4, ఫిబ్రవరి 2020, మంగళవారం

కరోనా వైరస్ అంటే ఏమిటి ? దానిని ఎదుర్కోవడానికి సాధారణ రక్షణ పద్ధతులు ఏమిటో తెలుసుకోండి


కరోనా వైరస్ అంటే ఏమిటి ? 
దానిని  ఎదుర్కోవడానికి  సాధారణ రక్షణ పద్ధతులు ఏమిటో తెలుసుకోండి
 

చైనాలో
కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌ ప్రాణాంతకమైనది.కరోనా వైరస్‌ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే ఈ వైరస్‌ను 1960ల్లో తొలిసారిగా కనుగొన్నారు.పక్షులు, క్షీరదాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 

కరోనా వైరస్ ఇప్పుడు చైనానే కాదు ఇతర దేశాలను కూడా భయభ్రాంతులకు గురి చేస్తోంది. అమెరికా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, సింగపూర్, థాయ్ లాండ్, ఆస్ట్రేలియా,నేపాల్, వియత్నాం, హాంగ్ కాంగ్, మకావు, మలేషియా, కెనడా, కాంబోడియా, శ్రీలంక, జర్మనీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కూడా కరోనా వైరస్ ఉన్నట్టు నిర్ధారణ జరిగింది.ఇప్పుడు మనదేశానికి (India) కూడా ఈ వ్యాధి పాకినట్లు వార్తలు వస్తున్నాయి.

దీని లక్షణాలు:-
1. తుమ్ములు
2. శ్వాస తీసుకోవడం కష్టం (respiratory problems)
3. జ్వరం







జాగ్రత్తలు :

  • మీ చేతులు తరచూ కడుగు కొంటూ ఉండండి  సబ్బుతో  డెట్టాల్  లేదా ఆల్కహాల్ కలిగి ఉన్న సోప్ వాటర్ తో కానీ చేతులు కడుక్కోవాలి ఇది మీ చేతి లో ఉన్న వైరస్ ల ను తొలగిస్తుంది

  • శ్వాస ను సరిగా ఉండేలా చూసుకోండి మనం ఇంట్లో ఉన్నప్పుడు గాని బయటకు వెళ్ళినప్పుడు గాని ముక్కుకు  ఒక  శుభ్రపర్చిన వస్త్రాన్ని కట్టుకోండి.. దీని వల్ల  మీ వల్ల ఇతరులకు గాని  ఇతరుల నుండి మీకు గని వైరస్ సోకే  ప్రమాదం ఉండదు .

  • ఇరుగు పొరుగువారు స్నేహితులతో మసిలేటప్పుడు కొద్దిగా ( 1మీటరు/3 అడుగులు) దూరం గా ఉంది మాట్లాడుతుందండి. ఇతరులు తుమ్మినప్పుడు దగ్గినప్పుడు దగ్గరగా ఉండవద్దు. 

  • ఎవరైనా శ్వాస సంబంధమైన  వ్యాధులతో భాద పడుతున్నప్పుడు ఆ వైరస్ మీకు గాని, మీనుంచి యితరులకు గానీ వ్యాపించి అది కరోనా   (like 2019-nCoV,)  గా మారవచ్చు.

  • అపరిశుభ్రమైన చేతులతో కళ్ళను నోటిని తుడుచుకోకండి.

  • మాంసం,ఆహార పదార్దాలు కొనేటప్పుడు నిల్వ పదార్దాలు కొనవద్దు.

  • పెంపుడు జంతువులూ అనారోగ్యం తో ఉంటె వాటికీ దూరం గా ఉండండి .

ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్ లు చూడండి ...

Novel coronavirus (2019-nCoV) - YouTube


ఈ క్రింది వార్తలు చూడండి...
ABN Andhra Jyothy news...

https://www.andhrajyothy.com/artical?SID=1026737

  • న్యూఢిల్లీ : చైనా దేశంలో ప్రబలిన కరోనా వైరస్ మన దేశంలోనూ కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ ప్రబలిన చైనా దేశంలోని వూహాన్ నగరం నుంచి మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు తిరిగి వచ్చిన విద్యార్థుల్లో వ్యాధి లక్షణా లుండటంతో వారిని ఆసుపత్రుల్లోని ఐసోలేషన్ వార్డులకు తరలించారు. చైనా దేశం నుంచి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానకిి 8, 878 మంది వచ్చారు. వారిని పరీక్షించగా 21 మందిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో వారిని వైద్యుల పరిశీలనలో ఉంచారు. వారిలో 18 మందికి కరోనా వైరస్ నెగిటివ్ అని రిపోర్టు రావడంతో వారిని ఆసుపత్రి  నుంచి డిశ్చార్జ్ చేశారు. 
  • కర్ణాటక రాష్ట్రంలో 51 మంది చైనా నుంచి రాగా వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించి చికిత్స చేస్తున్నారు. పూణే నగరంలోని జాతీయ వైరాలజీ ఇన్ స్టిట్యూట్‌కు 44 శాంపిల్స్ రాగా దీనిలో 29శాంపిల్స్ నెగిటివ్ అని తేలింది. ఒడిశా రాష్ట్రంలోని కటక్ లో 8 మంది కరోనా వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరగా వారిలో ఐదుగురికి వైరస్ లేదని వెల్లడైంది. కరోనా వైరస్ లక్షణాలున్న ఓ మహిళ, మరో వైద్యవిద్యార్థిని కటక్ వైద్యకళాశాల ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స చేస్తున్నామని ఒడిశా వైద్యశాఖ డైరెక్టరు డాక్టర్ సీబీకే మహంతి చెప్పారు. కరోనావైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర వైద్యఆరోగ్యశాఖ 104 ఆరోగ్య సహాయవాణి కాల్ సెంటరును ఏర్పాటు చేసింది.  ABN Andhra Jyothi news...
For latest information visit this site...

ఈ క్రింది వీడియో చూడండి ...



ఈ క్రింది వీడియో యు . ఆర్. యల్. లు చూడండి ...

కరోనా వైరస్: వినాశనాన్ని తలపించేలా ... - YouTube


https://www.youtube.com › watch


ప్రపంచంపై పంజా..! మరిన్ని దేశాలకు ... - YouTube


https://www.youtube.com › watch

Note:  
నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe  చేయండి.
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe 

చేయండి .   అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share
and subscribe చేయండి.   నా యూట్యూబ్ ఛానల్   bdl 1tv
నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  
కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి