చందనోత్సవం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చందనోత్సవం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, ఏప్రిల్ 2025, బుధవారం

అక్షయ తృతీయ - సింహాచలం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి చందనోత్సవం నిజరూప దర్శనం చరిత్ర

వోవిట్స్తెలుగు.బ్లాగ్స్పాట్.కామ్

అక్షయ తృతీయ - సింహాచలం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి చందనోత్సవం నిజరూప దర్శనం చరిత్ర

సింహాచలం చందనోత్సవం

అక్షయ తృతీయ - సింహాచలం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి చందనోత్సవం నిజరూప దర్శనం చరిత్ర

👉
అక్షయ తృతీయ రోజున విశేష ప్రాముఖ్యత కలిగిన ఒక విశేష ఘటన సింహాచలం దేవస్థానంలో జరుగుతుంది. ఈ రోజే స్వామివారి చందనాలేలత తొలగించి నిజరూప దర్శనాన్ని భక్తులకు కలిగిస్తారు. సింహాచల లక్ష్మీ నృసింహస్వామి ఏడాది పొడవునా చందనంతో పూతబడి ఉంటాడు. 
👉
ఒక్క అక్షయ తృతీయ నాడు మాత్రమే ఆ చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునే అవకాశం ఉంటుంది.
👉
సింహాచలంలోని వరాహ లక్ష్మీనృసింహ స్వామి ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. 
👉
మిగిలిన 364 రోజులు చందనంతో కప్పి ఉన్న లింగాకృతిలో కనిపిస్తారు. 
👉
ఏటా విగ్రహం నుంచి చందనాన్ని ఒలిచి... మళ్లీ కొత్త చందనాన్ని పూస్తారు. దానినే చందనోత్సవం అంటారు. 

చందనోత్సవం విశిష్టత

👉
అక్షయ తృతీయ సందర్భంగా సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం.  చందనోత్సవం అనేది అనాదిగా వస్తున్న ఉత్సవం. ఏడాదిలో ఒక్కరోజే స్వామివారి నిజరూప దర్శనం కలుగుతుంది కాబట్టి లక్షలాది మంది భక్తులు ఈ రోజున దర్శనార్థం తరలివస్తారు. 

👉
స్వామివారి విగ్రహాన్ని చల్లదనంగా ఉంచడానికే చందనం పూత విధానం కొనసాగుతుంది. ఇది వైష్ణవ సంప్రదాయంలో అరుదైన ఒక విధానం.

👉
కోటి పున్నములు ఒక్కసారి వచ్చి వెన్నెల వాన కురిసినట్లు,
👉
కోటి పద్మాలు రేకులు విప్పి జల జల తేనె కాలువలు చిందించినట్లు,
👉
కోటి హంసలు రెక్కల కాంతితో తళతళలు చిలికినట్లు,
👉
కోటి ముత్యాలు దండగా గుచ్చినట్లు' శ్రీ సింహగిరి వాసుడి నిజరూపం సాక్షాత్కరించిందని   అభివర్ణించారు శ్రీ చందన శతక కర్త, విద్వత్కవివరేణ్యులు శ్రీ మానాప్రగడ శేషసాయి.

👉
శ్రీహరి తన దశావతార వైభవంలో మూడు, నాలుగు అవతారాల యుగళంగా దర్శనమిచ్చింది సింహాచలంలో శ్రీవరాహాలక్ష్మీనరసింహస్వామిగా మాత్రమే. 

👉
నరసింహస్వామి యోగ మార్గంలో అనాహతానికి, విశ్వంలో సూర్యమండలానికి, దేవలోకంలో సుదర్శన చక్రానికి ప్రతీక.

👉
వరాహస్వామి భూతత్త్వానికి, మూలాధారానికి, విశ్వ చైతన్య మూలానికి ప్రతీక. 

👉
వరాహమూర్తి అనాహతం చేరుకున్నప్పుడు కుండలిని ఆత్మ తత్త్వాన్ని దర్శిస్తుందని పండితులు చెబుతారు.

👉
దక్షిణ భారతదేశంలోని వైష్ణవాలలో ప్రముఖమైనది సింహాచల క్షేత్రం. తూర్పు కనుమల్లో ప్రకృతి సౌందర్యం నడుమ వెలసిన స్వామి అశేష భక్త కోటికి ఇలవేల్పు. 

👉
శ్రీ మహా విష్ణువు వరాహ రూపంలో హిరణ్యాక్షుని వధించాక, నరసింహ రూపంలో హిరణ్యకశిపుణ్ని సంహరించాడు. 

👉
హిరణ్యకశిపుడి పుత్రుడు పరమ విష్ణు భక్తుడు అయిన ప్రహ్లాదుడి కోరికపై స్వామి వరాహనృసింహుడిగా వైశాఖ శుద్ధ తదియ నాడు వెలసి పూజలందుకుంటున్నాడని ప్రతీతి.

👉
స్వామిని ప్రహ్లాదుడు సేవిస్తున్న కాలంలోనే బ్రహ్మ మహేశ్వరుడితో, ఇంద్రాది దిక్పాలురతో సింహగిరికి తరలి వచ్చి బ్రహ్మోత్సవాలు జరిపించాడని పురాణ కథనం.
🙏ఇది కృతయుగం నాటి గాథ🙏

👉
అనంతర కాలంలో స్వామికి ఆరాధనలు లేక ఆలయం శిథిలమై శ్రీవారిపై పుట్టలు లేచి దివ్య మంగళ విగ్రహం కనుమరుగైంది. 

షట్చక్రవర్తుల్లో ఒకరైన పురూరవుడు ఊర్వశితో గగన మార్గాన విహరిస్తుండగా వారి విమానం స్వామి ఉన్న ప్రదేశం నుంచి ముందుకు సాగకుండా నిలిచిపోయింది.

ఊర్వశి తన దివ్య దృష్టితో ఆ ప్రదేశంలో వరాహ నరసింహుడు ఉన్నాడని గ్రహించి పురూరవుడికి తెలిపింది. 

నాటి రాత్రి స్వామి పురూరవుడికి స్వప్నంలో కనిపించి తనను పుట్ట నుంచి బయటకు తీసి గంధాన్ని సమర్పించమన్నాడు.

భూమికి గంధవతి అని పేరు. అందుకే పుట్ట మట్టికి బదులు గంధాన్ని సమర్పించమన్నాడు. చక్రవర్తి సహస్ర కలశ గంగ ధారతో, పంచామృతాలతో స్వామిని అభిషేకించాడు.

ఇది స్థల పురాణం. హిరణ్యకశిపుడి వధానంతరం ఉగ్రనరసింహుని చల్లబరచడానికి దేవతలే చందనం పూశారని భక్తుల విశ్వాసం.

వైశాఖ శుద్ధ తదియ నాడు అంటే చందనోత్సవం నాడు ఏడాది పొడవునా స్వామి దేహానికి పూసిన చందనాన్ని వలిచి, నిజరూప సందర్శనం కలిగిస్తారు. 

అనంతరం స్వామికి తొలి విడతగా మూడు మణుగుల చందనం పూస్తారు. తరవాత వైశాఖ పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి దినాల్లో మూడేసి మణుగుల చందనం సమర్పిస్తారు.

మూడు మణుగులు అంటే ఇప్పటి లెక్కల్లో 120 కేజీలని ఆ క్షేత్రంలోని పండితులు చెబుతారు.
స్వామి వారి పూజా విధానం పాంచరాత్ర ఆగమ పద్ధతిలో జరుగుతుంది.

గోవిందరాజ స్వామి ఇక్కడ ఉత్సవ మూర్తి. మదనగోపాలస్వామి శయన మూర్తి. వేణుగోపాల స్వామి స్వప్న మూర్తి. యోగ నారసింహమూర్తి బలి మూర్తి. సుదర్శనుడు చక్ర పెరుమాళ్‌.

ఈ అయిదుగురు మూర్తులకు జరిగే నిత్యారాధనను ‘పంచభేరి’ అంటారు. ఈ ఆలయంలో ‘కప్పస్తంభం’ విలక్షణమైనది.

స్థల పురాణం:

👉
సింహాచలం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన 32 నృసింహ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ స్వామివారు లక్ష్మీ సమేతంగా నృసింహరూపంలో దర్శనమిస్తాడు. ఇది ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం సమీపంలోని పర్వత ప్రాంతంలో వెలసిన దేవాలయం. పురాణాల ప్రకారం, హిరణ్యకశిపుని సంహారం చేసిన అనంతరం ప్రహ్లాదుడి కోరిక మీద స్వామివారు ఇక్కడ లక్ష్మీతో కలసి ఉంటానని వరమిచ్చాడు.

👉
ఈ సింహాచలం దివ్యక్షేత్రం స్థలపురాణం లోతుల్లోకి వెళితే లోకాలను భయకంపితుల్ని చేసిన రాక్షసరాజులు, సోదరులైన హిరణ్య కశిప , హిరణ్యాక్ష సోదరుల కాలం నాటిది.

👉
హిరణ్యాక్షుడు భూమండలాన్ని ఆక్రమించుకొని హింసని ప్రజ్వలిమ్పచేసినపుడు ఆ మహావిష్ణువు వామనావతారధారిగా అవతరించి హిరణ్యాక్షుడిని వధించి భూమండలాన్ని రక్షించాడు. 

👉
తన సోదరుడైన హిరణ్యాక్షుడి మరణాన్ని సహించలేని హిరణ్యకశిపుడు మహావిష్ణువుపై కక్ష సాధనకై బ్రహ్మ మెప్పు కొరకై కఠోర తపస్సు చేయసాగాడు.

👉
ఇంతలో బ్రహ్మ ప్రత్యక్షమై హిరణ్యకశిపుని కోరిక సాధ్యపడదని సెలవిచ్చాడు. హిరణ్యకశిపుడు తేరుకొని తనకు జంతువుతో గాని మనిషితో గాని , పగలు కానీ రాత్రి కానీ , ఆకాశంలో కానీ భూమిపై కానీ మరణం లేకుండా బ్రహ్మ దేవుణ్ణి వరం కోరి పొందాడు.

👉
హిరణ్యకశిపుడు తనకు చావే లేదని గర్వితుడై , భూమండల వాసులంతా తననే పూజించాలని వేధించడం ప్రారంభించాడు. అంతే కాకుండా దేవతలను, మునులను , విష్ణు భక్తులను వేధించసాగాడు.

👉
విధి వైచిత్రి , హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతో విష్ణు భక్తునిగా జన్మించాడు. “నారాయణ” నామ జపంతో అనునిత్యం విష్ణు ఆరాధనలో ఉన్న హిరణ్యకసిపునికి ఆగ్రహం తెప్పించి ఎన్ని విధాల ప్రయత్నించినా ప్రహ్లాదుని విష్ణుభక్తిని కించింది మార్చలేకపోతాడు.

👉
హిరణ్యకశిపుడు అసహనానికి గురై మదగజాలతో తొక్కించినా , విషసర్పాలతో మధ్యలో పడేసినా ప్రహ్లాదుడు లొంగలేదు. సరి కదా నారాయణ నామ స్మరణతో అడ్డంకుల్ని ప్రహ్లాదుడు అధిరోహించడం హిరణ్యకసుపుని అగ్రహజ్వాలల్ని మరింత రగిలించింది.

👉
చివరిగా ప్రహ్లాదుడిని సముద్రంలో తోసి అతనిపై ఓ పర్వతాన్నుంచమని తన భటులను అజ్ఞాపించాడు. భటులు ప్రహ్లాదుడిని సింహాద్రి పర్వతం పైకి ఎక్కిస్తారు. అక్కడినుండి సముద్రంలోకి ప్రహ్లాదుడిని విసిరి వేసి ఆపై సింహాద్రి పరవతాన్ని పెకిలించి అతనిపై ఉంచాలని వారి ఆలోచన. అంతలో మహావిష్ణువు సింహాద్రి కొండపైకి ఊరికి వచ్చి ప్రహ్లాదుడిని కాపాడారు.

👉
అందుచే సింహాద్రి పర్వతం ప్రహ్లాదుడిని మహావిష్ణువు కాపాడిన ప్రాంతంగా గుర్తింపు పొందింది.
తన భక్తుడైన ప్రహ్లాదుని కోరికమేరకు మహావిష్ణువు , 

హిరణ్యకశిపుని సంహరించిన వరాహావతారం మరియు హిరణ్యాక్షుడిని సంహరించిన నృసింహావతారముల కలబోతగా వరహనృసింహంగా అవతరించి సింహాచలం దివ్యక్షేత్రంలో కొలువై ఉన్నారు.

సింహాచలందివ్యక్షేత్రం ఆలయచరిత్ర :

👉
తన తండ్రి మరణాంతరం ప్రహ్లాడుడే వరహనరసింహ స్వామి ఉత్సవామూర్తికి తొలిగా ఆలయ నిర్మాణం చేపట్టారని , కృతయుగం ఆఖరులో ఆలయం శిధిలావస్తకు చేరుకుందని సంకేతాలు.

👉
అయితే తరువాతి కాలంలో రాజ పురురావ తన సతీమణి ఊర్వశితో విహారానికి గుర్రాలపై వెళ్ళగా అతను సింహాచలం దివ్యక్షేత్రం వైపు ఆకర్షింపబడి బురదలో కూరుకుపోయిన వరహనరసింహ స్వామి విగ్రహాన్ని శుభ్రం చేస్తుండగా ఆకాశవాణి స్వామి వారి నిజరూపాన్ని బయట చేయరాదని చందనం పూత పూయాలని ఒకసారి వైశాఖం మాసం మూడవరోజున మాత్రమే నిజరూప దర్శనం చేయించాలని వినిపించింది.

👉
రాజ పురురావ స్వామి వారి విగ్రహం పైనుంచి తొలగించిన బురద స్థానంలో చందనం పూత పూయించిన నాటి నుండి నేటి వరకు వరహనరసింహ స్వామి వారి సింహాచలం దివ్యక్షేత్రం అప్రతిహతంగా భక్తుల నీరాజనాలను అందుకొంటూనే ఉంది. అప్పట్లోనే రాజా పురురవ ఆలయాన్ని పునర్నిర్మించారని స్థలపురాణం చెపుతోంది.
 
👉
స్వామి వారి నిజరూప దర్శనం ఒక్క అక్షయ తృతీయ నాడే లభిస్తుంది.
ఆలయ ప్రాంగణంలో ఇప్పటికీ విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు నాటి శిలాఫలకాలు ఉన్నవి. 

👉
అయితే కళింగ రాజ్యాన్ని గెలుపొందిన చోళరాజు కులోత్తుంగ-1 కాలంనాటికే ఈ దివ్యక్షేత్రం ప్రముఖంగా వేలుగొందినట్లు చారిత్రిక ఆధారాలు చెబుతున్నాయి.

👉
శ్రీకృష్ణదేవరలు వారు , తన సతీమణి తో కలసి స్వామి వారికీ 991 ముత్యాలను మరియు ఇతర విలువైన ఆభరణాలను సమర్పించారని శాసనాలు చెపుతున్నవి.

ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య

అక్షయ తృతీయ రోజున సింహాచలంలో లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. స్వామివారి నిజరూప దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు ప్రారంభమవుతున్నాయి. ఈ రోజున మూడు నుంచి నాలుగు లక్షల మంది వరకు దర్శనార్థం వచ్చి స్వామివారి అనుగ్రహం పొందుతారు.

భక్తులకి ఉచిత అన్న ప్రసాదం :

👉

1989 నాటి ధర్మకర్త డాక్టర్ శ్రీ.పి.వి.జి.రాజు గారి అధ్వర్యంలో ప్రారంభమైన ఈ అన్నదాన కార్యక్రమం ఈనాటికి రోజుకు 5000 మందికి అన్నదాన అనుభూతిని కలిగించే స్థాయికి ఎదిగింది.
    
👉
ఈ పర్వదినాన దేవస్థానం ప్రత్యేకంగా అన్నదానాన్ని నిర్వహిస్తుంది. వేలాది మందికి ఉచితంగా ప్రసాదాన్ని అందించడమే కాక, పౌష్టికాహారం ఏర్పాటు చేస్తారు. తమవంతు సేవగా అన్నదానంలో పాలుపంచుకుంటారు.

వసతి సౌకర్యాలు:

👉
భక్తుల కోసం దేవస్థానం గెస్ట్ హౌసులు, ధర్మశాలలు, టెంపరీ టెంట్లు ఏర్పాటు చేస్తారు. ప్రైవేట్ హోటళ్లతో పాటు శివురాలు కూడా సిద్ధంగా ఉంటాయి. రవాణా సౌకర్యాలకు కూడా ప్రత్యేక బస్సులు నడుపుతారు. ఆరోగ్య సేవ కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచుతారు.

👉
యాత్రికుల సౌకర్యార్ధం కొడపై “యత్రసదన్” కామన్ బాత్రూం , టాయిలెట్స్ , వెయిటింగ్ హాల్ , లాకర్ వసతితో కలదు. అంతే కాకుండా “గజపతి సత్రం”లో 48 గదులు సాధారణ అద్దెకు లభిస్తాయి.

👉
ఇవి కాకుండా కొండ దిగువన 2014లో “యాత్ర పుష్కరిణి” సమీపంలో నిర్మించిన “నర్మదా సదన్” 68 గదులు, టి.టి.డి.చౌల్త్రి 12 గదులు , “పుష్కరిణి చౌల్త్రి”లో 40 గదులు యాత్రికుల సౌకర్యార్ధం అందుబాటులో ఉన్నవి.

భక్తుల కి రవాణా సౌకర్యాలు చేరుకునే విధానం:

👉
విశాఖపట్టణం వరకు బస్సు, రైలు, విమానాల్లో రావచ్చు. అక్కడ నుండి సింహాచలం కొండ క్రిందికి (అడవివరం) సుమారు 15 కి.మీ. లోపు దూరం ఉంటుంది. అక్కడికి సిటీబస్సు, ఆటో, టాక్సీలలో చేరవచ్చు. సింహాచలం కొండ క్రింది నుండి పైకి దేవాలయం వరకు మెట్లమీదగా (సుమారు వెయ్యి మెట్లు) గాని, దేవస్థానంవారి ఘాట్ రోడ్డు మీదుగా దేవస్థానం బస్సులోగాని, టాక్సీలోగాని చేరవచ్చును.

రవాణా మంచిదిసింహాచలం రైల్వేస్టేషన్:

👉

సింహాచల క్షేత్రం విశాఖపట్నం ద్వారా నౌక, రైలు, రోడ్డు, విమాన మార్గాల్లో అనుసంధానమై ఉంది. విశాఖపట్నం విమానాశ్రయం నుండి కేవలం 11 కి.మీ, విశాఖ ప్రధాన రైల్వే స్టేషన్‌ నుండి 11 కి.మీ, విశాఖపట్నం బస్‌ స్టేషన్‌ నుండి 12 కి.మీ దూరంలో ఉంది. సింహాచలానికి 5 కి.మీల దూరంలో గోపాలపట్నం వద్ద సింహాచలం రైల్వే స్టేషన్ కూడా ఉంది. 

👉
ఆయా ప్రాంతాల నుంచి సింహాచలానికి విస్తృత రవాణా సదుపాయం ఉంది. అన్ని చోట్ల నుంచి నిత్యం పదుల సంఖ్యలో ప్రైవేట్ క్యాబ్‌లు, ఆటోలతో పాటు ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉంది. 

👉
సింహాచలం కొండ దిగువ నుంచి ఎగువకు సింహాచలం దేవస్థానము కూడా ప్రత్యేక వాహనాలను నడుపుతోంది.

👉
సొంత వాహనాలు ఉంటే నామమాత్రపు (రూ.10) టోల్‌ రుసుము చెల్లించి ఆ వాహనాల్లోనే చేరుకోవచ్చు. 

👉
కొండ పైకి చేరుకునేందుకు దేవస్థానం వారు నాలుగు, ఆర్టీసీ వారు 20 బస్సులు నడుపుతున్నారు. ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది.

👉
ఇక చందనోత్సవం, గిరి ప్రదక్షిణ, ముక్కోటి ఏకాదశి, బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాలలో ఆర్టీసీ మరిన్ని ప్రత్యేక సర్వీసులు నడుస్తున్నాయి. 

👉
లిఫ్ట్:
వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా స్వామివారి ఆలయ గాలిగోపురం పక్కన లిఫ్టు ఏర్పాటు చేశారు.

👉
బస్సు సౌకర్యం : 
రాష్ట్రము లోని అన్ని ప్రధాన నగరాల నుండి ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సు సౌకర్యం విరివిగా ఉన్నది. విశాఖపట్నం కాంప్లెక్స్ నుండి సింహాచలం కొండ పైకి చేరుకోవడానికి విరివిగా బస్సు అవకాశం ఉంది.

👉
 రైలు సౌకర్యం :
అన్ని ప్రధాన నగరాల నుండి విశాఖపట్నం జంక్షన్ కు రైలు సౌకర్యం ఉంటుంది. ఇచ్చటి నుండి సింహాచలం కొండ పైకి ప్రతి పది నిముషాలకు సిటి బస్సు సౌకర్యం ఉన్నది.

👉
విమాన సౌకర్యం :
దేశంలోని అన్ని ప్రధాన నగరాల విమానాశ్రయాల నుండి విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి పలు విమానయాన సంస్థలు నడుపుతున్న సంగతి మీకు తెలుస్తుంది. ఇక్కడి నుండి ప్రైవేటు కాబ్‌లలో సింహాచలం కొండపైకి చేరుకోవచ్చు.

ఈ క్రింది వీడియో యు.ఆర్.ఎల్.చూడండి:

గమనిక:

దయచేసి క్రిందికి ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్లు చూడండి లైక్, షేర్, నోటి ఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.
👉

నా బ్లాగులు: 

వోవిట్స్తెలుగు.బ్లాగ్స్పాట్.కామ్

తెలుగుతీవి.బ్లాగ్‌స్పాట్.కామ్

wowitsviral.blogspot.com

itsgreatindia.blogspot.com

నాట్‌లిమిటెడ్‌మ్యూజిక్.బ్లాగ్‌స్పాట్.కామ్/

👉

నా అడ్మిన్ ఫేస్‌బుక్ గ్రూపులు: 

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

మానవత్వం, సామాజిక సేవ/ మానవత్వం / సంఘసేవ

గ్రాడ్యుయేట్ నిరుద్యోగుల సంఘం

కామెడీ కార్నర్

వోవిట్సిండా

మీరే చేయండి

పురుష ప్రపంచం 

👉

నా ఫేస్ బుక్ పేజీలు:

విద్యావంతులైన నిరుద్యోగుల సంఘం:


హిందూ సంస్కృతి మరియు సాంప్రదాయ విలువలు

భారతీయ సంతతికి చెందినవాడు

నా ట్యూబ్ టీవీ

వోవిట్స్ వైరల్

👉

యూట్యూబ్ ఛానెల్‌లు:





నా ఈమెయిల్ ఐడీలు:




బి. ధర్మలింగం 
ప్లేస్ : లంకెలపాలెం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం