wowitstelugu.blogspot.com
లక్ష్మీ అనుగ్రహం కలగడానికి ఏమి చేయాలి శాస్త్రం చెప్పే విధి విధానాలు ఏమిటి? అష్ట లక్ష్మిల ప్రార్థనలు
లక్ష్మీ అనుగ్రహం కావాలని అందిరికీ కోరిక. ధనం, ఆరోగ్యం ఇలా పలు రకాల లక్ష్మీ సంపదల కోసం అందరూ తాపత్రయం పడుతుంటారు. ఎంతో కష్టపడి పనిచేసినా ధనం నిల్వ ఉండని వారు కొందరు, ధనం వచ్చినా పలు సమస్యలతో నీటిలా ఖర్చు అయిపోతుందని మరికొందరు. ఎంత కష్టపడ్డా చాలీచాలనీ బతుకులు అని మరికొందరు.
వీరంతా శాస్త్రం చెప్పిన విధివిధానాలను పాటిస్తే తప్పక లక్ష్మీ అనుగ్రహం కలుగడమే కాదు పదిమందడికి ఉపయోగపడే స్థాయికి చేరుకుంటారు. ఆ నియమాలు ఏమిటో చూద్దాం.
- తప్పనిసరిగా ప్రాతఃకాలమందే లేచి ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఊడ్చుకొని వీలుంటే ఆవుపేడతో కళ్లాపి అంటే నీటిని చల్లుకుని చక్కటి ముగ్గును వేయాలి.
- ఇంటి గదులను చిమ్మేటప్పుడు నీటిలో ఉప్పును కొద్దిగా వేసి ఇల్లు శుభ్రం చేసుకోవాలి
- లక్ష్మి ముగ్గు లేదా కుబేర ముగ్గు వేసి అలంకారం చేయాలి. ఇంటి ప్రధాన ద్వారం అలకరించినట్లే వెనుక (దక్షిణ ద్వారం కూడా అలంకరించాలి ) లేకపోతె లక్షి దేవి అక్కగారి కి ( జేష్టా దేవి కి కోపం వస్తే లక్ష్మి దేవి కి కూడా కోపం వస్తుంది.
- గుమ్మానికి పసుపు, కుంకుమ, రంగులతో అలంకరణగా వేసుకోవాలి. ఇది లక్ష్మీ ప్రదానికి సూచన.
- గుమ్మానికి ఇరుపక్కల సుగంధ ద్రవ్యాలు వెదజల్లే పువ్వులు మామిడి తోరణాలు కట్టడి ఉంచాలి.
- ఇంటి ప్రధాన ద్వారానికి అటు ఇటు కాలు పెట్టి మాట్లాడరాదు.
- ఇంటి ప్రధాన ద్వారం తొక్కి లోపాలకి ప్రవేశించరాదు.
- గుమ్మం కనుక ఈశాన్యం మూల ఉంటె గుమ్మానికి ఉత్తరం వైపు ఒక రాగి చెంబులో కొద్దిగా పువ్వులు వేసి ఉంచాలి. ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది.
- గుమ్మానికి లోపల రాగి చెంబు పెట్టాలనుకొంటే ఇంట్లో రాగి చెంబుతో నీళ్ళు తీసుకుని, దానిలో నీళ్ళు నింపి దానిలో ఒక (1) రూపాయ లేదా (5)ఐదు రూపాయల బిళ్ళలు , పచ్చ కర్పూరం, ఒక ఎర్రని పువ్వు వేసి గుమ్మానికి లోపల ఒక పక్కన ఉంచాలి.
- ప్రతి శుక్రవారం గడపలకు, తులసీకోటకు పసుపుతో అలంకరణ, పూజ చేస్తే తప్పక సర్వభూత స్వరూపిణి అయిన దారిద్య్రనాశిని అనుగ్రహం కలుగుతుంది
- ప్రతి శుక్రవారం, గురువారం సాయంత్రం పూట గుగ్గిలం, సాంబ్రాణి పొగ వేసు కుంటే చాలా మంచిది, దుష్ట శక్తుల నివారణకు, చెక్పెట్టి చక్కటి ప్రశాంతత, అష్టలక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది.
- ఇంట్లోకి కాలు పెడుతున్నట్లు ఉన్న లక్ష్మి దేవి పటము అంత శుభప్రదం కాదు
- పద్మాసనం వేసుకొని కూర్చొన్న లక్ష్మి అమ్మవారి పటములు మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి
- ఇంటి ఇల్లాలు ఆడబడుచులు కానీ ఇంటిలో దుఃఖించరాదు. ఇంటి పెద్దలు వారు కంటి తడి పెట్టకుండా చూసుకోవాలి.
- ముసలి తల్లిదండ్రులని పరుషముగా మాట్లాడడం, పనులు చేయించడం, అవమానించడం చేయరాదు.
- తులసి మొక్కకు నీరు పోయడం . దీపం వెలిగించడం చేయాలి.
- లక్ష్మి దేవికి ఎరుపురంగు అన్నా, పట్టు వస్త్రాలు అన్నా చాల ఇష్టం, కావున స్త్రీలు లక్ష్మి అష్టోత్తరం చదివేటప్పుడు ఎరుపురంగు వస్త్రాలు ధరించాలి.
- లక్ష్మి అష్టోత్తరం చదివిన తరువాత విష్ణు మూర్తిని కూడా స్మరించుకోవాలి
- లక్ష్మి దేవి కి ప్రసాదం తీపి పదార్దాలు , నేటితో చేసిన పదార్దాలు ప్రసాదం గా పెట్టాలి.
- చిన్నపిల్లలను భాద పెట్టరాదు
- భార్యాభర్తలు తరచూ కలహించుకోరాదు.
- గోవును పూజించాలి. హింసించరాదు
- మంచం దిగకుండా రోజంతా మంచం మీద గడుపరాదు.
- ఇంటిని శుభ్రం గా అందం గా అలంకరించువాలి.
- అన్యాయంగా మోసం డబ్బు సంపాదించరాదు అది శాశ్వతం గా ఉండదు.
- లక్ష్మీదేవి విగ్రహాన్ని ఆవునేతితో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి.
- విగ్రహం గట్టిగా పూర్తీ లోహంతో కూడి ఉండాలి. విగ్రహం గుల్లగా ఉంటే పనికి రాదు ఇది గమనించాలి.
- ఆఫీసులో/ వ్యాపార సంస్థలో కాని తూర్పు ముఖంగా కూర్చుంటే ధనాకర్షణ, ధనప్రాప్తి కలుగుతుంది . పన్నీరు లో కొత్త తెల్లని వస్త్రాన్ని తడిపి ఎండబెట్టి ఆ వస్త్రంతో వత్తులు చేసి శుచి గా చేసిన వత్తులు వాడాలి.
- ప్రతి శుక్ర వారం ఆవునేతితో ఆ నేతి తడిపిన మూడు వత్తులతో దీపారాధన చేస్తే సకల సంపదలు కలుగుతాయి.
- గురు , శుక్రవారం ఐదు పత్తి వత్తులతో ఆవునేతితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది.
- శ్రీ మహాలక్ష్మీ స్తవాన్ని త్రిసంధ్యలలో పఠించువారు మహా ధనవంతులవుతారు -
- శ్రీదేవీ భాగవతము ప్రతి రోజూ సంపుటిత సహిత శ్రీసూక్తం చదివితే అఖండలక్ష్మి కటాక్షం కలుగుతుంది.
- కమల సప్తమీ వ్రతమును చైత్ర,వైశాఖ మాసాలలో శుక్ల సప్తమి నాడు శ్రీమత్స్య పురాణంలో చెప్పిన ప్రకా చేయటం వలన మహాసంపదలు కలుగుతాయి.
- ఇంట్లో మనకు ఇంతకు పూర్వం బంగారపు లక్ష్మీదేవి ఉంగరం ఉంటె కుడిచేతికి ఉంగరపు వేలుకు ధరించాలి.
- కనకధారాస్తోత్రం ప్రతిరోజూ త్రిసంధ్యలలోపఠిస్తే అపార సంపద చేకూరుతుంది.
- శుక్రవారం లక్ష్మీదేవిని అష్ట గంధాలతో (కర్పూరం,కస్తూరి, పుణుగు, జవ్వాది, అగరు, పన్నీరు, అత్తరు,శ్రీగంధం)తో పూజిస్తే కీర్తి , ప్రతిష్టతలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
- ఉగాది తరువాత వచ్చే శుక్రవారం ఇష్టమైన దైవానికి అభిషేకం చేయడం ద్వారా ఆ సంవత్సరమంతా ధనానికి కొదవ ఉండదు.జాతకరీత్యా ఉన్నదోషాలు కొంత తొలగిపోతాయి.
- శ్రావణమాసం ప్రతివారం అమ్మవారిని ఆరాధించాలి. ఆనవాయితీ అనుసరించి వ్రతాలూ చేయాలి.
- అమ్మవారి ఆలయాలు వీలైనప్పుడల్లా దర్శించు కోవాలి. అమ్మవారి పర్వదినాలో తప్పనిసరిగా దర్శించు కోవాలి.
- అన్న్ని సందర్భాలలో అనాధ లకు, పేదలకు దాన ధర్మాలు, అన్నదానాలు చేస్తుండాలి.
- ధనాన్ని ఉంచే చోటు శుభ్రం గా ఉంది సువాసనలు వెదజల్లు తుండాలి (బీరువా )
- సువాసనలు వెదజల్లే వట్టి వేరు బీరువాలో కొద్దిగా ఉంచాలి .
- పసుపురంగు (లక్ష్మి) గవ్వలు పదకొండు బీరువాలో గాని దేవుడి గది గాని ఉంచాలి.
- పసుపు కుంకుమ చిట్టి గాజుల దండ తో అమ్మవారిని అలంకరించాలి.
- తామర విత్తనాలు దండ అమ్మవారిని అలంకరించాలి
- మగవారు పర్సు స్త్రీల హ్యాండ్ బాగ్ లేత గులాబీ లేదా ఎరుపు రంగును కలిగి ఉండాలి .
- వివాహిత స్త్రీలు నుదుటను ఎప్పుడు కుంకుమ ధరించే ఉంచుకోవాలి,
- వివాహిత స్త్రీల కాలికి మట్టెలు ఎప్పుడు ధరించి ఉండాలి.
- ఎట్టి సమయం లోను జుట్టు విరబోసుకొని ఉండరాదు.
- శుక్రవారం, లక్ష్మివారం ఎవ్వరికి డబ్బు అప్పుగా ఇవ్వరాదు.
- అనవసరం గా తాగుడుకు జూదానికి అప్పులు ఎట్టి పరిస్థితులలోను చేయరాదు .
పటించాల్సిన శ్లోకాలు :
01
ఓం "సర్వమంగళ మాంగళ్యేశివే సర్వార్థసాధికే
శరణ్యేత్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే"
అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః
02
శబ్దాదిగ శ్శబ్దసహ శ్శిశిర శ్శర్వరీకరః
అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః
03.
ఓం శ్రీ ఓం నమః పరమ లక్ష్మయి విష్ణు వక్షస్థితాయై
రమాయై ఆశ్రీత తారకా యై నమో వహ్ని జాయై నమః
నమో భగవతే వాసుదేవాయ నమః
04
ఓం ధనద సౌభాగ్య లక్ష్మీ కుబేర వైశ్రవణాయ మమకార్య సిద్ది స్వాహా
05.
అష్టలక్ష్మిలు, అష్టలక్ష్మి శ్లోకం
హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవి సిరి సంపదల దేవత. వివిధ భాగ్యాల అధిష్టాన దేవతలుగా ఈ లక్ష్మీ దేవియే అష్టలక్ష్ములుగా పూజింపబడుతుంది. దేవాలయాలలో అష్టలక్ష్ములు ఒకే చొట అర్చింపబడడం సంప్రదాయం.
హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవి సిరి సంపదల దేవత. వివిధ భాగ్యాల అధిష్టాన దేవతలుగా ఈ లక్ష్మీ దేవియే అష్టలక్ష్ములుగా పూజింపబడుతుంది. దేవాలయాలలో అష్టలక్ష్ములు ఒకే చొట అర్చింపబడడం సంప్రదాయం.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి