wowitstelugu.blogspot.com
అమ్మవారి నాభిస్థానంలో పంచముఖ శివుడు ఆసీనుడై కనిపించే అద్భుతం శ్రీ జగజ్జనని ఆలయం
అమ్మవారి నాభిస్థానంలో పంచముఖ శివుడు ఆసీనుడై కనిపించే అద్భుతం శ్రీ జగజ్జనని ఆలయం
➽ త్రిమూర్తులు సహా ముక్కోటి దేవతలందరినీ నడిపించే తల్లి జగజ్జనని. సకల చరాచర జగత్తును సృష్టించిన తల్లి జగజ్జనని. అలాంటి శక్తి స్వరూపిణిని కాళీ, దుర్గ, లక్ష్మి, సరస్వతి రూపాల్లో దర్శనం చేసుకుంటాం. కానీ జగజ్జనని రూపం లో ఆ తల్లిని మాత్రం చాలా తక్కువమంది దర్శించుకొని ఉంటారు. ఇలా జగజ్జన ని రూపంలో ఆ తల్లి వెలసిన ఆలయాలు ప్రపంచంలో రెండు మాత్రమే ఉన్నవి. మరి ఆ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? ఆ అమ్మవారి రూపం ఎలా ఉంటుంది? ఆ ఆలయం విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసు కుందాం.
➤ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, నంద్యాలలో శ్రీ జగజ్జనని ఆలయం ఉంది. ఈ అమ్మవారి ఆలయాలు ప్రపంచంలో రెండు ఉండగా అందులో ఒకటి హిమాలయ పర్వతాల్లోని మానస సరోవరం లో ఉండగా, మరొక ఆలయం ఈ ప్రాంతంలో ఉందని చెబుతారు. ఇక మానస సరోవరంలో వెలసిన అమ్మవారు స్వయంభువు అని చెబుతారు. కానీ ఆ విగ్రహం ప్రస్తుతం శిధిలావస్తలో ఉందని చెబుతారు. ఇక ఈ ఆలయంలో వెలసిన అమ్మవారి విగ్రహాన్ని చూస్తే ప్రతి ఒక్కరికి ఒక కొత్త అనుభూతి వస్తుందని అంటారు.
ఈ ఆలయ స్థల పురాణం
➤పూర్వం నంద్యాలకు చెందిన శివనాగపుల్లయ్య అనే వ్యక్తి భవానీ మాత భక్తుడు. అతను ప్రతి సంవత్సరం కూడా తప్పకుండ భవానీ మాల ధరించేవాడు. అయితే 1983 వ సంవత్సరంలో అయన భవానీ దీక్షలో ఉన్నపుడు యాత్రలో భాగంగా అహోబిలానికి వెళ్లగా అక్కడ కొంతమంది యోగులని కలిసాడు. అప్పుడు వారి మధ్య ఆధ్యాత్మిక చర్చ జరుగగా జగజ్జనని ప్రస్తావన వచ్చినది. అందులో ఉన్న ఒక యోగి జగజ్జనని రూపం గురించి తెలియచేసి అతడికి ఆ అమ్మవారి రూపం ఉన్న ఒక చిత్ర పటాన్ని ఇవ్వగా అందులో ఉన్న అమ్మవారి దివ్య మంగలా రూపాన్ని చూసి ముగుడై ఈ అమ్మవారి రూపాన్ని ఇప్పటివరకు చూడలేదే అని చాలా ఆవేదన చెందాడు. ఇలా అమ్మవారి ఆలయ కేవలం హిమాలప్రాంతంలో ఉన్న మానస సరోవరంలో మాత్రమే ఉందని తెలుసుకున్న అతడు ఎలాగైనా తన ప్రాంతంలో ఆ అమ్మవారి ఆలయాన్ని నిర్మించాలని భావించాడు.
శ్రీ జగజ్జననీ ఆలయ నిర్మాణ విశేషాలు
- 'సంకల్పోహి జనానాం చిత్త సమ్యక్కరణసాధనం, తదన్యత్ర ఫలాఫలాని దైవేైన నిశ్చయితవ్యం'' - ఇతి ప్రాజ్ఞా ఊచు. అని ప్రాచీన వార్తికం. మనిషి ఒక 'రోబోట్' లాంటి వాడు. రిమోట్ కంట్రోల్తో దానిని నడిపించే సాంకేతిక మేధావి ఆ పరమాత్మ. ఆయన తన ఇష్ట ప్రకారము మనిషిని నడుపుతుంటాడు.
- మనిషిపనల్లా తన జన్మ యెందుకోసమో కాస్తయినా గ్రహించి తన ధర్మపథంలో తాను నడుస్తోండడం, అలా నడుస్తూ పోతుంటే తన కిష్టమైన పద్ధతిలో నడిపేవాడు ఆ పరమాత్మ.
- పుణ్యమూర్తి శివనాగపుల్లయ్య అలాంటి ఓ సాధారణ మనిషి. తానెందుకీ మానవ జన్మనెత్తాడో ఆలోచన లేని వ్యక్తి. దైవం నడిపినట్లు నడిచే యాంత్రికపాణి అలా భగవన్నిర్ణయంగా 1983లో భవాని దీక్షలో ఉన్నప్పుడు అహోబిలం వెళ్ళడం అక్కడ ఎగువ అహోబిళంలో అత్యంత తేజస్సంపన్నులైన యోగుల బృందం జగజ్జననీ మూర్తి వున్న చిత్రాన్ని శివనాగపుల్లయ్య చేతికిచ్చి ''ఇది హిమాలయాల్లో వుండేదని మా గురువులు చెప్పేవారు. నిన్ను చూడగానే ఈ అమ్మవారికి ఆలయ నిర్మాణ ప్రేరణ నీలోనే కలిగించాలనేది ఆ తల్లి సంకల్పం. అమ్మకు ఆలయం కట్టు. కట్టుతావు. ఇక నీకన్నీ జయాలే'' అన్నారు.
- ఆశ్చర్య సంభ్రమం నుండి పుల్లయ్య తేరుకోనే లోగానే వాళ్ళు అవుపించలేదు. అదీ సంకల్పం. అది కలిగించిందా పరాశక్తి. ఫోటో పుల్లయ్య చేతిలో వుంది.
- తర్వాత పుష్కర కాలానికి గానీ మళ్ళీ ఆలయ నిర్మాణ సంకల్పం శివనాగపుల్లయ్యకు కలుగలేదు. అంటే 1996లో అమ్మవారి ఆలయ నిర్మాణానికి అనువైన స్థలాన్ని పట్టణం ఈశాన్యంలో లక్షలు వెచ్చించి కొనుగోలు చేశాడు.
- ఈ సంకల్పానికి వూతమిచ్చింది యువసైన్యమే. 1988లోనే భవానీ దీక్షో పాల్గొనే మిత్రబృందం అందరూ కలిసి ''శ్రీ దుర్గ ఫ్రెండ్స్ యూనిట్'' అని యేర్పడ్డారు.
- ఈ ఆస్తిక భక్త యువ బృందమంతా అన్నదాన కార్యక్రమములు, చలివేంద్రములు, పేదలకు ఆర్థిక సహాయము, అనేక విపత్తులలో పలు విధాల సేవా కార్యక్రమాలకు అలవాటు పడిన ఈ యూనిటం.
- జగజ్జననీ ఆలయ నిర్మాణ సంకల్పం బూనింది. పూనిందీ అంటే పరాశక్తి కల్గించింది.సేకరించిన స్థలానికి కంచి, శృంగేరీ స్వాముల వారి శుభాశీరనుమతులూ లభించాయి.
- తరువాత 3 సం.లకు 1999 జనవరిలో శిలాన్యాసం జరిగింది. అమ్మవారి విగ్రహం 9. ల ఎత్తుది చేయించి తాత్కాలిక పూజలు నిర్వహించే కుటీరం ఏర్పాటు జరిగాక త్రిశరనాగసర్పం ఒక రాత్రి అమ్మవారి విగ్రహానికి ఫణిచ్ఛాయ పట్టిందన్న వింత, నమ్మినా నమ్మకున్న జరిగిన సత్యం. ఈ అపూర్వ సత్య సంఘటన 1999 జులైలో జరిగింది.
- ఆ తరువాత శిల్పులను మాట్లాడడం మొదలుకొని బృహత్ శిలలు తెప్పించటం, మలిపించటం, అగాధంగా పునాదులు, మహత్తర శిల్పాలు, మహోన్నత స్తూపాలు, నిలువెత్తు అధిష్ఠానం, గర్భగుడి, రంగ, ఆస్థాన మంటపాది ప్రణాళికలు, గోపుర నిర్మాణం తద్బాహ్య దృశ్యమాన సకల దేవతా మూర్తులు - ప్రకృతి ప్రతిబింబ దేవతాకృతులు - తదితర శిల్ప కళా వైభవ సంస్కృతీ ప్రదర్శనం వరకూ.
- లక్షల రూపయల వ్యయం తో ఏళ్ళ తరబడీ అమ్మవారి ఆలయ నిర్మాణం కొనసాగిస్తుండడం అమ్మ భక్తుడు శివనాగపుల్లయ్య, అతని అనుచర బృందం ఎలా సాధిస్తుందనడం ఆ జగన్మాతకే ఎరుక!
- పలువిధాల యాచనలతో పరమార్థ దృక్పథములో పరమాత్మికాలయ నిర్మాణం సాగించటం శ్రీ దుర్గ ఫ్రెండ్స్ యూనిట్ కు తలకుమించిన భారమే అవుతున్నా అపోహలకు తావివ్వని రీతిలో ఐచ్ఛిక విరాళాలతో - అర్థించే తీరుతో ఈ అపూర్వ నిర్మాణాన్ని సాగించడం ఆశ్చర్యమే.
- అయినా క్రియ నెరిగి ఉదారులే ముందుకు రావాలన్న తపన తప్ప యాచించి అలుసుకావడం ఇష్టంలేని పట్టుదల అమ్మవారిపై నమ్మకం ఈ ఆస్తిక బృందాన్ని ముందుకు నడుపుతూనే వున్నా ఏ భక్త ఆస్తిక ఉదారమహాశయులో సహకరించక పోరా అని ఆశ, అది జరగాలి విశ్వంలోనే అవూర్వమైన ఈ ఆలయం జగజ్జేగీయమానం కావాలి.
అమ్మవారి విగ్రహం వివరాలు
➤ఇలా ఆ అమ్మవారి ఆలయాన్ని ఈ ప్రాంతంలో నిర్మించాడు. ఇక ఈ ఆలయంలో గర్భాలయంలో జగజ్జనని నల్లరాతితో చేసిన తొమ్మిది అడుగుల ఎత్తు ఉంది ఎన్నో ప్రత్యేకతలతో దర్శనం ఇస్తుంది. అమ్మవారి నాభిస్థానంలో పంచముఖ శివుడు ఆసీనుడై కనిపిస్తాడు. పాదపీఠ భాగంలో శ్రీ మహావిష్ణువును కొలువు తీర్చిన తీరు అద్భుతం. ఈ అమ్మవారు అష్టభుజాలతో దర్శనం ఇవ్వగా, కుడివైపున ఉన్న చేతుల్లో చంద్రమండలం, సూర్యమండలం, భూమండలం, అభయహస్తం, లక్ష్మీదేవి, త్రినేత్రం, త్రిశూలం ఉంటాయి. ఎడమవైపు ఒక చేతిలో శంఖం, రెండో చేతిలో డమరుకం, మూడొచేతిలో ధనుస్సు, నాల్గవ చేతిలో బ్రహదేవుడు ఉంటారు. ఇంకా 17 తలల ఆదిశేషుడు అమ్మవారికి చత్రంగా కనిపిస్తాడు. ఇలా అమ్మవారు సింహవాహనం పై దర్శనం ఇస్తూ భక్తులని మంత్రముగ్దుల్ని చేస్తుంది.
శ్రీ జగజ్జననీ ఆలయం- ప్రాశస్త్యం
- అపూర్వ శిల్ప శోభారమణీయంగా నిర్మాణంలో ఉన్న శ్రీ జగజ్జననీ ఆలయం వెలసిన నంద్యాల అనాదికాలం నుండే ప్రముఖ శైవక్షేత్రం అనే చెప్పాలి.
- ఎందుకంటే ఇది నవనంది - ఆలయం ఆ విధంగా ఈ జగజ్జననీ ఆలయ క్షేత్రానికి అతి సమీప దూరంలోనే ప్రముఖ శైవక్షేత్రాలయిన శ్రీశైలం (ఆత్మకూరు రస్తా) మహానంది (నల్లమల తూర్పు) పడమన ఎర్రమలలు - నల్లమలల సంధి ప్రదేశంలో భోగేశ్వరం, ఎర్రమలలలోనే ప్రముఖ శైవక్షేత్రం యాగంటి, గుండం మల్లికార్జున స్వామి, బ్రహ్మగుండం, మద్దులేటి లక్ష్మీ నారసింహస్వామి, అహోబిల నరసింహక్షేత్రం, సర్వ నరసింహక్షేత్రం, ఇటు ప్రముఖ శక్తి స్థానమైన నందవరం చౌడేశ్వరీ నిలయం, కొత్తూరు సుబ్బరాయుడు క్షేత్రాలు అన్నీ చేరువలోనే ఉండడం జగజ్జననీ ఆలయ సందర్శకులకు ఎందో సౌకర్యంగా వుంటుంది.
ఇంకా ''ఓంకారం, నెమిలిగుండం, మోక్షగుండం, కొమ్ముచెరువు ఆంజనేయస్వామి, కాల్వబుగ్గ రామేశ్వర తీర్థం'' కూడా ఈ ఆలయ కేంద్రం నుండి అతి సులభంగా ప్రయాణింప వీలున్నంత దూరంలోనే, నిరంతరయాన సౌకర్యాలతో అలరారడం విశేషం.
కళ్యాణం-కమనీయం
➤ శివ పార్వతులు, శ్రీ లక్ష్మీ విష్ణువు, సిద్ధి బుద్ధి విఘ్నేశ్వర, శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, బ్రహ్మ సరస్వతుల కళ్యాణము ప్రతి రోజు జరుపబడును.
➽ క్రింది వీడియో యు .ఆర్.యల్ .లు చూడండి...
శోథన ఫలితాలు
➽గమనిక :
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like, share and subscribe చేయండి,
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like, share and subscribe చేయండి.
అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like, share and subscribe చేయండి.
అలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com like, share and subscribe చేయండి.
అలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండి.
Also, see my Youtube channel bdl 1tv like, share and subscribe,
Also, see my Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe, కామెంట్ చేయడం మర్చిపోకండి మీ కామెంట్, షేర్, లైక్ మాకెంతో మేలు చేస్తుంద, థాంక్యూ.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి