3, ఫిబ్రవరి 2022, గురువారం

పురాణాలు ఉద్భవం, లక్షణాలు వివిధ పురాణాలు లో వివరించే అంశాలు ఏమిటి

wowitstelugu.blogspot.com

పురాణాలు ఉద్భవం, లక్షణాలు వివిధ పురాణాలు లో వివరించే అంశాలు ఏమిటి

అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడు కుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. 

పురాణాలు ప్రణవం నుండి పుట్టాయని సంస్కృత భాగవతంలోని పన్నెండవ (12) స్కందం చెప్తుంది. బ్రహ్మదేవుడు ధ్యానమగ్నుడై ఉన్న సమయంలో ఆయన హృదయగృహ నుండి ఒక అనాహత శబ్దం వెలువడింది. ఆ శబ్దంలో నుండి కార కార కార శబ్ధాలు కూడిన ఓంకారశబ్దం ఆవిర్భవించింది.

👉"అ" నుండి "హ" వరకు గల అక్షరాలు ఆశబ్దంనుండి ఉద్భవించాయి. "ఓం కారం" సకల మంత్రాలకు బీజాక్షరం అయింది.

👉ఓంకారం నుండి నాలుగు వేదాలను ఉద్భవించాయి. ఆ 'అ'కార, 'ఉ'కార 'మ' కారములనుండి సత్వ,రజో,తమో అనే త్రిగుణాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అనే చతుర్వేదాలు,

👉 భూ॰భువ॰సువ॰ అనే త్రిలోకాలు, జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు జనించాయి. ఆ తరువాత బ్రహ్మదేవుడు చతుర్వేదాలను వెలువరించి తనకుమారులైన మరీచి తదితరులకిచ్చాడు.

👉వారు తమ కుమారులైన కశ్యపుడు తదితరులకు ఇచ్చారు. అలా వేదాలు పరంపరాగతంగా సాగిపోతూ ఉన్నాయి.

👉 వేదాలు ప్రజలకు క్లిష్టమైనవి కనుక అందుబాటులో లేనివి కనుక వేదవ్యాసుడు వేద ఉపనిషత్తు సారంతో కూడిన అష్టాదశ పురాణాలను రచించాడు. 

👉 పురాణాలను వ్యాసుడు తన శిష్యుడైన రోమహర్షణుకి చెప్పాడు. 

👉రోమహర్షుడు తిరిగి వాటిని తన శిష్యులైన త్రైయారుణి, కశ్యపుడు, సావర్ణి లాంటి శిష్యులకు అందించాడు. ఆ తర్వాత అలా ఒకరి నుండి ఒకరికి సంక్రమించాయి.

పురాణాలు వాటి లక్షణాలు: -

సర్గము, ప్రతి సర్గము, వంశము, మన్వంతరము, వంశాలచరిత్ర అనే పంచలక్షణాలు కలిగినదే పురాణం.

  • సర్గము - సర్వ ప్రపంచ సృష్టిని విస్తరించేది

  • ప్రతి సర్గము - సకల ప్రపంచము లయమయ్యే లక్షణం తెలిపేది (ప్రళయం)

  • వంశము - పృథు, ప్రియ వ్రతాదుల వంశోత్పత్తిని వివరించుట

  • మన్వంతరము - ఏ కల్పంలో ఏ మనువు కాలంలో ఏమి జరిగిందో తెలుపుట

  • వంశాలచరిత్ర: వివిధ దేవతల వంశ చరిత్ర తెలియ జేస్తుంది

భాగవతంలో పురాణ లక్షణాలు పది (10) గా చెప్పబడ్డాయి:-

సర్గోప్యశ్చ విసర్గశ్చ వృత్తి రక్షాంతరాణి చ

వంశో వంశానుచరితం సంస్థాహేతు రపాశ్రయ

దశభిర్లక్షణైర్యుక్తం పురాణం తద్విదో విదు:

అనగా :-

1. సర్గము (సృష్టి),

2.ప్రతిసర్గము (ప్రళయము),

3.వృత్తి (వ్యాపారము),

4.రక్ష (పరిపాలవ),

5.అంతరము (మన్వాదుల కాలము),

6.వంశము (వంశాదుల విషయము), వంశానుచరితము

7.(సూర్య, చంద్ర వంశస్థుల కథనాలు),

8.సంస్థా (స్థితి),

9.హేతువు (కారణము),

10.అపాశ్రయము (ఆశ్రయ విషయాలు)

  • 👉 అనే పది (10) లక్షణాలని పురాణ లక్షణాలు గా చెప్పబడినవి.
  • 👉 కొంతమంది పది (10) లక్షణాలున్నవి 👉మహాపురాణాలని,
  • 👉 ఐదు (5) లక్షణాలున్నవి 👉 పురాణాలని వర్గీకరిస్తున్నారు.

పురాణాల పేర్లు చెప్పే శ్లోకం చూడండి :

సత్రయాగం జరుగుచున్నప్పుడు అష్టాదశపురాణాలను తెలుపుతూ సూతుడు ఋషులకు చెప్పిన శ్లోకం. భాగవత పురాణము ప్రధమ స్కందములో చెప్పబడింది.

మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం

అనాపద్లింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్

పైన చెప్పిన వాటిలో ముందక్షరాలు :

  • "మ" ద్వయం -- మత్స్య పురాణం, మార్కండేయ పురాణం

  • "భ" ద్వయం -- భాగవత పురాణం, భవిష్య పురాణం

  • "బ్ర" త్రయం -- బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం

  • "వ" చతుష్టయం -- విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం

మిగిలిన వాటి పేర్ల మొదటి అక్షరాలు మాత్రమే తీసుకుని శ్లోకపాదం కూర్చటం జరిగింది:

  • అ -- అగ్ని పురాణం

  • నా—నారద పురాణం

  • పద్—పద్మ పురాణం

  • లిం -- లింగ పురాణం

  • గా -- గరుడ పురాణం

  • కూ -- కూర్మ పురాణం

  • స్క—స్కంద పురాణం

పురాణాల వర్గీకరణ:-

మహాపురాణాలు దైవము యొక్క మూడు రూపములు (త్రిమూర్తుల) రూపంగా  వర్గీకరించ బడ్డాయి. 


వైష్ణవ పురాణాలు:

విష్ణు పురాణం, భాగవత పురాణం, నారద పురాణము, గరుడ పురాణం, పద్మ పురాణము, వరాహ పురాణం, వామన పురాణము, కూర్మ పురాణం, మత్స్య పురాణము

బ్రహ్మ పురాణాలు:

బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, మార్కండేయ పురాణము, భవిష్య పురాణం,

శైవ పురాణాలు:

శివ పురాణము, లింగ పురాణము, స్కంద పురాణం, అగ్ని పురాణం

పద్మ పురాణంలో, ఉత్తర ఖండంలో.  దానికదే ఒక వైష్ణవ పురాణం, మూడు గుణాలలో లేదా లక్షణాలను అనుగుణంగా పురాణాల్లో వర్గీకరించింది; సత్యం, అభిమానం, ఉదాసీనత. 

సత్వ 

("నిజం; స్వచ్ఛత")

విష్ణు పురాణం, భాగవత పురాణం, నారద పురాణము, గరుడ పురాణం, పద్మ పురాణము, వరాహ పురాణం

రాజస 

("డిమ్నెస్; అభిరుచి")

బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, మార్కండేయ పురాణము, భవిష్య పురాణం, వామన పురాణము బ్రహ్మ పురాణము

తామస 

("చీకటి; అజ్ఞానం")

మత్స్య పురాణము, కూర్మ పురాణం, లింగ పురాణము, శివ పురాణం స్కంద పురాణం, అగ్ని పురాణం

అష్టాదశ పురాణములలో పురాణముల వివరణ వాటి శ్లోకము ల సంఖ్య :

  1. బ్రహ్మ పురాణం - బ్రహ్మదేవుడు మరీచికి బోధించింది. 10,000 శ్లోకములు కలది.

  2. పద్మ పురాణము - బ్రహ్మదేవునిచే చెప్పబడింది. 55,000 శ్లోకములు కలది. భగవద్గీత గొప్పతనాన్ని వివరిస్తుంది. అందువల్ల, ఇది కూడా గీతామహత్మ్యము గా (లిట్. భగవద్గీత ఘనత ) అంటారు. 

  3. విష్ణు పురాణం - పరాశరుని రచన. దీనిలో 63,000 శ్లోకములు ఉన్నాయి.విష్ణువు అనేక పనులు, ఆయనని పూజించేవారు వివిధ మార్గాలను వివరిస్తుంది.

  4. శివ పురాణం - వాయుదేవునిచే చెప్పబడింది. ఇందులో 24,000 శ్లోకాలున్నాయి. శివుడు, ఆయన గురించి ఇతర కథలు, పూజలు, శివ గొప్పతనం, గొప్పతనాన్ని వివరిస్తుంది. వాయు పురాణం : 24,000 శ్లోకములు కలది.  శివ పురాణంకి గల  మరియొక పేరు. 

  5. లింగ పురాణము - నందీశ్వరుని రచన. 11,000 శ్లోకాలు ఉంది. విశ్వం యొక్క లింగం వైభవం, శివ యొక్క చిహ్నం, మూలం వివరిస్తుంది. ఇది లింగం గురించి అనేక కథలు ఉన్నాయి. ఇందులో విష్ణు, బ్రహ్మ మధ్య వివాదం ఎలా అనివార్యమైంది, అలాగే ఎలా పరిష్కరించవచ్చు అనేది కూడా అగ్ని లింగం తెలియ జేస్తుంది.

  6. గరుడ పురాణం - విష్ణుమూర్తి గరుత్మంతునికి చెప్పిన ఈ పురాణంలో 19,000 (16,000?) శ్లోకాలున్నాయి.మరణం, దాని తర్వాత కార్యాలు వివరిస్తుంది.

  7. నారద పురాణము - నారద మహర్షి రచన. 24,000 (25,000?) శ్లోకములు కలది. వేదాలు, వేదాంగాలు గొప్పతనం వర్ణిస్తుంది.

  8. భాగవత పురాణం- శుకమహర్షి పరీక్షిత్తునకుపదేశించింది. 18,000 శ్లోకములు కలది.

విష్ణువు యొక్క పది అవతారాలు చెప్పడం, పురాణాలల్లో యొక్క అత్యంత ప్రసిద్ధి, ప్రముఖం అయినదిగా భావించింది. దీని పదవ, పొడవైనది అని చెప్పవచ్చు, కృష్ణ పనులు, వ్యాఖ్యానం, తన చిన్ననాటి లీలలు పరిచయం, తరువాత అనేక భక్తి ఉద్యమాలు ఒక ప్రక్రియ ద్వారా విశదీకరించింది

  1. అగ్ని పురాణం - భృగుమహర్షిచే చెప్పబడింది. 16,000 (8,000?) శ్లోకములు కలది. వాస్తు శాస్త్రం, రత్నశాస్త్రం వివరాలను కలిగి ఉంది.

  2. స్కంద పురాణం - కుమారస్వామిచే చెప్పబడింది. 80,000 (లక్ష?) ఇందు శ్లోకములు ఉన్నాయి.  స్కంధ (లేదా కార్తికేయ), శివుడు యొక్క కుమారుడు పుట్టిన వివరాలు వివరిస్తుంది. ఇది చాలా పెద్దదైన పురాణం, ఇందులో సంబంధిత పురాణములు, ఉపమానరీతిగా, కీర్తనలు, కథలు భారతదేశంలో తీర్థయాత్రా కేంద్రాలలో భౌగోళిక స్థానాలను కలిగిన ఒక అసాధారణమైన, కచ్చితమైన పుణ్యస్థల సూచికను కలిగి ఉంది. అనేక విషయాల ఆచూకీలు లభ్యం కాలేని సూక్తులను వాచకము రూపములో అందిస్తుంది ఈ పురాణం.

  3. భవిష్య పురాణం లేదా భవిష్యోత్తర పురాణం - శతానీకుడు సుమంతునకు బోధించింది. 14,500 (31,000?) శ్లోకములు ఉన్నాయి.

  4. బ్రహ్మవైవర్త పురాణం - వశిష్ట మహర్షి అంబరీషునకు ఉపదేశించింది. 18,000 (12,000) శ్లోకములు కలది. కృష్ణ, వినాయకుడు దేవతలు,పూజించే మార్గాలను వివరిస్తుంది..

  5. మార్కండేయ పురాణం - పక్షులు క్రోష్టి (జైమిని) కి చెప్పినట్లుగా మార్కండేయమహర్షి రచించెను. 9,000 (32,000?) శ్లోకములు ఉంది.దేవి మహాత్మ్యం, గుళ్ళల్లో పూజారులు/శాక్తేయులు మొదలగు వారి కోసం ఒక ముఖ్యమైన వాచకం, పొందుపరచబడింది.

  6. వామన పురాణము - బ్రహ్మదేవుని రచన - 14,000 శ్లోకములు కలది.ఉత్తర భారతదేశం లో కురుక్షేత్రం చుట్టూ ప్రాంతాల్లో వాటిని వివరిస్తుంది.

  7. వరాహ పురాణం - శ్రీవరాహమూర్తి భూదేవికి ఉపదేశించింది. ఇందు 24,000 శ్లోకములు ఉన్నాయి.విష్ణు భక్తి ఆచారాలు, వివిధ రూపాలు ప్రార్థన వివరిస్తుంది. శివుడు, దుర్గ యొక్క అనేక దృష్టాంతాలు కూడా కలిగి ఉంది.

  8. మత్స్య పురాణం - శ్రీమత్స్యావతారుడైన విష్ణువు మనువునకు ఉపదేశించెను. దీనిలో 14,000 శ్లోకాలున్నాయి.మత్స్యావతారము కథ, విష్ణువు యొక్క పది ప్రధాన అవతారాల యొక్క మొదటి అవతారము. ఇది కూడా పలు రాజ వంశాల వారసత్వపు వివరాలను కలిగి ఉంది. 

  9. కూర్మ పురాణం - శ్రీకూర్మావతారుడైన విష్ణువు ఉపదేశించెను. దీనిలో 17,000 (6,000) శ్లోకాలున్నాయి.  విష్ణువు యొక్క పది ప్రధాన అవతారములు యొక్క రెండవది ఉంది.

  10. బ్రహ్మాండ పురాణం - బ్రహ్మదేవుని రచన- 1,100 (12,200?) శ్లోకములున్నది.లలితా పంచాక్షరీ, కొన్ని హిందువులు ప్రార్థనలు వర్ణించు ఒక వాచకం కలిపి ఉంది. 

  11. హరివంశ పురాణం - 16,000 శ్లోకములు  ఇతిహాసములు (పురాణ కవిత్వం) పరిగణించబడుతుంది.

ఈ క్రింది శ్లోకం అష్టాదశ పురాణాల (18) ను మూడు విధాలుగా విభజిస్తూ వైష్ణవ, శైవ, బ్రహ్మ పురాణాలుగా చెబుతుంది.

వైష్ణవం నారదీయం చ తధా భాగవతం శుభం గారుడంచ తధా పాద్మం

వరాహం శుభదర్శనే సాత్వికాని పురాణాని విష్ణ్వేయాని శుభానిదై

బ్రహ్మాండం బ్రహ్మ వైవర్తం మార్కండేయం తధైవ చ భవిష్యం వామనం బ్రహ్మరాజ నిబోధతే 

మాత్స్య కౌర్మం తధా లైంగ శైవం స్కౌందం ఆగ్నేయంచ షడేతాని తామసాని భోధమే

ఇలాంటిదే మరొక శ్లోకం:-

బ్రాహ్మం పాద్వం వైష్ణవంచ శైవం వైంగం చ గారుడమ్

నారదీయం భాగవతం ఆగ్నేయం స్కాంద సంజ్ఞికమ్

భవిష్యం బ్రహ్మవైవర్తం మార్కండేయం చ వామనమ్

వారాహం మత్స్య కౌర్మాణి బ్రహ్మాండాఖ్యమితి త్రిషట్

  • వైష్ణవ పురాణాలు - సాత్విక గుణాన్ని

  • బ్రహ్మ పురాణాలు - రాజస గుణాన్ని

  • శైవ పురాణాలు - తామస గుణాన్ని ప్రధానంగా కలిగి ఉంటాయి అని పై శ్లోకం అర్థం. 

ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్.ల లో పురాణాల గురించి తెలుసుకోండి

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ , షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My Facebook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి