16, ఏప్రిల్ 2020, గురువారం

మణిద్వీపవర్ణనతో అమ్మవారిని ఎలా పూజించాలి. మణిద్వీప వర్ణన ఫలితం ఏమిటి

wowitstelugu.blogspot.com
మణిద్వీపవర్ణనతో  అమ్మవారిని  ఎలా పూజించాలి. మణిద్వీప వర్ణన ఫలితం ఏమిటి
రాజరాజేశ్వరి దేవి 
మణిద్వీపం అని తలచినంత మాత్రమే సకల దరిద్రాలూ దరిదాపుకు చేరవని శాస్త్ర ప్రమాణం. మణిద్వీపాన్ని మనసారా చదివినా లేక గానం చేసినా వచ్చేఫలితాలను వర్ణించడానికి వేయిపడగల ఆదిశేషుడుకి కూడా సాధ్యం కాదు అని ప్రతీతి.

పూజకి కావలసిన పసుపు కుంకుమ అగరువత్తుల కర్పూరం తాంబూలం దీపారాధన వస్తువులు మరియు

నవరత్నాలు .రాగి కంచు వెండి బంగారము మెదలగు లోహాలతో యదాశక్తి అమ్మకు పూజచేసుకుంటూ.సుగంధ ద్రవ్యాలతో మణిద్వీప నివాసినిని పూజిస్తారు.

ఈ బ్రహ్మాండమును కనురెప్పపాటులో సృష్టించి లయముచేయగల ముప్పదిరెండు మహాశక్తుల పరిరక్షణలో ఈ సమస్థ విశ్వమూ ఉండుటవలన ముప్పదిరెండురకాల పూలతో అమ్మవారిని పూజించాలి. 

వాటిలో ఈ క్రిందన ఉదహరించిన పూవులున్నాయి 

1. మల్లెపువ్వులు 

2. గులాబి 

3. సన్నజాజి 

4. విరజాజి 

5.సెంటుమల్లి 

6. డిసెంబరంపువ్వులు 

7. చామంతులు

8. లిల్లీ 

9. ముద్దగన్నేరుపువ్వులు 

10. నందివర్ధనం

11. పారిజాతపూలు 

12. చంద్రకాంతంపూలు 

13. సువర్నగన్నేరుపూలు 

14. కలువ పూలు 

15. పాటలీపుష్పాలు

16. ముద్దనందివర్ధనం 

17. గన్నేరుపూలు 

18. కదంబపూలు

19. మందారాలు 

20. తామరలు 

21. కనకాంబ్రాలు

22. దేవగన్నేరు పూలు 

23. అశోక పుష్పాలు 

24. నిత్యమల్లెపువ్వు

25. కుంకుమపువ్వు 

26. పొన్నపువ్వు 

27. మంకెనపువ్వు

28. రాధామనోహరాలు 

29. కాడమల్లె 

30. నాగమల్లె

31. విష్ణుక్రాంతం 

32. రామబాణం /లేక నూరు వరహాలు పూలు 

33. దేవకాంచన పూలు

34. చంపక ( సంపంగి)

 35. పున్నాగ పుష్పాలు

మొగలి పూవు బంతి పూవూ పూజకు పనికిరాదు
మందారాలలో గులాబీలలో చామంతులలో చాలా రకాలు ఉన్నా వాటన్నిటినీ ఒక్కొక్కటిగానే పరిగణించి ఈక్రింద ఇవ్వడము జరిగింది.మందారాలలో గులాబీలలో చామంతులలో చాలా రకాలు ఉన్నా వాటన్నిటినీ ఒక్కొక్కటిగానే పరిగణించి ఈక్రింద ఇవ్వడము జరిగింది. ఇవ్వికాక ఇంకేమైనా ఉన్నా, వీట్లో ఏమైనా అమ్మ పూజకు పనికిరావన్నా తెలియజేయండి

నైవేధ్యాలుగా 32 రకాలు  చేసి అమ్మవారికి సమర్పించాలి 

మణిద్వీప వర్ణన మహత్యం 
  • శ్రీచక్ర బిందు రూపిణి శ్రీ రాజరాజేశ్వరి శ్రీదేవి శ్రీ మహావిద్య శ్రీ మహాత్రిపురసుందరి శ్రీ లలితా జగన్మాత అమ్మవారు నివాసముండే పవిత్ర ప్రదేశమే మణి ద్వీపం.

  •  పదునాలుగు లోకాల అనంతరం సర్వలోకంలో ఆమె కొలువై వున్నారు. యావత్‌ జగతిని పరిరక్షించే అమ్మవారి మదిలో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకం ఉద్భవించింది. నాలుగువైపులా అమృతంతో కూడిన సముద్రం సరిహద్దులుగా వున్న ఈ ద్వీపాన్ని వర్ణించాలంటే మన శక్తి చాలదు. 

  • మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో పరివేష్టితయై వుంటారు. దేవీ భాగవతంలో మణి ద్వీపం గురించిన వర్ణన వుంది. అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు లాంటి నవనిధులతో పాటు బంగారు మయమైన కొండలు ఈ ద్వీపంలో వున్నాయి.

  •  అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు దర్శనమిస్తారు

  • మొదట వచ్చే ఇనుప ప్రాకారంలో భూమండలంలోని రారాజులు వుంటారు.వీరు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను పంపుతుంటారు

  •  అనంతరం కంచుతో చేసిన రెండో ప్రాకారం వుంటుంది. పచ్చటి అరణ్యములతో, వివిధ రకాల జంతువులు, పక్షుల కిలకిలరావాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనిస్తుంటుంది. ఇలా అనేక ప్రాకారాలు దాటిన అనంతరం చింతామణి గృహంలో అమ్మవారు వుంటారు.

  •  జ్ఞాన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తి మండపంలో మంత్రులతో చర్చలు నిర్వహిస్తారు. వైకుంఠం, కైలాసం కంటే అద్భుతమైన ప్రపంచం అమ్మవారి నివాసం.

  •  యావత్‌ విశ్వంలో ఎక్కడా లభించని అనంతమైన సంపద అక్కడ వుంటుంది. అన్నింటినీ మించి అమ్మ సన్నిధిలో వుండటమే మహావరం. అందుకనే మణిద్వీప వర్ణన పారాయణం చేస్తుంటారు.

  •  ఈ పారాయణంతో ఇంట్లోని వాస్తుదోషాలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలూ లభిస్తాయి.

ఫలశృతి:

  • పదునాలుగు లోకాలకూ పరంజ్యోతియగు మణిద్వీప నివాసిని, పరమేశ్వరిని, తొమ్మిది విధాలుగా కీర్తించుకొనుటకు తొమ్మిది దోహాలతో ఈ స్తోత్రం వ్రాయబడింది.

  •  అమ్మకు నవసంఖ్య ఇష్టంగాబట్టి దీనిని తొమ్మిది పర్యాయములు ప్రతిరోజు చదివిన ప్రతిమనిషి తరించవచ్చు.

  •  దీనిని శుక్రవారమునాడు పూజావిధాన ప్రకారము పూజించి తొమ్మిది మార్లు పారాయణ లేదా గానం చేసిన ధన, కనక, వస్తు, వాహనాది సంపదలు కలిగి భక్తి, జ్ఞాన, వైరాగ్య, సిద్ధులతో ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో తులతూగి, చివరకు మణిద్వీపం చేరగలరు. ఇది శాస్త్రవాక్యం.

  • మణిద్వీప వర్ణన, చింతామణ గృహవర్ణనలు వింటేనే సకల పాపాలూ నశిస్తాయని భక్తకోటి నమ్మకం

శ్రీమాత నివాసం చింతామణి గృహం

విజయదశమి పర్వదిన శుభవేళ ఆ జగజ్జనని, శివాత్మక మణిద్వీప నివాసినీ అయిన ఆ తల్లిని స్మరించుకోవటం ఎంతో శుభప్రదం.ఆ అమ్మ మణిద్వీపంలో   ఎలా అలరారుతోంది  అనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు వర్ణించి చెప్పే కథ.

దేవీభాగవతంలో వర్ణితమై ఉంది. నూతన గృహప్రవేశ శుభ సందర్భాలలో తరతరాలుగామణిద్వీప వర్ణన పారాయణం చేస్తూ ఉండటం ఓ ఆచారంగా వస్తోంది.

మణిద్వీప వర్ణన పూజ విధానం ఈ క్రింది వీడియో లలో చూడండి.

గమనిక :

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ.














కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి