అఘోరా శైవ సాధువులు నాగసాధ్విల జీవనసరళి, ఆచార వ్యవహారాలు గురించి తెలుసుకోండి
ప్రతి మనిషి ఒక శవ (శవం) అతను ‘శివ’గా రూపాంతరం చెందే మార్గమే ‘అఘోర’ అంటారు. అఘోర తెగకు చాలా ప్రాచీన చరిత్ర ఉంది. సభ్యసమాజానికి దూరంగా ఉండటం వలన, సన్యాసం వలన, వీరు చేసే తపస్సుల వలన రోగాలను నయం చేసే మంత్రశక్తులు ఉన్నాయనే నమ్మకం గ్రామీణ ప్రజలలో ఉంది. వీరి విపరీత చర్యలు వల్ల హిందువులు వీరికి వీరి సంప్రదాయాలకి దూరంగా ఉంటున్నారు అని చెప్పవచ్చు. నిర్వచనాలు, ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలియకుండానే క్షణకాలం పాటు ఒళ్లు జలదరించే పేరు ఈ అఘోరా అనే పదం.
సంస్కృతంలో అఘోర అంటే ‘భయం లేని’ అనే అర్థం ఉంది. కాని అఘోర పేరు విన్నా వాళ్లను చూసినా మనకు భయం కల్గుతుంది. ఈశ్వరుడి అయిదు ముఖాల్లో ఒకటైన అఘోరకు అఘోరాలకు ఎలాంటి సంబంధం ఉందో తెలియదు గానీ వీళ్లు శివుడిని ఆరాధిస్తారు. మానవరూపంలో ఉన్న శివుడి ప్రతీకగా తమను తాము భావిస్తారు. కపాలిక సంప్రదాయం నుంచి వేరు పడిన వారే అఘోరాలు. ప్రపంచంతో సంబంధం లేకుండా భవ బంధాలను వదులుకోవడాన్ని తమ నగ్నదేహం నిదర్శనం అని వీరు చెబుతుంటారు.
వీరి జీవన విధానం :
కాలుతున్న శవాల మధ్య కాలం గడుపుతుంటారు.
శ్మశానాలలో జీవించటం వీరికి అలవాటు.
స్మశానాల్లో నగ్నంగా సంచరిస్తుంటారు.
పాడుబడ్డ భవనాలలో జీవించటం, పూజలు, ప్రాణాయమాలు, తపస్సులు అందులోనే నిర్వహించటం
కాలిన శవాల బూడిదను విభూతిగా పరిగణించి, తమ నగ్న శరీరం అంతటా రాసుకోవటం.
శివుడు, పలు ఇతర దేవతలు పుర్రె, ఎముకలను ధరించినట్లు వీరు కూడా ధరిస్తారు.
పుర్రెను ఆహారంగా స్వీకరించే పాత్రగా వినియోగించటం, అదే పుర్రెలో (కుక్క వంటి) జంతువులకు కూడా ఆహారదానం చేయటం
పొడవాటి ఎముకలను దండంగా వినియోగించటం
మానవ కళేబరాలను ఆహారంగా భుజించటం ( పూర్తి నిర్దారణ కాలేదు )
శవాలతో సంభోగించటం ( పూర్తి నిర్దారణ కాలేదు )
గంజాయి తాగుతూ స్మశానాల్లో నగ్నంగా సంచరిస్తుంటారు.
అధ్వైతిగా జీవించడం ద్వారా మోక్షం పొంది .పునర్జన్మ పొందవచ్చని అఘోరాలు నమ్ముతారు.
వీళ్లు పగటిపూట చాలా అరుదుగా కనిపిస్తారు. కేవలం శివరాత్రి, కుంభమేళా సమయాల్లో మాత్రమే పగటిపూట కనిపిస్తారు.
జట్టు జడలు కట్టి, శరీరం మట్టితో కొట్టుకు పోయి ఒంటి నిండా గాయాలతో ఉంటారు ఈ అఘోరాలు.
కొందరు అఘోరాలు శరీరంలో ఎముకలు లేవా అన్నట్లుగా ఎటు పడితే అటు శరీరాన్ని వంచుతుంటారు.
ఉత్తర భారతంలో మహిళా అఘోరాలు కూడా ఉంటారు.
పురుష అఘోరాల మాదిరిగానే స్త్రీలు కూడా స్మశానంలో నిద్రించడంతో పాటు, శవాలను భక్షిస్తూ ఉంటారు. ( గమనిక : ఈ వాక్యం పూర్తిగా నిర్దారణ కాలేదు )
అఘోరాల ఆశ్చర్య కరమైన జీవనసరళి:
👉 అఘోరాలు తమ సంప్రదాయం ప్రకారం శవాలను దహనం చేయకుండా గంగానదిలో విడిచిపెడతారు. అలాంటి శవాలు అఘోరాలకు ఆహారంగా మారతాయి. అవి ఎలాంటి స్థితిలో ఉన్నా, ముక్కు పుటాలు అదిరిపోయే దుర్వాసన చట్టు ముట్టినా అఘోరాలు పట్టించుకోరు. తినడం మీదే శ్రద్ధ పెడతారు.
👉 ఇలా చేయడం వల్ల వాళ్లకు వ్యాధులు ఏవీ రావట! నరమాంసం తినే ముందు కొంత మాంసాన్ని దేవుడి కోసం విడిచి మొక్కుతారు.
👉నగ్నంగా వీధుల వెంట సంచరించే అఘోరాలు ఆ నగ్నత్వానికి తాత్విక అర్థం చెబుతారు.
👉పద్దెనిమిదవ శతాబ్దాంలో నివసించిన కినరామ్ అగోర సంప్రదాయినికి ఆద్యుడు. ఇతను 150 సంవత్సరాలు జీవించాడట! కినరామ్ శివుడి అంశతో జన్మించిన యోగి అని అతని భక్తులు విశ్వసిస్తారు.
👉 కినరామ్లో ఎన్నో దివ్యశక్తులు, మహిమలు ఉండేవట. వాటితో ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేవాడట. వారణాసిలో ఈ బాబాకు ఒక మందిరం ఉంది. అఘోరాలకు ఇదొక పవిత్రక్షేత్రం.
👉అఘోరాల అభిప్రాయాలు అజ్ఞానం అనేది చీకటి. అఘోర అనేది దివ్యవమైన కాంతి. అది అజ్ఞానమనే చీకటిని చీల్చి వేస్తుంది.
👉 ఏకాంతంలో చెట్టుకింద కూర్చున్నప్పుడు కలిగే జ్ఞానమే అఘోర.
👉చితిమంట అనేది తిరుగులేని అంతిమ సత్యం. ప్రతి ఒక్కరికీ చావు తప్పదని అది ఎప్పుడూ చెబుతుంది.
👉ప్రపంచం యావత్తు అఘోరతో ఉంటుంది. అఘోర మాత్రం ప్రపంచానికి అతీతుడై ఒంటరి లోకాల్లో వుంటాడు.
👉 తమ కళ్లు భౌతికమైన వాటిని మాత్రమే కాక ఇతరుల చూపుకు అందని సూక్ష్మ అంశను కూడా చూస్తాయంటారు అఘోరాలు. వివిధ రూపాల్లో చేసే తాంత్రిక సాధన తమలోని మండలిని శక్తిని తట్టి లేపుతుందని.అప్పుడు చితిమంటల మీద దేవుళ్లు నాట్యం చేస్తారని నమ్మకంగా చెబుతారు.
👉 అర్థరాత్రి సమయంలో శ్మశానంలో చితిముందు ఒక బండ మీద నగ్నంగా కూర్చొని అఘోర ధ్యానం చేస్తాడు. అప్పుడు అతని కళ్లలో భయం, ముఖంలో సిగ్గు లాంటి లక్షణాలేవీ కనిపించవు. గాలికి అతని పొడ వాటి వెంట్రుకలు తనలోని తాంత్రికశక్తి గురించి చెబుతున్నట్లుగా వేలాడుతుంటాయి.
👉అఘోరల కుడిచేతిలో కనిపించే కపాలం తాను తెలుసుకున్న సత్యాన్ని ప్రతిబింబిస్తుంది. రుద్రాక్షలను లెక్కిస్తూ ఏదో మంత్రాలను పటిస్తుంటారు.
👉 కొన్ని సందర్భాల్లో శవం మీద కూర్చొని ధ్యానిస్తుంటారు. అప్పుడు అతని చుట్టూ ఎముకలు ఉంటాయి. ధ్యానంలోకి దిగే ముందు తనచుట్టూ రక్షణ వలయాన్ని నిర్మించు కుంటాడు. దీన్ని ‘కిలన’ అంటారు.
👉 ధ్యానంలో ఉన్న అఘోర ముందు మూడు పుర్రెలు ఉంటాయి. వాటిని రాజస, తామస, సాత్విక గుణాలకు ప్రతినిధులుగా భావిస్తాడు.
👉 అఘోర దగ్గర అడనక్క ఉంటుంది. ఈ నక్క తన సందేశాన్ని శ్మశాన దేవుడికి తీసుకెళుతుందని విశ్వసిస్తాడు. కఠోర సాధన వల్ల తాము ఎన్నో శక్తులను పొందినట్లు అఘోరాలు చెబుతారు.
👉 అఘోర మహిమలను ఆ నోట ఈ నోట ఈ పుస్తకంలో ఈ పుస్తకంలో విన్నవారు తప్ప చూసిన పూర్తిగా వారు లేరు. సాక్ష్యం చెప్పిన వారు కూడా లేరు.
👉 అఘోరలు ఆరాధించే ఆలయాలుఅఘోర్ కుటి, నేపాల్ నేపాల్ లోని కాట్మండు లో కుటి అనే ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని బాబా సింగ్ షావక్ నిర్మించాడట. ఇతను శ్రీరామ భక్తుడు. విధ్యాంచల్ పార్వతీదేవి దుర్గా అవతారంలో మహిషాసురుడి ని చంపిన తర్వాత ఇక్కడ ఉన్నట్టు నమ్మకం ఉంది. ఈ ఆలయం చుట్టు అనేక గుహలు ఉంటాయి. అందుకే ఇక్కడ అఘోరాలు ధ్యానం చేస్తుంటారట.👉కాళీ మాత శక్తిపీఠాల్లో ఒకటి కాళీ మాత ఆలయం. గుప్త కాశీకి సమీపంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. కేదార్ నాథ్, ఉత్తరాఖండ్ చుట్టుపక్కల దీన్ని నిర్మించారు. దేశమంతా తిరిగిన తర్వాత చాలామంది అఘోరీలు ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతారట.
👉 తారాపీఠ్ వెస్ట్ బెంగాల్ లోని రాంపూర్ హాట్ అనే చిన్న దేవాలయం ఇది. ఈ ఆలయం గోడ చుట్టూ.. అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయాన్ని తాంత్రిక్ టెంపుల్ గా పిలుస్తారు. ఇక్కడ సతీ దేవత తారాదేవిగా పూజింపబడుతుంది. అందుకే ఇక్కడ ఈ అంత్యక్రియలు జరిగే ప్రాంతంలో అఘోరాలు తమ తంత్రమంత్రాలు చేస్తూ ఉంటారు.
👉 కపలీశ్వర్, మధురై ఈ ఆలయం అఘోరీలకు ప్రత్యేకంగా చెబుతారు. ఈ ఆలయానికి దగ్గరగా.. ఆశ్రమం ఉంటుంది. అనేక సమాధులు ఉంటాయి. వీటిలోపల అఘోరీలు తమ తంత్రాలు చేస్తూ ఉంటారు.కాళీ మందిరం, కోల్ కత్తా ధక్షిణేశ్వర కాళీ ఆలయం ధక్షిణేశ్వర్ కి దగ్గరలో ఉంది. కాళీమాతకు ప్రత్యేకం. సతీదేవి మరణం తర్వాత ఆమె ఎడమ కాలి నాలుగో వేలు ఇక్కడ పడిపోయిందట. అనేక మంది అఘోరీలు ఇక్కడ కు వచ్చి తంత్రాలు, ధ్యానం చేస్తూ ఉంటారు.
వీరి స్థావరాలు
- ఎప్పుడు హిమాలయాలోనే ఉండే అఘోర, నాగ సాధువులకి నిజంగానే అద్భుత శక్తులు ఉన్నాయా అనేది అంతుచిక్కని ప్రశ్నే, వారికి శక్తులున్నాయని వారు చెప్పుకోవడమే తప్పించి ప్రత్యక్షంగా చూసిన వారు తక్కువ అనే చెప్పుకోవచ్చు.
- నెలల తరబడి హిమాలయాల్లోని మంచు పర్వతాలలో ఉండటం అనేది మాములు మనుషులకి సాధ్యం కాదు, కానీ అఘోరాలు బయటి ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా జీవిస్తున్నారు.
- హిమాలయాలలో గడ్డకట్టే చలిలో ఆవాసాలు ఏర్పాటుచేసుకుని శివుని ఉపాసన చేస్తూ ఉంటారు.
- బెంగాల్ లోని అడవుల్లో, గుజరాత్ లోని ఎడారి ప్రదేశాల్లో ఉంటారట .వీరు ఎక్కువగా బయట కనిపించరు .వీరు ఒక్కొక్కరు 100 లేదా 150 సంవత్సరాలు బ్రతుకుతారట.
- కొంతమంది 250 సంవత్సరాలు బతికినవాళ్లు కుడా ఉన్నారట ఉత్తరభారతంలోని కాశి లో ఎక్కువగా ఉండే వీరు శివరాత్రి కుంభమేళా పుష్కరాల్లో పాల్గొంటారట.
- ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ జిల్లాలో,ఉత్తరాఖాండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ సమీపంలో కాళీమాత ఆలయంలో, చెన్నై సమీపములో కాళీశ్వర ఆలయం ఇలా కొన్ని ప్రదేశాలలో సమాధుల దగ్గర్లో వీళ్లు వుంటారు
- కుంభమేళా జరిగేటప్పుడు మాత్రం తమ లోకం నుంచి బాహ్య ప్రపంచంలోకి వస్తారు. భారతదేశంలోని హిందూ సమాజం అత్యంత పవిత్రంగా కొలిచే వీరిని అఘోరాలు అంటారు.
- వీరిపట్ల భారతీయ సమాజంలో అపారమైన భక్తి, గౌరవం ఉన్నాయికుంభమేళా సమయంలో నదీసంగమంలో పవిత్ర స్నానాలకు వచ్చే అఘోరాల్లో కొందరు నకిలీలు కూడా ఉంటారు.
- పవిత్ర స్నానాలకు వచ్చే భక్తులు, పర్యటకుల దగ్గర పూజలు, ఆశీర్వచనాల పేరిట డబ్బు సంపాదించు కునేందుకు ఇలాంటి అవతారమెత్తేవారూ ఉంటారని చెప్పారు.
- అఘోరాలు అందరి మంచి కోసం పూజలు చేస్తారని... పిల్లలు కలగాలని, ఇల్లు కట్టుకోవాలని.. ఇలా అనేక కోరికలతో వచ్చి ఆశీర్వచనాలు కోరేవారిని వారు ఏమాత్ర పట్టించుకోరని చెప్పారు.
- నిజమైన అఘోరాలకు డబ్బుపై వ్యామోహం ఉండదని, వారు డబ్బును ఆశించరని థక్కర్ తెలిపారు.
- అఘోరాలు ప్రధానంగా శివభక్తులు. ఉత్తర భారతదేశంలో అఘోరాల్లో పురుషులే ఉంటారు..కానీ, పశ్చిమబెంగాల్లో మాత్రం శ్మశాన వాటికల్లో పురుషులతో పాటు మహిళా అఘోరాలూ కనిపిస్తారు. ఈ మహిళా అఘోరాలు దుస్తులు ధరిస్తారు.
- ''చాలామంది చావంటే భయపడతారు. శ్మశానాలను చావుకు సూచనగా భావిస్తారు. కానీ, అఘోరాలకు అదే ఆరంభ స్థానం. సాధారణ ప్రజలు పాటించే నియమాలు, విలువలను వారు ధిక్కరిస్తారు'' అంటారు థక్కర్.
- ''సమాజం దూరం పెడుతున్న వర్గాల కోసం అఘోరాలు పనిచేస్తున్నారు'' అని మిన్నెసోటాకు చెందిన మెడికల్, కల్చరల్ ఆంత్రోపాలజిస్ట్' రాన్ బారెట్ చెప్పారు.
- కుష్టు వ్యాధి బారినపడి సొంత కుటుంబాలకు దూరమైన ఎంతోమందిని అఘోరాలు వారణాసిలో తాము నిర్వహిస్తున్న ఆసుపత్రిలో చేర్చి సేవలందిస్తున్నారు. వారికి ఆయుర్వేదం నుంచి అల్లోపతీ వరకు అన్ని రకాల వైద్యం అందిస్తున్నారు.
- 'తాము మృతదేహాలతో సంభోగిస్తామని బహిరంగంగా అంగీకరించిన అఘోరాలు ఉన్నారు. కొందరు తాము జరిపే కర్మకాండల్లో భాగంగా వేశ్యలతోనూ సంభోగిస్తారు. కానీ, అఘోరాల్లో ఏ ఒక్కరూ స్వలింగ సంపర్కాన్ని ఆమోదించరు, ఆచరించరు'' అని చెప్పారు మాలిన్సన్.
- ఇటీవల కాలంలో కొందరు అఘోరాలు బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు చిన్నపాటి వస్త్రాలను ధరిస్తున్నారు. అంతేకాదు... కొందరు సెల్ఫోన్లు వాడుతున్నారు.. ప్రజా రవాణాను వినియోగిస్తున్నారు.
- భారత దేశంలో ఎంతమంది అఘోరాలు ఉన్నారనే విషయంలో స్పష్టమైన లెక్కలు లేనప్పటికీ వేలసంఖ్యలో ఉన్నట్లు మాత్రం అంచనాలున్నాయి.
- అఘోరాలు చనిపోతే వారి మృతదేహాలను మిగతా అఘోరాలు తినరు. వారిని దహనమో, పూడ్చిపెట్టడమో చేస్తారు.
- అఘోరాలు కొంచం జనపనార గోచీ తప్ప ఏమీ ధరించకుండా స్వేచ్ఛగా తిరుగుతారు. అఘోరాలు వారి నగ్న శరీరాలను (మానవ దహనం అవశేషాలు నుండి) బూడిదతో అద్దుతారు.
- బూడిద జీవితం యొక్క 5 ముఖ్య అంశాలను తయారు చేస్తుందని వేరు అంటారు. అందువలన వ్యాధులు మరియు దోమల నుండి అఘోరలను రక్షిస్తుందని నమ్ముతారు. ఇది ప్రధానంగా లార్డ్ శివ భౌతిక రూపాన్ని అనుసరిస్తున్నారని అనుకోవచ్చు.
- మహిళలు అఘోరాలుగా మారడం అంత సులువైనది కాదు. ముందుగా వారు నాగ సాద్వీలుగా మారాలి. అంటే కనీసం 6 ఏళ్ల పాటు బ్రహ్మచర్యం పాటించి ఉండాలి. 6 ఏళ్ళు ( ఆరేళ్లపాటు కటిక బ్రహ్మచర్యం అంటే పురుష వాసన తలగకుండా, శృంగారం వంటి వ్యామోహాలకు దూరంగా ఉండాలి.
- ఆరు సంవత్సరాల పాటు దూరంగా ఉన్న వారు జీవితాంతం కూడా బ్రహ్మచర్యాన్ని పాటించగలరని సన్యాసి ఆచార్య మహామండలేశ్వర్ నిర్ణయించి వారికి సన్యాసం ఇస్తారు.
- ఇలా మారేందుకు తమకు తాముగా పిండ ప్రధానం చేసుకోవాలి. తమ రక్త సంబంధీకులను వదిలేసుకోవాలి. సన్యాసినిగా మారిన రోజు కొత్తగా పుట్టినట్లుగా భావించాలి.
- నాగ సాద్విగా మారిన తర్వాత మహిళలు తమ అలవాట్లను పూర్తిగా మార్చుకోవాలి. పురుషులతో సమానంగా మహిళలు కూడా శివ పూజలో పాల్గొనాల్సి ఉంటుంది.
- ప్రతి రోజూ ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి, నిత్య కర్మ చేసిన తర్వాత శివారాధన చేయాలి.
- ఇలా మద్యాహ్నం వరకు గడిపి ఆ సమయంలో భోజనం చేస్తారు. ఆ తర్వాత మళ్లీ ఈశ్వరనామ జపం చేస్తూ, భజనలు చేస్తూ దైవ పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం సమయంలో దత్తాత్రేయ పూజలో అంతా పాల్గొంటారు.
- మహిళా నాగ సాద్విలు దత్తత్రేయ తల్లి అయిన సతి అనసూయ దేవిని ఎక్కువగా పూజిస్తారు.
- పూజల సమయంలో ఎలాంటి కోరికలూ కోరుకోకూడదు. ఎందుకంటే వారు సర్వసంగ పరిత్యాగిలు కదా కేవలం ఈ జన్మకు మోక్షం కలిగించాలని దైవాన్ని ఈ అఘోరాలు వేడుకుంటారు అంతే.
- మహిళా అఘోరాలు చనిపోయిన సయమంలో వారి మృత దేహాలను కుటుంబీకులకు అప్పగించరు.
- సాద్వీగా మారే సమయంలోనే పిండ ప్రధానం పెట్టుకోవడంతో పాటు దిన కర్మలు చేస్తారు. కనుక ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా శవాన్ని నదిలో లేదా ఏదైనా చెరువులో పడవేస్తారు. (ఈ విషయం ఎంతవరకు నిజమో ఎవరూ ప్రూఫ్ తో బయటపెట్టింది లేదు )
- స్మశానంలో ఉండే అఘోరాలు చనిపోతే స్మశానం బయట నదిలో పడవేస్తారు. పురుష అఘోరాల మాదిరిగా దిగంబరంగా కాకుండా మహిళ అఘోరాలు కాశాయ వస్త్రం ధరిస్తారు.
- స్నానం ఆచరిస్తున్న సమయంలో కూడా మహిళా అఘోరాలు ఆ వస్త్రాన్ని అలాగే ఉంచుకోవాల్సిందే.
- విదేశాలకు చెందిన మహిళలు కూడా నాగ సాద్విలుగా మారేందుకు కాశీ వారణాసి వస్తుంటారు.
నానో టెక్నాలజీ అంటే ఏమిటి?
- నానో టెక్నాలజీ అంటే పెద్ద పరిమాణాలను అతి చిన్న పరిమాణాలుగా(సూక్ష్మం) చేసి ఒక చోటు నుండి మరో చోటుకి తరలించడం, అఘోరాలు కూడా దేశంలో ఎక్కడ కుంభమేళా జరిగినా వేల సంఖ్యలో వస్తారు, కానీ వచ్చేటప్పుడు కానీ తిరిగి వెళ్ళేటప్పుడు కానీ ఎవరికీ కనిపించరు, కేవలం కుంభమేళా జరిగే ప్రాంతంలో మాత్రమే కనిపిస్తారు,
- అఘోరాలు, నాగ సాధువులు నానో టెక్నాలజీ(సూక్ష్మ శరీరయానం )నే ఉపయోగించి ఎవరికీ కనిపించకుండా హిమాలయాల నుండి ఎక్కడికి అయిన వచ్చి తిరిగి వెళ్తున్నారని చెబుతారు. పూర్వకాలంలోనే మన ఋషులు ఈ టెక్నాలజీల గురుంచి రాసిపెట్టారని హిమాలయలలో తపస్సు చేస్తే ఆ శక్తులన్నీ లభిస్తాయని కొంత మంది నమ్ముతున్నారు.
నాగ సాధువులు గురించి:
👉 ఇక నాగ సాధువులు ఈ అఘోరాల లాగ ఇంత కఠినంగా ఉండరు ఎందుకంటే వీరు ఎప్పుడు కఠినమైన ధ్యానంలో సాధన చేస్తుంటారు. వీరి అంతిమ లక్ష్యం మాత్రం మామూలు మానవులకు కనిపించని దేవున్ని వారు ప్రత్యేక్షంగా చూడటమే. అలాగే వీరు తీసుకునే ఆహరం మామూలు మానవులు తీసుకునే ఆహారం లాగే ఉంటుంది. కొన్ని సంవత్సరాలు వీరు ఆహరం, నీరు లేకుండా ధ్యానం చేయగలరు. నాగ సాధువులకు చాలా మహిమలు తెలుసు అంటూవుంటారు. దానికి కారణం వారు ఎప్పుడు దైవ ధ్యానంలో ఉండటమే.
👉ఎప్పుడైనా కుంభమేళాలో గాని, పుష్కరాలలోగాని వారు వస్తే వారికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తూ వారి దగ్గర చాలా మంది ప్రజలు వారి కోరికలు చెప్పుకుంటారు. వారు కూడా భక్తుల కోరికలను తీరుస్తుంటారు. ఈనాగ సాధువులు గాలిలోనే ఏదైనా తాయత్తు లేదా బుడిదా తీసి భక్తులకు ఇస్తుంటారు. ఇలా చేయడం మామూలు విషయం కాదు ఎందుకంటే గాలిలో ఒక వస్తువును సృష్టించడం అంత సులువు కాదు దీన్నే ఆధునిక విజ్ఞాన శాస్త్రం న్యూక్లియర్ ట్రాన్స్ మ్యుటేషన్ అని అంటారు.అలాగే బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో హిమాలయ గుహలలో, కొండల్లో, నదీ తీరాల్లో ఉండే నాగ సాధువులు మాత్రమే ఇలాంటివి చేస్తుంటారు.
ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్ . ల లో అఘోరాలు నాగసాధ్వి ల గురించి తెలుసుకోండి
ఈ రోజు సూక్తి:
"If you can tune into your purpose and really align with it, setting goals so that your vision is an expression of that purpose, then life flows much more easily."
- Jack Canfield
దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు చూడండి లైక్ , షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి:
My blogs:
Wowitstelugu.blogspot.com
https://wowitstelugu.blogspot.com
teluguteevi.blogspot.com
https://teluguteevi.blogspot.com
wowitsviral.blogspot.com
https://wowitsviral.blogspot.com
Youtube Channels:
bdl 1tv (A to Z info television),
https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ
bdl telugu tech-tutorials:
https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg
My Admin FaceBook Groups:
Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు
https://www.facebook.com/groups/dharmalingam/
Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ
https://www.facebook.com/groups/259063371227423/
Graduated unemployed Association
https://www.facebook.com/groups/1594699567479638/
Comedy corner
https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks
Wowitsinda
https://www.facebook.com/groups/1050219535181157/
My Facebook Pages:
Educated Unemployees Association:
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
Hindu culture and traditional values
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
My tube tv
https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour
Wowitsviral
https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour