మాయ అంటే ఏమిటీ మనుషులు ఎందుకు ఈ మాయలో పడుతుంటారు
What is delusion and why do people fall into this delusion
💥మాయావినో మమిరే అశ్య మాయాయ (ఋగ్వేదం 9.83.3)
💥మహా మాయగాళ్ళు ఆయన మాయచేతనే మాయచేస్తుంటారు.
👺 మాయ లో మనం పడటమే ఈ జీవితంలో అన్నిటికన్నా ఆశ్చర్యం. అసలైన మాయ .
👺 ఈ జీవితమనే అడవిలో మన మనసు తికమక పడుతుంది, పెడుతుంది.
👺 మన ఇహలోక జీవితం శాశ్వతం సంపూర్ణం ఎన్నటికి మారనిది సుఖమైనది అంటుంది.
👺 కానీ మన మనసు అంటుకు పోయిన ఈ లోకం ఈ లోకంలోని మన జీవితం తాత్కాలికం అసంపూర్ణం ఎప్పుడూ మారేది పరిమితులతో కూడినది చాలా విచారకరమైనది కూడా.
👺 గత జన్మల కర్మలను స్వభావాలను బట్టి మనం ఇహలోక ఆశలు పెంచుకుంటాము. మన రాగ ద్వేషాలను బట్టి ఆశలు కోర్కెలు ఎన్నోమనలో కలుగుతాయి.
👺 మనసు పుట్టించే ఇహలోకాశలతో మనం మోసపోతాము. నాది నేను అనే మాయలో పడి మంచి మంచి వస్తువులుకోరతాము రోగం మరణం వద్దంటాము.
👺 మహావిద్యావంతులు కూడా కోర్కెలు ఉండాలి కోర్కెలు లేనివాడు చచ్చినట్లే లెక్క అంటారు.
👺 తల్లిదండ్రుల్నిజన్మను బంధువుల్ని కులాన్ని రంగును మరణాన్ని అన్నిటినీ మనమే ఏదేది ఎప్పుడు జరగాలో ఎలా జరగాలో కోరుకున్నట్లు అలాగే జరుగుతున్నట్లూ మనం భ్రమిస్తున్నాము.
👺 అన్నిటికంటే ఆశ్యర్యం కలిగించే మన ఈమూర్ఖత్వపు అజ్ఞానమే మహా చిత్రమైన మాయ.
1.👺 ఒక వ్యాపారి ఒక ఎడారి ని దాటవలసి ఉన్నది . అతడు అతని యొక్క బరువైన సామానులు మోసుకొని పోవుటకు ఒక ఒంటెను ఏర్పాటు చేసుకొన్నాడు. అతను అతని యొక్క మొత్తం సామానులు ఒంటెపైకి ఎక్కించి నాడు , వాటితో పటు ఒక చిన్న ఖాళీ డబ్బాను కూడా ఉంచాడు. ఆ ఒంటె ఆ సామాను బరువుకు బాధ పడుతూ ముందుకు పోవుటకు మొరాయించింది. అప్పుడు ఆ వ్యాపారి ఆ ఒంటె మీద ఉన్న సామాన్ల లో నుండి కాళీ డబ్బాను తీసి క్రిందకు విసిరి నాడు. ఆ డబ్బా శబ్దం చేస్తూ క్రింద పడింది . అప్పుడు ఆ ఒంటె తన వీపు మీద నున్న సామాను బరువు తగ్గిందని భావించి ఆ మండుతున్న ఇసుక ఎడారిని కూడా లెక్క చేయకుండా ఎడారిని దాటింది. మనిషి కూడా ఇలాంటి మాయల లోనే పడుతుంటాడు . మనిషి కూడా తనకి అన్ని సాధ్యమైయ్యే సాధ్యం కాదు అనుకుంటాడు.
2.👺 ఒక డాక్టర్ మరి యు ఒక పారిశ్రామిక వేత్త స్నేహితులు . వారిద్దరూ ఒక్క ముఖ్యమైన సమావేశానికి అర్ధరాత్రి కారులో ప్రయాణమైనారు. పారిశ్రామిక వేత్త కారు నడుపుతున్నారు. డాక్టర్ కబుర్లు చెబుతున్నారు. ప్రయాణిక బదలి కో లేదా ఇంకేదైనా మానసిక ఒత్తిడో తెలీదు కానీ పారిశ్రామిక వేత్తకు హఠాత్తుగా తల బద్దలైయెలా తల నొప్పి మొదలైంది. పారిశ్రామిక వేత్త డాక్టర్ ని ఏదైనా మందు ఇమ్మని అడిగాడు . డాక్టర్ దగ్గర ఉన్న మెడికల్ కిట్ లో మందులు తలనొప్పికి సంబందించినవి ఏవి లేవు .
👺 కానీ కోటులోంచి ఒకటి తీసి స్నేహితుడిని పైకి తీసి చూడకుండా చప్పరించాలని దాన్ని మింగ కూడదని చెప్పాడు. పారిశ్రామిక వేత్త మాట్లాడుతూ చప్పరిస్తూ ఉండగానే హఠాత్తుగా తలనొప్పి తగ్గి పోయింది. తలనొప్పి తగ్గగానే దాన్ని నోట్లోంచి చూడకుండా తీసి పారేయమన్నాడు . పారిశ్రామిక వేత్త డాక్టర్ చెప్పినట్లు అలాగే చేసాడు. కాని తలనొప్పికి వాడిన మందు పేరేమిటి అని అడిగడానికి మొహమాట పడి. చాలా కాలమైనా తరువాత డాక్టర్ ని పారిశ్రామిక వేత్త అడిగినాడు మీరు నాకు తల నొప్పికి ఇచ్చిన మందేమిటని? అప్పుడు డాక్టర్ చెప్పిన సమాధానానికి పారిశ్రామిక వేత్త నివెర్రపోయాడు . ఆ డాక్టర్ ఇచ్చిన మందు ఏమిటంటే అతని కోటు గుండీ. డాక్టర్ మంచి మందే ఇస్తాడు లే అనే నమ్మకమే అతని తలా నొప్పిని తగ్గించింది.మనిషి అలాగే మన జబ్బులకు అన్నిటికి కారణం మన మనస్సే అన్న సంగతి మర్చి పోతాడు. ఇదే మరి మాయ అంటే ?
👺 ఈ ప్రపంచము లో మానవ జీవితం అంతా కూడా ఒక ఎడారి లేదా సముద్రం లాంటిది . ఎన్నెన్నో వింతలూ విచిత్రాలు. ఈ మాయ దేవి లీలలకు అంతు లేదు . అన్ని తెలిసిన వాడు తనకు ఏమి తెలీదనుకుంటాడు . ఏమి తేలినవాడు తనకు అన్ని తెలుసు అనుకుంటాడు. అన్నిటికి ఈ మాయ లేదా డెల్యూషన్ మనిషిని మాయ లోకి తోస్తుంది . మాయ అనేది ఓకే ఊహ. ఒకొక్క సారి చిన్న చిన్న కష్టాలు తొలగించి అంతులేని ఆనందాన్ని కలిగిస్తుంది. అంతులేని ధన సంపదలు ఉంది కూడా చాలామందికి మానసిక శారీరక భాదలు ఈ మాయ వల్లే కలుగుతాయి .మానవుడు ఈ కష్టాల నుంచి పూర్తిగా విముక్తి లభించిందని భ్రమిస్తుంటాడు. ఈ మాయ ప్రతి క్షణం ప్రతి మానవుడిని వెంటాడుతూనే ఉంటుంది.
👉 అంబ లేదా జగదాంబ ఈ జగత్తున్నంతా సృష్టించి రక్షించి తిరిగి లయం చేసే శక్తి స్వరూపం.
👉 జగత్తుకంతటికీ అధినాయకి. జగదాంబిక.త్రిమూర్తుల యోగదృష్టి సంయోగం వల్ల జన్మించింది.
మాయేశ్వరీ దేవి ఎవరు?
🙏 మాయేశ్వరీ మాత.దేవీ భాగవతం ఆరో స్కంధంలో సకల జగత్తుకు మూలాధారమైన శక్తే ఈ మాయేశ్వరీ మాత
🙏 హరిహరబ్రహ్మ రుద్రాదులను సయితం ఈమె సృష్టించి వారి చేత ఏయే పనులు చేయించాలో వాటిని చేయిస్తుంటుంది.
🙏 చరాచర జగత్తునంతటినీ ఆడించే మాయాశక్తి ఆమె. సత్వ, రజో, తమో అనే మూడు గుణాలతో ఆవరించి ఉండే మాయ ఆ తల్లి చేతిలోని ఓ సూత్రం.
🙏 ఆ మాయాశక్తి వల్లే అంతటి పెద్ద పెద్ద దేవుళ్ళు కూడా ఒకసారి కోపంగా, మరోసారి దుఃఖపడుతూ కనిపిస్తుంటారు.
🙏 తమోగుణం ఆవరించి ఉన్నప్పుడు మూఢంగా ప్రవర్తించి విషాదాన్ని అనుభవిస్తూ కనిపిస్తారు.🙏 మాయాశక్తికి లోనుకాకుండా మోక్షపథం వైపు పయనించాలంటే తనలోని మాయను తొలగించమని వేడుకోవాలి.
🙏 ఆదిపరాశక్తి అని, సచ్చిదానంద స్వరూపిణి అని, భగవతి, మాయేశ్వరి అని కూడా ఆ మాతఅని కూడా అంటుంటారు.
🙏 ఆ సూత్రంతోనే సకల సృష్టిని బొమ్మను చేసి ఆడించినట్టు ఆడిస్తూ ఉంటుంది ఆమె.
🙏బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు కూడా త్రిగుణాత్మకమైన మాయను పొంది ఉంటారు.
🙏 మూడు గుణాలలో మొదటిదైన సత్వగుణం ఆవరించి ఉన్నప్పుడు త్రిమూర్తులు శాంతులై తపస్సు చేసుకుంటూ ఉంటారు.
🙏 అదే రజోగుణం ఉన్నప్పుడు ఘోరంగా ప్రవర్తిస్తుంటారు.
🙏 ఈ జగత్తంతా మాయ ఆధీనంలో ఉంటుంది . ఈ మాయాశక్తిని ప్రేరేపించే జగదాంబికను పరతత్వం అని, పరమేశ్వరి అని కూడా అంటారు.
🙏అప్పుడు మనస్సు నిర్మలంగా ప్రకాశిస్తుంది. ఇంద్రియాలకు నిగ్రహశక్తి లభించినప్పుడు మనిషి చూపు తాత్కాలిక సుఖాల మీద ఉండదు.
ఈ రోజు సూక్తి "