5000 సంవత్సరాల క్రితము ప్రపంచాన్ని
హిందువులు మహాప్రపంచం
(జంబూద్వీపం) అనేవారు
క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని జంబూ దీపం అని పిలిచేవారు . ఇప్పటి భారత దేశం ఒక్కప్పటి భరత ఖండం. ఆఫ్రికా ఇప్పటికి ఆఫ్రికాయే . అమెరికన్ కాంటినెంట్ ని పాతాళ దేశం నాగదేశం అనేవారు ఆసియా ఖండాన్ని ఆర్య ఖండం అనేవారు . అలాగే గ్రీన్ ల్యాండ్ ని గ్రాస ఖండం అని ఆస్ట్రేలియా ని ఆస్ట్రేలియా అని అనేవారు. హిందూ పురాణాలలో ప్రాచీన గ్రంధాలలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
👉
జంబుద్వీపే భరతవర్షే భరతఖండే...
👉
సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు "జంబుద్వీపే భరతవర్షే భరతఖండే" అనేవి
మనమందరం వినే ఉంటాము. మన హిందు ఆచారాలలో ఈ సంకల్ప
మంత్రం ఒక అంతర్భాగం.
👉
అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?
జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో
ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాము
లు గా (భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం
ఒకటి. మిగిలిన 8 వర్షములు ఇవి:
👉
1) కేతుముల వర్ష
👉
2) హరి వర్ష
👉
3) ఇలవ్రిత వర్ష
👉
4) కురు వర్ష
👉
5) హిరణ్యక వర్ష
👉
6) రమ్యక వర్ష
👉
7) కింపురుష వర్ష
👉
8 ) భద్రస్వ వర్ష
👉 పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్,
బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం (ఒకప్పుడు కష్యప
సముద్రం) వరకు వ్యాపించి ఉండేది.
👉 ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం
(ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం)
👉 వైదిక సంస్కృతి/నాగరికత కు ఆత్మ వంటిది.
పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం
అబద్ధంఅనడానికి ఇలాంటివి లెక్కలేనన్నిఆధారాలు
ఉన్నాయి.
👉 మనల్ని తక్కువ చేయడానికి ఈ సిద్ధాంతాన్ని
సృష్టించారు.
👉 ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి
ఆర్యులనే వారు ఎవరు దండయాత్ర చేయలేదు.
ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే
మనపూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా
తెలుసు.
1. మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది. అప్పుడు చాలా వరకు దక్షిణ
అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ
ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా
సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి
సముద్ర మట్టానికి పైన ఉండేవి.
2.
దీన్ని బట్టి నిరూపితమైనది ఏమిటంటే వైదిక సంస్కృతి కేవలం 5000
సంవత్సరాల క్రితమే పుట్టిందని, కురుక్షేత్రం కేవలం కొన్ని సంవత్సరాల క్రితం
జరిగిందని చెప్పేవారివి తప్పుడు ప్రచారాలు మరియు పచ్చి అబద్ధాలు.
ఆస్ట్రేలియా నీటి కింద ఉన్నపుడే వైదిక నాగరికత ఉంది. దీన్ని బట్టి అర్థం
చేసుకోవచ్చు మనది ఎంత పురాతనమైన నాగరికత అని !
3.
మనల్ని దిగ్బ్రాంతికి గురిచేసే విషయం ఏమిటంటే మన ప్రభుత్వం ఇంకా
మనపాఠ్య పుస్తకాలలో ఇటువంతి అబద్ధపు సిద్ధాంతాలను, భారత దేశానికి
వ్యతిరేకంగా, భారత దేశాన్ని/భారతీయులను తక్కువచేసి చూపించే తప్పుడు
చరిత్రను భోదిస్తుంది. మన ప్రభుత్వం దేశ యువతకు మన పూర్వికులు
పామరులు/ఏమి తెలియని వాళ్ళు అని భోదిస్తుంది. దేశ భక్తులు కనుగొన్న
నిజమైన చరిత్రను భోదించడం లేదు.
4.
మన పాఠ్య పుస్తకాలలో మన ఋషుల గురించి పెట్టాలి అనే ప్రతిపాదన
తెచ్చినపుడు విద్యావ్యవస్థను హిందూ మాట మత పరం చేయొద్దని
తిరస్కరించాయి. తమ సొంత దేశం యొక్క గొప్పతనాన్ని తిరస్కరించి మన
పూర్వీకులను మనమే చిన్నచూపు చూసే దేశం ఎదైనా ఉంటుందా? ఏం మన
ఋషులు భారతీయులు కాదా? వారి గురించి మన పాఠ్య పుస్తకాలలో
ఎందుకు ఉండకూడదు?
5.
ఏ ప్రభుత్వం అయినా దేశ సంస్కృతిని/పూర్వీకులను గౌరవించాలి.
ఇప్పటికైనా భారతీయులు మేలుకోవాలి. మనం ఎంత గొప్ప సంస్కృతికి వారసులమో గ్రహించి మన సంస్కృతిని కాపాడుటకు మనవంతు కృషి
చేయాలి.
ఈ క్రింది వీడియో యు.ఆర్. యల్.లు. చూడండి ...