ఐశ్వర్యాన్ని కలుగజేసే గొప్పదేవుడుకుబేర- స్వామి, కుబేర మంత్రాలు
- కుబేర స్వామిని బౌద్ధ ధర్మంలోనూ జంబాల అని కూడా పిలుస్తారు, అలాగే జైన్ ధర్మలోనూ ప్రాముఖ్యత కలిగిన గొప్ప 'దేవుడి'గా కొనియాడబడుతూ ఉంటాడు.
- కుబేరుడు అనే సంస్కృత పదాన్ని, అతని యొక్క శారీరక వైకల్యాలను బట్టి 'సరైన ఆకృతిని కలిగి లేని వ్యక్తిగానూ' లేదా"క్రూరమైన / వైకల్యంతో" ఉన్న వ్యక్తియని అనువదించారు.
- ఇంకొక సిద్ధాంతం ప్రకారం, అతనిని "కుంభ" అనే క్రియ పదం నుండి ఉద్భవించవచ్చని సూచిస్తుంది, అనగా "రహస్యంగా దాచేవాడని" దాని అర్థం.
- దేవుని చేత విశ్వంలో సృష్టించబడిన అన్ని సంపదలకు 'కుబేరుడే' సంరక్షకుడు. కానీ మొదట్లో దీనిని చాలా మంది దేవతలు ఇష్టపడలేదు.
- భారీ ఊబకాయ శరీరాన్ని కలిగి ఉన్న కుబేరున్ని చూసి చాలామంది ప్రజలు హాస్యాస్పదంగా వర్ణించారు చూసారు
- కుబేరుడు ఈ విధమైన అవమానాలను పొందటంవల్ల, అతను శివుని కోసం గోరమైన తపస్సు చేశాడు. శివుడు అతని ఎదుట ప్రత్యక్షమయ్యి, ఏ వరం కావాలో కోరుకోమని కుబేరుడిని అడిగాడు.
- కుబేరుడు, తాను అత్యంత జనాదరణ పొంది మరియు అందరి చేత గౌరవం పొందాలని కోరుకున్నాడు. అలా ఆ శివుడు అతనిని అన్ని సంపదలకు సంరక్షకుడిగా నియమించారు .
- ఆ తరువాత నుండి కుబేరుడు ప్రజలందరిచేత ఆరాధించబడటం ప్రారంభమైనది. ఈవిధంగా ఎవరైతే కుబేర మంత్రాన్ని జపిస్తారు అలాంటివారు తప్పక కుబేరుని యొక్క ఆశీస్సులను పొందగలరు.
- శివపురాణం రుద్రసంహితలోని సృష్టిఖండంలో కుబేరుని శివుడు అనుగ్రహించిన సందర్భాన్ని గురించి పేర్కొన్నారు. కుబేరుడి అసలు పేరు వైశ్రవణుడు. విశ్రవసువుకి జన్మించాడు కాబట్టే ఈయనను వైశ్రవణుడు అని పిలుస్తారు.
- వైశ్రవణుడు పూర్వ జన్మలో గుణనిధి అనే పేరుతో జీవిస్తూ తన జీవిత చిరమాంకంలో ఉపావాస దీక్ష చేసి శివాలయంలో దీపారాధన చేస్తూ తనువు చాలించాడు.
- ఈ పుణ్య ఫలం వల్ల అతడు వైశ్రవణుడిగా జన్మించి, శివునికి అత్యంత సమీపంగా ఉండే అదృష్టాన్ని కూడా పొందాడు. ఈశ్వరానుగ్రహం పొందటానికి కాశీ నగరానికి వచ్చి గంగాతీరంలో తీవ్రమైన తపస్సు చేశాడు.
- అతని కఠోర తపస్సుకు మెచ్చిన శంకరుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమయ్యాడు. పరమేశ్వరుని అమిత ప్రకాశాన్ని చూడలేక వైశ్రవణుడి కళ్లు మూతపడ్డాయి. దీంతో శివయ్య పాదాలను దర్శించుకోడానికి తనకు చూపు ప్రసాదించమని అతడు వేడుకున్నాడు.
- అర్థనారీశ్వరుడైన శివుడి దర్శించి పక్కనే అమ్మవారు ఉండటంతో అసూయపడ్డాడు. నిరంతరం అమ్మ శివుని వెంట ఉండటాన్ని అసూయ పడి కుటిల మనసుతో ఆమె వంక చూశాడు. దీన్ని గ్రహించిన పార్వతి ఏ కంటితో తనను వంకరగా చూశాడో ఆ కన్ను పోతుందని వైశ్రవణుడిని శపించింది.
- శివపార్వతులను వేడుకోవడంతో తన శాపానికి తిరుగులేదని, కన్ను తెల్లగా కమిలిపోయినట్లు కనిపిస్తూ కురూపిగా ఉన్న అతడిని కుబేరుడు పేరుతో పిలుస్తారని ఆమె తెలిపింది.
- అసూయ అనేది ఎలాంటి వారికైనా ప్రమాదకారి అనే సందేశాన్ని ఇవ్వడానకి తాను అలా చేశానని జగదాంబ చెబుతుంది. ఆ తర్వాత పార్వతీపరమేశ్వరులు కుబేరుడిని ఆశీర్వదించి నవనిధులకు అధిపతిగా చేశారు.
- అంతే కాకుండా గుహ్యకులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులకు కుబేరుడే అధినాయకుడు. కైలాసానికి సమీపంలోని అలకానగరం రాజధాని అవుతుంది కాబట్టి అక్కడకి రావాలని వైశ్రవణుడిని శివుడు ఆఙ్ఞాపించాడు.
- పరమేశ్వరుని ఆఙ్ఞ ప్రకారం దేవశిల్పి విశ్వకర్మ అలకాపురిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాడు.
అష్ట ఐశ్వర్యాలను పొందే కుబేర మంత్రాలు01. కుబేర మంత్రం
ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యదీప్తాయే ధనధాన్యసమృద్ధిం మి దేహీ దాపయా శ్వాహ !
ॐ यक्षाय कुबेराय वैश्रवणाय धनधान्याधिपतये
धनधान्यसमृद्धिं मे देहि दापय स्वाहा॥
Om Yakshaya Kuberaya Vaishravanaya Dhanadhanyadhipataye
Dhanadhanyasamriddhim Me Dehi Dapaya Svaha॥
02. కుబేర ధనప్రాప్తి మంత్రం
ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః
ॐ श्रीं ह्रीं क्लीं श्रीं क्लीं वित्तेश्वराय नमः॥
Om Shreem Hreem Kleem Shreem Kleem Vitteshvaraya Namah॥
03. కుబేరుడు అష్ట-లక్ష్మి మంత్రంఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్ట-లక్ష్మి మమ గ్రిహి ధనం పూరయ పూరయ నమః !
ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्ट-लक्ष्मी मम गृहे धनं पुरय पुरय नमः॥
Om Hreem Shreem Kreem Shreem Kuberaya Ashta-Lakshmi
Mama Grihe Dhanam Puraya Puraya Namah॥
04.కుబేర గాయత్రీ మంత్రం
ఓం యక్ష రాజాయ విద్మయా అలికదేషాయా ధీమహి తన్నోకుబేర ప్రచోదయాత్ !
05. కుబేర మంత్రం
ఓం యక్షాయ కుబేరాయా.. వైశ్వనాయ.. ధనధాన్యాది పతయే. ధనధాన్య సమృద్ధి.. మి దేహీ దాపయా స్వాహా
06. లక్ష్మి కుబేర మంత్రం :
ఓం ధనధ సౌభాగ్య లక్ష్మి కుబేర వైశ్రవణాయ మమ కార్య సిద్ది స్వాహా
ఎలా జపించాలి :
పొద్దున్నే లేచాకతలస్నానం చేసి చెక్క పీఠం మీద లక్ష్మీదేవి, కుబేరుడు ఉన్న పటం పెట్టాలి. అది ఉత్తర దిశగా ఉండేలా చూసుకోవాలి.
అలాగే ఒక నెయ్యిఒత్తిని వెలిగించి ధూపం వెయ్యాలి. పూజ చేస్తూ గణపతి దేవుడిని ప్రార్థించాలి. 108 సార్లు ఇలా మంత్రాన్ని ఆసనంలో కూర్చుని జపించాలి. ఇలా చేస్తే కుబేరుడు ధనప్రాప్తి ఇస్తాడు.
అలాగే చెక్క పీఠం మీద ఏడు గవ్వలను పెట్టి పూజిస్తే ఇంకా త్వరగా ధనప్రాప్తి లభిస్తుంది.
- హిందూ గ్రంధాల ప్రకారం, కుబేర మంత్రాన్ని ప్రతీరోజూ 108 సార్లు చెప్పున, 3 లేదా 5 , 9, 21, నెలల కాలం పాటు జపిస్తూ ఉండటంవల్ల కుబేరుడిని సంతృప్తిపరచి, అతని యొక్క ఆశీర్వాదాలు పొందేటందుకు ఇదే ఉత్తమమైన మార్గం.
- మీరు ఈ విధంగా కుబేర మంత్రాన్ని పఠించడం వల్ల ధనవృద్ధిని కలుగజేస్తూ, మీ జీవితంలో నుండి అరిష్టాలను దూరం చేస్తుంది మరియు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతూ, ఐశ్వర్యాలను, సంపదలను కలుగజేస్తుంది.
- ఈ కుబేర మంత్రాలను జపించటం వల్ల మీరు ఆ కుబేరుని యొక్క ఆశీస్సులను పొందటానికి, మరియు మీ సంపదలను వృద్ధి చేసుకోవడానికి దోహదపడుతుంది.
కుబేర మంత్రాలూ స్తోత్రాలు ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్.లు. చూడండి.
ఈ బ్లాగ్ చదివిన వారందరికీ అఖండ లక్ష్మి కటాక్షం కలగాలని కోరుకొందాం శుభం...
Note:
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like, share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like, share and subscribe
చేయండి . అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like, share
and subscribe చేయండి. నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv
చేయండి . అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like, share
and subscribe చేయండి. నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv
నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe చేయండి.
కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి