ajpuja district collector లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ajpuja district collector లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, మే 2019, సోమవారం

Do you know Great Indian Kerala ajpuja District collector S. Suhan visits every day to the tribal schools

wowitstelugu.blogspot.com

గొప్పభారతీయ కేరళ  రాష్ట్ర   అల్లపుజా జిల్లా కలెక్టర్   ఎస్. సుహాన్ ప్ర‌తి రోజు గిరిజన హాస్ట‌ల్ లోనే భోజ‌నం 
ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులకు గానీ, స్కూళ్లకు గానీ ఎవరైనా అధికారులు తనిఖీకి వస్తున్నారని ముందుగా తెలిస్తే చాలు, ఉపాధ్యాయులు మరియు మిగతా అధికారుల హడావిడి మామూలుగా ఉండదు. ఆ ఒక్కరోజు ఎక్కడా లేని హడావిడి చేస్తూ రూల్స్ అన్ని ఫాలో అవుతూ బుద్దిగా పనిచేస్తారు. మళ్లీ అధికారి తిరిగి వెళ్లిపోగానే షరా మామూలే. అందుకే కేరళలోని ఓ కలెక్టర్ రూట్ మార్చాడు.

అది కేరళ రాష్ట్రం అల్లపుజా జిల్లా. కలెక్టర్ ఎస్.సుహాన్. 2012 లో  IAS బ్యాచ్ కు చెందిన ఈయన ఇటీవలే అల్లపుజ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. వచ్చీరాగానే జిల్లాలోని పాఠశాల్లో బోధన, సౌకర్యాలపై దృష్టి పెట్టారు. ఒకరోజు  మధ్యాహ్నం నీరుకున్నమ్ లోని శ్రీ దేవి విల్సమ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ కు వెళ్లారు. సరిగ్గా పిల్లలు భోజనం చేసే సమయంలో. కలెక్టర్ వచ్చారని అందరూ హడావిడి చేస్తుంటే, ఆయన నేరుగా డైనింగ్ హాలులో ఓ ప్లేట్ తీసుకున్నారు. పిల్లల మధ్య కూర్చుని భోజనం చేశారు. ఆ రోజు కర్రీస్ దోసకాయ, ఆలుగడ్డ. పెరుగు కూడా ఉంది. పిల్లల మధ్య మధ్యాహ్న భోజనం చేస్తూనే ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు.
అల్లపుజా జిల్లా కలెక్టర్. రోజూ ఆఫీస్ కు వస్తాడు. క్యారేజీ తెచ్చుకోడు.. హోటల్ నుంచి పార్శిల్ రాదు.. భోజనం టైంకి సరిగ్గా ఆఫీస్ నుంచి మాయం అవుతారు. ఎక్కడికి వెళతాడు అనేగా మీ డౌట్. ఆయన గిరిజనుల స్కూల్ కు వెళతాడు. అవును సరిగ్గా భోజనం టైంకి స్కూల్ కు వెళ్లే ఆ కలెక్టర్ అక్కడ పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తాడు. బిజీ షెడ్యూల్ తప్పితే మిగతా ఎక్కువ రోజులు ఇలాగే చేస్తాడు.

ఇటీవలే అల్లపుజ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు కలెక్టర్ సుహాన్. దీని వల్ల మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెరుగుతుందని.. విద్యార్థుల ఆరోగ్యంపైనే కాకుండా చదువుపై కూడా దృష్టి పెట్టటానికి వీలవుతుంది అన్నారు. పిల్లల తల్లిదండ్రుల్లోనూ ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం ఏర్పుడుతుందన్నారు. అతి సామాన్యుడిగా, ఓ పేరంట్ గా వారితో కూర్చుని భోజనం చేయటం వల్ల పిల్లల్లోనూ భరోసా, ధీమా, దైర్యం వస్తుందన్నారు అయన చెబుతున్నారు.

ఇది ఎప్పుడో ఒక్క రోజు జరిగిన తనిఖీ కాదు, అంతకు ముందు ఆయన వయనాడ్ జిల్లా కలెక్టర్ గా కూడా పని చేశారు. అప్పుడు కూడా ఇలాగే గిరిజన పాఠశాలలపై దృష్టి పెట్టారు. ప్రతి రోజు ఓ గిరిజన పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉపాధ్యాయులకు షాక్ ఇచ్చేవారు. దీంతో అటవీ ప్రాంతంలోని గిరిజన స్కూల్స్ విద్యార్థుల సంఖ్య అనూహస్యంగా పరిగింది. ఒక్కో పాఠశాలలో 30 మంది స్టూడెంట్స్ చేరారు. ఒకే ఒక్క సంవత్సరంలోనే ఈ మార్పు తీసుకొచ్చారు అక్కడ అయన .

  • కలెక్టర్ స్కూళ్లను తనిఖీలు చేసే ఫోటోలు సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. అధికారిలా కాకుండా సామాన్యుడిలా మారి విధులు నిర్వహిస్తున్న కలెక్టర్‌ను అందరూ అభినందిస్తున్నారు.  
  • నిజంగా ఇలాంటి కలెక్టర్ ప్రతి జిల్లాకు ఉంటే అభివృద్ది అనేది ఖాయం.  గవర్నమెంట్ స్కూళ్లంటే  తల్లిదండ్రులకు ఉన్న అపోహలు తొలగిపోవడం ఖాయం అని అందరూ అనుకుంటున్నారు.  
  • హ్యాట్సాఫ్ టు  కేరళ కలెక్టర్. అందరు కలెక్టర్లు ఎలా ఉంటె ఎంత బాగుండేదో కదా? అని అందరూ చర్చించుకుంటున్నారు.
ఈ క్రింది సుహాస్ గారి వీడియో యూ.ఆర్.యల్ లు చూడండి ...


Note: 
నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and  subscribe  చేయండి
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like,share and subscribe  చేయండి .  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి  మరియు నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com  చూడండి చూసి  like,share and subscribe  చేయండికామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ.