భారత దేశములోని ముఖ్య మైన సరస్వతీ దేవి ఆలయ ములు
సరస్వతీ దేవీ సకల విద్యాస్వరూపిణి. ఈ దేవిని ఒక్క హిందువులు మాత్రమే కాకుండా జైనులు, బుద్దులు కూడా ఆరాధిస్తారు. కంబోడియా, థాయిలాండ్ వంటి దేశాల్లో కూడా సరస్వతీదేవిని చదువుల తల్లిగా కొలుస్తారు. మన దేశంలో సరస్వతీదేవిని పూజించే కొన్ని ఆలయాలు ఏంటి ఎక్కడ ఉన్నాయనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
![]() |
సరస్వతి ఆలయం ,బాసర |
- తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా, బాసరలో గోదావరి నది ఒడ్డున జ్ఞాన సరస్వతి దేవి ఆలయం ఉంది.
- ఇక్కడి అమ్మవారి విగ్రహాన్ని వ్యాసమహర్షి ప్రతిష్టించినట్లు ప్రతీతి.
- కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన ప్రాణ నష్టాన్ని చూసి ఇక్కడికి వచ్చి తపస్సు చేసాడని, ప్రతి రోజు ఉదయం గోదావరిలో స్నానం చేసి మూడు పిడికిళ్ల ఇసుక తెచ్చి మూడు కుప్పలుగా పోసి పుజించాడని, ఆ మూడు ఇసుక కుప్పలే సరస్వతి, లక్ష్మి, కాళికా రుపొందాయని పురాణం.
- ఈ ఆలయంలో పిల్లల అక్షరాబ్యాసం చేయించడానికి తల్లితండ్రులు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.
సరస్వతి అమ్మవారి క్షేత్రము. - బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడి మందిరం ... మరొక ప్రసిద్ధి చెందిన ఆలయం జమ్ము కాశ్మీర్ లో ఉంది. హిందూ మతం ప్రకారం జ్ఞానాన్ని ...
ఈ క్రింది వీడియో యూ.ఆర్ .యల్ లు చూడండి ...
శ్రీ వైష్ణోదేవి ఆలయం, కాట్రా
![]() |
శ్రీ వైష్ణో దేవి ఆలయం , కాట్రా |
- జమ్మూ – కాశ్మీర్ రాష్ట్రంలో కాట్రా అనే ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. త్రికూట పర్వత గుహలో ఈ ఆలయం వెలసింది.
- మనదేశంలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా చెప్పబడే వాటిలో వైష్ణోదేవి ఆలయం కూడా ఒకటిగా చెబుతారు.
- పూర్వం జగన్మాత భూలోకంలో ధర్మాన్ని రక్షించి, ప్రజలని కాపాడేందుకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతులు తమ తేజస్సు నుండి ఒక దివ్య శక్తిని ఆవిర్భవించారని స్థల పురాణం.
- ఇలా ఆదిశక్తి మూడు అంశలతో సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి రూపం ధరించి వైష్ణోదేవిగా ఇక్కడ పిండరూపంలో ఆవిర్భవించింది.
ఇంకా వివరాలకు వికీపీడియా చూడండి ...
వైష్ణోదేవి ఆళయం ప్రవేశ ద్వారం ... ఈ ఆలయం ఉత్తర భారత్ లోని జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో జమ్ముకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ... జమ్ము నుండి 50 కిలో మీటర్ల దూరంలో వున్న కాట్రా ప్రాంతానికి హెలి కాప్టర్లలో వెళ్లవచ్చు.
ఈ క్రింది వీడియో యూ. ఆర్. యల్. చూడండి..
ముక్తేశ్వరస్వామి ఆలయం – కాళేశ్వరం
![]() |
శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయం , కాట్రా |
- తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరంలో అతి ప్రాచీన శివాలయం ఉంది.
- ఈ ఆలయంలో విశేషం ఏంటంటే. ఒకే పానవట్టావం పైన పక్క పక్కనే రెండు శివలింగాలు ఉన్నాయి.
- ఈ ఆలయ ప్రవేశ ద్వారం ముందు సరస్వతి మందిరం ఉంది.
శారదా పీఠం – శృంగేరి
![]() |
శారద పీఠం శృంగేరి |
- కర్ణాటక రాష్ట్రం, తుంగభద్ర నది ఒడ్డున శృంగేరి వద్ద ఈ ఆలయం ఉంది.
- ఇక్కడ వెలసిన శారదాదేవి జ్ఞానికి, విజ్ఞాన సర్వస్వానికి తల్లి లాంటిది.
- ఆదిశంకరాచార్యుల వారు తానూ నిత్యం పూజానిమిత్తం తన ఇష్టదైవం అయినా శారదాదేవి మూర్తిని మంచి గంధపు చెక్కతో చేయించి ప్రతిష్టించుకున్నారు.
అప్పటి నుండి ఇప్పటి వరకు శృంగేరీ శారదా పీఠం పీఠాధిపతి బిరుదులలో "కర్ణాటక సింహాసన ప్రతిష్ఠాపనాచార్య" కూడా చేర్చి చెబుతారు. 1782 నుంచి 1799 వరకూ శ్రీరంగపట్నాన్ని రాజధానిగా చేసుకుని మైసూరు సామ్రాజ్యాన్ని పరిపాలించిన ...
చరిత్ర · గురు పరంపర · ప్రచురణలు
ఈ క్రింది యు ట్యూబ్ వీడియో యూ. ఆర్ .యల్ చూడండి ...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి