శివుడి లింగ రూపాలు పంచ కేదారాలు పంచ భూత లింగ ఆలయాలు భాస్కర క్షేత్రాలు గురించి తెలుసు కుందాము
శివుడు ఆద్యంతాలు లేని వాడు, అతిశయించువాడు (ఎక్కడి నుండైనా, ఎక్కడికైనా; ఏ కాలం నుండైనా, ఏ కాలానికైనా అవలీలగా పయనించువాడు), రూపాతీతుడు.ఆది శంకరాచార్యుల వారి ప్రకారం శివ అనగా కల్మషము లేని వాడు. అంటే ప్రకృతి యొక్క (సత్వ, తమో, రజో) గుణాలేవీ అంటని వాడు. అందుచేత శివనామస్మరణంతోనే సకలజనులని పరిశుద్ధము చేయువాడు. స్వామి చిన్మయానందుల వారి ప్రకారం శివుడు అనగా అనంత పరిశుద్ధుడు, ఏ గుణములు అతడిని కళంకితుడిని చేయలేని వాడు.
వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణమ్
వందే పన్నగ భూషణం శశిధరం వందే పశూనాం పతిమ్
వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియమ్
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్
శివాలయం లో శివుని రూపాలు ఎలా ఉంటాయి:
శివుని లింగరూపములోను, మానవ ప్రతిరూపంలోనూ పూజించవచ్చని ఆగమశాస్త్రాలవల్ల తెలుస్తున్నది.
శివుని ప్రతిమలలో స్థానమూర్తిగాను, ఆశీనమూర్తిగానూ ఉంటాడు. కానీ శయనరూపంలో శివుని ప్రతిమలు లేవు.
మొత్తం 45 రకాలుగా శివ ప్రతిమలు ప్రతిష్ఠించవచ్చని ఆగమశాస్త్రాలు తెలుపుతున్నాయి.
శివుడు ప్రతిమగా పూజింపబడుచున్నప్పటికీ ఎక్కువగా లింగరూపములోనే ప్రతిష్ఠింపబడుచున్నాడు.
శివుడు కేవలం రుద్రస్వరూపమే కాక ప్రేమస్వరూపుడు కూడా. శివుణ్ణి, అతని కుటుంబాన్ని మనం రెండు విధాలుగా దర్శించవచ్చును.
ఆవి రుద్రస్వరూపముగ ఐతే శివుడు, మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్ర గణపతి.
శాంతస్వభావునిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు, పార్వతీ దేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరుడు, గురునాథ స్వామి, వేద వేదాంగ భూషణులు మనకు కనిపిస్తారు.
శివలింగాలు (4) నాలుగు రకాలు.
అవి ఏమిటంటే :
(1) దైవికాలు, (2) ఆర్షకాలు, (3 )బాణలింగాలు, (4.మానుషాలు.)
పంచ కేదారాలు:-
కురుక్షేత్ర యుద్ధం ముగుసిసిన తరువాత పాండవులు బ్రహ్మహత్యా పాతకం, దాయాదులను చంపిన పాపం పోగొట్టు కోవడానికి శివ దర్శననానికి వెళ్ళారు వారికి దర్శనం ఇవ్వడానికి ఇష్ట పడని ఈశ్వరుడు కాశీ విడిచి నంది రూపం ధరించి ఉత్తర దిశగా పయన మయ్యాడు. పాండవులు పట్టు వదలక వెంబడించగా గుప్త కాశీ ప్రాంతంలో నంది రూపంలో కనిపించిన ఈశ్వరుని పట్టుకోవడానికి భీమశేనుడు ప్రయత్నించగా ఈశ్వరుడు మాయమయ్యాడు. అప్పుడు ఈశ్వరుని శరీర భాగాలు ఐదు చోట్ల ప్రతిష్ఠితమై అవి పుణ్య క్షేత్రాలుగా భాసిల్లాయి. శివ పురాణంలో వర్ణించబడిన పంచ కేదారాలను పంచఆరామాలని పిలుస్తుంటారు.
🛕 కేదారినాధ్🛕 తుంగ నాధ్,
🛕 రుద్ర నాధ్,
🛕 మధ్య మహేశ్వర్,
పంచభూత లింగ ఆలయాలు:-
ఈ పంచ భూత లింగ ఆలయాలలో నాలుగు దేవాలయాలు తమిళనాడులో ఉండగా, ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది.
🛕 ఆకాశ లింగ ఆలయం (నటరాజ స్వామి ఆలయం )- చిదంబరం
🛕 పృద్వి లింగేశ్వర స్వామి( ఏకాంబరేశ్వర స్వామి ఆలయం) - కంచి
🛕 వాయు లింగం ( శ్రీ కాళహస్తేశ్వర స్వామి ఆలయం )- చిత్తూరు (ఆం.ప్ర)
🛕 జల లింగం ( శ్రీ జంబుకేశ్వర స్వామి ఆలయం )- తిరుచునాపల్లి
🛕 అగ్ని లింగం (శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయం )- తిరువణ్ణామలై
భాస్కర క్షేత్రాలు :-
1. కాశీ
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి