మన హైందవ ధర్మంలో ముఖాన బొట్టుకి విశేషమైనటు వంటి ప్రాధాన్యత ఉంది.
👉ఇది దైవ చిహ్నముగా గుర్తించబడుతుంది. మన దేహంలోని ప్రతి ఒక్క శరీర అవయవానికి ఒక్కొక్క అధిదేవతలు ఉన్నారు. నుదుటకు బ్రహ్మదేవుడు అధిదేవత. నుదురు బ్రహ్మస్థానం. కనుక బ్రహ్మస్థానమైన నుదుట తిలకం (బొట్టు) పెట్టుకుంటారు.బొట్టులేని ముఖము ముగ్గులేని ఇల్లు ఒక లాంటివే అంటారు అంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో వారి యొక్క ముఖము,ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వేయరో ఆ ఇల్లు ఈ రెండూ కూడా స్మశానంతో సమానం అని పెద్దలు చెబుతూ ఉంటారు.
👉హిందూమతంలో మాత్రమే బొట్టుపెట్టుకొనే ఆచారముంది. ప్రపంచంలో ఏ ఇతర మతాలలోనూ ఈ ఆచారం లేదు. బ్రహ్మదేవుడు నుదుట వ్రాసినగీత తప్పింప ఎవరికీ శక్యం కాదు. కాని ఎవ్వరు ముఖాన బొట్టు పెట్టుకుందురో వారు బ్రహ్మరాసిన రాతను చెరిపి మంచిరాత వ్రాసుకుంటారనే నమ్మకం కొంత మంది లో ఉంది.
👉కస్తూరి తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్త్భుం' అనే శ్లోకం వినని వాళ్లుండరు. సంస్కృతంలో 'తిలకమ్' అని, తెలుగులో 'బొట్టు' అని అర్థం. మన నుదుటిలో జ్ఞాన నేత్రం ఉండేచోటు అంటే రెండు కనుబొమల మధ్య ఆజ్ఞాచక్రానికి తగులుతూ ఎఱ్ఱని కుంకుమ బొట్టు ప్రతినిత్యం పెట్టుకోవాలని యోగశాస్త్రం చెబుతోంది
👉మానవ శరీరము మొత్తము ప్రత్యేకించి కనుబొమ్మల మధ్యనున్న సూక్ష్మమైన స్థానమును విద్యుదయస్కాంత తరంగ రూపాలలో శక్తిని ప్రసరింపజేస్తుంది. అందువలననే విచారముగా నున్నప్పుడు వేడి కలిగి తలనొప్పి వస్తుంది. తిలకము లేక బొట్టు మన నుదిటిని చల్లబరచి వేడి నుండి రక్షణ నిస్తుంది. శక్తిని కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది. కొన్ని సమయాలలో చందనము లేక భస్మము నుదుట మొత్తము పూయబడుతుంది
👉 బొట్టు లేదా తిలకం అనేది హిందూ మతంలో ఒక సంప్రదాయ సంస్కృతిగా ఆచరిస్తూ వస్తున్నారు . బొట్టు పెట్టుకోవడం ద్వార ఆజ్ఞాచక్రం శక్తిని పెంచుతుంది. శరీరానికి చల్లదనానిచ్చి తేజస్సును పెంచుతుంది. హిందువులు ఏదేశంలో ఉన్నను భరత సంస్కృతి అనేది శాస్తీయ పరంగా ఎంతగోప్పదో తెలుసుకుని, దానిని మరువకుండా ఉన్నప్పుడు ఆచార సాంప్రదాయలను ఆచరించినప్పుడు, మనదేశ హిందూ సంస్కృతిని గౌరవించినవారు అవుతారు మరియు ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
👉భారతీయులకు ఈ ఆచారము చాలా ప్రాచీనమైనది.క్షత్రియ వంశానికి చెందిన క్షత్రియులు వారు తన వీరత్వానికి చిహ్నంగా ఎర్రని కుంకుమను నుదటన ధరించే వారు. వర్తక వ్యాపారాల ద్వారా సంపదను పెంపొందించుకునే వైశ్యులు అభివృద్ధికి చిహ్నంగా పసుపు పచ్చని కేసరిని ధరించేవారు.
👉శూద్ర జాతికి చెందిన వారు నల్లని భస్మాన్ని లేక కస్తూరిని ధరించేవారు. విష్ణు ఉపాసకులు U ఆకారముగా చందన తిలకాన్ని, శైవ ఉపాసకులు భస్మ త్రిపున్డ్రాన్ని, దేవి(అమ్మవారి) భక్తులు ఎర్రని కుంకుమ బొట్టును ధరిస్తారని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి.
👉నుదుటి యందు సూర్య కిరణాలు సోకరాదు,ఇది ఆరోగ్య సూత్రం. మనలోని జీవాత్మ జ్యోతి స్వరూపుడిగా మధ్యమంలోని ఆజ్ఞాచక్రంలో సుషుప్త దశలో హృదయస్థానంలో అనగా అనాహత చక్రంలో ఉంటాడు.ఈ బొట్టు(తిలకం) ధరించడం వలన మనిషి భక్తి, ముక్తి కలిగి నిజాయతీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంతే కాదు నుదుటి పైన బొట్టు ధరించిన వారిని చూస్తే ఎదుటి వారిలోనూ పవిత్ర భావనను కలుగ చేస్తుంది, గౌరవాన్ని కూడా పొందుతారు.
👉ఇంటిముందు ముగ్గు లేకపోతే దరిద్ర దేవత ఏ విధంగా ఇంట్లో తాండవం చేస్తుందో అదే విధంగా ముఖాన బొట్టు పెట్టుకోకపోతే ఆ ముఖంలో శనిదేవుడు దరిద్రదేవత తాండవం చేస్తాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు.
👉 శనీశ్వరుడు మరియు దరిద్రదేవతగా పిలువబడే జ్యేష్టదేవి ఇద్దరూ భార్యా భర్తలే కాబట్టి ఒకరు ఉంటే రెండోవారు కూడా ఖచ్చితంగా ఉంటారు. అదేవిధంగా లక్ష్మీదేవి ఉంటే నారాయణుడు ఉంటాడు.వారిద్దరూ ఐశ్వర్యాన్ని కలిగిస్తారు. కాబట్టి ముఖానికి బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు.
👉పూజాదికాలలో, వివాహ శుభకార్యాలలో ఏ శుభకార్యాలలోనైనా కుంకుమ ధరించడం సంప్రదాయంగా వస్తోంది. తిలకధారణ జీవితంలో సుఖశాంతలు, శుభాలు కలిగిస్తుంది. నుదుట బొట్టు లేకుండా చేసే దానం, స్నానం, హోమం, పుణ్యకార్యాల, తపస్సుకాని నిష్ఫలము అవుతాయి.
👉మహర్షులు, సాధువులు, దేవతా ఉపాసకులు నుదుట తిలకం ధరిస్తారు . నిత్య నైమిత్తిక కామ్యకర్మలు, శ్రాద్ధకర్మలు నుదుటిన బొట్టులేకుండా చేయడం వలన నిష్ఫలమవుతాయని మన ధర్మశాస్త్రాల్లో కూడా పేర్కొనబడింది.
👉 పద్మపురాణంలో, ఆగ్నేయపురాణంలో పరమేశ్వర సంహితలోస్త్రీలు, పురుషులు అనే భేదం లేకుండా నొసటిమీద కుంకుమ ధరించడం వలన భర్త ఆయుష్షు పెరుగుతుందని, లక్ష్మీనివాసమైన నుదుటిపై బొట్టు ధరించే వేళ 'ఊర్థ్వపుండ్రం లలాటేతు భర్తురాయుష్యవర్థకమ్ లలాటే కుంకుమం చైవ సదా లక్ష్మీ నివాసకమ్' అనే మంత్రం చెప్పుకుంటూ బొట్టుపెట్టుకోవాలని పురాణాలు తెలుపుతున్నాయి.
👉అందుకే అంత్యప్రాసల కవి ఆరుద్ర 'నూరేళ్ళ పెట్టు నొసటి బొట్టు అది నోచే నోముల కలిమి పెట్టు'' అన్నాడు. జ్ఞానదాతయైన శ్రీకృష్ణుడు కస్తూరి తిలకంతోనే శోభించాడు. అలాంటి జ్ఞానాన్ని పొందడానికి పురుషులు సైతం బొట్టు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
👉ఎవరైనా మన ముఖాన్ని చూసినప్పుడు వారి యొక్క కంటి నుండి వచ్చేటటువంటి నకారాత్మక శక్తి అంటే నెగెటివ్ఎనర్జీ అంటారు..అది మనపై పడుతుంది..నరుడు కంటి చూపుకి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని అంటూ ఉంటారు పెద్దలు
👉 అలాగే ఎదురుగా ఉండేటటువంటి వారు..మన ముఖాన్ని చూస్తే వారి యొక్క చూపులో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ మన యొక్క కనుబొమ్మల రెండింటికీ మధ్యలో ఉండేటటువంటి స్థానంలో కేంద్రీకృతమవుతుంది.
👉మన శరీరంలో ఉండేటటువంటి నాడులలో కొన్ని సున్నితమైనటువంటి నాడులు రెండు కనుబొమ్మలకు మధ్యభాగంలో ఉంటాయి.ఎప్పుడైతే దృష్టి మనమీద పడిందో.. అటువంటి సున్నితమైనటువంటి నాడులు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి.
👉ఆ నాడులు ఒత్తిడికి లోనవటం వలన.ఆ నాడులు మెదడుకు అనుసంధానమై ఉంటాయి. అంటే మెదడుకు సంభందించినటు వంటి నాడులు మన ముఖములో కనబడుతాయి.కాబట్టి ఆ మెదడు దెబ్బ తింటుంది. మెదడు దెబ్బ తినడం అంటే మెదడు మీద ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా మనకు తలనొప్పి వస్తుంది.మనఃశాంతి పోతుంది.
👉 చిరాకు వస్తుంది.ఏ విషయం పైన సరిగా దృష్టి పెట్టలేము.కాబట్టి ఎదుటి వారి యొక్క కంటిచూపు నుండే మన యొక్క మేధాశక్తిని కాపాడుకోవాలంటే..మెదడును కాపాడుకోవాలంటే మనకు ఉన్నటువంటి పాజిటివ్ఎనర్జీని కాపాడుకోవాలంటే ఖచ్చితముగా వారి చూపులకు మన కనుబొమ్మల మధ్య భాగానికి మధ్య ఏదైనా అడ్డంగా పెట్టాలి.
👉 కాబట్టి నుదుటున బొట్టు పెడితే చాలు. మనం బొట్టు పెట్టుకున్నామంటే ఎదురుగా ఉండేటటువంటి వారి యొక్క చూపు మన యొక్క నుదుట మీద పడినా కూడా మన సున్నితమైనటువంటి నాడులకు ప్రమాదం లేకుండా బొట్టు అడ్డుకుంటుంది.తద్వారా మన యొక్క శక్తి మన దగ్గరే ఉంటుంది.
👉జ్ఞాపకశక్తి, మేధాశక్తి అన్నీ రకాలయినటువంటి విశేషమైనటువంటి శక్తులు మన దగ్గరే ఉంటాయి.ఎటువంటి ఒత్తిడికి లోనూ కావు.అవి మనల్ని కాపాడుతూ ఉంటాయి. మన యొక్క అభివృద్ధికి తోడ్పడతాయి.అందుకని బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి. సైంటిఫిక్ గా కూడా తప్పనిసరిగా సైన్సు ప్రకారం కూడా ఇది నిరూపించడం జరిగింది.
👉ఏవేలు తో బొట్టు పెట్టుకోవాలన్నప్పుడు ఒకొక్కరు ఒకోవిధంగా చెబుతారు. కొందరు మధ్య వేలు మంచిదని.. మరికొందరు ఉంగరపు వేలు మంచిదని. అయితే ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకుంటే శాంతి, జ్ఞానం వస్తుంది. మధ్య వేలితే పెట్టుకుంటే ఆయువు, సంపద వస్తాయని ప్రతీతి. ఒక చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోకూడదు. బొటన వేలితో పెట్టుకుంటే పుష్ఠి కలుగుతుంది.
👉అందుకని ఎప్పుడైనా సరే చక్కగా బొట్టు పెట్టుకోండి. ఋణ బాధలు ఉన్నటువంటివారు నాగసింధూరాన్ని బొట్టుగా ధరించండి. ఆ బొట్టు పెట్టుకోవడం వలన ఋణబాధలు అన్నీ కూడా తొలగిపోతాయి.
👉అదే విధంగా సర్పదోషాలు, నాగదోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ఎక్కువగా మనఃశాంతి లేక ఇంట్లో గొడవలు ఎక్కువగా అవుతున్నాయి అంటే ఆరావళి కుంకుమను బొట్టు పెట్టుకోండి.
👉 పుణ్యస్త్రీలు మాత్రమే కాకుండా సౌభాగ్యవతులే కాకుండా మగవారే కాకుండా వైథవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా కుంకుమను ధరించవచ్చు దానినే గంగసింధూరము అంటారు.
👉 ఆంజనేయస్వామి వారి యొక్క బొట్టు అని కూడా అంటారు ఆ బొట్టును వైదవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా పెట్టుకోవచ్చు. ఎటువంటి తప్పూ లేదు.
👉 అందువల్ల చక్కగా కుంకుమను ధరించండి. మన హైందవ ధర్మానికి పట్టుకొమ్మలు మన ఆచారాలే.ఆ ఆచారాలను కనుక మనం అనుసరిస్తే హైందవ ధర్మం యొక్క రక్షణను మనం పొందగలుగుతాము
👉 దానితో పాటుగా మన యొక్క రక్షణను కూడా మనం పొందగలుగుతాము. ఇవన్నీ కూడా పెద్దవారు మనకు ఏర్పాటు చేసినటువంటి బంగారుబాటలు. అందుకని చక్కగా కుంకుమను ధరించండి. మీ ఉన్నతిని కాపాడుకోండి.
ఈ క్రింది వీడియో .యు ఆర్. యల్.లింక్ లలో నుదుటన బొట్టు గురించి తెలుసుకోండి
Today's Quote:
-Joel Osteen
Note:
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి