3, డిసెంబర్ 2020, గురువారం

ప్రాచీన ఆలయం శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం పంచదార్ల శివాలయం విశిష్టత

wowitstelugu.blogspot.com
ప్రాచీన ఆలయం శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం పంచదార్ల శివాలయం విశిష్టత

శ్రీ ఉమా ధర్మలింగేశ్వరస్వామి ఆలయం

  • ఆంధ్ర ప్రదేశ్ విశాఖ జిల్లా ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలకు నెలవైన జిల్లా ఈ జిల్లా లో పంచదార్ల గ్రామానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.

  • 12 కిలోమీటర్ల విస్తీర్ణం గల ఇక్కడి కొండ ప్రాంతంలో కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయంభు శివలింగంతో పాటూ ఎల్లవేళలా భూగర్భం నుంచి వచ్చే ఐదు ధారలు భక్తులకు, సందర్శకులకు కనువిందు చేస్తాయి.

  • తియ్యని రుచి కలిగిన ఈ నీటిని సేవిస్తే అనారోగ్య సమస్యలు దరిచేరవనే నమ్మకం ఇక్కడి ప్రజల్లో బలంగా ఉంది.

  • మంచినీటి కోసం వాటర్ ప్లాంట్ లను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడిన ప్రస్తుత రోజుల్లో ఈ ప్రాంత ప్రజలు తాగునీటి అవసరాల కోసం కేవలం ఈ నీటిని మాత్రమే వినియోగించడం విశేషంగా చెప్పుకో వచ్చు.

పంచదార్ల శివాలయం విశిష్టత


👉పంచదార్ల (దీని అసలు పేరు ధారపాలెం) , ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో స్థలాలను చూసే సైట్లలో ఇది ఒకటి .


👉అనకాపల్లి నుండి 26 కిలోమీటర్ల దూరంలో ఉంది. శాశ్వత సహజ వసంతం నుండి ఐదు మూలాల నుండి ప్రవహించే ఐదు ప్రాంతాల నీటి నుండి పంచదార్ల కు ఈ పేరు వచ్చింది.


👉ఒక లింగం ఉంది, దీనిలో ఇతర లింగాలను 85 వరుసల 12 వరుసలలో చెక్కారు మరియు దీనిని 'కోటిలింగం' (కోటి లింగాలు) అని కూడా పిలుస్తారు.


👉ఆలయంలోని మండపం స్తంభాలపై 15 వ శతాబ్దం (తూర్పు చాళుక్యులు) నాటి వివిధ శాసనాలు ఉన్నాయి.


ఆర్టీసీ రోడ్ మార్గము 

  • రోడ్ రవాణా కార్పొరేషన్ (ఆర్టీసీ) ప్రతి రోజు వడ్రపల్లి గ్రామానికి గాజువాక నుండి ఒక బస్సు నిర్వహిస్తోంది.

  • బస్సు ఉదయం 2, సాయంత్రం 2 సార్లు ట్రిప్పులు చేస్తుంది. గ్రామం నుండి, నగర జిల్లా ఒక కిలోమీటర్ కంటే తక్కువ దూరంలో ఉంది.

    అనకాపల్లి నుండి పంచదార్లకు నుండి 26 కి. అనకాపల్లి నుండి పంచదార్లకు రోడ్ కనెక్టివిటీ ఉంది .

  • ఎదురుగా కొండకర్ల గ్రామానికి ప్రత్యక్ష బస్సులు లేవు. అయితే, అనకాపల్లి నుండి చూచు చుకొండ వరకు 16 బస్సులు నడుస్తున్నాయి.

  • అనకాపల్లి నుండి 10 కిలోమీటర్ల దూరంలో మరియు కొండకర్ల గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పంచదార్ల గ్రామము.

  • చూచు కొండ నుండి ఆటో రిక్షాలద్వారా ఈ దేవాలయానికి వెళ్ళవచ్చు.

  • యాత్రికులు ఎవరైనా అనకాపల్లి నుండి పంచదర్ల వరకు రహదారి ద్వారా చేరుకోవచ్చు.

పంచదార్లకి సమీప పట్టణం అనకాపల్లి రైలు ద్వారా

  • ఎలమంచిలి, నరసింగపల్లి రైల్వే స్టేషన్ పంచదార్లకు సమీప రైల్వే స్టేషన్లు. అనకాపల్లి తాడి రైల్వే స్టేషన్లు అనకాపల్లి కు సమీపంలో ఉన్నరైల్వే స్టేషన్లు.


శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం పంచదార్ల, ధారపాలెం వైజాగ్


👉 ఈ గ్రామంలో మనం అద్భుతమైన శివాలయాన్ని చూడవచ్చు. దీనిని 11 నుండి 13 శతాబ్దాల వరకు తూర్పు చాళుక్యులు నిర్మించారు.


👉 5 ప్రదేశాల నుండి నీరు వస్తోంది, అది ఎక్కడి నుండి వస్తున్నదో తెలియదు. ఈ నీరు చివరికి ఆలయానికి సమీపంలో ఉన్న ట్యాంకుకు చేరుకుంది.


👉 ఉమా ధర్మ లింగేశ్వర స్వామి ఆలయం, రాధ మాధవ స్వామి ఆలయం గ్రామంలో ప్రసిద్ధి చెందాయి.


👉 ఇక్కడ ద్విముఖ గణపతి ఆలయం మెట్ల దార్లో ఈ మధ్యనే కట్టారు. ప్రతి సంకటహర చతుర్థి నాడు హోమాలు ఉచిత భోజనాలు నిర్వహిస్తారు.


👉ఈ ద్విముఖ గణపతి ఆలయం లో 11 సార్లు ప్రదక్షిణ చేస్తే పెళ్లి కానీ వారికీ పెళ్లి అవుతుందని నమ్మకం. అలాగే పిల్లలు పుట్టని వారికి పిల్లలు పుడతారని ప్రతీతి.


👉 అలాగే మెట్ల క్రింది భాగం లో సాయిబాబా ఆలయం కూడా ఉంది.


👉 విజయనగర (బొబ్బిలి) రాజుల కాలంలో పంచదార్ల స్థలం పన్ను వసూలు చేసే ప్రదేశంగా ఉండేది.


👉 తొమ్మిదవ శతాబ్దంలో తూర్పు చాళుక్య చోళులు నిర్మించిన ఈ పంచదార్ల ఆలయం పూర్తిగా నిర్లక్ష్య స్థితిలో ఉంది.


👉  ఆలయ ప్రాంగణానికి సమీపంలో ఉన్న స్నానఘట్టం లో వందలాది సబ్బులు మరియు షాంపూ సాచెట్లు తేలుతూ కనిపిస్తాయి.


👉ఇది శాశ్వత నీటి వనరు ద్వారా ఇవ్వబడుతుంది.


👉కానీ ఈ వారసత్వ నిర్మాణాన్ని సరిగ్గా నిర్వహించడానికి లేదా సంరక్షించడానికి పురావస్తు విభాగం లేదా పర్యాటక శాఖ లేదా ఎండోమెంటు విభాగం ఎటువంటి సరైన బాధ్యత తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు.


ఆలయ ముఖ్యాంశాలు:

  • భక్తులకు ప్రవేశం ఉచితం కాబట్టి ఈ ఆలయం ఆదాయాన్ని కోల్పోతుంది. కేవలం కార్తీక సోమవారాలు, శివరాత్రి నాడు మాత్రమే దర్శనం టిక్కెట్లు ఉంటాయి.

  • దానికి కూడా సరిఅయిన పర్యవేక్షణ లేదు. ఇచ్చిన టికెట్లే తీసుకొని మళ్ళా మళ్ళా అమ్ముతుంటారు.

  • విజయనగరానికి చెందిన రాజులు దానం చేసిన వ్యవసాయ భూముల ద్వారా వచ్చే ఆదాయం నుండి ఈ ఆలయం నిర్వహించబడుతుంది

  • సుందరమైన పరిసరాలతో, ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఎండోమెంట్ మరియు పర్యాటక శాఖ చొరవ తీసుకుంటే పర్యాటకులకు ఆనందం కలుగుతుంది.

ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. ల లో పంచదార్ల గురించి తెలుసుకోండి

Panchadarla Special Story || AP Tourism ... - YouTube


ఈ రోజు సూక్తి 

"Happiness is letting go of what you think your life is supposed to look like and enjoying it for everything that it is."
-Mandy Hale
Note:

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share, and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండి
అలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share, and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe,   కామెంట్   చేయడం మర్చిపోకండి.

ప్రాచీన ఆలయం శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం వీడియో 

2, డిసెంబర్ 2020, బుధవారం

30 కార్తీక పురాణము విశిష్టత - ముప్పైవ రోజు పారాయణ

wowitstelugu.blogspot.com

30 కార్తీక పురాణము విశిష్టత  - ముప్పైవ రోజు పారాయణ



ఇరవై తొమ్మిదవ అధ్యాయం

సూతుడు చెప్పిన విషయాలను విన్న ఋషులు 

'ఓ మునిరాజా! రావిచెట్టు ఎందువలన అంటరానిది అయ్యింది. ఆయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది? అని ప్రశ్నించగా, సూతమహర్షి సమాధాన పరచసాగాడు ...


రావిచెట్టు - దరిద్రదేవత


🌞పూర్వం క్షీరసాగర మథనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మినీ, కౌస్తుభాన్నీ శ్రీహరికి సమర్పించి, తక్కిన సంపద అంతా దేవతలు తీసుకున్నారు. 

🌞 శ్రీహరి, శ్రీదేవిని పెండ్లిచేసుకోదలిచాడు. కాని, శ్రీదేవి 'ఓ నారాయణా! నాకన్నా పెద్దది నా అక్కయ్య ఉన్నది. 

🌞ఆ జ్యేష్టకు పెండ్లి గాకుండా కనిష్టనయినా నేను కళ్యాణమాడటం పాడిగాదు గనుక ముందామె మనువుకి సంకల్పించ'మని
కోరింది. 

🌞ధర్మబద్ధమైన 'రమ' మాటలను అంగీకరించి, విష్ణువు ఉద్దాలకుడు అనే మునికి జ్యేష్టాదేవిని సమర్పించాడు.

🌞స్థూలవదన, శుభ్రరదన, అరుణనేత్రి, కఠినగాత్రి, బిరుసుశిరోజాలూ గలిగిన జ్యేష్టాదేవిని, ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు.
                  

దరిద్రదేవతకు ఇష్టమైన స్థలములు


👉నిరంతర హోమధూప సుగంధాలతోనూ, వేదనాదాలతోనూ నిండిన ఆ ఆశ్రమాన్ని చూసి, పెద్దమ్మ దుఃఖిస్తూ 'ఓ ఉద్దాలకా! నాకీ చోటు సరిపడదు. 

👉వేదాలు ధ్వనించేదీ, అతిథి పూజా సత్కారాలు జరిగేవీ, యజ్ఞయాగాదులు నిర్వహించబడేవీ అయిన స్థలాలలో నేను నివసించను. 

👉అన్యోనానురాగంగల భార్యాభర్తలు ఉన్నచోటగాని, పితృదేవతలు పూజింపబడే చోటగాని, ఉద్యోగస్థుడు, నీతివేత్త, ధర్మిష్టుడు, ప్రేమగా మాట్లాడేవాడు, గురుపూజా దురంధరుడూ ఉండే స్థలాలలోగాని నేను ఉండను.

👉ఏ ఇంట్లో అయితే రాత్రింబవళ్ళు ఆలుమగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో, ఏ యింట్లో అతిథులు నిరాశతో ఉసూరుమంటారో ఎక్కడయితే వృద్ధులకు, మిత్రులకు, సజ్జనులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో! నేను అక్కడ ఉండటానికే ఇష్టపడతాను' 

👉ఎక్కడయితే దురాచారాలూ, పరద్రవ్య, పరభార్యాపహరణశీలురైన వారు ఉంటారో అలాంటి చోటులో అయితేనే నేను ఉంటాను. కళ్ళు త్రాగేవాళ్ళు, గోహత్యాలు చేసేవాళ్ళు, బ్రహ్మహత్యాది పాతక పురుషులూ ఎక్కడ ఉంటారో నేను అక్కడ ఉండటానికే ఇష్టపడతాను' అంది.


రావి మొదట్లో - జ్యేష్టానివాసం
  • ఆమె మాటలకు వేదవిదుడైన ఉద్దాలకుడు కించిత్తు నొచ్చుకున్నవాడై 'ఓ జ్యేష్టా! నీవు కోరినట్లుగా నీకు తగిన నివాసస్థానాన్ని అన్వేషించి వస్తాను. అంతవరకూ నువ్వు ఈ రావిచెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చో'మని చెప్పి బయలుదేరి వెళ్ళాడు.
  • భర్త ఆజ్ఞ ప్రకారం జ్యేష్టాదేవి రావిచెట్టు మొదలులో అలాగే వుండిపోయింది. ఎన్నాళ్ళకీ ఉద్దాలకుడు రాకపోవడంతో పతివిరహాన్ని భరించలేని పెద్దమ్మ, పెద్దపెట్టున దుఃఖించసాగింది. 

  • ఆమె రోదనలు వైకుంఠంలో వున్న లక్ష్మీనారాయణుల చెవులలో పడ్డాయి. వెంటనే లక్ష్మి తన అక్కగారిని ఊరడించవలసిందిగా విష్ణువును కోరింది. 
  • విష్ణు కమలాసమేతుడై జ్యేష్టాదేవి ఎదుట ప్రత్యక్షమయి,ఆమెని ఊరడించుతూ 'ఓ జ్యేష్టాదేవీ! ఈ రావిచెట్టు నా అంశతో కూడి వుంటుంది. కనుక, నువ్వు దీని మూలంలోనే స్థిరనివాసం ఏర్పరచుకుని వుండిపో.

  • ప్రతియేటా నిన్ను పూజించే గృహస్థులయందు లక్ష్మి నివసిస్తూ వుంటుంది' అని చెప్పాడు. ఆ నియమాలలోనే ప్రతి శనివారం రావిచెట్టు పూజనీయగానూ, అక్కడ జ్యేష్టాదేవిని షోడశోపచార విధిని అర్చించే స్త్రీలపట్ల శ్రీదేవి అమిత కరుణాకలితయై అనుగ్రహించేట్లుగానూ ఏర్పరచాడు శ్రీహరి.

👉 ఓ ఋషులారా! సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా, నారదుని చేత పృథుచక్రవర్తికి చెప్పబడిన విధానంగా, నేను మీకీ పద్మపురాణాంతర్గత కార్తీక పురాణాన్ని వివరించాను. 

👉ఎవరయితే ఈ కార్తీక మహత్యాన్ని చదువుతున్నారో, వింటున్నారో, వినిపిస్తున్నారో సమస్త పాపాలనుండీ విడివడి విష్ణు సాయుజ్యాన్ని పొందుతున్నారు. 

👉 అని సూతుడు చెప్పగా విని సంతోషించిన ఋషులు - అక్కడినుండి బదరీవన దర్శన కాంక్షులై పయనమయ్యారు.


ఇరవై తొమ్మిది ముప్పై అధ్యాయాలు సమాప్తం

ముప్పైవ రోజు పారాయణ సమాప్తం


కార్తీక మాసపురాణ పారాయణసంపూర్ణం 

ఈ క్రింది యు. ఆర్. యల్. ల లో ముప్పైవ రోజు పారాయణ చూడండి 

Note:

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share, and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండి
అలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share, and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe,   కామెంట్   చేయడం మర్చిపోకండి.

ఈ రోజు సూక్తి 
"Learn from the past, set vivid, detailed goals for the future, and live in the only moment of time over which you have any control: now."
-Denis Waitley

29 కార్తీక పురాణము విశిష్టత - ఇరవై తొమ్మిదవ రోజు పారాయణ

wowitstelugu.blogspot.com

29 కార్తీక పురాణము విశిష్టత - ఇరవై తొమ్మిదవ రోజు పారాయణ


ఇరవై ఏడవ అధ్యాయం

నారదుడి హితవుపై రవ్వంత చింతించిన యముడు, ఆ ధనేశ్వరునకు ప్రేతపతి అనే తన దూతను తోడిచ్చి, నరకాన్ని తరింపచేయవలసినదిగా ఆదేశించాడు. ఆ దూత, ధనేశ్వరుడిని తనతో తీసుకొనివెడుతూ మార్గమధ్యంలో నరక భేదాలను చూపిస్తూ, వాటి గురించి ఇలా వినిపించసాగాడు ...

తపవాలుకము

'ఓ ధనేశ్వరా! మరణించిన వెంటనే, పాపకర్మలు ఇక్కడే కాల్చబడిన శరీరములు కలవారై - దిక్కులు వ్రకల్లయ్యేలా రోదిస్తూ వుంటారు. దీనినే 'తప్తవాలుక నరకము' అంటారు. వైశ్యదేవవరులైన అతిథులను పూజించనివారూ, గురువులను, అగ్నిని, బ్రాహ్మణులను, గోవును, వేదవిధులను, యజమానిని కాళ్ళతో తన్నినవారి పాదాలను మా యమదూతలు ఎలా కాల్చుతున్నారో చూడు!

 క్రకచము

అనే పేరుగల ఈ నరకం మూడవది. ఇక్కడ పాపాత్ములను అడ్డముగానూ, నిలువుగానూ, ఏటవాలుగానూ, సమూలముగానూ, అంగాంగములుగానూ రంపములతో కోస్తూ ఉంటారు.

అసిపత్రవనం

నాలుగవ నరకధోరణి అయిన దీనినే అసిపత్రవనం అంటారు. భార్యా-భర్తలను, తల్లి-దండ్రుల నుండి సంతానమును ఎడబాపులు చేసే పాపులు అంతా ఈ నరకానికి చేరి, నిలువెల్లా బాణాలతో గ్రుచ్చబడి అసిపత్రాలచే శరీరాలు చించబడి, ధారలుగా కారే నెత్తుటి వాసనకు వెంటపడి తరిమే తోడేళ్ళ గుంపులకు భయపడి పారిపోవాలని పరుగులుతీసి, పారిపోయే దిక్కులేక పరితపిస్తూ వుంటారు. చంపుట, భేదించుట మొదలైన విధులతో ఈ నరకం ఆరు రకాలుగా వుంటుంది. 

కూటశాల్మలి

పదహారు రకాలుగా దండించేదీ, పరస్త్రీలనూ, ద్రవ్యాన్నీ హరించేవాళ్ళూ, పరాపకారులూ అయిన పాపులు వుండేది 'కూటశాల్మలీ' నరకం.

రక్తపూయం

'రక్తపూయ'మనే ఈ విభాగం ఆరవ నరకం. ఇక్కడ పాపాత్ములు తలక్రిందులుగా వ్రేలాడుతూ యమకింకరులచేత దండించబడుతూ వుంటారు. ఎవరైతే తమ కులాచార రీత్యా తినకూడని వస్తువులు తింటారో, పేర్లను నిందిస్తారో, చాడీలు చెబుతుంటారో వారు అంతా ఈ నరకంలోనే వుంటారు.

కుంభీపాకం

మొట్టమొదట నీకు విధించబడినదీ, ఘోరాతి ఘోరమైన నరకాలన్నిటిలోకీ నికృష్టమైనదీ అయిన ఈ 'కుంభీపాక'మే ఏడవ నరకం. దుష్టద్రవ్యములు, దుర్భారాగ్నికీలలు, దుస్సహదుర్గంధాలతో కూడి వుంటుంది.

రౌరవం

నరకాలలో ఎనిమిదవదైన ఈ 'రౌరవం' దీర్ఘకాలికమని తెలుసుకో. ఇందులో పడినవారు కొన్ని వేల సంవత్సరములదాకా బైట పడలేరు.

ధనేశ్వరా! మన ప్రమేయం లేకుండా మనకంటినపాపాన్ని శుష్కమనీ, మనకు మనమై చేసుకున్న పాపాన్ని ఆర్ధ్రమనీ అంటారు. ఆ రెండు రకాల పాపాలూ కలిపి ఏడు విధాలుగా వున్నాయి.

(1) అపకీర్ణం

(2) పాంక్తేయం

(3) మలినీకరణం

(4) జాతిభ్రంశం

(5) ఉపవీతకం

(6) అతిపాతకం

(7) మహాపాతకం.

ఈ పరిదృశ్యమానులైన నరులచేత ఉపరి ఏడు రకాల నరకాలూ వరుసగా అనుభవింపబడుతూ వున్నాయి. కాని, నువ్వు కార్తీక వ్రతస్థులైన సజ్జనుల సాంగత్యం ద్వారా పొందిన అమితపుణ్యం కలిగినవాడివి కావడం వలన ఈ నరకాలను కేవల దర్శనమాత్రంగా తరించగలిగావు.

పై విధంగా చెబుతూ యమదూత అయిన ప్రేతాధిపతి, అతనిని యక్షలోకానికి చేర్చాడు. అక్కడ తను యక్షరూపుడై, కుబేరుడికి ఆప్తుడై, ధనయక్షుడు అనే పేరును పొందాడు. విశ్వామిత్రుడు ఆ మధ్యలో ఏర్పరచిన 'ధనయక్షుతీర్థం' ఇతని పేరుమీదనే సుమా! అందువలన, సత్యభామా! పాపహారిణీ, శోకనాశినీ అయిన ఈ కార్తీక వ్రత ప్రభావంవల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరు అనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు. అని సత్యభామకు చెప్పినవాడై, శ్రీకృష్ణుడు సాయం సంధ్యానుష్టార్థమై స్వీయగృహానికి వెళ్ళాడని సూతుడు ఋషులకు ప్రవచించాడు.


ఇరవై ఏడవ అధ్యాయం సమాప్తం


ఇరవై ఎనిమిదవ అధ్యాయం


సూత ఉవాచ: 

🌞ఈ కార్తీకమాసము పాపనాశని విష్ణువుకు ప్రియకరి, వ్రతస్థులకు భుక్తి, ముక్తిదాయినీ అయి వుంది. 

🌞కల్పోక్త విధిగా ముందుగా విష్ణు జాగరణము, ప్రాతఃస్నానము, తులసి సేవ ఉద్యాపనం, దీపదానం అనే ఈ అయిదింటినీ కూడా కార్తీక మాసంలో ఆచరించినవారు ఇహానుభుక్తిని, పరానముక్తినీ పొందుతున్నారు. 

🌞పాపాలు పోవాలన్నా, దుఖాలు తీరాలన్నా, కష్టాలు కడతేరాలన్నా కార్తీకవ్రతాన్ని మించినది మరొకటి లేదు. ధర్మార్థ కామమోక్షాలు నాలుగింటికోసమూ కూడా ఈ కార్తీకవ్రతం ఆచరించవలసి వుంది.

🌞కష్టుడయినా, దుర్గారణ్యగతుడు అయినా, రోగి అయినా సరే విడువకుండా ఈ వ్రతాన్ని పాటించాలి. ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతమును మానకుండా శివాలయంలోనో, విష్ణువు ఆలయంలోనో హరిజాగారాన్ని ఆచరించాలి. 

🌞శివవిష్ణు దేవాలయాలు చేరువలో లేనప్పుడు రావిచెట్టువద్దగానీ, తులసీవనంలోగాని వ్రతం చేసుకొనవచ్చును. 

🌞విష్ణు సన్నిధానంలో విష్ణు కీర్తనలు ఆలపించే వాళ్ళు సహస్ర గోదాన ఫలాన్నీ, వాద్యాలను వాయించేవాళ్ళు అశ్వమేథఫలాన్నీ, నర్తకులు సర్వతీర్థాల స్నానఫలాన్నీ పొందుతారు. 

🌞ఆపదలలో ఉన్నవాడు, రోగీ, మంచినీరు దొరకనివాడు, వీళ్ళు కేశవ నామములతో లాంచన మార్జన ఆచరించితే చాలు, వ్రతోద్యాపనకు శక్తిలేనివాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది.


శ్లో ||    ''అవ్యక్తరూపిణో విష్ణో స్వరూపో బ్రాహ్మణోభువీ'' 

  • శీమహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు, కావున ఈ కార్తీకమందు బ్రాహ్మణుని సంతోషపరచడం చాలా ప్రధానం. 

  • అందుకు కూడా శక్తిలేనివాళ్ళు గో పూజ చేసినా చాలును, ఆ పాటి శక్తయినా లేనివాళ్ళు రావి-మఱ్ఱి వృక్షాలను పూజించినంత మాత్రం చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందగలుగుతారు. 

  • దీపదానం చేసే స్తోమత లేనివారు, దీపారాధన అయినా తాహతు లేనివారు ఇతరులచే వేలిగించబడిన దీపాన్ని ప్రజ్వలింపచేసి, గాలి మొదలైన వాటివలన అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యం పొందుతారు. పూజకు తులసి అందుబాటులో లేని వారు తులసి బదులు విష్ణుభక్తుడైన బ్రాహ్మణున్ని పూజించాలి.


 రావి - మఱ్ఱి

👉 సూతుడు చెప్పినది విని ఇతర వృక్షములన్నిటి కంటే కూడా రావి, మఱ్ఱి వృక్షాలు మాత్రమే గో, బ్రాహ్మణతుల్య పావిత్ర్యత నెలా పొందాయి అని అడిగాడు సూతుడు.

👉 పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు మహా సురతభాగంలో వుండగా కార్యాంతరం వలన దేవతలు, అగ్నీ కలిసి బ్రాహ్మణ వేషదారులై వెళ్ళి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు. 

👉అందుకు కినిసిన పార్వతీదేవి 'సృష్టిలోని క్రిమికీటకాదులు సహితము సురతములోనే సుఖపడుతూ ఉన్నాయి. 

👉 అటువంటిది మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు. నాకు సురత సుఖభ్రంశాన్ని పాటించిన మీరు చెట్లయి పడివుండండి' అని శపించింది. 

👉 దాని కారణంగా దేవతలంతా వృక్షాలుగా పరిణమించవలసివచ్చింది. 

👉ఆ పరిణామంలో బ్రహ్మ పాలాశవృక్షంగానూ, విష్ణువు అశ్వత్థంగానూ, శివుడు వటముగానూ మారారు. 

👉 బ్రహ్మకు పూజార్హత లేదు. జగదేక పూజనీయులైన శివకేశవరూపాలు గనుకనే రావి-మఱ్ఱి వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది. 

👉 వీటిలో రావి చెట్టు శనిదృష్టి సంబంధితమైన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది. ఇతర వారాలలో రావిచెట్టును తాకరాదు సుమా! అంటూ చెప్పడాన్ని ఆపాడు సూతుడు.


ఇరవై ఏడు, ఇరవై ఎనిమిది అధ్యాయాలు సమాప్తం


ఇరవై తొమ్మిదవ రోజు పారాయణ సమాప్తం


ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్ ల లో ఇరవై ఎనిమిదవ 

రోజు పారాయణం చూడండి


Karthika Puranam Day-29 | కార్తీక పురాణం 29 ...

Quote Today:
"Our greatest glory is not in never falling, but in rising every time we fall."
-Confucius

Note:
నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share, and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండి
అలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share, and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe,   కామెంట్   చేయడం మర్చిపోకండి.