12, ఫిబ్రవరి 2019, మంగళవారం

Afroz Shah, a young Indian lawyer from Mumbai, is determined to the world’s largest beach clean-up project.

wowitstelugu.blogspot.com

ఆఫ్రోజ్ షా ముంబైలోని ఒక యువ భారతీయ న్యాయవాది, ఇతను  ప్రపంచంలోని అతిపెద్ద బీచ్ క్లీన్-అప్ ప్రాజెక్ట్తో ముఖ్యమైన భూమికను పోషిస్తున్నారు .

అఫ్రోజ్ షా 
ఆఫ్రోజ్ షా ఒక సముద్ర ప్రేమికుడు మరియు అతను ముంబై సముద్ర తీరాలని  ప్లాస్టిక్ రహిత చేయడానికి దీక్ష బూని, సముద్ర మలినాలని శుభ్రం చేయడం ప్రారంభించారు . ఈ ఆశయం తో  భారతదేశం అంతటా తీరప్రాంతములలో  కమ్యూనిటీలు స్థాపించి ఈ కార్యక్రమాన్ని ఉదృతం చేయడానికై ప్రతినపూనారు .

  • అక్టోబర్ 2015 లో, Afroz shah   అతని పక్క ఇంట్లో స్నేహితుడు హర్బన్ష్ మాథుర్ 84 ఏళ్ల వయస్సులో  ప్లాస్టిక్ కాలుష్యాలు కారణంగా పైల్స్  వ్యాధి తో మరణించారు,  వెర్సోవా నగరం యొక్క తీరం పూర్తిగా కరగ కుండా ఉన్న వ్యర్ధాలు  కుప్పలు ఉండడం చూసి విసుగు చెందారు.  దాని గురించి  ఏదో  చేయాలని  నిర్ణయించి  ఆ పనిని  ఇరువురు  తమతామే  సంకల్పించుకొని  బీచ్ శుభ్రం చేయడం  ప్రారంభించారు.
  • ప్రతి వారాంతం లో బీచ్ లోని చెత్తను శుభ్రం చేయడం ప్రారంభించారు. ప్రతి వారాంతంలో, అఫ్రోజ్ షా తో  చేరడానికి వాలంటీర్లు ను  ప్రోత్సహించారు మురికివాడల నుండి బాలీవుడ్ తారలవరకు ,  పాఠశాల నుండి రాజకీయ నాయకులవరకు .  అఫ్రోజ్ షా  తో  కలిసి "సముద్రాన్ని  శుభ్రం  చేయడానికి  తేదీలు ఏర్పాటు చేసుకొని  పనులు చేస్తున్నారు".
  • వెర్సోవా (Versova) నివాసితులు ' అఫ్రోజ్ షాహ్ దృఢ సంకల్పానికి అందరు గర్వంగా భావిస్తున్నారు . 
  • కార్యకర్తలు  కమ్యూనిటీ ప్రజల  ఆచరణాత్మకమైన ప్రయత్నాల వల్ల   సముద్రపు అలల తాకిడి తగ్గింది , ప్రతి నెలలోను  కనిపించే కొత్త చెత్తను తగ్గించడంతో,  బీచ్ ని తిరిగి పరిశుభ్రమైన ప్రాంతంగా మారడం  ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మరియు వారి ప్రభుత్వాలు  సముద్ర తీరాలను  శుభ్రం చేయడం ప్రారంభించారు . 
  • ఇప్పటివరకు, అఫ్రోజ్ షా మరియు వాలంటీర్లు 2.5 కిలోమీటర్ల బీచ్ నుండి 4,000 టన్నుల చెత్తను సేకరించారు శుభ్రం చేసారు .
  •  ప్రతి ఇంటిలోనూ ఈ కార్యక్రమాన్ని భాగస్వామ్యం చేయడానికి ఇతను విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు . సముద్రతీర ప్రాంతం లోని  వ్యక్తులను ముందు భాగస్వామ్యం చేసి దానిని త్వరలో దేశమంతా  ప్రచారం చేయాలనీ దృఢ సంకల్పం తో ఉన్నారు. అతను తీరప్రాంతపు చెత్త చెట్ల మడ అడవులను శుభ్రపర్చాలని కోరుకుంటున్నారు. 
  • తీర  ప్రాంతాలు శుభ్రంగా ఉండి   తీర ప్రాంతాలల్లో  వృక్ష సంపదను బాగా పెంచ గలిగి నట్లైతే తుఫాన్ బారినుంచి తీర ప్రాంతాలను దేశాన్ని కూడా రక్షించవచ్చు
  • చాల సందర్భాలలో ప్రజలు ,ప్రభుత్వాలు సరిగా సహకరించలేదు. సేకరించిన వ్యర్దాలను. వేరే ప్రాంతాలకు తరలించడం లో  అలసత్వం చేసే వారు.  ఉత్పత్తి వ్యర్దాలను  తొలగించడం ప్లాస్టిక్ మరియు ఇతర వ్యర్దాలను శుభ్రం చేయడం పూర్తయే వరకు  కమ్యూనిటీ లను కార్య కర్తలను పెంచుకుంటూ

అతను భారతదేశంలోని మరియు  ప్రపంచవ్యాప్తం గా తన  బీచ్ క్లీన్-అప్ క్రూసేడ్ను కొనసాగించడానికి ప్రతిజ్ఞ చేసారు. హాట్స్ ఆఫ్ అఫ్రోజ్ షా..

ఈ క్రింది ట్విట్టర్ లింక్ లో అఫ్రోజ్ షా గురించి తెలుసుకోండి ....

ఈ క్రింది ఫేస్బుక్ లింక్ లో అఫ్రోజ్ షా గురించి తెలుసుకోండి ....

Afroz Shah | Facebook

https://www.facebook.com/afroz.shah.984

ఈ క్రింది 'ఇన్స్టాగ్రామ్' లింక్ లో అఫ్రోజ్ షా గురించి తెలుసుకోండి ....

Afroz Shah (@afrozshah_) • Instagram photos and videos

ఆఫ్రోజ్ షా గురించి తెలుసుకోవడానికి ఈ క్రింది వీడియో లింక్లు యు .ఆర్. యల్ లు క్లిక్ చేయండి...

Great Indian Afroz Beach clean up program




Afroz Shah on Versova Beach Cleanup - Part II - YouTube






Afroz Shah is back - YouTube

https://www.youtube.com/watch?v=vKyh-LAQZcI


Note:  
నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండి .
నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com  చూడండి చూసి  like,share and subscribe  చేయండి.
మరియు  wowitsviral.blogspot.com  like,share and subscribe  చేయండి
అలాగే నా బ్లాగ్ teluguteevi.blogspot.com కామెంట్ చేయడం మర్చిపోకండి  థాంక్యూ .



6, ఫిబ్రవరి 2019, బుధవారం

do you know the parents succession of guilty contributes to children

wowitstelugu.blogspot.com

తల్లితండ్రులు  చేసిన పాపం పిల్లలకు ఇలా సంక్రమిస్తుంది

తల్లితండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుంది. దాన్నే జాతకంలో పితృశాపం అని, స్త్రీ శాపం అని అంటారు.

  • నన్ను ఆడికి కన్నారా... కన్నప్పుడు భరించాలి మీరు  అని  తరచూ పిల్లలు అనడం చూస్తుంటాము. నిజానికి అడిగి కనడం కాదు, వారిని నీవే ఎంచుకున్నావు. జీవుడు తను చేసిన కర్మ వల్లనే రాబోయే జన్మలో తన తల్లితండ్రులను, కుటుంబాన్ని ఎంచుకుంటాడు. కుటు౦బంలో ఎవరైనా స్త్రీలకు అన్యాయం చేస్తే స్త్రీ శాపం తగులుతుంది. అది రాబోయే తరాలకు సంక్రమిస్తుంది.

  • ఆడామగ అయినా సరే వయసులో దురలవాట్లకు బానిసైతే పాపం తరువాతి తరం వ్యాధుల రూపంలో అనుభవిస్తుందిఅవిటిగా పుట్టడంపుట్టుకతోనే భయంకరమైన వ్యాధులు సోకడంఒకవేళ ఆరోగ్యంగా పుట్టారని అనుకున్నాకాల క్రమేనా అవయవాలు పాడవవడం జరుగుతుందిదానినే "వంశపార్యపరంఅంటారు. 
  • సర్పాలను చంపినప్పుడు సర్పశాపం పితృ దేవతలకు శ్రాద్దం నిర్వహించనందు వలన పిత్రుశాపం సంక్రమిస్తాయి.   వీటి కారణంగా జీవితంలో ఎదుగుదల ఉండదు, ఉద్యోగాలు రావు, వచ్చినా అభివృద్ధి ఉండదు. సంతానం కలగదు. వ్యాపారాలలో నష్టం మొదలయినవి వస్తాయి. ఇవన్నీ పూర్వీకులు చేసిన కారణంగా తరువాతి తరం అనుభవిస్తుంది.

  • అందుకే మనం వయసులో "ధర్మoగా" ఉంటే, మనకు పుట్టే వారు కూడా అదే ధర్మాన్ని పంచుకుని పుడతారు. జీవితంలో వృద్ధి చెందుతారు.
  • అలాగే గురుగ్రహం యొక్క అనుగ్రహం లేనప్పుడు పిల్లలు జీవితంలో వ్రుద్ది ఉండదు. పిల్లలను చూసి తల్లితండ్రులు భాద, మనస్తాపానికి గురవుతారు. నిజానికి ఆనుభవించేవారికంటే వారిని చూసేవారికీ  బాధ  ఆధికంగా ఉంటుంది.

  • || గురుధ్యానం ప్రపద్యామి పుత్ర పిడోపశాంతయే || అని శాస్త్ర వాక్కు.   గురు/బృహస్పతి ధ్యానం వలన సంతానం వలన కలిగే బాధ తోలగుతుంది
  • ఒక వ్యక్తి ఒక కుటుంబంలో పుట్టినపుడు, అతడు తన కర్మతో పాటు కుటుంబానికి చెందిన కర్మను కూడా స్వీకరిస్తాడు. అతడిపై ప్రభావం ఉంటుంది.


కొన్ని ఉదాహరణలు:

  • అనవసరంగా  ఇతరులను విమర్శించరాదు ...   ఈ లోకంలో ఉండే అన్ని జీవులలో "దత్తుడు" ఉన్నాడు. అంటే గురు అవతారం "దత్తాత్రేయుడు". తెలిసో తెలియకో ఇతరులను విమర్సి౦చడం అంటే దత్తుడిని అవమానించడం, విమర్శించడమే. అది కూడా కొంత పాపాన్ని సమకూర్చిపెడుతుంది. అది కూడా గురుశాపానికి కారణమవుతుంది.

  • పచ్చని చెట్లను నరకరాదు  పచ్చని చెట్లపై గురు ప్రభావం ఉంటుంది. పచ్చని మొక్కలు/చెట్లను నరికితే, అది జాతకంలో గురుదోశంగా కనిపిస్తుంది. కళ్ళముందే పిల్లలు మరణించడం, స్త్రీ సంతానం ఉంటే వారు వైవిధ్యం పొందడం వంటివి జరుగుతాయి

  • పండ్లు కాయలు పుష్పాలతో ఉన్న చెట్లను నరికితే పండ్లు, కాయలు, పుష్పాలతో ఉన్న చెట్లను నరికితే, సంతానం కూడా కలగని సందర్బాలు౦టాయిఅంటే పిల్ల పుట్టింట్లో కుర్చుని ఏడుస్తుంది. ఆమెను చూసి తల్లితండ్రులు ఏడుస్తారు. దానికి కారణం బిడ్డ తల్లితండ్రులు చేసిన పాపం. అందుకే పిల్లలు కలవారు పచ్చని చెట్లు కొడుతుంటే, "పిల్లలున్న వాడివి, పచ్చని చెట్లు కొడుతున్నావ్, ఎంత తప్పు చేస్తున్నావో" అని మన పెద్దలు అంటూ ఉంటారు.

  • అక్రమ సంపాదన  పనికిరాదు...  భూములు లాక్కుంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు తమ అక్రమసంపాదన సక్రమంగా చూపించడం కోసం పేద రైతులను మోసం చేసో, మరొక విధంగానో భూములు ఆక్రమిస్తూంటారు. వ్యవసాయం మీద పన్ను లేదు కనుక భూమిలో పండిన దానిపై వచ్చిన ఆదాయంగా తమ అక్రమసంపాదను చూపి సక్రమం చేసుకుంటారు.
  • బలవంతం గా భూములు లాక్కోరాదు ...  ఒక కుటుంబంలోని వారికి ఒక భూమి వంశపారంపర్యంగా సంక్రమించినప్పుడు, దానికి పితృదేవతల అనుగ్రహం ఉంటుంది. భూమిని బలవంతంగా లాక్కుంటే, పితృదేవతలు ఏడుస్తారు. అది శాపంగా మారి లాక్కున్న వారి కడుపు కొడుతుంది. వారి పిల్లల అకాల మరణం చెందుతారు, లేదా జీవచ్చవాలుగా మిగిలిపోతారు. దీనికి కారణం తల్లితండ్రులు చేసిన పాపం

  • వారసులు అనుభవించకుండా భూములు అమ్ముకోవడం చేయరాదు... అసలు మనం ఒక భూమిని కొనాలన్నా, దానికి ముందు వెనుక బాగా ఆలోచించాలి. యోగులైతే ఒక భూమిని కొనే ముందు పితృదేవతలను సంప్రదిస్తారు. మీరు ఉచితంగా ఇస్తానన్నా వారు తీసుకోరు. ఎందుకంటే తమ వారసులు అనుభవించకుండా భూములు అమ్ముకోవడం పితృదేవతలకు ఇష్టం ఉండదు. విచిత్రం ఏమిటంటే మన దేశంలో ప్రభుత్వాలే భూములను లాక్కుంటాయి.

  • అవినీతికి పాల్పడితేఇతరులకు ద్రోహం చేస్తే ఏమవుతుందో తెలుసా...   వ్యక్తి అయినా సంపాదించేది తన కోసం, తన పిల్లల కోసం. వారు బాగుండడం చూసి ఆనందించాలని అనుకుంటాడు. క్రమంలో అతడు అవినీతికి పాల్పడితే, ఇతరులకు ద్రోహం చేస్తే, వారి ఏడుపు వీరికి శాపంగా మారుతుంది. అవినీతి పరులు బాధపడేది వారి పిల్లలకు హాని కలిగినప్పుడే. అందుకే వారి పిల్లలు అకాలమరణాల పాలవుతారు.

ఇలా ఎన్నో రకాలుగా తల్లితండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుంది. కాబట్టి, తస్మాత్ తల్లితండ్రులు తమ పిల్లల భవిస్యత్తు  కోసమైనా జాగ్రత్తగా ఉండండి ...

ఈ క్రింది వీడియో యూ.ఆర్.యల్ లు చూసి మరింత తెలుసుకోండి...



Note:  

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండినా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com  చూడండి చూసి  like,share and subscribe  చేయండి.  మరియు  wowitsviral.blogspot.com  like,share and subscribe  చేయండి.  అలాగే నా బ్లాగ్ teluguteevi.blogspot.com  కామెంట్ చేయడం మర్చిపోకండి  థాంక్యూ .