హిందూ వేదసంస్కృతి లో అంతర్భాగ మైన ఆనాటి సత్సం ప్రదాయాలు, సంస్కారాలు
ఈనాడు ఈ సంస్కృతి మరుగున పడిపోతున్న దుస్ధితి పట్టినది. ప్రాశ్చాత్యుల విద్యాప్రభావము చేత భావ దాస్యము కల్గి సనాతన భావములమీద వ్యతిరేకత ఏర్పడిన ప్రస్తుత కాలమిది. మన సంప్రదాయాలు, ఆచారాలు అర్ధంలేని వని త్రోసిపుచ్చేవారి సంఖ్య ఎక్కువైనది. మన సంస్కృతిలోని అమూల్యమైన విషయాలను మనం మర్చిపోతుంటే, పాశ్చాత్య దేశాలెన్నో మన వేద సంస్కృతి, సంప్రదాయాలను, విశేషాలను గ్రహించి ఆచరిస్తున్నారు. ఈనాటి మన సంస్కృతి లోని సంప్రదాయాలను గొప్పతనాన్ని తెలుసుకొని భారతీయ యువతీ యువకులు ఆచరించుట ఏంతో ముఖ్యం.
 |
నమస్కారం |
- నమస్కారం అనేది భారతీయుల సాంప్రదాయ హావభావాలలో ఒకటి. ఇది సాధారణంగా గౌరవ సంకేతంగా కనిపిస్తుంది. రెండు చేతులను మరియు చేతి వేళ్ళను కలిపి దగ్గరకు చేర్చి నమస్కారం చేస్తారు.
- రెండు చేతులను కలిపి నొక్కటం వలన ఒక వ్యక్తికి ఎక్కువ కాలం గుర్తుకు సహాయపడే ఒత్తిడి పాయింట్లు యాక్టివేట్ అవుతాయని చెబుతారు.
- ఎవరైనా ఎదురుపడితే నమస్కరించడం భారతీయ సంప్రదాయంలో అతి ముఖ్యమైన పద్దతి. నమస్కరించడం వళ్ల మనలో వినయ, విధేతలు పెరుగుతాయి.
- పెద్దవాళ్ళు కనపడినప్పుడు నమస్కరించడం వాళ్ల ఆశీర్వాదాన్ని పొంది మనలో పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది.
- అదే విధంగా వాళ్లు ప్రసన్నత చెంది మనకు సరైన మార్గ నిర్దేశనం చేస్తారు . ప్రేమ, గౌరవం, సహనం, వినయం, ఓర్పు అనే సద్గుణాలు అలవడంలో మనకు నమస్కారం ఏంటో దోహదపడుతుంది.
- దైవసన్నిధిలో నమస్కరించేటప్పుడు రెండు కళ్లు మూసుకుంటూ ఉంటాం. అంతర్లీనంగా భగవంతుడి సన్నిధిలో ఉన్నామనే అనుభూతికి లోనవ్వడమే ఇందులోని పరమార్థం.
- గురువులు, వయసులో పెద్దవారికి, పండితులకు పూర్తిగా వంగి నమస్కారం చేస్తాం
 |
సూర్యనమస్కారములు |
- సూర్యనమస్కారములు అనేది భారతీయుల సాంప్రదాయ హావభావాలలో ఒకటి. ఇది సాధారణంగా గౌరవ సంకేతంగా కనిపిస్తుంది. రెండు చేతులను మరియు మరియు కాళ్లను కలిపి దగ్గరకు అనేకరకాల వ్యాయామాలు చేస్తారు దీనినే సూర్య నమస్కారములు అంటారు.
- రెండు చేతులను కాళ్లతో రక రకాల భంగిమ వ్యాయామం వల్ల ఒక వ్యక్తికి ఎక్కువ కాలం సహాయపడే ఒత్తిడి పాయింట్లు యాక్టివేట్ అవుతాయి అని చెప్పా వచ్చు.
- హిందువులు ఉదయాన్నే సూర్య దేవున్ని ప్రార్దించే ఒక సంప్రదాయాన్ని కలిగి ఉన్నారు. ఉదయాన్నే వచ్చే సూర్యుని కిరణములు కళ్ళకు మంచిది. ప్రతి ఉదయం సూర్య నమస్కారాలు అనే ఈ వ్యాయామం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఈ క్రింది వీడియో యూ.ఆర్. ఎల్.చూడండి ...
 |
ఆడపిల్లలు గాజులు ధరించడం
|
ఆడపిల్లలు గాజులు ధరించడం మన భారతీయ సంప్రదాయం.
- స్త్రీ దేవతా మూర్తులకి కూడా గాజులు ఉంటాయి.
- మగవారు చేతికి కడియాలు ధరించేవారు. ఇప్పుడు కూడా కొంతమంది నాగరికత లో భాగంగా ధరిస్తుంటారు.
- గాజులు ఎల్లప్పుడూ చేతి నరాలకు తాకుతూ ఉండడం వల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందట.
- దీంతో ఆ గాజుల వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయట.
- అంతే కాకుండా ఆడ వారి శరీరం నుంచి విడుదలయ్యే నెగెటివ్ శక్తిని నిర్వీర్యం చేసేందుకు కూడా గాజులను ధరింపజేసేవారట.
ఈ క్రింది వీడియో యూ.ఆర్. ఎల్.చూడండి ....
https://www.youtube.com/watch?v=ULycDs4TGqY
 |
మట్టెలు ధరించడం |
- హిందూ మతంలో వివాహం అయిన మహిళల కాలికి తప్పని సరిగా మట్టెలు (రింగ్స్) ఉంటాయి. ఇది కేవలం అలంకరణ కోసం కాదు. సాధారణంగా కాలి రింగ్ ను రెండవ కాలి వేలి మీద ధరిస్తారు. ఈ కాలి వేలి నరాలు గర్భాశయం మరియు గుండెకు నేరుగా కలుపుతుంది. రెండవ కాలి వేలికి రింగ్ ధరించటం వలన గర్భాశయం బలపడుతూ,ఋతు రక్త ప్రవాహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.
- వివాహిత స్త్రీలు కాళ్ళకు మెట్టెలు పెట్టుకోవడం ఆచారం. వాడుకలో ''మెట్టెలు''గా ఉన్న ఈ పదం నిజానికి ''మట్టెలు''. మనలో చాలామందికి అసలు మెట్టెలు ఎందుకు పెట్టుకోవాలి అనే సందేహం మీలో ఉందా.. అయితే ఈ కథనం చదవండి.
- కాలి బొటనవేలు పక్కనున్న వేలు స్త్రీలకు ఆయువుపట్టు వంటిది. దాని నుంచి విద్యుత్తు ప్రసరిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదు. అలా తగలకుండా ఉండటానికే మెట్టెలు ధరించే సంప్రదాయం ఏర్పడిందని పండితులు అంటారు. ఇలా అనుకోవడానికి కారణం ఓ పురాణగథ.
- దక్ష ప్రజాపతి తన అల్లుడైన శివుడిని అవమానిస్తాడు. తన భర్తకు జరిగిన అవమానాన్ని చూసి కోపోద్రిక్తురాలైన దాక్షాయణి, తన కాలివేలిని భూమిపై రాసి నిప్పు పుట్టించి, అందులో తాను దహనమయ్యిందని పురాణాలు చెబుతున్నాయి. దీనిని అనుసరించే పై నమ్మకం ఏర్పడింది. అందుకే వివాహిత స్త్రీలు మెట్టెలు పెట్టుకునే ఆచారం వచ్చింది.
- మెట్టెలు ధరించడం ద్వారా కలిగే ప్రయోజనాము ఏమిటంటే గర్భకోశంలోని నరాలకు, కాలి వేళ్ళకు సంబంధం ఉంటుంది. వేళ్ళకు అంటిపెట్టుకుని ఉండే మెట్టెలవల్ల గర్భ సంబంధమైన ఇబ్బందులు కలగవు.
 |
తిలకధారణ |
- నుదుటిపైన తిలకధారణ చేయటం అనేది ప్రతి ఇంట్లోనూ జరిగే సాధారణ పద్ధతి.నిజానికి నుదుటిపైన ఈ ప్రాంతంలో అజ్ఞా చక్ర ఉంటుందని చెబుతారు. ఈ విధంగా తిలకంను వర్తింపచేసినపుడు ఈ చక్రం స్వయంచాలకంగా యాక్టివేట్ అవుతుంది.
- ఇది శరీరం నుండి శక్తి నష్టంను నిరోధిస్తుంది. అలాగే ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది.
- కస్తూరి తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్త్భుం' అనే శ్లోకం వినని వాళ్లుండరు. సంస్కృతంలో 'తిలకమ్' అని, తెలుగులో 'బొట్టు' అని అర్థం. మన నుదుటిలో జ్ఞాన నేత్రం ఉండేచోటు అంటే రెండు కనుబొమల మధ్య ఆజ్ఞాచక్రానికి తగులుతూ ఎఱ్ఱని కుంకుమ బొట్టు ప్రతినిత్యం పెట్టుకోవాలని యోగశాస్త్రం చెబుతోంది.
- మానవ శరీరంలో వేల సంఖ్యలో నాడులున్నాయి. ఇవి ప్రాణశక్తిని ప్రవహింపజేసే అదృశ్య నాళికలు. వీటన్నింటికీ కేంద్ర స్థానం లలాట భ్రూమధ్యభాగం, అంటే కనుబొమల మధ్య స్థానం. ఈ స్థానంలోంచి ప్రాణశక్తి కిరణాలు ప్రసారవౌతాయి.
- ఈ ప్రాణశక్తి కిరణాలు వ్యర్థం కాకుండా ఆపగల మహత్తరమైన శక్తి, కుంకుమ, విభూతి, గంధం, కస్తూరి, చందనం వంటి పదార్థాలకు ఉంది. ఇవి దృష్టి దోషాలను కూడా నివారిస్తాయి. అందుకే మహర్షుల బోధనల వలన నుదుటిపై బొట్టు ధరించడం మనకు సంప్రదాయంగా మారింది.
- కంకుమలో పసుపు ఉంటుంది. రెండు గుణాలు కలిగిన ఈ కుంకుమను నుదుట గంధం ధరించి దానిపై కుంకుమ ధరిస్తే మంచి ఫలితాలుంటాయి. గంధం జ్ఞానానికి సంకేతం.యోగశాస్త్రం ప్రకారం ఈ రెండు కనుబొమల మధ్యన ఆజ్ఞాచక్రం ఉండే చోట మనం పెట్టుకునే కుంకుమ వేలి ఒత్తిడివలన ఒకరకమైన ఉత్తేజం ఏర్పడుతుంది.
- నొసటిమీద ఎర్రని కుంకుమ బొట్టు ముతె్తైదువతనాన్ని సూచిస్తుంది. మనస్తత్వ శాస్తర్రీత్యా ఎర్రని కుంకుమ ఒక ప్రత్యేకమైన వర్గ ఫలం కలిగి ఉంది. నొసటిమీద కుంకుమ పెట్టుకోవడం మన భారతీయుల ప్రాచీన సంప్రదాయం.
- బొట్టు ధరించడం మగవారికీ అవసరమే.భగవంతుడు సంచరించే షుఘుమ్ననాడి ఎక్కడ రెండు కనుబొమల మధ్య వుంటుందో అక్కడ ఆజ్ఞాచక్రస్థానంలో కుంకుమ ధరించడం వలన భగవంతుని స్మరించిన వారవౌతాము. ముఖానికి ఆభరణం తిలకం.
- పద్మపురాణంలో, ఆగ్నేయపురాణంలో పరమేశ్వర సంహితలో స్ర్తిలు, పురుషులు అనే భేదం లేకుండా నొసటిమీద కుంకుమ ధరించడం వలన భర్త ఆయుష్షు పెరుగుతుందని, లక్ష్మీనివాసమైన నుదుటిపై బొట్టు ధరించే వేళ 'ఊర్థ్వపుండ్రం లలాటేతు భర్తురాయుష్యవర్థకమ్ లలాటే కుంకుమం చైవ సదా లక్ష్మీ నివాసకమ్' అనే మంత్రం చెప్పుకుంటూ బొట్టుపెట్టుకోవాలని పురాణాలు తెలుపుతున్నాయి. అందుకే అంత్యప్రాసల కవి ఆరుద్ర 'నూరేళ్ళ పెట్టు నొసటి బొట్టు అది నోచే నోముల కలిమి పెట్టు'' అన్నాడు.
- జ్ఞానదాతయైన శ్రీకృష్ణుడు కస్తూరి తిలకంతోనే శోభించాడు. అలాంటి జ్ఞానాన్ని పొందడానికి పురుషులు సైతం బొట్టు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
- బొట్టు శుభానికి సంకేతం. శుభకార్యాలను ఆహ్వానించడానికి మహిళలకు బొట్టు ఇవ్వడం హిందూ సంప్రదాయంలో ఆనవాయితీ.
- బొట్టును జగన్మాత సౌందర్య చిహ్నంగా భావిస్తారు. హిందూ ధర్మశాస్త్రాల్లో ఉన్న కొన్ని ఆచారాలను, వాటి వెనుక ఉండే వైజ్ఞానిక విషయాలను నేటి యువతులు తెలుసుకోవలసిన అవసరం ఎంతగానో వుంది.
- కుంకుమబొట్టు మేధస్సును పెంచి వృద్ధిపరచే సాధనంగా మన పూర్వీకులు భావించారు. ఈ కుంకుమ బొట్టు స్ర్తిల ముఖారవింద ఆకర్షణతోపాటు ఆరోగ్యసూత్రాలు దాగి ఉన్నట్లు, హిందూ స్ర్తి నుదుటి బొట్టు లేకపోవడం ముఖం కళావిహీనంగా అగుపిస్తుంటుంది.
- పూజాదికాలలో, వివాహ శుభకార్యాలలో ఏ శుభకార్యాలలోనైనా కుంకుమ ధరించడం సంప్రదాయంగా వస్తోంది. తిలకధారణ జీవితంలో సుఖశాంతలు, శుభాలు కలిగిస్తుంది.
- నుదుట బొట్టు లేకుండా చేసే దానం, స్నానం, హోమం, పుణ్యకార్యాల, తపస్సుకాని నిష్ఫలవౌతాయని, మహర్షులు, సాధువులు, దేవతా ఉపాసకులు నుదుట తిలకం ధరించేవారు.
- నిత్య నైమిత్తిక కామ్యకర్మలు, శ్రాద్ధకర్మలు నుదుటిన బొట్టులేకుండా చేయడం వలన నిష్ఫలమవుతాయని మన ధర్మశాస్త్రాల్లో కూడా పేర్కొనబడింది.
 |
తులసి మొక్క |
- తులసి మొక్క ఆధ్యాత్మికంగానే కాదు. ఆరోగ్య ప్రదాయినిగానూ ఎంతో మేలు చేస్తుంది. తులసి ఆకును ప్రకృతి ప్రసాదించిన తల్లిగా. ఆయుర్వేద నిపుణిగా చెప్పవచ్చు. ఒకప్పుడు తులసి కోట లేని ఇల్లు ఉండేది కాదు. కానీ ఇప్పుడు తులసి కోటలు కనుమరుగైపోయాయి. మారుతున్న కాలం సంప్రదాయా లనూ దూరంగా తీసుకెళ్తోంది. కాంక్రీట్ జంగిల్స్లో తులసి కోటకు చోటు కరువైంది. అయితే తులసి ఆకుకు ఎన్నో రకాల వ్యాధులతో పోరాడే అద్భుతమైన శక్తి ఉంది. తులసి ఆకు ఆరోగ్యంతోపాటు చర్మ సంరక్షణకి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టే పెద్దలు తులసిని సర్వరోగ నివారిణిగా పిలిచారు.
- తులసి మొక్కను పూజించుట భారతదేశంలో దాదాపు ప్రతి హిందూ మతం ఇంటి బయట ఒక తులసి మొక్క ఉంటుంది. దీనిని ప్రతి రోజు పూజిస్తారు.తులసి మొక్కలో అధిక ఔషధ విలువలు ఉన్నాయి. అందువల్ల వేద ఋషులు మొక్క యొక్క విలువను గ్రహించారు. అందువలన అంతరించిపోతున్నా ఈ మొక్కను రక్షించడానికి, వారు ఈ మొక్కను పూజించే సంప్రదాయంను ప్రారంభించారు. ఆ విధంగా ప్రజలు తులసి మొక్క విలువ,గౌరవం మరియు సంరక్షణ చేస్తున్నారు.
- మలేరియా వచ్చినప్పుడు 5 నుంచి ఏడు తులసి ఆకులను నలిపి మిరియాల పొడితో కలిపి తీసుకుంటే మంచి ఉపశమనం పొందవచ్చు.
- తులసి రసం, అల్లం రసం కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు ఇట్టే తగ్గిపోతాయి. అలాగే ప్రతిరోజూ 5 నుంచి 25 గ్రాముల నల్ల తులసి రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు.
- కొద్దిగా తులసి విత్తనాలకు పెరుగు లేదా తేనెతో కలిపి ఇస్తే వాంతులు తగ్గుతాయి.
- తులసి ఆకులను నీళ్లలో మరిగించిఆ నీటిని సేవిస్తే చెవి నొప్పి నుంచి బయటపడవచ్చు.
- కృష్ణ తులసి రసాన్ని మిరియాల పొడిలో వేసి ఆ మిశ్రమాన్నినూనె లేదా నెయ్యితో కలిపి తీసుకుంటే గ్యాస్ర్టిక్ సమస్యల నుంచి బయటపడవచ్చు.
 |
రావిచెట్టు |
- రావి చెట్టు సాధారణంగా ఒక పనికిరాని చెట్టుగా కొంతమంది పరిగణిస్తారు. కానీ ఆయుర్వేద పరంగా
దీని ఉపయోగాలు చాల ఉన్నాయి.
- రావిచెట్టు వేళ్ళ లో బ్రహ్మ కాండం లో విష్ణువు ఆకులలో శివుడు ఉంటారనేది. హిందువుల నమ్మకం
- ఈ చెట్టును చాలా మంది హిందువులు పూజిస్తారు. ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.
- రావి చెట్టు రాత్రి పూట ఆక్సిజన్ ఉత్పత్తి చేసే చెట్లలో ఒకటి.కాబట్టి, ఈ చెట్టును సురక్షితంగా ఉంచడానికి పవిత్రంగా గుర్తించబడుతుంది.
- భోది వృక్షం లేదా రావి చెట్టు హిందువులు మరియు బౌద్ధులు పవిత్ర వృక్షంగా పరిగణిస్తుంటారు. మత ప్రాధాన్యత మాత్రమే కాకుండా, రావి చెట్టు ఆకులు చాలా విధాలుగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
- ఈ వృక్షం మలబద్దకం సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
- పురాతన కాలంలో మధుమేహా వ్యాధిని తగ్గించటానికి రావి చెట్టు సారాన్ని వాడే వారని అధ్యయనాలలో తెలిపారు. రావి చెట్టు నుండి సేకరించిన సారం రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
- రావి చెట్టు ఆకులతో చెవి ఇన్ఫెక్షన్ లను తగ్గించవచ్చు.పరిశోధనలలో బాసిల్లస్ సబ్టైలిస్, ఎస్చేరిచియాకోలి, స్టెపైలోకోకస్, కాండిడా అల్బికానా, ఫంగస్ నైజర్, సూడోమొనాస్ ఎరుగినోస వంటి బ్యాక్టీరియా మరియు ఫంగస్ లను నియంత్రిస్తుందని కనుగొన్నారు.
 |
భారతీయ భోజన సంస్కృతి |
- భారతీయ భోజన సంస్కృతి అరటి ఆకులో కారపు వంటకాలతో భోజనం ప్రారంభించటం (పప్పు, నెయ్యి, చారు, సాంబారు, కూర, పచ్చడి, పెరుగు) మరియు ఒక తీపి వంటకంతో ముగించటం అనేది భారతదేశం లో ఒక సాధారణ పద్ధతి. స్వీట్స్ ఈ ప్రక్రియ వేగాన్ని తగ్గిస్తాయి. అందుచేత ఒక భోజనం చివరిలో స్వీట్లు తరువాత తాంబూలం (సుగంధ ద్రవ్యాలు జీర్ణ వ్యవస్థ మరియు ఆమ్లాలను యాక్టివేట్ చేస్తాయి) కలిగి ఉండాలని పెద్దలు చెబుతారు.
- భారతీయ సంప్రదాయంలో ముఖ్యంగా దక్షిణాదిలో అరటిఆకులలో భోజనం చేయడం పరిపాటి. దీనికి ఒక సంప్రదాయంగా పాటిస్తారు. అరటిఆకుపై వేడి వేడి అన్నం, పప్పు, నెయ్యి .. తదితర వంటకాలను వడ్డించుకొని భుజిస్తే ఆ రుచిని వర్ణించడం అసాధ్యం.
- అరటిఆకుపైన ఎందుకు వడ్డిస్తారంటే ఈ అరటి ఆకులు విషాహారాన్న, కలుషిత ఆహారాన్ని గ్రహిస్తాయి. విషాహారాన్ని ఆకుపై వేసిన వెంటనే నల్లగా మారుతుంది. దీంతో ఆహారంలో విషం కలిపినట్టు తెలిసిపోతుంది.దీంతో పాటు అరటిఆకులు అనేక పోషకాలను కలిగివుంటాయి.
- మనం తీసుకునే ఆహారంతో కలిసి మన శరీరానికి కావాల్సిన విటమిన్లను అందిస్తాయి. కేరళలో ఇడ్లీలు, కొన్ని రకాల నాన్ వెజ్ వంటలను అరటి ఆకుల్లో వండుతారు. అన్ని విటమిన్లు అందడంతో శరీరం ఆరోగ్యంగా వుంటుంది. ఇది పర్యావరణహితంగా కూడా వుంటుంది.
- దీంతో సంప్రదాయంతో పాటు ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ వుంటాయి. అరటి ఆకుల్లో పాలిఫ్లెనొల్స్ వుంటాయి. ఇవి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ను కలిగివుంటాయి.
- వీటిపై వేడివేడి పదార్థాలను వడ్డిస్తే ఇవి కూడా భోజనంలో కలిసిపోతాయి. వీటిని భుజించడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది.
 |
గోరింటాకు |
- గోరింటాకు పెట్టుకోవడం మన సంప్రదాయం. గోరింటాకుని చక్కగా ముద్దగా రుబ్బి,అరచేతుల్లోనూ, అరికాళ్లలోనూ పెట్టుకుంటే శరీరంలోని వేడినంతా లాగేసి, అవి ఎర్రబడతాయి. దాన్నే పండట మంటారు. శరీర తత్త్వాన్ననుసరించి లేత నారింజ రంగు నుండి ముదురు ఎరుపు రంగు వరకు పండుతుంది. ఈ రంగు ప్రేమ గాఢతని తీవ్రతని తెలియ చేస్తుందంటారు.
- తడిలో,నీళ్ళల్లో పని చేసే ఆడవారికి కాలి వేళ్ళ సందున పాయటం, మడమలు పగలటం సహజం. వానాకాలమైతే మరీనూ. గోరింటాకు పెట్టుకుంటే ఆ బాధలకి ఉపశమనం లభిస్తుంది. అందుకే తప్పనిసరిగా ఆషాఢ మాసంలోను,అట్ల తద్దికి, ఉండ్రాళ్ళ తద్దికి ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలని నియమం ఏర్పరచారు మన పెద్దలు.
- గోరింటాకులో ఉన్న ఔషధీ గుణం పిప్పిగోళ్ళని గోరుచుట్టుని రాకుండా నివారిస్తుంది. ఒక వేళ వస్తే తగ్గిస్తుంది. కాలి వేళ్ళ గోళ్ళ మొదళ్ళలో మట్టి చేరి ఒండ్రు పోస్తే ఆ వేలికి గోరింటాకు పెడతారు. పోతుంది.
- గోళ్ళకి లాగానే జుట్టుకి కూడా రంగునిస్తుంది గోరింటాకు. ఒకసారి జుట్టుకి గోరింటాకు రంగు పడితే ఒక పట్టాన పోదు. తగ్గదు కూడా! అంతే కాదు. అది సహజమైన మంచి కండిషనర్ గా పని చేస్తుంది. గోరింటాకు పెడితే జుట్టు మెత్తగా పట్టు కుచ్చు లాగా ఉండి, నిగనిగా మెరుస్తుంది.
- కేశ పోషణ కోసం మెంతి, ఉసిరి వంటివి ఉపయోగించాలంటే కూడా గోరింటాకు బేస్ లాగా పనిచేస్తుంది. ఇది ఆడవారికి మాత్రమే పరిమితం కాదు.
- ఈ నాడు ఆడ, మగ తేడా లేకుండా అందరూ జుట్టుకి గోరింటాకు పెట్టుకుంటున్నారు. గడ్డానికి కూడా పెట్టుకుంటున్నారంటే గోరింటాకు విలువని ఎంత బాగా గుర్తించారో అర్థం చేసుకోవచ్చు.
- గోరింటాకు పెట్టటం ఒకకళ గా పరిగణించబడుతోంది ఈనాడు. దాని కోసం శిక్షణాసంస్థలు కూడా వెలిశాయి.
- అరచేతులకే కాక చేతుల వెనుక భాగాలు, ముంజేతుల నుండి మోచేతుల వరకు కూడా రకరకాల జిలుగులతో గోరింటాకుని అలంకరించుకుంటున్నారు. ఇంకా, మెడ, భుజాలు కూడా ‘మెహింది’ పెట్టించు కోవటం ఒక ‘ఫాషన్’ అయింది.
- పెళ్లి కూతురి చేతులకి గోరింటాకు పెట్టటం ఒక గౌరవంగా పరిగణించ బడుతుంది.
- ఇప్పుడు ప్రతి శుభ కార్యంలోను గోరింటాకు పెట్టటం ఒక ఆనవాయితీగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే పసుపు తర్వాత అంతగా ఆడవారి జీవితంతో పెనవేసుకు పోయింది
- గోరింటాకుని పెళ్ళిళ్ళకి ప్రత్యేకంగ మెహెంది పెట్టేవారిని నియమించుకుంటున్నారు. ఉత్తర దేశం వారి పెళ్లి వేడుకల్లో మెహెందికి ఒక రోజు కేటాయిస్తారు.
 |
భోజనం తినే పద్దతి |
- భోజనం తినే పద్దతి మనం సాధారణంగా నేలపై సుఖాసనం యొక్క భంగిమలో కూర్చుని తింటూ ఉంటాము. ఈ భంగిమ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాబట్టి,మనం సుఖాసనంలో కూర్చొని భోజనం చేస్తాము.
- అప్పుడు మనం తినే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మన పొట్ట దగ్గర కండరాలు వ్యాకోచించకుండా ఉంటాయి. భోజనము పైన ఏకాగ్రత ఉండి భోజం రుచిగా ఉంటుంది .
- కుడి చేత్తో తినడం వాళ్ళ చేతి వేళ్ళ నుండి మెదడుకు ఆ ఆహారం తినే అనుభూతి వాళ్ళ ఆరోగ్యం గా ఉంటాము .
 |
మంగళ సూత్రం |
- వివాహాల లో మంగళ సూత్రం, నల్లపూసల తాడు ప్రాధాన్యత కలిగి ఉంటాయి. ఆ సూత్రం మేడలో ఉన్నంత కాలం భర్త ఆరోగ్యం గా ఉంటాడని అర్ధం.
- హైందవ వివాహంలొ ప్రధానమైన ఘట్టం మంగల సుత్రధారణ, వివాహితుల మెడలో మంగళసూత్రం తప్పని సరిగా ఉంటుంది. దీనికి తోడు నల్లపూసలు కూడా ఉంటాయి. ఇవి దుష్టశక్తుల కన్ను పడకుండా పెళ్ళిరోజున వధువుకు అదృష్టం చేకుర్చుతాయని మన పూర్వికులు చెబుతారు.
- నల్ల పూసలను వధువు మెడలో కట్టడం వల్ల ఆమెకు, ఆమె భర్తకు, వారి బాంధవ్యానికి, దాంపత్య జీవితానికి ఎటువంటి హాని జరగదని నమ్ముతారు.
- వివిధ రాష్ట్రాల వారికి మంగళసూత్రం విభిన్న రకాలుగా ఉంటుంది. తమిళనాడులొ మంగళసూత్రాలు ఓ రకంగా టేల్స్ తో, మహారాష్ట్ర మంగళసూత్రాలు పట్టీలతో, ఆంధ్ర ప్రదేశ్ లొ గుండ్రని ఆకృతిలొ, కర్ణాటకలొ సాంప్రదాయ బద్ధమైన పతకాలతో ఉంటాయి. వాటిలో తేడాలు ఎలా ఉన్న దేవుడి చిహ్నంతోను, దేవాలయ గోపురాల మాదిరగానే ఉంటాయి.
- వీటిని సంతాన సౌఫల్యానికి, సంపదలకు గుర్తులుగా పరిగణించాలి. భారతదేశంలొ ప్రతి కమ్యూనిటీ వారూ పాటిస్టారు, గౌరవిస్తారు. ప్రతి స్త్రీ వివాహిక జీవితంలొ ఇవి ప్రధాన భాగం. వివాహిత స్త్రీలు మంగళసూత్రాలు లేదా నల్లపూసలు లేకుండా గడప దాటి బైటికి వెళ్ళరు, వెళ్ళకూడదు.
ఈ క్రింది వీడియో యూ.ఆర్. ఎల్.చూడండి ....
4/pAFTH8DwVGhmD-v6GkLS70NZ50FkR2AMx5qoUsibOn1KxlV2pHit1q0
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి