కార్తీక దీపం అంటే ? దీపం ఎలా వెలిగించాలి? దీపాలు ఎన్నిరకాలు ? ఏ దీపం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకోండి ?
🪔దీపము లేదా దివ్వె (ఆంగ్లం Lamp) ఒక విధమైన కాంతినిచ్చే సాధనము. చిన్న దీపమైనా చీకటిని తరిమేస్తుంది. దీపావళి దీపాల సమాహారంతో ఉత్సాహంగా జరుపుకునే హిందూ పండుగ. సాధారణంగా హిందూ ధర్మంలో దీపారాధన అనేది చాలాపవిత్రమైన కార్యం. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా దీపాన్ని భావిస్తాం. ఇక పంచాయ తన ఆరాధనలో అయితే దీపాన్ని కార్తీకేయ స్వరూపంగా భావిస్తాం. దీపం జ్ఞానానికి ప్రతీక. కార్తీక మాసాన్ని దేవ దీపావళి అని కూడా అంటారట. ఎక్కువగా ఈ నెలలో దీపాలను వెలిగిస్తూ వుంటారు. ఇక ఈ కార్తీకపౌర్ణమి రోజున ముఖ్యంగా శివునికి, విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజులట. ముఖ్యంగా ఈ రోజున భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, దీపాలు వెలిగిస్తే మనం కోరుకునే విధంగా ఫలితాలు అందుతాయి.
👉 కార్తీక మాసంలో దీపం విశిష్టత :
- దీపాలకి పెట్టడానికి కార్తీకమాసం చాలా శ్రేష్టమైనది. కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి శివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవదీపావళి అని కూడా అంటారు. ఆశ్వయుజ అమావాస్య అంటే దీపావళి వెళ్లిన మర్నాడు కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఇక ఆ రోజు నుండి కార్తీకమాసం ముగిసే వరకు ప్రతిరోజు సాయంవేళ దీపాలు వెలిగిస్తారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ నెల అంతా కార్తీక మహాపురాణాన్ని పారాయణం చేస్తే అన్ని శుభాలు చేకూరి మహాశివుని అనుగ్రహం లభిస్తుంది.
- సృష్టిలో తొలిదీపం భగవంతుడే! ఆయన జ్యోతి స్వరూపుడు. అందుకే ఏ దేవుని, దేవత నామావళిని మనం గమనించినా - పరంజ్యోతి, జ్యోతిసే నమః అని పరంజ్యోతియే నమః, జ్యోతిస్వరూపాయై నమః అని ఉంటుంది. తాను ప్రకాశిస్తూ అన్నింటినీ ప్రకాశింప చేసే రూపం ఏదో అదే జ్యోతి. అదే భగవంతుడు. వెలుగులకు వెలుగు, సమస్త లోకాలను కాంతిమయం చేయగలిగిన వాడు పరమాత్ముడే.
- పరమాత్మ ఎక్కడో ఉండడు. మన లోపలే ఉంటాడు. మనం పూజానంతరం చెప్పుకునే "మంత్రపుష్పం" ఆయన అనేక జ్వాలల సమాహారమని వర్ణిస్తుంది. ఇంకా హృదయ క్షేత్రంలో పరమాత్మ జ్యోతిలా వెలుగుతుంటాడంటుంది.
- ఉపాసనామార్గంలో తన లోపలికి తానే వెళ్ల గలిగితే ఆ జ్యోతి తానే అని తెలుస్తుంది. ఆ తెలుసుకోగలగడమే మనిషి జన్మకు సార్థకం. ఇదే మనిషి జన్మకు ప్రధానమైన లక్ష్యం కావాలి. లోపల ఉన్న వస్తువే తాను అనే విషయాన్ని అవగాహన చేసుకుని అక్కడే స్థిరంగా ఉండగలిగితే అప్పుడు ఈశ్వరతత్త్వం అర్ధం అవుతుంది. తద్వారా మోక్షం సిద్ధిస్తుంది.
- దీపం ఉండగా ఇల్లు చక్కపెట్టుకో అన్నారు. శరీరం లోపల ఈశ్వర ప్రకాశం ఉండి శరీరం పని చేస్తుండగానే శాస్త్రాన్ని, గురువును ఆధారం చేసుకుని భగవన్మార్గంలో ప్రయాణం చేసి పరమాత్మ తత్త్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడే జీవితానికి అర్థం, పరమార్థం.
జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే!
జానామీతి తమేవ భాంత మనుభాత్యేతత్సమస్తం జగత్
తస్మె శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!
అన్నారు శంకరాచార్యులు
- అంటే కొన్ని రంధ్రాలున్న కుండలో దీపాన్ని వెలిగిస్తే ఆ దీప కాంతి అన్ని వైపులకు ప్రసరించి కాంతిని వెదజల్లుతుంది.
- అలాగే, మన శరీరంలోని జ్ఞానజ్యోతి జ్ఞానేంద్రియాల ద్వారా ప్రకాశిస్తుంటే మనం అన్నింటినీ తెలుసుకోగలుగుతున్నాం. లోపలి పరంజ్యోతి తెలుసుకునేందుకు ఆధారభూతమైనది బయట మనం వెలిగించే దీపం. ఈ దీప సహాయంలో లోపలి దీపాన్ని తెలుసుకోవాలి. అంటే బయటి దీపాన్ని గురువుగా భావించాలి.
- ఆలయాల్లో కూడా సాధారణంగా గర్భగుడిలో ఎప్పుడూ కేవలం ఒక్క నూనె దీపం మాత్రమే ఉంటుంది. ఆ దీప సాయంతోనే ఆలయం లోపలి పరమాత్మను చూడగలుగుతాం. అదే విధంగా హృదయంలోని పరమాత్మను కూడా జ్ఞానజ్యోతి ద్వారా దర్శించగలగాలి. అంటే ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తుంది. "అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ" అన్నారు. బయట వెతికితే కనిపించదు. ఆర్తితో, ఏకాగ్రతతో లోపల శోధించాలి. అప్పుడే పరమేశ్వరి దర్శనం లభిస్తుంది.
- దీపం వెలిగించి పూజ చేసే సమయంలో 'దీపం దర్శయామి' అన్న ఉపచారం వచ్చినప్పుడు దీపకాంతిలో పరమాత్మ పాదాలను దర్శించాలి. అంటే దీపాన్ని దేవుని పాదాల చెంత ఉంచి అక్కడనుంచి పాదాలు దర్శించమని కాదు. అలా మనోనేత్రంతో దర్శించగలగాలి.
- ఉజ్జ్వలమైన దీపకాంతిలో అంతకంటే తేజోమయమైన దైవం పాదాలు ప్రకాశిస్తుంటే ఆ కాంతిని మనం చూడగలగాలి. అలా చూడాలంటే సాధారణ దీపాలతో సాధ్యం కాదు. ఎవ్వరూ వెలిగించనవసరం లేకుండా వెలిగే సూర్యభగవానుడే అసలైన దీపం. అందుకే, *సూర్యే మధ్యది హిః* అంటాం. సూర్యభగవానుడే దీపమై ఉన్నాడని అర్థం.
కార్తీక మాసంలో, ముఖ్యంగా శివాలయాలలో ఎత్తైన చోట, అవసరమైతే ఒక గడకు కట్టి, సాయం సంధ్యవేళ, మట్టితో గానీ, లోహంతో గానీ చేసిన ఒక చిల్లుల పాత్రలో నువ్వుల నూనె వేసి ప్రమిదలో ఒత్తులను వెలిగించడం ఒక సంప్రదాయంగా ఉంది. కార్తీక మాసం అంతా ప్రమిదలు వెలిగించే ఈ దీపాన్ని ఆకాశదీపం అంటారు; సూర్యుడు తులా రాశిలో ఉన్నప్పుడు వెలిగించే దీపం; కార్తీక దీపం అని కూడా వ్యవహరిస్తారు.
👉 కార్తీక దీపం విశిష్టత:
కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి.
- రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తే రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మెుత్తాన్ని సూచిస్తాయి
- ఈ ఒత్తులు. అరటి దొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు.
- మనం తెలియక చేసిన కొన్ని పాపాలు ఈ మాసంలో పూజలు చేస్తే తొలగిపోతాయట. ముఖ్యంగా ఈ నెలలో సత్యనారాయణ వ్రతం చేస్తే చాలా పుణ్యం లభిస్తుందట.
- ప్రతిరోజు నదీ స్నానం చేసి ఆ తర్వాత పూజ గదిలో దీపాలను వెలిగించి, తులసి చెట్టు దగ్గర మరొక దీపాన్ని వెలిగిస్తే చాలా మంచి జరుగుతుందట.
- ఇక ఇలా వెలిగించిన దీపాలను ఏదైనా నదిలో కాని, ఎటువంటి కాలువలో కానీ అరటి ఆకు మీద పెట్టి వదిలితే చాలా మంచిదట.
- ఈ మాసంలో శివాలయంలో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లు సమానమట. దీంతో శివుని కృప మన మీద ఉంటుందట. సుఖసంతోషాలతో ఆనందంగా వెదజల్లుతూ ఉంటాము. ముఖ్యగా దీపం ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి వస్తుందట.
- ఇక ఇలా దీపాలు పెట్టడం తో పాటు, హోమాలు చేయడం కూడా మంచిదని కొంతమంది పండితులు చెప్పుకొస్తున్నారు.
- దీపాలను సూర్యుడు ఉదయించక ముందే పెట్టాలి.
- సాయంత్రం వేళలో సూర్యుడు అస్తమించే టప్పుడు పెట్టాలి.
- మనం ఉదయం పూట దీపం వెలిగించి తులసి చెట్టు దగ్గర పెడితే అది కార్తీక దామోదరుడు కి చెందుతుందట.
- మనం శివుని దగ్గర పెట్టే దీపం అది శివునికి చెందుతుందట.
👉 పరిశుభ్రమైన దీపారాధన
- శుభ్రమైన దీపారాధన కుంది/సెమ్మలో దీపం పెట్టాలి.
- ప్రతీరోజు శుభ్రంగా కడిగిన దానిలో మాత్రమే దీపం పెట్టాలి.
- నిన్న దీపం పెట్టిన కుంది కడగకుండా దీపారాధన చేయకూడదు.
- దీపారాధన వెలిగించేటప్పుడు అగ్గిపుల్లలతో కాకుండా కర్పూరంతో వెలిగించాలని పండితులు తెలియజేస్తుంది.
👉 దీపారాధన కు ఎటువంటి నూనె వాడాలి :
- భైరవస్వామికి ఆవనూనె దీపం వెలిగించి పూజిస్తే శత్రుపీడ విరగడ అవుతుంది. సూర్యభగవానుడి ప్రసన్నం కోసం నేతిదీపం వెలిగించాలి.
- శని ఆరాధనలో ఆవనూనె దీపం వెలిగించాలి. రాహు, కేతు గ్రహ శాంతి కోసం అవిసెనూనె తో దీపారాధన చేయాలి.
- నల్ల నువ్వుల నూనె తో శనీశ్వరునికి దీపారాధన శుభము.
- వ్యాపారస్థులు ఆర్ధిక లాభాల కోసం నియమపూర్వకంగా పూజగదిలో లేదా దేవాలయాలలో స్వచ్చమైన నేతి దీపం వెలిగించాలి.
- ఏ దేవీదేవతల పూజలో అయినా ఆవునేయ్యి దీపం, నువ్వులనూనె దీపం తప్పకుండా వెలిగించాలి.
- దుర్గాదేవి, లలితాదేవి, సరస్వతీదేవీల అనుగ్రహం కోసం రెండు ముఖాల దీపం వెలిగించాలి. ఇలా ఆయా దేవతలకు దీపారాధన చేస్తే వారికి దేవతానుగ్రహం శ్రీఘ్రంగా కలుగుతుంది
- దీపం వెలిగించడానికి ఆముదం ఉపయోగిస్తే దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగుతుంది
- విప్ప, వేప నూనెలు ఆవు నెయ్యి వాడటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.
- అదే ఆవు నెయ్యి, విప్ప, వేప, ఆముదం, కొబ్బరినూనెల మిశ్రమంతో 41 రోజులు దీపం వెలిగిస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
- ఎట్టి పరిస్థితులలో కూడా పల్లి (వేరుశనగ ) నూనెతో దీపారాధన చేయరాదు.
👉 దీపానికి ఏ ప్రమిద వాడాలి
మనం ఇంట్లో దేవునికి దీపారాధన చేసినా కొంత మంది విషయం తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. మరికొందరికి నియమాలు తెలియకపోవచ్చు. ఏ ప్రమిదలో ఏ దీపం వెలిగించాలి అనే విషయంపై సరైన అవగాహన ఉండదు. అయితే నిత్యపూజకు ఎలాంటి ప్రమిదలు వాడాలి ? ప్రత్యేక పూజల సమయంలో ఎలాంటి దీపాలు వెలిగించాలి వంటివి ఇప్పుడు తెలుసుకుందాం
- పంచలోహాలు,వెండి, మట్టితో చేసిన ప్రమిదల్లో దీపం వెలిగించడం శ్రేయష్కరం అయితే నిత్యపూజకు మట్టి ప్రమిదలు వాడటం మంచిది కాదు
- తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేయడం మంగళకరం.
- సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మి దేవిని స్మరించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయి.
- దీపాన్ని క్రింద పెట్టకూడదు.
- దీపం కింద తమలపాకు,లేదా ఎదైనా ప్లేట్ ఉపయోగించి దీపారాదన చేయాలి.
👉 దీపం ఎటువైపు వుండాలి :
దీపం ఏ దిశకు పెట్టాలి అనేది మరో సందేహం. దీపం దేవునికి ఎదురుగా కుడిపక్కకు అంటే మన కుడిపక్కకు లేదా దేవుని మంటపంలో ఆగ్నేయ భాగంలో పెట్టాలి. బొడ్డుత్తులైతే ఏ సమస్య ఉండదు.
- తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు
- పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది.
- ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరిసంపదలు,విద్య, వివాహం వంటివి సిద్ధిస్తాయి.
- దక్షిణంవైపు దీపారాధన చేయరాదు దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు,కష్టాలు, దుఖం బాధ కలుగుతాయి.
- దీపపు సెమ్మలో మధ్యలో వత్తి పైకి చూసే విధంగా ఉంటే దిక్కులతో ఎటువంటి ఇబ్బంది ఉండదు.
- రెండు దీపాలు పెడితే ఒకదానిని మరొకటి చూసే విధంగా పెట్టాలి.
- ఒక్కటే పెడితే తూర్పు లేదా ఉత్తరం లేదా పశ్చిమం చూసే విధంగా దీపాన్ని వెలిగించాలి.
- నాలుగు పక్కలా నాలుగు దీపాలు పెడితే మరీ శ్రేష్ఠం. కానీ ఇంట్లో స్థలం, నూనె, ఆర్థిక పరిస్థితులను చూసుకుని పెట్టాలి.
- అందుబాటులో ఉన్న ఏదైనా నూనెతో వెలిగించండి. భక్తి, శ్రద్ధతో ఏ విధమైన దీపాన్ని పెట్టినా శుభమే.
- దీపారాధనకు తామరకాడతో చేసిన వత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు.
- తెల్లటి కొత్త వస్త్రం మీద పన్నీరు చల్లి ఎండలో ఆరబెట్టి తర్వాత ఆ వస్త్రాన్ని వత్తులుగా చేసి దీపారాధన చేసినా శుభ ఫలితాలు పొందవచ్చు
- అలాగే జిల్లేడు కాయ నుంచి వచ్చిన దూదితో దీపం చేసి వెలిగిస్తే ఈతి భాదలు తొలగించుకునుటకు మంచిది.
- ఒకే ప్రమిదలో మూడువత్తులు వేసి దీపాన్ని వెలిగించవచ్చు.
- అవకాశం ఉంటే దేవుని రూపాలు/ప్రతిమలకు రెండు పక్కల రెండు దీపాలను పెట్టవచ్చు.
- ప్రతి దాంటో మూడు వత్తులను కలపి ఒకటిగా చేసి లేదా ఒక్కొక్కటి చొప్పునైనా వెలింగచవచ్చు.
👉 దీపాలు ఎన్ని రకాలు :
నందాదీపం🪔
దీన్నే అఖండదీపం అని కూడా అంటారు. ఇప్పటికీ తిరుమల క్షేత్రంలో ఈ దీపం వెలుగుతూ ఉంటుంది. స్వామి శిలారూపంలో స్వయంభువుగా పద్మపీఠంపై ప్రతిష్ఠితులైనప్పుడు ఆ తేజోమయ మూర్తి ముందు తొలి దీపాన్ని చతుర్ముఖ బ్రహ్మ వెలిగించాడు.
అర్చాదీపం 🪔
మనం పూజలో ఉపయోగించే దీపాన్ని అర్చాదీపం అంటారు.
లక్ష్మీదీపం 🪔
లక్ష్మీదేవి అంతరాలయంలో వెలిగించిన దీపాన్ని లక్ష్మీ దీపంగా పిలుస్తారు.
బలిదీపం 🪔
ఆలయంలో బలిహరణ స్తంభం వద్ద వెలిగించే దీపాన్ని బలిదీపం అంటారు.
ఆకాశదీపం 🪔
దీనికి ఒక ప్రత్యేకత ఉంది. కార్తికమాసం తప్ప మిగిలిన ఏ ఇతర మాసాల్లోనూ ఈ దీపం వెలిగించరు. కార్తికమాసం ఆరంభంనుంచి ఆలయంలోని ధ్వజస్తంభం పైన తాడుసాయంతో ఆకాశదీపం వెలిగిస్తారు. దీనిని చూడడం, వెలిగించడం కూడా విశేషమైన ఫలితం కలిగిస్తుంది.
నిరంజన దీపాలు 🪔
అనేకమైన కుందుల్లో గుత్తులు గుత్తులుగా దీపాలు వెలిగిస్తే వాటిని నిరంజన దీపాలంటారు.
కార్తిక పున్నమినాడు ప్రతీ శివాలయంలోనూ జ్వాలా తోరణం నిర్వహిస్తారు. అంటే ఇరుపక్కలా రెండు గడకర్రలను పాతిపెడతారు. ఆ రెండు కర్రలను కలుపుతూ అడ్డంగా మరో కర్రను కడతారు. కొత్త గడ్డిని తాడులా పురిటని దాన్ని వరుసలుగా చుడతారు. యమద్వారం ఎలా ఉంటుందో ఆ విధంగానే పెద్ద చక్రంలా తయారు చేస్తారు. ఆ చక్రం చుట్టూ ఇంధనంగా నెయ్యి పోసి దాన్ని గడకర్రలకు అడ్డంగా కట్టిన కర్ర మధ్యలో వేలాడదీస్తారు. అనంతరం అగ్నిని ప్రజ్వలింప చేస్తారు. ఈ గడ్డి తాడే కాలభైరవుడు.
- మానవుడు ప్రాణాలు విడిచిపెట్టగానే ముందుగా కనిపించేది అతి భయంకరంగా ఉండే నల్లని కుక్క. ఆరు ముఖాలతో భౌభౌమంటూ క్రూరంగా అరచుకుంటూ మనల్ని తరుముకుంటూ వస్తుంది. ఆ సమయంలో మన ముందు ఏమీ కనిపించ చిక్కటి చీకటి. వెనక తరుముతూ కుక్క. ఆ కుక్కకు చిక్కకుండా ఎటువెళ్లాలో కూడా తెలియని అయోమయ స్థితిలో అలా పరిగెడుతూనే చివరకు యమద్వారం చేరుకుంటుంది దేహం.
- భగభగమంటలతో వెలుగుతూ వలయంలా తిరుగుతూ ఉంటుందా ద్వారం. ముందుకు వెడదామఁ కాల్చి బూడిద చేసే భయంకరమైన అగ్నిజ్వాల. వెనక్కి వెడదామంటే నాలికలు బార చాచి, తన పదునైన ఇనుప పళ్లతో దేహాన్ని ఒడిసిపట్టి రక్కేసేందుకు భైరవం తరుముకు వస్తుంటుంది. చేసేది లేక ఒళ్లంతా బొబ్బలు పెడుతున్నా అగ్నితోరణం (జ్వాలావలయాన్ని) దాటి లోపలికి ప్రవేశిస్తుంది దేహం. అప్పటి వరకూ తరముకు వచ్చిన ఆ కుక్క కాల భైరవుడు. ఉగ్రభైరవుడు.
- ఆ నరకద్వారం లోపల మరింత భయంకరంగా ఉంటుంది. ఆ పరిస్థితి దాపురించకుండా ఉండాలంటే ఏం చెయ్యాలని అలనాటి మహర్షులంతా కలిసి మహాదేవుణ్ణి ప్రార్థించారు. అప్పుడు ఆయన కరుణించి మహా మృత్యుంజయ మంత్రంతో ధ్యానించి తనను శరణు కోరుకున్న వారు నరకద్వారాన్ని చేరుకోరని వరాన్ని ప్రసాదించాడు. అందుకు అనువుగా కార్తికమాసం నాటి పున్నమినాడు తప్పనిసరిగా జ్వాలాతోరణాన్ని వెలిగించి దాని మధ్యనుంచి దాటిన వారు నరకద్వారాన్ని చేరుకోరంటూ అనుగ్రహించాడు అశుతోషుడు.
- జ్వాలాతోరణం ఎదుట "నా మరణానంతరం ఈ ద్వారాన్ని దాటే పరిస్థితి కల్పించకు శంకరా" అని ప్రార్థించాలి. శివుడు అర్థాంగితో సహా పల్లకీలో గడ్డిచక్రం మధ్యనుంచి మూడు సార్లు దాటతాడు. అది యమద్వారం నుంచి మనల్ని రక్షిస్తాడనే దానికి సంకేతం. భక్తులు కూడా శివనామ స్మరణ చేసుకుంటూ ఆ పల్లకి వెనకే దాటతారు. ఈ విధంగా చేసిన వాళ్లకు నరక బాధ ఉండదని భక్తుల విశ్వాసం.
- భీమేశ్వర పురాణంలో శ్రీనాథుడు దాక్షారామంలో జరిగే జ్వాలాతోరణాన్ని వర్ణించాడు.
- కార్తిక వేళ భీమశంకరుని నగర మందు దూరునెవ్వారు చిచ్చుర తోరణంబు వాడు దూరడు ప్రాణనిర్వాణ వేళ భీకరమగు యమద్వార తోరణంబు* అంటాడు.
- అందుకే కార్తికపున్నమినాడు జ్వాలాతోరణం జరిగే సమయంలో ఆ తోరణమధ్యనుంచి పార్వతీపరమేశ్వరుల పల్లకి వెడుతుంటే దాని వెనుక భక్తులు కూడా అటు, ఇటూ మూడుసార్లు వెళ్లివస్తారు.
- ఆ అగ్నికి ఆహుతి కాగా మిగిలిన గడ్డిని కొంత ఇంటి చూరులోను, పశువుల గడ్డివామిలోనూ, ధాన్యాగారాల్లోనూ, పొలాల్లోనూ ఉంచుకుంటారు. ఇంటి ముఖద్వారం వద్ద ఉంచడం వల్ల ఇంటిలోకి ఏ దుష్టగ్రహాలూ ప్రవేశించవు. అలాగే, ధాన్యాగారాల్లో ధాన్యం అక్షయంగా ఉంటాయి. ప్రశాంత జీవితానికి అది రక్షగా ఉంటుందని భక్తుల విశ్వాసం.
ఈ క్రింది వీడియో యు.ఆర్.యల్.ల లో దీపం గురించి తెలుసుకోండి.
ఈ రోజు సూక్తి:
Note:
దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు, గ్రూప్ లు చూడండి లైక్ ,షేర్, చేయండి. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి,
My blogs:
Wowitstelugu.blogspot.com
https://wowitstelugu.blogspot.com
teluguteevi.blogspot.com
https://teluguteevi.blogspot.com
wowitsviral.blogspot.com
https://wowitsviral.blogspot.com
Youtube Channels:
bdl 1tv (A to Z info television),
https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ
bdl telugu tech-tutorials:
https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg
My Admin FaceBook Groups:
Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు
https://www.facebook.com/groups/dharmalingam/
Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ
https://www.facebook.com/groups/259063371227423/
Graduated unemployed Association
https://www.facebook.com/groups/1594699567479638/
Comedy corner
https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks
Wowitsinda
https://www.facebook.com/groups/1050219535181157/
My FaceBook Pages:
Educated Unemployees Association:
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
Hindu culture and traditional values
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
My tube tv
https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour
Wowitsviral
https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour
My email ids:
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి