18, నవంబర్ 2020, బుధవారం

3 కార్తీక పురాణము విశిష్టత - మూడవరోజు పారాయణము

wowitstelugu.blogspot.co3

3 కార్తీక పురాణము విశిష్టత  మూడవరోజు పారాయణము 

 పంచమ అధ్యాయం 

  • 'ఓ శివధనుస్సంపన్నా! జనకరాజా! శ్రద్ధగా విను. మనం చేసిన పాపాలు అన్నింటినీ నశింపచేయగల శక్తి ఒక్క కార్తీకమాస వ్రతానికి మాత్రమే వుంది. 
  • కార్తీకమాసంలో విష్ణు సన్నిధిలో ఎవరయితే భగవద్గీతా పారాయణం చేస్తారో వారి పాపాలు అన్నీ కూడా పాము కుబుసంలాగా తొలగిపోతాయి. 
  • పదీ-పదకొండూ అధ్యాయాలను పారాయణ చేసేవాడు వైకుంఠానికి క్షేత్రపాలకుడు అవుతాడు. 
  • ఎవరైతే కార్తీకమాసంలో తులసీ దళాలతో కాని, తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో కాని విష్ణుపూజ చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి, విష్ణుసమభోగాలను అనుభవిస్తాడు.
  • ఈ కార్తీక మాసంలో హరిహరులు ఎవరి సన్నిధి అయినా, ఏ పురాణం అయినా సరే చదివేవాడు సర్వకర్మబంధు విముక్తులు అవుతారు. 

  కార్తీక వనభోజనం      

శ్లో     యం: కార్తీకే: సీతే వనభోజన మాచరేత్ !
           సయాటి వైష్ణవం ధామం సర్వపాపై: ప్రముచ్యతే !!


కార్తీకమాస శుక్లపక్షంలో వనభోజనం చేసినవారు, పాపవిముక్తులు అయి విష్ణుదామాన్ని పొందుతారు. జప, హోమ, పూజా, భోజన, తర్పణ కాలాలలో పాపీ క్షుద్ర ఛండాలాది అశౌచవంతుల యొక్క సంభాషణలను వినిన పాపం తుడిచిపెట్టుకు పోతుంది. కాబట్టి, మహారాజా! కార్తీకమాస శుక్లపక్షం అన్ని రకాల వృక్షాలతో బాటుగా ఉసిరిచెట్టు కూడా వున్న తోటలోనే వనభోజనం ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఉసిరిచెట్టు క్రింద సాలగ్రామం నుంచి, గంధం, పుష్పాలు, అక్షతలు పూజించి, యథాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి. ఇలా కార్తీకమాసంలో వనభోజనాన్ని ఎవరయితే నిర్వహిస్తారో, వాళ్ళు ఆయా కాలాలలో చేసిన సర్వపాపాల నుంచీ తెములుకుని, విష్ణులోకాన్ని పొందుతారు. జనకపతీ ! ఈ కార్తీక మహత్యాన్ని భక్తిశ్రద్ధలతో విన్న బ్రాహ్మణ కుమారుడు దుర్యోనీ సంకటం నుంచి రక్షింపబడ్డాడు. ఆ కథ చెబుతాను విను ...  


దేవదాత్తోపాఖ్యానము     
                    
పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్భ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక దుర్మార్గుడు అయిన కుమారుడు కలిగాడు, అతగాడి దుష్ట ప్రవర్తనలను గుర్తించిన తండ్రి, అతగాడిని పాపవిముక్తుడిని చేయాలని సంకల్పం చేసుకుని 'నాయనా! రోజూ కార్తీక ప్రాతఃస్నానాన్ని ఆచరించు. సాయంత్రం హరిసన్నిధిలో దీపారాధానం చేస్తూ వుండు. ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివి ఆవు' అని చెప్పాడు. కాని, దుర్వర్తనుడైన ఆ బ్రాహ్మణపుత్రుడు తాను అటువంటి కట్టుకథలను నమ్మను అనీ,  కార్తీక వ్రతాన్ని ఆచరించను అనీ తండ్రికి ఎదురు తిరిగాడు. అందుకు విసిగిన దేవశర్మ తన కుమారిడిని 'అడవిలోని చెట్టుతొర్రలో ఎలుకవై పడివుండు' అని శపించాడు. శాపానికి భయపడిన ఆ బ్రాహ్మణకుమారుడు తండ్రి పాదాలపై పడి, తనకు తరోణోపాయం చెప్పమని కోరగా, ఆ తండ్రి 'నాయనా! నీవు ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణంగా విన్తావో అప్పుడే నీ ఎలుకరూపం తొలగిపోతుంది' అని శాపవిముక్తిని అనుగ్రహించాడు. 

దేవదాత్తుడి శాపవిముక్తి 

తండ్రి శాపం కారణంగా అప్పటికప్పుడే ఎలుక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు, దట్టమైన అరణ్యంలో ఫలవంతం అయింది. అనేక జంతువులకు ఆధారమైన ఒక మహా వృక్షం తొర్రలో నివశిస్తూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత, ఒకనొక సమయంలో మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీకస్నానం ఆచరించడానికి వచ్చి, ఆ ఎలుక వున్న చెట్టు మొదలు కూర్చుని తన శిష్యులకు పరమ పావనమైన కార్తీక మహత్యాన్ని వినిపించసాగాడు. ఆ సమయంలో దయాహీనుడూ, పాపాల పుట్టా, అడవిజీవాలను హింసించి పొట్టపోసుకునే వాడూ అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు. పుణ్యపురుషుల దర్శనం వలన ఉపకారమే కానీ, అపకారం ఏనాడూ జరుగదు. అదే విధంగా విశ్వామిత్రుడు వంటి తపోదనుల దర్శనంతోనే రవ్వంత పశ్చాత్తాపంతోనూ, జ్ఞానీ అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి 'అయ్యా! మీరు చెప్పుకుంటున్న కథలు ఏమిటి? అవి వింటూ ఉంటే నాకు ఈ కిరాతక జీవితం మెడ చిరాకు పుడుతోంది. దయచేసి ఈ రహస్యం ఏమిటో చెప్పండి' అని అనగానే, అతనిలోని వివేకం విచ్చుకుంటున్న వైనం గమనించిన విశ్వామిత్రుడు.

ఇలా అన్నాడు 'నాయనా! మేం కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ కార్తీకమాసంలో ఎవరైనా సరే తెలిసిగాని, తెలియకగాని స్నాన, దాన, జప, తప పురాణ శ్రవణాలు చేసినట్లయితే వారు వారి సర్వపాపాలనుండి విముక్తులు అవుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు    జ్వీవన్ముక్తులు అవుతారు.' అని తెలిపాడు. ఈ విధంగా కిరతకుడికి చెపుతున్న కార్తీక మహత్యాన్ని విన్న వెంటనే తొర్రలో ఉన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలేసి, పూర్వ బ్రాహ్మణ యువకుడి రూపాన్ని పొంది, విశ్వామిత్రుడికి అతని శిష్య బృందానికి ప్రమాణం చేసి తన పూర్వ కథను వినిపించి, ఆ ఋషులనుండి శలవు తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. తరువాత ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రుడు, శిష్యబృందం ద్వారా కార్తీక మహత్యాన్ని పూర్తిగా తెలుసుకోవడం వలన జీవితంలో కిరాతడుడు అయి కూడా, తరువాత ఉత్తమగతులను పొందాడు. కాబట్టి ఓ జనకరాజా! ఉత్తమగతులను కోరుకునేవారు ప్రయత్నాపూర్వకంగా అయినా సరే కార్తీక వ్రతం ఆచరించాలి లేదా కనీసం కార్తీకమాస మహత్యాన్ని అయినా శ్రద్ధతో వినాలి. 

 పంచమ అధ్యాయం సమాప్తం 
                  

 ఆరవ అధ్యాయం 

శ్రీ వశిష్టుడు తిరిగి చెపుతున్నాడు ... రాజర్షీ, జనకా! ఈ కార్తీక మాసం ముప్పై రోజులు కూడా ఎవరైతే శ్రీమహావిష్ణువును కస్తూరీ, గంధాలతోనూ, పంచామృతం తోనూ అభిషేకిస్తే వారికి పదివేల అశ్వమేథాలు చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీకమాసం సంధ్యా సమయంలో విష్ణుసన్నిధిలో దీపారాధానం చేసినా, దీపదానం చేసినా వారు విష్ణులోకాన్ని పొందుతారు. పత్తిని శుభ్రపరచి, దానితో వత్తినిచేసి, బియ్యం పిండి లేదా గోధుమపిండితో ప్రమిదను చేసి, ఆవునేతిని పోసి, ఆ పత్తివత్తిని తడిపి వెలిగించి ఒక సద్బ్రాహ్మణుడిని ఆహ్వానించి, అతనికి దానం ఇవ్వాలి. నెల పొడుగునా ఈ విధంగా చేసి, చివరిరోజున వెండి ప్రమిదను, భమిడి వత్తినీ చేయించి, వాటిని బియ్యపు పిండి మధ్యన ఉంచి పూజా నివేదనలు పూర్తిచేసి, బ్రాహ్మణులకు భోజనం పెట్టి, తరువాత తాము స్వయంగా ...
              
దీపదాన మంత్రం 

మంత్రం:     సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వసంప చ్చు భావాహం !
    దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ !!

'జ్ఞానమునూ, సంపదలనూ, శుభాములనూ కలిగించేది ఏదైనా దీపదానాన్ని చేస్తున్నాను. దీనివలన నాకు నిరంతరమూ శాంతి - సుఖం ఏర్పడుగాక' అని చెబుతూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణుడికి దానం చేయాలి. అలా చేసినవారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు. ఈ దీపదానం వలన విద్య, జ్ఞానం, ఆయువు వృద్ధి, తరువాత స్వర్గభోగాలూ కలుగుతాయి. మ్కనోవాక్కాయ కృత పాపాలు అన్నీ సమసిపోతాయి. నిదర్శనం కోసం ఒక కథను వినిపిస్తాను విను.  
                  

లుబ్థవితంతు మోక్షం పొందుట 

పూర్వం ద్రావిడ దేశంలో ఒక అనాధ వితంతువు ఉండేది. ఆమె రోజూ భిక్షాటన చేసి వచ్చినదాంట్లో మంచి అన్నమూ, కూరలు విక్రయించి తానూ మిగిలిన అన్నంతో తృప్తి పడుతూ డబ్బును వెనకేయసాగింది. ఇతరుల ఇళ్ళలో వంటపనులు, కుట్టుపనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలంగా వారి దగ్గర కొంత డబ్బు తీసుకుంటూ ఉండేది. అదిగాక భిక్షాటన కూడా చేసేది. ఇలా నిత్యం ధనం ఆర్జించడంపైనే మనసుపడిన ఆ వితంతువు, డబ్బు సంపాదించడమే తప్ప ఏరోజూ హరినామ స్మరణ చేయడం కాని, హరికథనో, పురాణాలు వినడం కానీ, పుణ్య తీర్థాలు దర్శించడం కానీ, ఏకాదశీ ఉపవాసం కానీ చేసి ఎరుగదు. ఇటువంటి ఈ వితంతువు ఇంటికి దైవవశాన శ్రీరంగ యాత్రీకుడు అయిన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకం తప్పదు అని గుర్తించి, జాలిపడి ఆమెను మంచిదారిలో  పెట్టాలనుకుని 'ఓ అమాయకురాలా! నేను చెప్పేది శ్రద్ధగా విని, ఆలోచించుకో. కేవలం చీమూ - నెత్తురూ, మాంసం - ఎముకలతో కూడుకుని సుఃఖదుఃఖాల లంపటం అయి ఉన్నదే తప్ప ఈ తోలుశరీరం వత్తి అశాశ్వతం అని తెలుసుకో. నెల, నీరు, నిప్పు, నింగి, గాలి అనే పంచభూతాత్మకం అయినదే ఈ శరీరం, ఈ దేహం నశించగానే ఆ పంచభూతాలు కూడా ఇంటికొప్పుమీద కురిసి నలుదిక్కులకూ చెదరిపోయే వాన నీళ్ళలా చెదరిపోతాయి. నీటిమీద నురుగులాంటి నీ తనువూ నిత్యం కాదు. ఇది శాశ్వతం అని నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడే మిడతలా మసి కావడమే తప్ప మేలు అనేది లేదు. మొహాన్నేమే భ్రమలనూ వదిలిపెట్టు. దైవం ఒక్కడే శాశ్వతుడు అనీ, సర్వ భూతదయాకరుడు అనీ గుర్తించు. నిత్యమూ హరిచరణాలనే స్మరించు. కామం అంటే కోరిక, కోపం అంటే దురాగ్రహం, భయం అంటే ఆత్మానాత్మీయ భంగత, లోభం అంటే ధనవ్యయ చింత. మోహం అంటే మమతానురాగాలు ఇటువంటి ఏ ఆరింటినీ వదిలిపెట్టు. నా మాట విని, ఇకనుంచి అయినా కార్తీకమాసంలో ప్రాతఃస్నానాన్ని ఆచరించు. విష్ణుప్రీతి కోసం భగవంతునికి అర్పణంగా దీపదానం చెయ్యి. దానిద్వారా అనేక పాపాలనుండి రక్షించబడతావు. అని హితవు చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు.


అతని మాటల మహిమ వలన ఆమెకు జ్ఞానోదయం అయింది. తను చేసిన పాపాలకోసం చింతించింది. తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించింది. అందుచేత ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసంలో వ్రత ఆచరణ ప్రారంభించింది. సూర్యోదయ వేళకల్లా చన్నీటి స్నానం, హరిపూజా, దీపదానం, తరువాత పురాణ శ్రవణం ఈ విధంగా కార్తీకమాసం నెలరోజులూ ఆచరించి, చివరిరోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసింది. తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినదై, చనిపోయి, విమానాన్ని అధిరోహించి, శాశ్వత సర్వభోగ సౌఖ్యాలను పొందింది. కాబట్టి, రాజా! కార్తీకమాసంలో అన్నింటికంటే ప్రధానమైనది దీపదానం. తెలిసిగాని, తెలియకగాని ఎవరైతే దీపదానం చేస్తున్నారో వారు తమ పాపాలను నశింప చేసుకున్నవారే అవుతున్నారు. దీన్ని వన్నా, చదివినా జన్మ సంసారబంధ విముక్తులై విష్ణుభక్తి పరాయణులు అవుతారు. 

                 

 ఆరవ అధ్యామ సమాప్తం  

                    మూడవరోజు పారాయణము సమాప్తం

ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్ . చూడండి 



Note: 

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe, Also see my  Youtube channel bdl Telugu tech-tutorials like share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుందథాంక్యూ

17, నవంబర్ 2020, మంగళవారం

2 కార్తీక పురాణం విశిష్టత, కార్తీక పురాణం రెండవ రోజు పారాయణం

wowitstelugu.blogspot.com
2 కార్తీక పురాణం విశిష్టత, కార్తీక పురాణం రెండవ రోజు పారాయణం

రెండవ అధ్యాయం - కార్తీక సోమవార వ్రతం 

  • వశిష్ట ఉవాచ:

ఓ జనక మహారాజా! విన్నంత మాత్రంతోనే మనోవాక్కాయముల ద్వారా చేయబడిన సర్వపాపాలనూ హరింపచేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా విను. అందులోనూ ఈ నెలలో శివుడికి ప్రీతికరమైన సోమవారం వ్రతం ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసం చేరుకుంటాడు. కార్తీకమాసంలో వచ్చే ఏ సోమవారం రోజయినా సరే స్నానం, జపాలు ఆచరించేవాడు వెయ్యి అశ్వమేథాల ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రత విధి ఆరు రకాలుగా ఉంది. ఉపవాసం, ఏకభుక్తం, నక్తం, అయాచితం, స్నానం, తిలాదానం.

  • ఉపవాసం:

శక్తి ఉన్నవారు కార్తీక సోమవారం రోజున పగలు అంతా భోజనం చేయకుండా (ఉపవాసం) తో గడిపి, సాయంత్రం శివుడికి అభిషేకం చేసి, నక్షత్ర దర్శనం తరువాత తులసీతీర్థం మాత్రమే సేవించాలి

  • ఏకభుక్తం:

సాధ్యం కానివాళ్ళు ఉదయం స్నానం, దానం, జపాలు యథావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి, రాత్రి భోజనానికి బదులు శివుడి తీర్థమో, తులసీతీర్థమో మాత్రమే తీసుకోవాలి. 

  • నక్తం:

పగలు అంతా ఉపవాసం ఉండి, రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేయవచ్చు.
అయాచితం గా భోజనం కోసం తమకు తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం 'అయాచితం' 

  • స్నానం:

పైవాటికి వేటికీ శక్తి లేనివాళ్ళు సమంత్రక స్నానం, జపం చేసినా చాలు. 

  • తిలాదానం:

మంత్రం, జపం విధాలు కూడా తెలియనివాళ్ళు, కార్తీక సోమవారం రోజున నువ్వులు దానం చేసినా సరిపోతుంది.

వ్రత ఫలితం 

  • పై ఆరు పద్ధతులలో దేన్నీ ఆచరించినా 'కార్తీక సోమవారవ్రతం' చేసినట్లే అవుతుంది. 
  • కానీ తెలిసి కూడా ఏ ఒక్కదాన్నీ ఆచరించనివాళ్ళు ఎనిమిది యుగాలపాటు కుంభీపాతర మొదలైన నరకాలను పొందుతారని అర్షవాక్యం. 
  • ఈ వ్రతం ఆచరణ వలన అనాథలూ, స్త్రీలు కూడా విష్ణు సాయుజ్యం పొందుతారు. 
  • కార్తీకమాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజూ కూడా పగలు ఉపవాసం ఉండి, రాత్రి నక్షత్ర దర్శనం తరువాత మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజు అంతా భగవంతుని ధ్యానంలో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివ సన్నిధిని పొందుతారు. 
  • సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమకచమక సహితంగా శివాభిషేకం చేయడం ప్రధానం అని తెలుసుకోవాలి.

నిష్టురి కథ 

పూర్వం ఒకానొక బ్రాహ్మణుడికి 'నిష్టరి' అనే కూతురు ఉండేది. పుష్టిగానూ, అందంగానూ, అత్యంత విలాసంగానూ ఉండే ఆమెకు గుణాలు మాత్రం శ్రేష్టమైనవి రాలేదు. దుష్టగుణ భూయిష్టమైన గయ్యాళిగానూ, కాముకురాలిగానూ తిరిగే ఈ 'నిష్టరి'ని ఆమె గుణాల వల్ల 'కర్కశ' అని కూడా పిలుస్తూ ఉండేవారు. బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కశని సౌరాష్ట్ర బ్రాహ్మణుడు అయిన మిత్రశర్మ అనే వాడికి ఇచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు.  ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచారపరుడు, సరసుడు మాత్రమే కాకుండా సహృదయం కూడా కావడం వలన కర్కశ ఆడినది ఆట పాడినది పాటగా కొనసాగుతూ వచ్చింది. అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడంతో మోజు చంపుకోలేక కొంతా, భార్యను వదిలివేయడం తన వంశానికి పరువుతక్కువ అనే ఆలోచన కొంత వలన మిత్రశర్మ, కర్కశ పెట్టే కఠినమైన హింసలన్నింటినీ భరిస్తూనే ఉండేవాడు. కాని, ఏనాడూ ఆమెను శిక్షంచలేదు. ఆమె ఎందఱో పరపురుషులతో అక్రమసంబంధం పెట్టుకుని భర్త, అత్తా, మామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది. అయినా భర్త సహించాడు. ఒకరోజు ఆమె విటులలో ఒకడు ఆమెను పొందుతూ ... 'నీ మొగుడు బ్రతికి ఉండటం వలన మనం తరచూ కలుసుకోలేక పోతున్నా'మని రెచ్చగొట్టడంతో, కర్కశ ఆ రాత్రికి రాత్రే నిద్రలో వున్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపేసి, ఆ శవాన్ని తానే మోసుకుని వెళ్ళి ఒక పాడుపడిన నూతిలోకి విసిరి వేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమెకి ఆమె విటుల బలం ఎక్కువ కావడం వల్ల, అత్తమామలు ఆమెను ఏమీ అనలేక, తామే ఇల్లు వదిలి పారిపోయారు. అంతటితో మరింత స్వతంత్రించిన కర్కశ, కన్నుమిన్ను కానని కామావేశంతో అనేకమంది పురుషులతో సంపర్కం పెట్టుకుని నిత్యసురత క్రీడలలో తేలియాడసాగింది. తాను చెడింది కాకుండా ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింప చేసి తన విటులకు తార్చి దానిద్వారా సొమ్ము చేసుకునేది. కాలం గడిచింది, దాని బలం తగ్గింది, యవ్వనం పోయింది, శరీరంలోని రక్తం పలచబడటంతో కర్కశ జబ్బుపడింది. ఎంతోమంది పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల పుణ్యమా అని, అనూహ్యమైన వ్యాధులు సోకాయి. పూలగుత్తిలాంటి మేని పుళ్ళు పడిపోయింది. జిగీబిగీ తగ్గిన కర్కశ దగ్గరికి విటులు రావడం తగ్గిపోయాయి. ఆమె సంపాదన పడిపోయింది. చివరికి అక్రమపతులకే కానీ, సుతులకు నోచుకోని ఆ నిష్టర, తినడానికి తిండీ, ఉండడానికి యింత ఇల్లూ, వంటినిండా కప్పుకోవడానికి బట్టలు కూడా కరువయ్యాయి. కొనవూపిరితో ప్రాణలతో నడివీధినపడి మరణించింది. కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కుకూడా లేకపోయింది. యమదూతలు ఆ జీవిని పాశబద్దను చేసి నరకానికి తీసుకుని వెళ్ళారు. యముడు ఆమెకు దుర్భరమైన శిక్షలను విధించాడు. 
                      

భర్తద్రోహికి భయంకర నరకం

భర్తను మరచిపోయి పరపురుషులను ఆలింగనం చేసుకున్న పాపానికి, ఆమె చేత మండుతున్న యినుప స్తంభాలను కౌగిలించుకునేలా చేశాడు. భర్త తలను బ్రద్దలు కొట్టినందుకు ముళ్ళగదతో ఆమె తల చిట్లిపోయేలా కొట్టించాడు. భర్తను తిట్టినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు కర్కశ పాదాలను పట్టుకొని కఠినమైన శిలలపై వేసి బాదించాడు. సీసం కాచి చెవులలో పోయించాడు. కుంషీపాత నరకానికి పంపాడు. ఆమె పాపాలకుగాను ఆమె ముందు పదితరాలవారూ, తరువాత పదితరాలవారూ ఆమెతో కలిపి మొత్తం 21 తరాలవారిని కుంభీపాతంలో కుమిలిపోసాగారు. నరక అనుభవం తరువాత ఆమె పదిహేనుసార్లు భూమిపై కుక్కగా జన్మించింది. పదిహేనవ జన్మలో కళింగ దేశంలో కుక్కగా పుట్టి, ఒక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది.

సోమవార వ్రత ఫలంతో కుక్క కైలాసం పొందటం 

ఇలా ఉండగా, ఒక కార్తీక సోమవారం రోజు ఆ బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి, శివుడికి అభిషేకాలు మొదలైనవి నిర్వహించి, నక్షత్ర దర్శనం తరువాత నక్తం తీసుకోవడానికి సిద్ధపడి, ఇంటిబయట బలివి విడిచిపెట్టాడు. ఆరోజంతా ఆహారం దొరకక ఉపవాసం (పస్తు) పడుకుని ఉన్న కుక్క ప్రదోష రోజున ఆ బలి అన్నాన్ని తిన్నది. బలి భోజనం వల్ల దానికి పూర్వస్మృతి కలిగి 'ఓ బ్రాహ్మణా! రక్షంచు' అని కుయ్యి కుయ్యి అని అరిచింది. దాని అరుపులు విని వచ్చిన బ్రాహ్మణుడు కుక్క మాటలాడటం చూసి ఆశ్చర్యపోతూనే 'ఏం తప్పు చేశావు? నిన్ను నేను ఎలా రక్షించగలను?' అని అడిగాడు. 

అందుకు ఆ కుక్క 'ఓ బ్రాహ్మణుడా! పూర్వజన్మలో నేను ఒక బ్రాహ్మణ స్త్రీని. కామంతో కళ్ళు మూసుకుపోయి, కాముకురాలిని అయి చేయకూడని పనులు చేశాను. భర్త హత్యకూ, వర్ణ సంకరానికి కారకురాలినైన పతితను. ఆ పాపాలకు అనుగుణంగా అనేకకాలం నరకంలో చిత్రహింసలు అనుభవించి, ఈ భూమిపై ఇప్పటికి 14సార్లు కుక్కగా పుట్టాను. ఇది 15వ సారి అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా నా పూర్వజన్మలు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావడం లేదు. దయచేసి వివరించు' అని కోరుకుంది.

బ్రాహ్మణుడు అంతా జ్ఞానదృష్టితో తెలుసుకుని 'ఓ శునకమా! ఈ కార్తీక సోమవారం రోజున ప్రదోష సమయం వరకూ పస్తుతో ఉండి నేను వదిలిపెట్టిన బాలి తిన్నందువల్ల నీకు ఈ పూర్వజన్మ జ్ఞానం కలిగింది' అని చెప్పాడు. దాంతో ఆ కుక్క 'కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా! నాకు మోక్షం ఎలా సిద్ధిస్తుందో దయచేసి తెలుపు' అని కోరిన తరువాత దయాపరుడైన ఆ బ్రాహ్మణుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం రోజు వ్రతఫలాన్ని ఆ కుక్కకి ధారపోయగా, వెంటనే ఆ కుక్క తన కుక్క దేహాన్ని విడిచిపెట్టి దివ్యస్త్రీ శరీరంతో, ప్రకాశవంతమైన వస్త్రాలతో, పితృదేవతలతో కలిసి కైలాసానికి చేరుకుంది. కాబట్టి ఓ జనకరాజా! నిస్సంశయంగా శ్రేయస్కరమైన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పకుండా ఆచరించు అని వశిష్టుడు చెప్పడం ఆపాడు. 
                 

 ద్వితీయ అధ్యాయం సమాప్తం 
                  

రెండవ రోజు పారాయణం సమాప్తం 


ఈ క్రింది వీడియో యు.ఆర్.యల్. ల.లో వీడియోలు చూడండి




Note:
నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe,Also see my  Youtube channel bdl Telugu tech-tutorials like share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుంది,  థాంక్యూ.

1 కార్తీక పురాణం విశిష్టత , కార్తీక పురాణం మొదటి రోజు

wowitstelugu.blogspot.com

1 కార్తీక పురాణం విశిష్టత, కార్తీక పురాణం మొదటి రోజు పారాయణం


కార్తీక పురాణము - మొదటిరోజు పారాయణము 

శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన:

 

శ్లో  !!   వాగీశాద్యా సుమనస్స స్సర్వార్థానా ముపక్రమే !

           యన్నత్వా కృతకృత్యాస్సుస్తం  నమామి గజాననమ్ !!


శౌనికాధులకు సూతుడు కార్తీక పురాణము చెప్పుట …

  • శ్రీ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టిలో విశిష్టమైన శ్రీనైమిశారణ్యానికి  విచ్చేసిన సూతమహర్షిని సత్కరించి, సంతుష్టుడిని చేసి, స్థానికులైన శౌనకాది ఋషులు ఆయన వద్దకు వచ్చి 'సకల పురాణగాథ అయిన, నూతమునీ కలికల్మశ నాశానకం అయిన కైవల్య దాయకమయిన కార్తీకమాస మహత్యము విన్పించి మమ్మల్ని ధన్యులను చేయమని అడిగారు. 

  • వారి కోరికను మన్నించిన వ్యాసశిస్యుడు అయిన సూతమహర్షి 'శౌనకాదురాలా! మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షులవారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణాలలోని స్కాంద, పద్మపురాణాలు రెండింటిలోనూ తెలియజేసి ఉన్నారు. ఋషిరాజైన శ్రీ వశిష్టులవారిచే , రాజ మహర్షి ఆయన జనకుడికి స్కాంద పురాణం లోనూ, హేలా విలాసాల బాలామణి అయిన సత్యభామకు, లీలామానుష విగ్రహుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మచేత పద్మపురాణంలోనూ ఈ కార్తీక మహత్యం సవిస్తరంగా చెప్పబడింది.

  • మన అదృష్టంవలన నేటినుంచే కార్తీకమాసం ప్రారంభం కాబట్టి, ప్రతిరోజూ నిత్యపారాయనగా ఈ మాసం అంతా కార్తీక పురాణ శ్రవణం చేసుకుందాము. ముందుగా స్కాంద పురాణంలోని వశిష్ట మహర్షిచే కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను, వినండి' అని చెప్పడం మొదలుపెట్టాడు.
జనకుడు వశిష్టుని కార్తీక వ్రత ధర్మము తెలియ చేయమనుట 

పూర్వం ఒకసారి సిద్దాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమయిన ద్రవ్యాల కోసం వశిష్ట మహర్షి, జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు. జనకునిచే మర్యాదలు అందుకుని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి "మహర్షీ! మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను. కానీ, సర్వపాపహరమయిన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి. సంవత్సరంలోని సర్వ మాసాల కంటే కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనదనీ చెబుతూ ఉంటారు కదా! ఆ నెలకి అంతటి ప్రాముఖ్యత ఎలా కలిగింది? ఆ వ్రతం ఉత్కృష్ట ధర్మం ఏవిధంగా అయింది?' అని అడిగాడు. దానికి వశిష్టుడు జ్ఞానహాసం చేస్తూ ఇలా తెలిపాడు. “జనకమహారాజా! పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ సత్వశుద్ధి కలగిన నీవంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమం అయినది, విన్నంత మాత్రమే అన్ని పాపాలను అణచివేసేది అయిన కార్తీక మహత్యం వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, నీవు అడిగిన సంగతులను చెబుతాను, విను. కార్తీకమాసంలో సూర్యుడు తులాసంక్రమణంలో ఉండగా, సహృదయంతో ఆచరించే స్నానం, దానం, జప, పూజలు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో. ఈ కార్తీక వ్రతాన్ని తులసంక్రమణాదిగా కాని, శుద్ధ పాడ్యమినుంచి కానీ ప్రారంభించాలి.

శ్లో         నిర్విఘ్నం కురుమే దేవా దామోదర నమోస్తుతే 

  • 'ఓ దామోదరా! నా ఈ వ్రతం నిర్విఘ్నంగా పూర్తిచేయి' అని నమస్కార పూర్వకంగా సంకల్పించుకుని, కార్తీక స్నానం ప్రారంభించాలి. 

  • కార్తీకంలో సూర్యోదయ వేళ కావేరీనదిలో స్నానం చేసినవారి పుణ్యం చెప్పలేనిది. 

  • సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాలలో చేరుతుంది. సరస్సులు, సెలయేర్లు, చెరువులు, జలాశయాల్లో కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు. 

  • బ్రాహ్మణుడు అయినవాడు కార్తీకమాసంలో నదికి వెళ్ళి హరి ధ్యానం చేస్తూ, కాళ్ళూ, చేతులూ కడుక్కుని, ఆచమనం చేసి, శుద్దాత్ముడై, మంత్రయుక్తంగా భైరవ ఆజ్ఞను తీసుకుని మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి.

  • దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలు వదలాలి. 

  • మంత్రజపంతో, బొటన వ్రేలి కొనతో నీటిని కెలికి, మూడు దోసిళ్ళ నీళ్ళు గట్టుమీదకి చిమ్మి, తీరం చేరుకోవాలి. చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి. దీన్నే యక్ష్ముతర్పణం అంటారు. 

  • ఒళ్ళు తుడుచుకుని, పొడివీ, మడివీ తెల్లబట్టలు వేసుకుని హరిస్మరణ చేయాలి. 

  • గోపీచందనంతో 12 ఊర్థ్వ ఉండ్రాళ్ళు ధరించి, సంధ్యావందన గాయత్రీ జపం ఆచరించాలి. 

  • ఔపాసన చేసి, బ్రహ్మయజ్ఞం ఆచరించి, తన తోటలోనుంచి చక్కటి పువ్వులను తెచ్చి శంఖ-చక్రధారి అయిన విష్ణువును, సాలగ్రామంలో భక్తిగా షోడశోపచారాలతో పూజించాలి. 

  • కార్తీకపురాణం చదవటం కానీ, వినటం కానీ ఆచరించే వాడై, ఇంటికి చేరి దేవతార్చన, దీపార్చన చేసి, భోజనం చేసి,  ఆచమనం చేసి తిరిగి పురాణ కాలక్షేపం చేయాలి. 

  • సాయంకాలం అవగానే ఇతర పనులు అన్నీ ముగించుకుని, విష్ణు ఆలయంలో కానీ, శివాలయంలో కానీ యథాశక్తి దీపాలను పెట్టి, అక్కడి స్వామిని ఆరాధించి, భక్షభోజ్యాదులు నివేదించిన తరువాత శుద్ధమైన మాటలతో వారిని స్తుతించి నమస్కారం చేయాలి. 

  • ఈ కార్తీకమాసం అంతా ఈ విధంగా వ్రతాన్ని చేసినవారు పునర్జన్మ లేకుండా వైకుంఠంలో స్థిరనివాసం పొందుతారు. 

  • ప్రస్తుత, పూర్వ జన్మలలో చేసిన పాపాలు అన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించిపోతాయి. వర్ణం, లింగభేదం, వయస్సుతో సంబంధం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించినవారు ఎవరైనా మోక్షం పొందటానికి అర్హులు అవుతారు అనడంలో ఎటువంటి సంకోచం లేదు. 

  • జనకరాజా! తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేక పోయినా ఇతరులు చేస్తుండగా చూసి, అసూయలేకుండా ఆనందించేవాడికి అ రోజున చేసిన పాపాలు అన్నీ విష్ణుకృప అగ్నిలో ఆహుతి అయిపోతాయి. 

మొదటి అధ్యాయం సమాప్తం

ఈ క్రింది  వీడియో యు.ఆర్. యల్. లో మొదటి అధ్యాయం చూడండి...



Note: 

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share, and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share, and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe, Also see my  Youtube channel bdl Telugu tech-tutorials like share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుందథాంక్యూ.