wowitstelugu.blogspot.com
దీని సంబందించిన వీడియో లింక్లు చూడండి
ఎటువంటి నీటిని మనం వాడాలి మినరల్ వాటర్ మంచిదేనా? మునిసిపల్ వాటర్ వాడొచ్చా తెలుసుకోండి
మానవులు త్రాగుటకు అర్హమైన స్వచ్ఛమైన నీరును తాగునీరు లేక మంచినీరు అంటారు. మానవునితో పాటు అనేక జీవులకు జీవించడానికి అత్యంత అవసరమైన పదార్థం నీరు, మానవుడు తన ఆరోగ్య సంరక్షణ కొరకు సురక్షితమైన మంచినీటిని వినియోగిస్తాడు. బాగా అభివృద్ధి చెందిన దేశాలలో గృహాలకు, వాణిజ్య, పరిశ్రమలకు తాగునీటి ప్రమాణాలు కలిగిన నీరు సరఫరా జరుగుతుంది.మానవ శరీరంలో సుమారు 70% నీటితో ఇమిడి ఉంది. ఇది జీవప్రక్రియలలో కీలకమైన భాగం. అనేక శారీరక ద్రావణాలకు ద్రావకంగా పనిచేస్తుంది
భారతదేశంలో ఉన్న మన పూర్వికులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మన ఆరోగ్యం కోసం కొన్ని సూత్రాలు చెప్పారు. అందులో ఇది ఒకటి. నీటిని శుబ్రపరిచేందుకు రాగి, ఇత్తడి బిందెలు, చెంబులు వాడేవారు. వీటిని వాడటం వలన నీటిలో ఉండే సూక్ష్మక్రిములు చనిపోతాయి.
పూర్వ కలం ఈ మినరల్ వాటర్ ప్లాంట్స్ పరిశుద్ధ యంత్రాలు ఉండేవే కాదు. ఎక్కువుగా అందరు వాడే చెరువులు , తరచూ ఉపయోగించే బావులు పారుతున్న నదుల ప్రవాహం నీరు తాగే ఏంతో ఆరోగ్యంతో ఉండే వారు. ఐతే ఈకాలం లో జనాభా విపరీతం గా పెరిగి పోవడం తో నీరు కలుషితమై పోతున్నాయి. దాంతో అందరు నీటిని వడకట్టి మరగబెట్టి చల్లార్చిన నీటిని వాడటం మొదలు పెట్టారు .
కానీ ఈ మధ్యకాలంలో ఏవేవో యంత్రాల ద్వార శుద్ధి చేసిన మినరల్ వాటర్ ని కొని అవే మంచివి అని 200 యమ్.యల్ నీరు కవర్ల లో ప్యాక్ చేసినవి 2 రూపాయల నుండి 3 రూపాయలు పెట్టి కొంటున్నాం. కిన్లే లాంటి పెద్ద వ్యాపార సంస్థలు లీటర్ డబ్బా 20/- రూ . కి అమ్ముతున్నారు.
కాని ఈమధ్య చేసిన సర్వేలలో తేలిన విషయం ఏమంటే నీళ్ళలో ఒక కెమికల్ కలిపి వాటిని మినరల్ వాటర్ లా అమ్ముతున్నారు. దీనివలన ప్రమాదమే కాని ఉపయోగం లేదు. రోగాలని కొనుక్కొని తెచ్చుకుంటున్నారు.
అసలు మినరల్ వాటర్ అంటే మంచి మినరల్ తో కూడిన నీరు అని అర్ధం. కానీ వడకట్టిన నీటిలోంచి మనిషికి అవసరమైన అసలైన మినరల్స్ అన్ని పోయి కుత్రిమ మినరల్స్ కలుపుతున్నారు. మనం వాడే సహజ మైన నీటీలో ( బావులు, చెరువులు, పారుతున్న నీటిలో మినరల్స్ సహజం గా ఉంటాయి)
మనం పరిశుద్ధమైన నీరు అనుకుంటూ మినరల్స్ కూడా వడ కట్టేసిన నీటిని కుత్రిమ మినరల్స్ కలిపిన నీటిని కొనుక్కోని రోగాల బారిన పడకూడదు అనుకుంటూనే రోగాలని కొనుక్కుంటున్నాము.
ఇంకో విషయం ఏంటంటే బయట మార్కెట్ లో కొనే మినరల్ వాటర్ వలన మన శరీరంలో ఎముకల చుట్టూ ఉండే కాల్షియం కరిగిపోయి ఎముకలు డొల్ల అవుతున్నాయి. దీనివలన ఎముక పటుత్వం కోల్పోయి చిన్న చిన్న సంఘటనలకే విరిగిపోతున్నాయి.
ఈమధ్య జరిగిన ఒక ప్రయోగంలో ''రోబ్ రీడ్'' అనే శాస్త్రవేత్త ప్లాస్టిక్ పాత్రలు, మట్టి పాత్రలు, ఇత్తడి, రాగి పాత్రలలో విరోచనకారి అయిన ఒక సూక్ష్మక్రిమిని వేశారు. దీనిని 24గంటల తరువాత పరిశీలించగా ఇత్తడి రాగి పాత్రలలో వేసిన క్రిములు శాతం తగ్గింది. మరల 48 గంటల తరువాత పరిశీలించగా రాగి మరియు ఇత్తడి పాత్రలలో క్రిములు 99 శాతం నశించిపోయాయి.
కానీ ప్లాస్టిక్, సీసాలలో వేసిన క్రిమి 24 గంటలకి రెట్టింపు అయింది. 48 గంటలకి దానికి రెట్టింపు అయింది. అని కనుగొన్నారు. పాస్టికి బాటిల్ కవర్లలో నీటిలో నిల్వ ఉంచడం కూడా అనారోగ్యానికి హేతువని పరిశోధనలలో తేలింది
ఈమధ్య కాలంలో అనేక మంది ఇళ్లలో రాగి పాత్రలని వాడటం గమనార్హం. హోటళ్లలో కూడా రాగి పాత్రలు వాడుతున్నారు. కనుక రాగి, ఇత్తడి పాత్రలను వాడండి. గాజు గ్లాస్ ల లో నీరు తాగడం కూడా మంచిదే .
శాస్త్రీయ పద్దతిలో స్వచ్ఛమైన త్రాగు నీరు ఎలా ఉండాలి?
- లీటరు నీటిలో ఇనుము శాతం ఒక మిల్లీ గ్రాముకు మించి ఉండకూడదు.
- నైట్రైట్ కణాలు సున్నా శాతం ఉండాలి. ఒక లీటరు నీటిలో నైట్రేట్ వంద మిల్లీగ్రాముల మించి ఉండకూడదు.
- నీటి స్వచ్ఛతను పి.హెచ్. అనే కొలమానంతో కొలుస్తారు. తాగేనీటిలో పి.హెచ్. విలువ 6.5 నుంచి 9.2 మధ్యలో ఉండాలి.
- హెచ్.టు.ఎస్. కాగితాన్ని నీటిలో ఉంచితే నీరు నలుపురంగులోకి మారితే బ్యాక్టీరియా ఉన్నట్లే.
- ఒక లీటరు నీటికి 2500 మిల్లీగ్రాముల విద్యుత్ ప్రసరణ సామర్థ్యం ఉండాలి. అంతకు మించి ఉండకూడదు.
- లీటరు నీటిలో 2 వేల వరకు వివిధ రకాల ఖనిజాలు కరిగి ఉంటే తాగేందుకు మంచిదే. అంతకు మించి ఖనిజాలు ఉండకూడదు.
- లీటరు నీటిలో వెయ్యి మిల్లీగ్రాముల క్లోరైడ్ కణాలుండవచ్చు.
- మెగ్నీషియం కణాలు 100 వరకు మాత్రమే ఉండాలి.
- ఒక లీటరు నీటిలో ఆల్కలైనిటి 600 మిల్లీగ్రాముల వరకు ఉండొచ్చు.
- ఒక లీటరు నీటికి తలతన్యత 600 మిల్లీగ్రాములు దాటకూడదు.
- లీటరు నీటిలో కాల్షియం పరిమాణం 200 మిల్లీగ్రాములు మించకూడదు. ఇక్కడ 68 మిల్లీగ్రాములు
- 400 మిల్లీగ్రాముల సల్ఫేట్స్ ఉండాలి.
ఇవన్నీ మనకి ఎలా తెలుస్తుంది అంటే మీరు బావి ని తవించినప్పుడు ప్రతి 1 సంవత్సరానికి ఒకసారి లాబరేటరీ లో పరిశోధన చేయిన్చాలి. ప్రభుత్వం బావులు చెరువులు నీటిని కూడా టెస్ట్ చేయించి తాగడానికి అనువైన వా కదా అనే బోర్డులు పెట్టించాలి. సాధారణం గా మనఇంట్లో కి వచ్చే మునిసిపల్ వాటర్ లేదా మన బావి లోని నీరు అందరు తరచు వాడే చెరువు నీరు పారె నీరు మనం ఇంట్లో కొద్దిగా వడ కట్టుకొని తాగడం మంచిది. ప్లాస్టిక్ పాత్రలలో సంపుల లో నీటిని చిన్న పాత్రల లో ఉన్న నీటిని 1 రోజుకు మించి వాడరాదు . వర్షాలు వరదలు వచ్చినప్పుడు వడకట్టి వేడి చేసి చలార్చిన నీటిని వాడాలి.
దీని సంబందించిన వీడియో లింక్లు చూడండి
మినరల్ వాటర్ తాగడం వల్ల వచ్చే రోగాలేంటి ...
Note:
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like, share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like, share and subscribe చేయండి .
అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe చేయండి.
నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv
అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe చేయండి.
నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv
నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe చేయండి.
కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి