శ్రామిక నేత చరిత్రకెక్కిన మహా మనిషి, ఆదర్శ జీవి, పుచ్చలపల్లి సుందరయ్య గారి జీవితం లో మరిచిపోలేని విశిష్ట ఘట్టాలు
ప్రపంచ చరిత్రలో చెరిగిపోని స్థానం సంపాదించుకున్న అతికొద్దిమంది మహా పురుషుల్లో పుచ్చలపల్లి సుందరయ్య,మహా మనిషి, మానవత్వానికే మచ్చుతునక ఆదర్శ జీవి.
పుచ్చలపల్లి సుందరయ్య గారి వివరములు:
• జననం : పుచ్చలపల్లి సుందరయ్య, 1913 మే 1,అలగానిపాడు, నెల్లూరు జిల్లా (ఆంధ్రప్రదేశ్)
• మరణం: 1985 మే 19 (సహజ మరణం),
• మరణం: 1985 మే 19 (సహజ మరణం),
• వృత్తి: రాజకీయ నాయకుడు
• నివాస ప్రాంతం: నెల్లూరు
• ప్రసిద్ద కామ్రేడ్: పి.యస్.
• రాజకీయ పార్టీ: సి.పి.(ఎం)
• రాజకీయ పార్టీ: సి.పి.(ఎం)
- నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అలగానిపాడు గ్రామంలో ఒక భూస్వామ్య కుటుంబంలో 1913 మే 1 న జన్మించాడు అందరిలాగే పుట్టారు. సంపన్న కుటుంబంలో పెరిగారు. కాని శ్రామికనేతగా ఎదిగారు. భూస్వామ్య బంధనాలను తాను తెంచుకోవడమే గాక, సమాజాభివృద్ధికి ఆటంకంగా మారిన ఫ్యూడల్ వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించివేయడానికి నడుంకట్టారు.
- భూస్వామ్య వ్యవస్థను సమూలంగా నిర్మూలించడానికి మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఆయుధంగా మలచుకోవడమేగాక దాన్ని ఆచరణలోపెట్టి లక్షలసంఖ్యలో సామాన్య ప్రజానీకాన్ని కదనరంగంలోకి దించిన మహానేత. దేశంలో బలమైన వామపక్ష శక్తిగా సిపియం ను ఆయన తీర్చిదిద్దారు. సిద్ధాంతాన్ని ఆచరణతో మేళవించిన పోరాటయోధుడు.
- తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు . కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన ఆయన తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడు.
సుందరయ్య చట్ట సభలలో ప్రాతినిధ్యం :
- 1952 లో సుందరయ్య మద్రాసు నియోజక వర్గం నుండి పార్లమెంటు రాజ్యసభకు ఎన్నికయ్యాడు. పార్లమెంటులో కమ్యూనిస్టు వర్గానికి నాయకుడయ్యాడు.
- తరువాత రాష్ట్ర శాసనసభకు ఎన్నికై, 1967 వరకు శాసన సభా సభ్యునిగా కొనసాగాడు. మళ్ళీ కొంత కాలం విరామం తరువాత 1978 లో శాసన సభకు ఎన్నికై, 1983 వరకు శాసన సభ సభ్యునిగా ఉన్నాడు.
- తను మరణించే సమయానికి సుందరయ్య ఆంధ్ర ప్రదేశ్లో పార్టీ సాధారణ కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడు. అతని భార్య లీల సుందరయ్య కూడా సి.పి.ఐ.-ఎమ్ పార్టీలో ఒక ముఖ్య నాయకురాలు.
- ఆయన పార్లమెంటు సభ్యులుగా ఉన్నంత కాలం మన దేశ పార్లమెంటు లో సైకిల్ స్టాండు ఉండేది. పార్లమెంటు సమావేశాలకు ఆయన సైకిల్ మీదే వెళ్ళేవారు.
- ఆయనతో పాటే ఆ స్టాండు కు కాలం చెల్లింది. రాష్ట్ర విధానసభలోనూ అదే సైకిల్. ఆయన నిరాడంబర జీవితానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు.
- పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కలిగితే తన ప్రజాసేవకు ఆ బంధాలు, బాంధవ్యాలు అడ్డుతగులుతాయని పెళ్లికాగానే కుటుంబనియంత్రణ శస్త్రచికిత్స చేయించుకొన్నారు.
- తండ్రినుంచి లభించిన ఆస్తిని నిరుపేద ప్రజలకు పంచివేశారు.
- తాను ఎక్కడికి వెళ్ళినా, తన సామాను తానే మోసుకొనేవాడు. తన బట్టలు తానే ఉతుక్కునేవాడు.
- పీ .యస్ .1985 మే19న మద్రాసులోని అపోలో ఆస్పత్రిలో కన్నుమూశారు.
- హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో ఆయన పేరుతో గ్రంథాలయం, ఆడిటోరియం, పార్కు ఏర్పాటయ్యాయి.
- గాంధీజీ నిరాడంబరత, ప్రకాశం వంటి ప్రజా సాన్నిహిత్యం, పటేలు వంటి పట్టుదల, నెహ్రూ వంటి రాజకీయ పరిణతి సుందరయ్యలో ఉన్నాయని పాతతరం నాయకులు వర్ణిస్తారు.
సుందరయ్య సమాజిక పోరాట పటిమ నిడారంబరత :
- కులవ్యవస్థను నిరసించిన ఆయన తన అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి లోని రెడ్డి అనే కుల సూచికను తొలగించుకున్నాడు. "కామ్రేడ్ పి.ఎస్." అని ఈయనను పిలిచేవారు. మన దేశంలో పేదలు వర్గరీత్యానే గాక సామాజికంగా అణచివేయబడుతున్నారు. ''వ్యవసాయకార్మికులు, పేదరైతుల మీద జరుగుతున్న దాడులు, సాంఘిక ఇబ్బందులు, అంటరానితనం, కుల, మత ఛాందసత్వాలకు వ్యతిరేకంగా ఈ సంఘాలు, ప్రజాతంత్ర వాదులంతా పోరాడాలి'' అని ఆనాడే సుందరయ్య గారూ పిలుపునిచ్చారు.
- పుచ్చల పల్లి సుందరయ్య నెల్లూరు జిల్లాలోని ఓ కుగ్రామంలో భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చాడు. ఆ ఊళ్లో ఆరోగ్య సదుపాయాలు లేవట. ప్రత్యేకించి ప్రసూతి సౌకర్యాలు లేక మహిళలు ప్రసవ వేదనతో కన్నుమూసేవారట.
- ఈ పరిస్థితి గమనించి చలించిపోయిన పుచ్చలపల్లి సుందరయ్య స్వయంగా మంత్ర సానితనం నేర్చుకున్నాడట. సుందరయ్య స్వయంగా ఎందరో మహిళలకు మంత్రిసానితనం చేశాడట. చివరకు సుందరయ్య హస్తవాసి మంచిది. ఆయన చేత్తో పురుడు పోసుకుంటే తల్లీబిడ్డా క్షేమంగా ఉంటారన్న పేరు తెచ్చుకున్నారట.
- స్వయంగా భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చినా సుందరయ్య ఆలోచనంతా నిత్యం పేదలు, బడుగు బలహీన వర్గాల గురించే.
ఈ మహామనిషి కి కొన్ని ఉదాహరణలు...
- ఓసారి పుచ్చలపల్లి సుందరయ్యగారింట్లో పెళ్లి జరుగుతోందట. అట్టహాసంగా విందుభోజనం సిద్ధం చేశారట. సుందరయ్య గ్రామంలోని దళితులను కూడా భోజనానికి పిలవాలని కోరారట. ఇంట్లోవారు అందుకు ఒప్పుకోలేదట. దాంతో ఆగ్రహించిన సుందరయ్య దళితులు తినని ఆహారం ఇంకెవరూ తినాల్సిన అవసరం లేదంటూ ఆ మొత్తం భోజనంలో విషం కలిపేశారట.
- గ్రామ పెద్దలను ఎదిరించి దళితులు ఆ గ్రామ బావి నుంచి నీళ్లు తీసుకునే సౌకర్యం సుందరయ్యే కల్పించారట. కిరాణా దుకాణాల్లో దళితుల పట్ల చూపే అంటరానితనం సహించలకే తానే స్వయంగా దళితవాడల్లో కిరాణా దుకాణం నిర్వహించారట. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉదాహరణలో నిజంగా జనం కోసం తపించిన ఇలాంటి నాయకులు ఉంటారా అనిపిస్తుంది. ఇలాంటి మహానుభావులు మళ్లీ పుడతారా అని అనిపిస్తుంది,
- సుందరయ్యగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. సుందరయ్య బతికున్నంతకాలం సామాజికన్యాయం కోసం , పేద ప్రజల కోసమే పోరాడారు. పాలకుల విధానాలపై తిరుగుబాటు చేశారు. సోషలిజమనే నూతన సమాజం కోసం అహరహం శ్రమించారు.
- గాంధీజీ నాయకత్వం పట్ల ఆకర్షితుడై, సుందరయ్య 1930లో తన 17వ యేట హైస్కూలు రోజుల్లోనే స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలలోను, ఉప్పు సత్యాగ్రహం లోను, సహాయ నిరాకరణోద్యమం లోను పాల్గొని కారాగార శిక్ష అనుభవించాడు. అతనిని నిజామాబాద్, బోర్స్టల్ స్కూలు లో ఉంచారు. ఆ సమయంలో అతనికి కమ్యూనిస్టులతో పరిచయం ఏర్పడింది. విడుదల అయినాక తన స్వగ్రామంలో వ్యవసాయ కార్మికులను సంఘటితం చేయడానికి కృషి చేశాడు.
- అమీర్ హైదర్ ఖాన్ స్ఫూర్తితో సుందరయ్య భారతీయ కమ్యూనిస్టు పార్టీ లో చేరాడు. అప్పటికి ఆ పార్టీ నిషేధంలో ఉంది. 1930 దశకంలో దినకర్ మెహతా, సజ్జద్ జహీర్, ఇ.ఎమ్.ఎస్. నంబూద్రిపాద్, సోలీ బాట్లివాలా వంటి ప్రముఖ కమ్యూనిస్టు నేతలు కాంగ్రేస్ సోషలిస్టు పార్టీ జాతీయ కార్య నిర్వాహక వర్గం సభ్యులుగా ఉండేవారు. సుందరయ్య కూడా వీరితో చేరి, క్రమంగా కాంగ్రేస్ సోషలిస్టు పార్టీ కార్యదర్శి అయ్యాడు.
ఈయన ఒక మహామనిషి, ఈయన లాంటి త్యాగజీవులెందరు వున్నారు. ఈ కాలం లో సలాం సుందరయ్య, శ్రమజీవులు నిన్నెపుడూ మరువరయ్యా మహానుభావా!.
మరిన్ని విషయాలు కోసం కామ్రేడ్ పి.యస్.వికీపీడియా చూడండి .
Sear
Documentary on Puchalapalli Sundaraiah - YouTube
https://www.youtube.com/watch?v=tcoBzciEifQ
పుచ్చలపల్లి సుందరయ్య జీవిత చరిత్ర || Biography of ...
https://www.youtube.com/watch?v=dkvJxq7WGIY
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి