శివరాత్రి నాడు పటించాల్సిన మంత్రాలు నాలుగు యామాల ప్రత్యేక పూజ శివుడిని ఏమి కోరుకోవాలి
మంగళకరుడు శివుడు, పార్వతికి వివాహం జరిగిన పవిత్రమైన రోజును మహా శివరాత్రి (Maha Shivaratri) అంటారు. ఈ రోజు సాయంకాల సమయాన్ని ప్రదోషకాలం అంటారు. ఈ ప్రదోష సమయంలో శివస్మరణ, శివదర్శనం చేసుకుంటే భక్తులకు సకల శుభాలు కలుగుతాయి. మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు, శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రతో కలిసి ఉన్నప్పుడు శివుడు లింగాకారంగా ఆవిర్బవించాడని శివపురాణం చెబుతోంది.
శివమూల మంత్రం - శివ పంచాక్షరీ మంత్రం
నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహాశ్వరాయ
నిత్యాయ శుధ్ధాయ దిగంబరాయ
తస్మైనకారాయ నమ:శివాయఓం త్రయంబకం యజ్మహే సుగంధిమ్ పుష్టి వర్ధనం
ఓం తత్పురుషాయ విద్మహే
మహాదేవాయ ధీమహి
శివ పంచాక్షరీ మంత్రం ఓం నమ:శివాయ లోని ఐదు బీజాక్షరాలకు అర్థం ఇలా వివరించవచ్చును.
మ కారం విష్ణువును
వ కారం మహేశ్వరుడిని
సూచిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
పూజలో అభిషేకం, అలంకరణ ఉంటాయి. గంధం, బిల్వపత్రాలు, తామరపువ్వులతో స్వామికి అర్చన చేస్తారు. నైవేద్యంగా పెసర పొంగలి సమర్పిస్తారు. రుగ్వేదాన్ని పారాయణం చేస్తే సౌభాగ్యం కలుగుతుంది. అంటే ఈ యామ పూజలో పాల్గొనే వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం.
రెండో యామం:
ఈ పూజలో మధుపర్కం అంటే చక్కెర, పాలు, పెరుగు, నెయ్యితో అభిషేకం చేస్తారు. ఆ తర్వాత రోజ్ వాటర్, కర్పూరం గంధ లేపనంతో అలంకరించి బిల్వపత్రాలు, తులసితో అర్చన గావిస్తారు. నైవేద్యంగా పాయసం సమర్పించి యజుర్వేదాన్ని పారాయణం చేస్తారు. దీని వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది.
మూడో యామం:
ఇందులో తేనెతో అభిషేకం చేసి, కర్పూరం గంధ లేపనంతో అలంకరణ చేస్తారు. బిల్వపత్రాలు, మల్లెపూలతో అర్చన, అన్నం, నువ్వులు నైవేద్యంగా నివేదించి, సామవేదాన్ని పారాయణం చేస్తే అపార సంపద లభిస్తుందట.
నాలుగో యామం:
చెరకు రసంతో అభిషేకం చేసి మల్లె, తామర పూలు, కర్పూరం గంధ లేపనంతో అలకరించాలి. తామర, కలువ, మల్లె పూలతో అర్చనగావించి, వండిన అన్నం నైవేద్యంగా పెట్టాలి. అథర్వణ వేదాన్ని పారాయణం చేస్తే కుటుంబంలో సఖ్యత కలుగుతుందని వేద పండితులు పేర్కొంటున్నారు.
శివరాత్రి రోజున శివుణ్ణి ఏమని కోరుకోవాలి
👉'మన ఇంట్లో దైవానికి నిత్య నైవేద్యం ఉండాలి' అని కోరుకోవాలి. అంటే మన ఇంట్లో ధాన్యం ఎప్పడూ నిలువ ఉంటుందన్న మాట.
👉 మన ఇంట్లో నేను నిత్యం పూజ చేయాలి అని కోరుకోవాలి. మనం ఆరోగ్యం బాగుండి, ఎప్పుడూ ఆనందంగా ఉంటేనే నిత్యపూజ సాధ్యపడుతుంది కనుక ఆ దేవుడిని నిత్యం కొలిచే భాగ్యం ప్రసాదిస్తే చాలు తండ్రీ అని వేడుకోవచ్చన్నమాట.
👉మన ఇంటికి ఎవ్వరు వచ్చినా కడుపునిండా భోజనం చేసి వెళ్ళాలి అని కోరుకోవాలి. అంటే మీకు అనుకూలవతి అయిన ధర్మపత్ని, పతి భాగస్వామి అవుతారు. ఈ కోరికలో ఉన్న మర్మం ఏంటంటే భార్యాభర్తల్లో ఏ ఒక్కరు మరొకరికి అనుకూలంగా లేకపోయినా ఇంటికి వచ్చే అతిథులందరికీ అతిథి మర్యాదలు చేయలేం. అలా కాకుండా అందరికీ అతిథిమర్యాదలు చేసే భాగ్యాన్ని ప్రసాదించమని ఆ దేవుడిని కోరుకోవడమంటే మీ జీవిత భాగస్వామి మీకు సైతం అనుకూలంగా ఉండేలా చూడమని ఆ దేవుడిని కోరుకోవడమే అవుతుంది.
👉నేను నా చివరి దశ వరకు నీ క్షేత్ర దర్శనానికి రావాలి అని కోరుకోవాలి. అంటే నీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వమని అడగడటమే అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
👉భాగవతులతో మన గడప నిండుగా ఉండాలి అని కోరుకోవాలి. అంటే మనకు సమాజంలో తగిన గౌరవం, స్థానం, కీర్తిప్రతిష్టలు రావాలి అని కోరుకోవడమే.
👉కుటుంబసమేతంగా సంతోషంగా మీ క్షేత్ర దర్శనానికి రావాలి అని దైవాన్ని కోరుకోవాలి. మనం ఆరోగ్యంగా, ఆర్ధికంగా, కుటుంబంతో అన్యోణ్యంగా కలిసి ఉంటేనే కదా అది సాధ్యపడుతుంది. ఇంక ఈ జీవితానికి ఎవరికైనా ఇంతకన్నా ఎక్కువ ఎమి కావాలి చెప్పండి.
ఈ క్రింది వీడియో యు ఆర్. యల్. ల లో శివరాత్రి పటించే మంత్రాలు గురించి తెలుసుకోండి:
ఈ రోజు సూక్తి :