23, నవంబర్ 2020, సోమవారం

14 కార్తీక పురాణము విశిష్టత - పదనాలుగవ రోజు పారాయణ

wowitstelugu.blogspot.com

 

14 కార్తీక పురాణము విశిష్టత  - పదనాలుగవ 


రోజు పారాయణ



ఇరవై తొమ్మిదవ అధ్యాయం

  • తరువాత అంబరీషుడు దూర్వాసుడికి నమస్కరించి - 'మహామునీనేను బహు పాపాత్ముడినిఆకలితోవుండి అన్నం కోసం నా ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలుచేసిన మందభాగ్యుడిని

  • అయినానాయందు దయతో మళ్ళీ నా యింటికి అతిథిగా వచ్చావుదయచేసి నా ఇంట విందు ఆరగించినా సర్వదోషాలను ఉపశమింప చేయిఅని ప్రార్థించాడు

  • దూర్వాసుడి అతనిని తన బాహువులతో(చేతులతోలేవనెత్తి - 'రాజాప్రాణదాతను 'తండ్రీఅంటారుఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడటం వలన నాకు పితృస్థానంలో ఉన్నావునిజానికి నేనే నీకు నమస్కరించాలికాని బ్రాహ్మణుడినీ తాపసినీనీకన్నా వయోవృద్ధుడినీ అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందేగాని మేలు చేయదుఅందువల్లనీకు నమస్కరించడం లేదని ఏమీ అనుకోకునేను నిన్ను కష్టపెట్టాను.

  • అయినా నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావునీవంటి ధర్మాత్ముడితో కలిసి భోజనం చేయడం మహద్భాగ్యంఅని చెప్పిఅతని ఆతిథ్యాన్ని స్వీకరించివిష్ణుభక్తుల మహాత్య ప్రకటన కోసంపరీక్షించడానికివచ్చిన దూర్వాసుడు ఆ సత్కార్యం పూర్తికావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు

  • కాబట్టికార్తీకశుద్ధ ద్వాదశీ వ్రతం సమస్త సత్ఫలితాల ప్రదాయిని అని తెలుసుకోవాలిశుద్ధ ఏకాదశినాడు ఉపవాసంజాగరణలు చేసి ద్వాదశినాడు దానాలు (క్షీరాబ్దద్వాదశీ వ్రతంనిర్వర్తించిబ్రాహ్మణ సమేతుడైద్వాదశీ ఘడియలు దాటకుండా పారణం చేయడంవల్ల అన్ని పాపాలూ అంతరించిపోతాయి.

  • ఈ పుణ్యగాథను చదివినాచదివించినావినినా కూడా ఇహంలో సర్వసౌఖ్యాలను పొందిపరంలో ఉత్తమపదాన్ని పొందుతారు.

 

ఇరవై తోమ్మిదవ అధ్యాయం సమాప్తం

 


ముప్పైవ అధ్యాయం

 

  • పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీకమహత్యాన్ని వినిశౌనకాదిఋషులు "మహానుభావాకలియుగ కల్మషగతులురాగాదిపాశయుక్త సంసారగ్రస్తులూ అయిన సామాన్యులకిసునాయసంగా లభించే పుణ్యం ఏదిఅన్ని ధర్మాలలోనూ అధికమైనది ఏదిదేవతలందరిలోకీ దేవాదిదేవుడు ఎవరుదేనివల్ల మోక్షం కలుగుతుందిమోహం దేనివలన నశిస్తుంది?

  • జరామృత్యుపీడతలుజడమతులుమాంద్యులు అయిన ఈ కాలపు ప్రజలు తేలిగ్గా తెములుకు పోయే తెరువు ఏమిటి?'' అని అడిగారుఅందుకు సూతుడు ఇలా చెప్పసాగాడు

  • "మంచి ప్రశ్నలనువేశారుఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించడం వలన వివిధ తీర్థక్షేత్రాల పర్యటనస్నానాల వల్లా వివిధ యజమానాది నిర్వహణలవల్లా కలిగేటువంటి పుణ్యం లభిస్తుంది

  • ఇంతవరకూ నేను మీకు చెప్పిన కార్తీకఫలమే వేదోక్తమైందివిష్ణువుకి ఆనందకరమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మంసర్వశాస్త్రాలనీ వివరించి చెప్పేందుకు నేను సమర్థుడిని కానుసమయం కూడా సరిపోదు

  • కాబట్టి అన్నిశాస్త్రాలలోనూ వున్న సారాంశాన్ని చెబుతాను వినండివిష్ణుభక్తీకన్నా తరుణోపాయం లేదువిష్ణుగాథలను వినేవాళ్ళు విగతపాపులైనరకానికి దూరంగాసంసారసాగరాన్ని తరించిపోతారు.

  • కార్తీకమాసంలో విష్ణు ప్రీత్యర్థంగా స్నానదానజపపూజాదీపారాధన మొదలైనవి చేసేవాళ్ళ పాపాలు అన్నీ వాటికవే పటాపంచలై పోతాయిసూర్యుడు తులారాశిలో నెలరోజులు కూడా విడవకుండాకార్తీకవ్రతం ఆచరించేవాళ్ళు జీవన్ముక్తులు అవుతారు

  • కార్తీకవ్రతము చేయని వాళ్ళు కుల,  మతవయో,  లింగభేద రహితంగా 'అంధతా మిశ్రంఅనే నరకాన్ని పొందుతారు
  • కార్తీకంలో కావేరీ నదీస్నానంచేసినవాళ్ళు దేవతలచే కీర్తించబడతారువిష్ణులోకాన్ని చేరతారు
  • కార్తీక స్నానం చేసివిష్ణువుకి అర్చన చేసినవాడు వైకుంఠాన్ని పొందుతాడుఈ వ్రతాచరణ చేయనివాళ్ళు వెయ్యిసార్లు ఛండాలపుజన్మల పాలవుతారు

  • సర్వశ్రేష్ఠముహరి ప్రీతిదాయకమూపుణ్యకరమూ అయిన ఈ వ్రతాచారణం దుష్టాత్ములకు లభించదుసూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీకస్నాన దానజప పూజాదులుచేసేవాళ్ళు సర్వదుఃఖావిముక్తులు అవుతారుమోక్షం పొందుతారు
  • దీపదానంకంచుపాత్ర దానందీపారాధనంధన-ఫల-ధాన్య-గృహాదిదానాలు అమిత పుణ్యఫలదాలుకార్తీకం ముప్పయిరోజులూకార్తీకమహత్యాన్ని వినినా పారాయణ చేసినా కూడా సకల పాపాలూ నశించిపోతాయి

  • సంపత్తులు సంభవిస్తాయిపుణ్యాత్ములు అవుతారుఇన్ని మాటలు ఎందుకువిష్ణుప్రియమైన కార్తీక వ్రతాచరణం వలన ఇహపర సుఖాలు రెండూ కూడా కలుగుతాయి.


ముప్పైవ అధ్యాయం సమాప్తం.


పదనాలుగవ (చతుర్థశిరోజు పారాయణ సమాప్తం


ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. ల లో 14 వ రోజు పారాయణ చూడండి...


Note: 

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe,Also see my  Youtube channel bdl Telugu tech-tutorials like share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుందథాంక్యూ.




22, నవంబర్ 2020, ఆదివారం

13 కార్తీక పురాణము విశిష్టత - పదమూడవ రోజు పారాయణము

wowitstelugu.blogspot.com

13 కార్తీక పురాణము విశిష్టత  - పదమూడవ రోజు పారాయణము

ఇరవై ఏడవ అధ్యాయము

విష్ణు ఉవాచ: 

"దూర్వాసా! బ్రాహ్మణుడవైన నీపట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై, ప్రాయోపవిష్టుడిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై వున్నాడు. నా సుదర్శనచక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఖిస్తున్నాడు. రాజయినందుకుగాను గో, బ్రాహ్మణరక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా, విప్రుడైవైన నీకు విపత్తు కలిగినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు. రాజదాననీతితోనే ధర్మ పరిపాలనం చేయాలి కాని, బ్రాహ్మణుడిని మాత్రం దండించకూడదు.  

శ్లో     బ్రాహ్మణో బ్రాహ్మనై రెవ నిగ్రాహ్యో వేదనాదిభి: !

         సత్య ధర్మాది నిరతై: లోభ దంభ వివర్జితై: !!

దోషి అయిన బ్రాహ్మణుడిని -వేదనిదులు, సత్యధర్మ నిరతులు, లోభదంభ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి. బ్రాహ్మణుడు పాపంచేసి, ప్రాయశ్చిత్తం చేసుకోనప్పుడు వపనం, ధనహరణం, స్థాన భ్రష్టత్వం మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప, రాజు శిక్షించకూడదు. తాను స్వయంగా బ్రాహ్మణుడిని చంపినా, తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా, ఇతరులచే తాను చంపించినా కూడా బ్రహ్మహత్యాపాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందుచేత, మహాభక్తుడైన ఆ అంబరీషుడు బ్రాహ్మణుడవైన నీకు తనవల్లనే నీకు ప్రాణాపాయకరమైన సుదర్శన వేధ కలిగినందుకు ఖిన్నుడై ఉన్నాడు. కాబట్టి, నువ్వు తక్షణమే అంబరీషుడి దగ్గరికి వెళ్ళు. తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం జరుగుతుంది' అని విష్ణువు చెప్పగానే, దూర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరింపబడింది. భయగ్రస్తుడైన దూర్వాసుడినీ, అతనిమీదకు రానున్న సుదర్శనాన్నీ చూడగానే, అంబరీషుడు ఆ చక్రానికి ఎదురువెళ్ళి "ఓ సుదర్శనచక్రమా! నన్ను మన్నించు. భయభ్రాంతుడైన వాడినీ, అందునా బ్రాహ్మణుడిని ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు'' అంటూనే ధనుర్థారియై, ఇంకా ఇలా చెప్పసాగాడు.

ఇరవై ఏడవ అధ్యాయం సమాప్తం

ఇరవైఎనిమిదవ అధ్యాయం ప్రారంభం 


"ఆగు! ఓ విష్ణుచక్రమా, ఆగు! ఈ బ్రాహ్మణవధ నీకు తగదు. చంపడమే ప్రధానం అనుకుంటే నన్ను చంపు. ఈ దూర్వాసున్ని వదలని పక్షంలో నీతో యుద్ధానికి అయినా సరే నేను సిద్ధంగానే ఉన్నాను. రాజులకి యుద్ధమే ధర్మంగాని, యాచన చేయడం ధర్మం కాదు. విష్ణువు ఆయుధానివైన నీవు నాకు దైవస్వరూపానివే గనుక నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు. అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదురించక తప్పదు. నిన్ను జయించగలిగినది అంటూ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలుసును. అయినా, నా బలపరాక్రమాలను కూడా ఒక్కసారి రుచిచూడు. మరికొన్నాళ్ళపాటు ఆ శ్రీహరి హస్తాలలో బ్రతికి వుండదలచుకుంటే శరణాగతుడైన దూర్వాసుడిని వదిలిపెట్టి వెళ్ళిపో, లేదంటే నిన్ను ఖచ్చితంగా నేలకూలుస్తాను'' అని క్షత్రియ ధర్మపాలన కోసం తనకీ దూర్వాసుడికీ మధ్య ధనుర్థారియై నిలబడిన అంబరీషుడిని ఆప్యాయంగా చూసి, అతని ధర్మనిర్వహణ మరింత పరీక్షించడం కోసం సుదర్శనచక్రం ఇలా పలుకసాగింది "అంబరీషా! నాతొ యుద్ధం అంటే సంబరం అనుకుంటున్నావా? మహాబలవంతులైన మధుకైటభులను, దేవలందరికీ అజేయులైన మరెందరో రాక్షసులని అవలీలగా నాశనం చేశాను నేను. ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరిచూడడానికైనా సమస్త ప్రపంచమూ కంపించిపోతుందో, అటువంటి బ్రహ్మరుద్ర తేజోమూర్తి అయిన ఈ దూర్వాసుడిప్పుడు ఇలా ధిక్కారధీనుడై అవస్థ పడుతున్నాడు అంటే అది నా ప్రతాపమేనని మరిచిపోకు. ఉభయ తేజస్సంపన్నుడైన దూర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలం క్షత్రియ అహంకార కారణం అయిన ఏకైక శివ తెజోమూర్తివి నువ్వు. నువ్వు నన్నేం, చేయగలవు? క్షేమం కోరుకునే వాడు బలవంతుడితో సంధి చేసుకోవాలేగాని, ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు. విష్ణుభక్తుడివి కాబట్టి ఇంతవరకూ నిన్ను సహించాను. లేనిపోని బీరాలకు పోయి, వృధాగా ప్రాణాలు పోగోట్టుకోకు'' ఈ మాటలతో అంబరీషుడి కళ్ళు ఎరుపెక్కాయి. "ఏమిటి సుదర్శనా! ఎక్కువ మాట్లాడుతున్నావు? నా దైవం అయిన హరి ఆయుధానివని ఇంతవరకూ ఊరుకున్నాను గానీ, లేకుంటే నా బాణాలతో నిన్ను ఎప్పుడో నూరుముక్కలు చేసివుండే వాడిని. దేవ, బ్రాహ్మణులపైనా, స్త్రీలూ - శిశువుల మీదా, ఆవులమీదా నేను బాణప్రయోగం చెయ్యను. నువ్వు దేవతవైన కారణంగా నీకింకా నా క్రూర చరణఘాతాల రుచి తెలియపరచలేదు. నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలు ఉంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి (క్షాత్ర)ధర్మయుతంగా పురుషరూపిడివై యుద్ధం చెయ్యి'' అంటూ ఆ సుదర్శనం యొక్క పాదాలపైకి ఏకకాలంలో ఇరవై బాణాలను వేశాడు. అతని పౌరుషానికీ, ధర్మరక్షణాదీక్షలో దైవానికైనా జంకని క్షాత్రానికి సంతోషించిన సుదర్శనచక్రం నరుడి రూపంలో చిరుదరహాసం చేస్తూ "రాజా! శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నిమంత్రించాడుగాని, నీతో కయ్యానికి కాదు. పరీక్షించేందుకు అలా ప్రసంగించానుగానీ, విష్ణుభక్తులతో నేను ఎప్పుడూ విరోధపడను. నీ కోరిక ప్రకారమే శరణాగతుడు అయిన దూర్వాసున్ని వదిలివేస్తున్నా''నని చెప్పి, అంబరీషుడిని ఆలింగనం చేసుకున్నాడు. అంతటితో అంబరీషుడు ఆనందభరితుడై "సుదర్శనా! నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు. భక్తులను పాలించడంలోనూ, రాక్షసులను సంహరించడంలోనూ, విష్ణుతుల్య ప్రకాశమానమూ, ప్రాణగమన కష్టహారకమూ అయిన నీ ఉత్కృష్టతకి ఇవే నా నమస్కారాలు'' అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు. సంతోషించిన సుదర్శనుడు, అంబరీషుడిని లేవనెత్తి, అభినందించి, అదృశ్యం అయ్యాడు. కలియుగ కార్తీకంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా, విన్నా అనేక భోగాలను అనుభవించి, అంత్యాన ఉత్తమ గతులను పొందుతారు.


ఇరవైఏడు, ఇరవై ఎనిమిది అధ్యాయాలు సమాప్తం


పదమూడవ (త్రయోదశి) రోజు నాటి పారాయణం సమాప్తం

ఈ క్రింది 13వ రోజు  వీడియో యు. ఆర్. యల్ లు. చూడండి 

21, నవంబర్ 2020, శనివారం

12 కార్తీక పురాణము విశిష్టత - పన్నెండ వ రోజు పారాయణం

wowitstelugu.blogspot.com

12 కార్తీక పురాణము విశిష్టత  - పన్నెండ వ రోజు పారాయణం

ఇరవై నాలుగవ అధ్యాయము


అత్రిమహముని చెబుతున్నాడు:- 

అగస్త్యా! కార్తీకమాస శుక్ల ద్వాదశిని 'హరిబోధిని' అని అంటారు. ఆ ఒక్క పర్వతిథీ వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసిన, అన్ని విధాలైన యజ్ఞాలు ఆచరించిన కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది. విష్ణువుపట్లా, ఏకాదశిపట్లా భక్తిని కలిగిస్తుంది. సూర్యచంద్ర గ్రహణ పర్వాలకంటే గొప్పదీ ఏకాదశి కంటే వందరెట్లు మహిమాన్వితమైనదీ అయిన ఈ ద్వాదశినాడు ఏ పుణ్యం చేసినా, పాపం చేసినా అది కోటిరెట్లుగా పరిణమిస్తుంది. అంటే - ఈ ద్వాదశినాడు ఒకరికి అన్నదానం చేసినా కోటిమందికి అన్నదానం చేసిన పుణ్యమూ, ఒక్క మెతుకు దొంగిలించినా కోటి మెతుకులు దొంగలించిన పాపమూ కలుగుతాయి. ఒకవేళ ఏ రోజుకైనాద్వాదశీ ఘడియలు తక్కువగా ఉన్న పక్షంలో - ఆ స్వల్ప సమయమైనా సరే పారణకు ఉపయోగించాలే కానీ, ద్వాదశి దాటిన తరువాత పారణం పనికిరాదు. పుణ్యాన్ని కోరేవారు ఎవరైనా సరే ఏ నిమయాన్నయినా అతిక్రమించవచ్చును కానీ ద్వాదశీ పారణను మాత్రం విసర్జించకూడదు. ఏకాదశీ తిథినాడు ఉపవాసం ఉండి, మరుసటినాడు ద్వాదశీ తిథి దాటిపోకుండా పారణ చేయాలి. దానిద్వారా కలిగే శ్రేయస్సును శేషశాయి చెప్పలేగాని- శుధుడు చెప్పలేడు. ఇందుకు అంబరీషుడు కథే ఉదాహరణ.


అంబరీష ఉపాఖ్యానము


ద్వాదశీ వ్రతాచరణ తత్పరుడు, పరమ భాగవోత్తముడు అయిన అంబరీష అనే మహారాజు ఒకానొక కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఉపవాశం చేసి, మరుసటి రోజు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్న కారణంగా, తిథి దాటకుండానే పారణ చేయాలని అనుకున్నాడు. అదే సమయానికి దూర్వాస మహర్షి వచ్చి ఆతిథ్యమిషతో తనకు కూడా భోజనం పెట్టవలసిందిగా కోరాడు. అంబరీషుడు ఆయనను ద్వాదశీ పారాయణకు ఆహ్వానించాడు. తక్షణమే దూర్వాసుడు స్నానం చేయడం కోసం నదికి వెళ్ళాడు. అలా వెళ్ళిన ఋషి ఎంత సేపటికీ రాకపోవడంతో అంబరీషుడు ఆతృతపడ్డాడు. ఆ రోజు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్నాయి. కాల అతిక్రమణ కాకుండా పారణ చేసి తీరాల్సింది. అతిథి వచ్చేవరకూ ఆగడం గృహస్థ ధర్మం. దాంతో వదలలేడు, ద్వాదశీ దాటకుండా పారణ చేయడం ఈ వ్రతస్థ ధర్మం. దీనినీ వదులుకోలేడు అదీగాక -


శ్లో ||    హరిభక్తి పరిత్యాగో ద్వాదశీత్యాగతో భవేత్ 

    యతోమ భయా త్క్రు త్వాసమ్య గుపొణం !

    పూర్వం ద్వాదశ సంఖ్యాకే పురుషో హరినాసరే  

    పాపముల్లంఘనేపాత్ నైవయజ్యం మనిషిణా !!


"ద్వాదశీ వ్రతాన్ని ఉల్లంఘించినవాడు, విష్ణుభక్తి విసర్జించిన వాడవుతారు. ఏకాదశినాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో - ద్వాదశీనాడు పారణ చేయకపోతే, అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది. అంతేకాదు - ఒక్క ద్వాదశీ పారణ అతిక్రమణ వల్ల ఆనాటి వ్రతఫలంతో పాటుగానే, అంతకు పూర్వం చేసిన పన్నెండు ద్వాదశీపారణం మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది. జన్మజన్మాంతర పుణ్యబలం క్షీణిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశి అతిక్రమణం వల్ల విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది. అందువల్లే ప్రాణానికి అపాయం అయినా సరే, ద్వాదశీ పారణ చేయడమే కర్తవ్యం. దానిద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపంవల్ల కల్పాంత దుఖమే కలుగునుగాక! దూర్వాస వచ్చిన తరువాత కన్నా, ద్వాదశీ తిథి ముగిసేలోపునే పారణం చేసి - హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాభుడే కడతేరుస్తాడు'' ఇలా అని మనస్సులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా, ధర్మవర్తనుడు అయిన ఆ అంబరీషుడు, ద్వాదశీ పారణ కోసం తనను పర్యవేక్షిస్తూ ఉన్న వేదవిదులకు తన ధర్మ సందేహాన్ని తెలియజేశాడు.

అంబరీషుడి సమస్య విన్న వేదస్వరూపులైన ఆ బ్రాహ్మణులు, క్షణాల మీద శృతి స్మ్రుతి శాస్తపురాణాలు అన్నింటినీ మననం చేసుకుని "మహారాజా! సర్వేశ్వరుడు అయిన ఆ భగవంతుడు సమస్త జీవులలో జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై వుంటున్నాడు. ఆ జఠరాగ్ని, ప్రాణ వాయువుచేత ప్రజ్వలింప చేయబడటం వలననే జీవులకు ఆకలి కలుగుతుంది. దాని తాపమే క్షుత్పిపాసా భాధగా చెప్పబడుతూ వుంది. కాబట్టి, యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింప చేయడమే జీవలక్షణం. జీవులచే స్వీకరింపబడే భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య రూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు. జీవులందరిలోనూ వున్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కనుకనే ..

శ్లో ||      అత శ్వపాకం శూద్రం వా స్వన్య స ద్మాగతం శుకం !

               అతి క్రమ్య న భుంజీత గృహమే థ్యతిధిం నిజం !!


తన యింటికి వచ్చినవాడు శూద్రుడైనా-ఛండాలుడైనా సరే, ఆ అతిథిని వదిలి గృహస్థు భోజనం చెయ్యకూడదు. అటువంటిది బ్రాహ్మణుడే అతిథిగా వస్తే - అతనిని విసర్జించడం అధమాధమమని వేరే చెప్పనక్కరలేదు గదా! పైగా తనచే స్వయంగా పిలువబడిన బ్రాహ్మణుడికంటే ముందుగా తానే భోజనం చేయడం బ్రాహ్మణావమానమే అవుతుంది. భూవరా! భూసురవమానం వలన ఆయుష్షు, ఐశ్వర్యం, కీర్తి, ధర్మం నశించిపోతాయి. మనో సంకల్పాలు సైతం తిరోహితాలై పోతాయి. బ్రాహ్మణుడు సర్వదేవత స్వరూపుడిగా చెప్పబడి ఉండటం వలన, బ్రాహ్మణ అవమానం సర్వదేవతలనూ అవమానించడంతో సమానమవుతుంది. జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు దేవతా తుల్యుడు అయి ఉండగా - కేవలం జన్మవలననే కాక, జ్ఞానం వలనా, తపో మహిమవలనా, శుద్ధ రుద్రస్వరూపుడుగా కీర్తించబడే దూర్వాసుడువంటి ఋషిని భోజనానికి పిలిచి, ఆయనకంటే ముందే పారణ చేయడం ధర్మమని చెప్పడం సాధ్యం కాదు. కోపిష్టి అయిన ఆ ఋషి సహిస్తాడనే భయాన్ని ప్రక్కకు నెట్టి చూసినా ...


శ్లో ||   వయం న నిశ్చయం క్వాపిగచ్చామో నరపుంగవ !

         తథాపి ప్రథమం విప్రా ద్భోజనం న ప్ర కిర్తితం !!


బ్రాహ్మణా తిథి కంటే ముందుగా భుజించటం కీర్తికరమైనది మాత్రం కాదు. ధరణీపాలా! ద్వాదశీ పారణా పరిత్యాగం వలన, అంతకు పూర్వ దినం అయిన ఏకాదశి ఉపవాసానికి భంగం కలుగుతుంది, ఆ ఏకాదశీ త్యాగానికి ప్రాయశ్చిత్తం అనేది లేదు. ఇటు - బ్రాహ్మణాతిథి అతిక్రమించడం వలన కలిగే విప్ర పరాభవానికి కూడా విరుగుడు లేదు. రెండూ సమతూకంలోనే వున్నాయి.

ఇరవై నాలుగవ అధ్యాయం సమాప్తం

ఇరవై అయిదవ అధ్యాయం ప్రారంభం


"అంబరీషా! పూర్వకర్మ అనుసారియై నీకు ఇప్పుడు రెండు ప్రక్కల నుంచీ కంఠపాశరజ్జువులా ఈ ధర్మసంకటం ప్రాప్తించింది, దూర్వాసుడు వచ్చేవరకూ ఆగాలో, లేదా - ద్వాదశీ ఘడియలు దాటకుండా పారణ చేయాలో ఏదీ నిశ్చయించి చెప్పడానికి ...


      శ్లో  || స్వాబుద్ధ్యాతు సమాలోక్య కురుత్వం తవ నిశ్చయం 


మేము ఆశక్తులమై పోతున్నాం. కాబట్టి "ఆత్మబుద్ధి స్సుఖంచైవ'' అనే సూత్రం వలన భారం భగవంతుడి మీద పెట్టి నీ బుద్ధికి తోచినదానిని నువ్వు ఆచరించు'' అన్నారు బ్రాహ్మణులు. ఆ మాటలు వినగానే అంబరీషుడు 'ఓ బ్రాహ్మణులారా! బ్రాహ్మణ శాపంకన్నా విష్ణుభక్తిని విడిచి పెట్టడమే ఎక్కువ కష్టంగా భావిస్తున్నాను.


శ్లో    ||  కర్తుం సాధ్యం యదాకాలం ద్వాదశ్యద్బిస్తు పారయేత్ !

             కృతావకాశ వత్సశ్చాత్ భూమ జీత్యేత్యవరేజగః !!


అనే శ్రుత్యర్థబోధక ప్రమాణం చేత, ప్రస్తుతం నేను కాసిన్ని మంచినీళ్ళను త్రాగుతాను. అందువల్ల, అతిథి కంటే ముందు అన్నం తిన్న దోషం రాదు. ద్వాదశి ఘడియలు దాటకుండా ఆహారం తీసుకున్న పారణ ఫలితమూ వుంటుంది. ఇందువలన దూర్వాసుడు కోపించి శపించే అవకాశమూ ఉండదు. నా జన్మాంతర పాపమూ నశిస్తుంది. ఇదే నా నిర్ణయం'' అన్నాడు. అలా అంటూ, వారి ఎదుటనే రవ్వంత జలపానం చేశాడు. నోటిదగ్గరి నీటిపాత్రని ఇంకా నేల మీద పెట్టనయినా లేదు - అదే సమయంలో అక్కడ అడుగుపెట్టాడు దూర్వాసుడు. చేతిలో జలపాత్రతో వున్న రాజును చూడగానే జరిగింది ఏమిటో గ్రహించేశాడు. 'చూపులతోనే కాల్చేస్తాడు' అన్నట్లు చురచురా చూశాడు. మాటలతోనే మారణహోమం చేస్తాడా అన్నట్లు ... "రేరే దురహంకార పూరిత రాజాధమా! అతిథినైన నేను లేకుండానే ద్వాదశీ పారణం చేస్తావా?


శ్లో ||  అస్నాత్వాతుమలం భుంక్తే  -అదత్వాఘంతు కేవలం

         యోనిమంత్రితాతిధి: పూర్వం మోహాద్భుంక్తే తతోధమః 

         మాలాశేసతు విజ్ఞేయః క్రిమిదిష్టాగాతో యధా 

         భుంజతేతేత్వఘం పాపాయే ఏవచ త్యాత్మకారణాత్  

         ఆతిథర్థ్యంచ పక్వం యే భుంజతే తేత్వ ఘాదఘం !!


స్నానం చెయ్యకుండా భోంచేసేవాడు - మలభోజి అవుతాడు. పరుడికి పెట్టకుండా తానొక్కడే తినేవాడు పాపభోక్త అవుతాడు. తానాహ్వానించిన అతిథికి పెట్టకుండా ముందుగా తనే భోంచేసేవాడు - ఆశుద్ధంతో పురుగువలే మలాశియే అవుతాడు. పక్వమైనది గాని, ఫలం గాని, పత్రంగాని, నీళ్ళుగాని - భోజనార్థంగా భావించి సేవించినది ఏదైనా సరే అన్నంతో సమానమే అవుతుంది. అందువలన - నీచేత అంగీకృతుడనైన అతిథిని - నేను రాకుండానే, నాకంటే ముందుగా అన్న ప్రతివిధిగా జలపారణం చేశావు. బ్రాహ్మణ తిరస్కారివైన నువ్వు బ్రాహ్మణ ప్రియుడైన విష్ణువుకు భక్తుడి ఎలా అవుతావు? "యథా పురోధనస్స్వస్య మదమోహాన్మహీపతే'' పురోహితుడు చెప్పినట్లు కాకుండా, మరోవిధంగా ఆచరించే మదమోహితుడిలా ప్రవర్తించావు నువ్వు'' అన్నాడు దూర్వాసుడు. ఆ ఆగ్రహానికి భయకంపితుడు అయిన అంబరీషుడు దోసిలి పట్టినవాడై "మునీంద్రా! నేను పాపినే! పరమ నీచుడనే! అయినా నిన్ను శరణు కోరుతున్నాను. నేను క్షత్రియున్ని గనుక - ఏ అభిజాత్యహంకారం వల్లనో తప్పు నేను చేశాను, కాని, నువ్వు బ్రాహ్మణుడివైన కారణంగా శాంతాన్ని వహించు. నన్ను రక్షించు. నీవంటి గొప్ప ఋషులు తప్ప విడిచి - మమ్మల్ని ఉద్ధరించేవాళ్ళు ఎవరు ఉంటారు?'' అంటూ అతని పాదాలమీద పడి ప్రార్థించాడు. అయినా సరే, ఆ దూర్వాసుడి కోపం తగ్గలేదు. మణిమకుటాన్ని ధరించే ఆ అయోధ్యాపతి శిరస్సును తన ఎడమకాలితో తన్నివేశాడు. రవంత ఎడంగా వెళ్ళి "ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ప్రార్థిస్తే వాళ్ళు శాంతులు అవుతారు. కాని, నేను అలాంటివాడిని కాను. నాకు కోపంవస్తే, శాపం పెట్టకుండా ఉండను. చేపగానూ, తాబేలుగానూ, పందిగానూ, మరుగుజ్జు వాడిగానూ, వికృతమైన ముఖం కలవాడిగానూ, క్రూరుడైన బ్రాహ్మణుడిగానూ, జ్ఞానశూన్యుడైన క్షత్రియుడిగానూ, అధికారంలేని క్షత్రియుడిగానూ, దురాచార భూయిష్టమైన పాషండ మార్గవాదిగానూ, నిర్దయాపూర్వక బ్రాహ్మణ హింసకుడివనై  బ్రాహ్మణుడిగానూ - పదిజన్మల (గర్భ నరకాల) అనుభవించు'' అని శపించాడు. అప్పటికే బ్రాహ్మణ శాపభయంతో అవాక్కయి వున్నాడు అంబరీషుడు. అయినా అతని అంతర్యంలో సుస్థితుడై ఉన్న శ్రీమహావిష్ణువు కల్పాంతరకాల లోకకళ్యానార్థమొ, బ్రాహ్మణ వాక్యాన్ని తిరస్కరించకూడదనే తన వ్రతంవల్లా, ఆ పదిజన్మల శాపాన్ని తానే భరించదలచి - 'గృహ్ణామి' అని ఊరుకున్నాడు. "ఇన్ని శాపాలు ఇస్తే - గృహ్ణామి - అంటాడేమిటి రాజు? వీడికింకా పెద్ద శాపం ఇవ్వాలి' అని మరోసారి నోరు తెరవబోయాడు దూర్వాసుడు. కానీ సర్వజ్ఞుడైన శ్రీహరి దూర్వాసుడి నోట ఇంకో శాపం వెలువడకుండానే - భక్తుడైన అంబరీషుడి రక్షణార్థంగా తన ఆయుధమైన సుదర్శన చక్రాన్ని వినియోగించడంతో, అక్కడి పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి - జగదేక శరణ్యమూ, జగదేక భీకరమూ అయిన సుదర్శనచక్రం రివ్వున దూర్వాసుడ్ని వంక కదిలింది. అచేతనాలైన పూజిత సంజ్ఞలలోంచి - జడమైన విష్ణుచక్రం, దివ్యకాంతి ప్రభాశోభితమై తనవంక కదలిరావాడాన్ని చూడగానే - దూర్వాసుడు త్రుళ్ళిపడ్డాడు. ఆ చక్రానికి చిక్కకూడదని భూచక్రం అంతా కూడా క్షణాలమీద పరిభ్రమించాడు. అయినా 'సుదర్శనం' అతగాడిని తరుముతూనే వుంది. భీతావహుడైన ఆ దూర్వాసుడు - వశిష్టాది బ్రహ్మర్షులనీ. ఇంద్రాది అష్టదిక్పాలకులనీ, చిట్టచివర శివ-బ్రహ్మలనీ కూడా శరణు కోరాడు. కాని, అతడి వెనకనే విహ్వల మహాగ్ని జ్వాలాయుతంగా వస్తూన్న విష్నుచక్రాన్ని చూసి ఎవరికీ వారే తప్పుకున్నారు తప్ప విడిచి, తెగించి ఎవరూ అభయాన్ని ఇవ్వలేదు.

ఇరవై అయిదవ అధ్యాయం సమాప్తం


ఇరవై ఆరవ అధ్యాయం ప్రారంభం


ఆ విధంగా ప్రాణభీతిపరుడైన దూర్వాసుడు సంభవిత లోకాలు అన్నీ సంచరించి, చిట్టచివరగా చక్రపాణి అయిన విష్ణులోకాన్ని చేరుకున్నాడు. "హే జగన్నాథా! హే బ్రాహ్మణ ప్రియా! మాధవా! మధుసూధనా! కోటిసూర్యులతో సమానమైన కాంతినీ-వేడినీ కలిగిన నీ ధర్మచక్రం నన్ను చంపడం కోసం వస్తున్నది. బ్రాహ్మణపాదముద్రా సుశోభిత మహారస్కుడవైన నువ్వే నన్నీ ఆపదనుంచి కాపాడాలి'  అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ శ్రీహనే శరణుకోరాడు. విలాసంగా నవ్వాడు విష్ణువు "దూర్వాసా! ప్రపంచానికి నేను దైవం అయినా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు. కానీ, నువ్వు అద్బ్రాహ్మణుడివీ, రుద్రాంశసంభూతుడివీ అయి వుండీ కూడా అంబరీషుడిని అకారణంగా శపించావు. పారణకు వస్తానని చెప్పి స్నానం చేయడానికి వెళ్ళిన నువ్వు, సకాలానికి చేరుకోలేదు. ఆలస్యంగా రాదలచుకున్నవాడివి నీకోసం ఎదురు చూడకుండా, ద్వాదశి ఘడియలు గతించి పోకుండా పారణచేయడానికి అనుమతి అయినా ఇవ్వలేదు. ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యసద్బ్రాహ్మణుడివీ, రుద్రాంశ సంభూతుదివీ అయివుండీ కూడా అంబరీషుడిని శపించావు. పారణకు వస్తానని చెప్పి, స్నానంకోసం వెళ్ళిన నువ్వు సకాలానికి చేరుకోలేదు. ఆలస్యంగా రాదలచుకున్నవాడివి నీకోసం ఎదురు చూడకుండా, ద్వాదశీ ఘడియలు గతించిపోకుండా పారణ చేయడానికి అనుమతి అయినా ఇవ్వలేదు. ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి వున్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్ళను తీసుకున్నాడేగాని, ఆకలితోనో నిన్ను అవమానించాలనో కాదు. ' అనాహారేపి యచ్చస్తం శుద్ధ్యర్థం వారినాఃసదా'' నిషిద్ద ఆహరాలకు కూడా, నీటిపానం దోషం కాదని శాస్త్రాలు చెబుతుండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది? ఆత్రేయా! నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడే కాని, కోపగించుకోలేదు! అయినా సరే, ముముక్షువైన అతగాడిని నువ్వు పదిదుర్భరజన్మలను పొందాలని శపించావు. నా భక్తులను రక్షించుకోవడం కోసం, నీ శాపాన్ని నిముషంలో త్రిప్పివేయగలను. కాని, బ్రాహ్మణవాక్యం వట్టిపోయిందనే లోకాపవాదు నీకు కలగకుండా ఉండడం కోసం, ఆ భక్తుడి హృదయం చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించినవాడినీ, నీ శాపాన్ని అంగీకరిస్తూ 'గృహ్ణామి' అన్నవాడినీ నేనేగాని, ఆ అంబరీషుడు మాత్రంకాదు. అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలియదు. ఋషి ప్రభూ! నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతాన దుష్టుడైన శంఖాసురున్ని సంహరించేందుకూ, శిష్టుడైన మనువును ఉద్దరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను. దేవదానవులు క్షీరసాగరాన్ని మధించే వేళ, మందరగిరిని మూపున ధరించి, దానికి కుదురుగా ఉండేందుకుగాను కూర్మావతారుడి (తాబేలు)ని అవుతాను. భూమిని ఉద్ధరించేందుకు, హిరణ్యాక్షుణ్ణి చంపేందుకు వరాహాన్ని అవుతాను. హిరణ్యకషిపున్ని సంహరించడం కోసం వికృతాసనం గల 'నరసింహ' రూపావతార దారుడిని అవుతాను. సర్వదేవతా సంరక్షణకోసం ధర్మబలుడైనా కూడా దానవుడు గనుక 'బలి' అనేవాడిని శిక్షించేందుకు వామనుడి నవుతాను. త్రేతాయుగంలో జమదగ్నికి కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడినై దుర్మదులైన రాజులను చంపుతాను. రావణసంహారం కోసం ఆత్మజ్ఞానశూన్యుడై, అంటే, నేనే భగవంతుడిని అనేది మరిచిపోయి మాయామానుష విగ్రహుడి అయిన దశరథరాముడిగా అవతరిస్తాను, ద్వాపరయుగంలో జ్ఞానినీ, బలిష్టినీ అయి వుండీ కూడా రాజ్యాధికారం లేకుండా రాజు (బలరాముడు)కు తమ్ముడిగా కృష్ణుడిగా జన్మిస్తాను. కలియుగ ఆరంభంలో పాపమొహం కోసం పాషండమత ప్రచారకుడినై పుడతాను. ఆ యుగాంతంలో శత్రుఘాతుకుడైన బ్రాహ్మణుడిగా ప్రభవిస్తాను. దూర్వాసా! నా ఈ దశావతారాలనూ ఆయా అవతారాలలోని లీలలను ఎవరు విన్నా, చదివినా, తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచలు అయిపోతాయి. 


శ్లో ||     ధర్మా నానావిధా వేదే విస్తృతా నరజన్మానాం !

    దేశకాల వయోవస్థా వర్ణాశ్రమ విభాగశః !!


దేశ, కాల, వయోవస్థలను బట్టి, వర్ణాశ్రమాలను అనుసరించి, 'ధర్మం' అనేక విధాలుగా వేదంచే ప్రవచించబడివుంది. అటువంటి వివిధవిధ ధర్మాలలోనూ కూడా 'ఏకాదశి'నాడు ఉపవాసం, ద్వాదశిదాటకుండా పారణం అనేవి విశ్వజనీనంగా భాసిస్తున్నాయి. అటువంటి వైదిక ధర్మాచరణం చేసినందుకుగాను, నువ్వు ఆ అంబరీషుడిని శపించింది చాలక, తిరిగి మరో ఘోర శాపం ఇవ్వబోయావు. బ్రాహ్మణుడవైన నీ వాక్యాన్ని సత్యం చేయడమూ భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడమూ రెండూ నా బాధ్యతలే కాబట్టి మళ్ళీ శపించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియంత్రించాను.


 ఇరవైనాలుగు, ఇరవై ఐదు, ఇరవై ఆరు అధ్యాయాలు సమాప్తం.

పన్నెండవ రోజు పారాయణ సమాప్తం.

కార్తీక పురాణం 12 వ రోజు పారాయణం వీడియో యు. ఆర్. యల్ . లు.

11 కార్తీక పురాణము విశిష్టత - పదకొండవ రోజు పారాయణం

wowitstelugu.blogspot.com

11 కార్తీక పురాణము విశిష్టత - పదకొండవ రోజు పారాయణం

కార్తీక పురాణము - పదకొండవరోజు పారాయణ 

ఇరవై ఒకటవ అధ్యాయము

యుద్ధవర్ణన

ఆత్ర ఉవాచ :  

అగస్త్య - సాధారణమైన కొట్లాటగా ప్రారంభమై, దొమ్మీగా మారి, ఆ సమరం ఒక మహాయుద్ధంగా పరిణమించింది.  అస్త్రశాస్త్రాలతో, పదునైన బాణాలతో, వాడివాడి గుదియలతో, ఇనుపకట్ల తాడి కర్రలతో, ఖడ్గ, పట్టిన, ముపల, శూల, భాల్లాతక, తోమర, కుంభ, కుఠారాద్యా ఆయుధాలతో ఘోరంగా యుద్ధం చేశారు. ఆ సంకుల సమరంలో కాంభోజరాజు మూడువందల బాణాలను ప్రయోగించి, పురంజయుడి గొడుగును, జెండానూ, రథాన్ని కూలగొట్టాడు. తరువాత ఇంకొక అయిదు బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు. మరికొన్ని బాణాలతో పురంజయుడిని గాయపరిచాడు. అందుకు కోపం తెచ్చుకున్న పురంజయుడు - బ్రహ్మమంత్రంతో అభిమంత్రించిన పదునైన పది బాణాలను కాంభోజరాజుపై వేశాడు. ఆ బాణాలు కాంభోజుడి కవచాన్ని చీల్చి, గుండెలో దిగబడ్డాయి. రక్తం ధారాపాతంగా కారుతుండగా తన వక్షంలో గ్రుచ్చుకున్న బాణాలను పెరికి తీసి, ఆ కాంభోజ మహారాజు 'ఓ పురంజయా! నేను పరులసొమ్ముకు ఆశపడేవాడిని కాను. నీవు పంపిన బాణాల్ని నీకే త్రిప్పి పంపుతున్నాను తీసుకో'' అంటూ వాటిని తన వింట సంధించి, పురంజయుడి మీదకు ప్రయోగించాడు. ఆ బాణాలు పురంజయుడి సారథిని చంపివేశాయి. ధనుస్సును ముక్కలు చేశాయి. పురంజయుడిని మరింత గాయపరిచాయి. అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి ఇరవై రెక్కల బాణాలను వింట సంధించి వారిని ఆఖరివరకు లాగి కాంభోజుడిపై వదిలాడు. ఆ యిరవై బాణాలూ ఏకకాలంలో అతగాడి గుండెలలోనుండి వీపు గుండా దూసుకుపోవడంతో కాంభోజరాజు మూర్చపోయాడు. దానితో యుద్ధం మరింత భయంకరమైంది. తెగిన తుండాలతో ఏనుగులు, నరకబడిన తలలతో గుర్రాలు, విరిగిపడిన రథాలు, స్వేచ్చగా దొర్లుతున్న రథచక్రాలు, తలలూ, మొండేలు వేరు కాబడి, ఎడం ఎడంగా పడి గిలగిలా తనుకుంటున్న కాల్బంటుల కళేబరాలతో కదనరంగం అంతా కంఠగింపుగా తయారయింది. మృతవీరుల రక్తం అక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది. అటువంటి ఆ భీషణ భీభత్స సంగ్రామంలో అధర్మి అయిన పురంజయుడి బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది. కురుజాది వీరుల విజృంభణను తట్టుకోలేక, ఆ సాయంత్రానికల్లా సమరభూమిని వదిలి, పట్టణంలోకి పారిపోయాడు. అంతఃపురం చేరి, ఆనాటి శతృవుల విజయానికి పడిపడి దుఃఖిస్తున్న పురంజయుడిని చూసి - 'సుశీలుడు' అనే పురోహితుడు 'మహారాజా! శతృవైన ఆ వీరసేనుడిని గెలవాలనే కోరికే గనుక బలవత్తరంగా ఉంటే తక్షణమే భక్తిప్రవత్తులతో విష్ణువును సేవించడం ఒక్కటే మార్గం. రాజా! ఇది కార్తీక పూర్ణిమ, కృత్తికా నక్షత్రయుతుడై-చంద్రుడు షోడశ కళాశోభాయమానంగా వుండే ఈవేళ, ఈ ఋతువులో లభించే పూలను సేకరించి, హరిముందు మోకరించి పూజించు. విష్ణుసన్నిధిలో దీపాలను వెలిగించు. ఆయన ముందర, గోవిందా-నారాయణా- మొదలైన నామాలతో మేళతాళాలతో ఎలుగెత్తి పాడు. ఆపాటలతో పరవశుడై హరిముందు నర్తించు. అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు. కార్తీకమాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం వేయి అంచులతో శతృభయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు. ఈ కార్తీక పుణ్యమహిమను చెప్పడం ఎవరివల్లా అయ్యే పనికాదు. భూపతీ! ఈనాటి నీ ఓటమికి కారణం సైన్యబలం లేకపోవడంగాని, నీకు శరీరబలం లేకపోవడంగాని కానేకాదు సుమా! మితిమీరిన అధర్మవర్తనం వలన. నీ ధర్మబలం దానిద్వారా దైవబలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం. కాబట్టి పురంజయా! శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు. కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు. ఈ కార్తీక వ్రతం వలన ఆయురారోగ్యైశ్వర్య సుఖసంపత్ సౌభాగ్య సత్సంతానాలు సంఘటిల్లి తీరుతాయి. నామాటలను విశ్వసించు. 

ఇరవై ఒకటవ అధ్యాయం సమాప్తం 

ఇరవై రెండవ అధ్యాయము

రెండవనాటి యుద్ధం - పురంజయుని విజయం


అత్రిమహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు ... అగస్త్యా! ఆ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజయుడు తక్షణమే విష్ణు ఆలయానికి వెళ్ళి, వివిధ ఫలపుష్పాలతో విష్ణువును షోడశోపచారాలతో పూజించి, ప్రదక్షిణ నమస్కారాలు అర్పించి, మేళతాళాలతో ఆయనను కీర్తించి, పారవశ్యంతో నాట్యం చేశాడు. అంతేకాదు, బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలుచేశాడు. దీపమాలికలు వెలిగించి అర్పించాడు. ఆ రాత్రంతా అలా విష్ణుసేవలో విలీనుడైనన పురంజయుడు, మరుసటి రోజు ఉదయమే మిగిలిన సైన్య సమేతంగా పునః యుద్ధరంగాన్ని చేరాడు. నగర సరిహద్దులను దాటుతూనే, శతృవులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన శంఖాన్ని పూరించాడు. ఆ శంఖారావం చెవినపడిన కాంభోజ, కురుజాది బలాలు పురంజయుడిని ఎదుర్కొన్నాయి. వజ్రాలవంటి కత్తులతోనూ, పిడుగులవంటి బాణాలతోనూ, అమిత వేగావంతాలూ - ఆకాశానికి సైతం ఎగరగలిగినవి అయిన గుర్రాలతోనూ, ఐరావతాలతోనూ, అన్యోన్య జయకాంక్ష తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కాల్పలాలతోనూ క్రమక్రమంగా యుద్ధం తీవ్రంగా పరిణమించసాగింది. గతరాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుడగమనుడు అతనికి దైవబలాన్ని తోడుచేయడం వలన, ఆనాటి యుద్ధంలో శతృరాజులు శక్తులన్నీ ఉడిగిపోయాయి. కాంభోజుల గుర్రాలు, కురజాదుల ఏనుగులు, వివిధ రాజుల రథబలాలు, వరికూతం యొక్క పదాతిబలాలూ దైవకృప ప్రాప్తుడైన పురంజయుని ముందు చిత్తుచిత్తుగా ఓడిపోయాయి. పురంజయుడి పరాక్రమానికి గుండెలు అవిసిపోయిన పగవారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదలి తమతమ రాజ్యాలకు పరుగులు తీశారు. అంతటితో విష్ణు అనుగ్రహం వలన విజయాన్ని పొందినవాడై పురంజయుడు అయోధ్యా ప్రవేశం చేశాడు. విష్ణువు అనుకూలుడు అయితే శత్రువు మిత్రుడు అవుతాడు. విష్ణువు ప్రతికూలుడు అయితే మిత్రుదేశం శతృవు అవుతాడు. దేనికైనా దైవబలమే ప్రధానం. ఆ దైవబలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం. అటువంటి ధర్మాచరణలలో ప్రపతమైన కార్తీకవ్రత ధర్మానుష్టానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలూ కూడా చిటికెలమీదనే చిమిడిపోతాయి. అగస్త్యా! విష్ణుభక్తి సిద్ధించడమే కష్టతరం. అందులోనూ కార్తీక వ్రత ఆచరణ ఆసక్తి, శక్తి కలగడం ఇంకా కష్టతరం. కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతమూ, శ్రీహరిసేవా వదలకుండా చేస్తారో వాళ్ళు శూద్రులైనా సరే, వైష్ణవ ఉత్తములుగా పరిగణింపబడతారు. వేదవిదులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా శ్రీహరిసేవా, కార్తీక వ్రత ఆచరణలు లేనివాళ్ళు కర్మచంఢాలులేనని గుర్తించు. ఇక వేదావేత్తయై, హరిభక్తుడై, కార్తీక వ్రతనిష్టుడైన వాడియందు సాక్షాత్తూ ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతోంది. ఏ జాతివాళ్ళయినా సరే ఈ సంసార సాగరాన్నుంచి బయటపడి ఉత్తమగతుల్ని పొందాలనే కోరికతో విష్ణువును అర్చించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించిపోయినట్లుగా భావించు. అగస్త్యా! స్వతంత్రుడుగానీ, పరతంత్రుడుగానీ హరిపూజా చేసేవాడై ఉంటేనే ముక్తి, భక్తులకూ శ్రీహరీ, విష్ణువుకీ భక్తులూ అన్యోన్యనుతబద్ధులై ఉంటారు. భక్తులకు ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి, రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే. విశ్వమంతటా నిండి వున్న ఆ విష్ణువుయందు భక్తిప్రవత్తులున్నవారికి మాత్రమే. కార్తీక వ్రత అవకాశం చేజిక్కుతుంది. కాబట్టి, వేదసమ్మతమూ, సకలశాస్త్రసారమూ, గోప్యమూ, సర్వవ్రత ఉత్తమమూ అయిన ఈ కార్తీకవ్రతాన్ని ఆచరించినా, కనీసం కార్తీక మహత్యాన్ని మనఃస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగతపాపులై అంత్యంలో వైకుంఠం చేరుకుంటారు. మహాత్వపూర్వకమైన ఈ ఇరవై రెండవ అధ్యాయాన్ని శ్రాద్ధకాలంలో పఠించడంవలన - పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు సుమా!

త్రయోవింశ అధ్యాయము

హే ఆత్రి మునీంద్రా! విష్ణు కృపవలన విజయుడైన పురంజయుడు ఆ తరువాత ఏం చేశాడో వివరించు అని, అగస్త్యుడు కోరడంతో, ఆత్రి ఇలా చెప్పసాగాడు.
భగవంతుని కృపవలన యుద్ధభూమిలో విజయలక్ష్మిని వరించిన పురంజయుడు, అమరావతిలో ఇంద్రుడిలా తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు. గతంలోని దుష్టభావాలను వదిలిపెట్టి - సత్యశౌదపాలనం, నిత్యధర్మాచరణం, దానశీలత, యజ్ఞయాగాది నిర్వహణలు, మొదలైనవి చేస్తూ ప్రతి సంవత్సరం కార్తీక వ్రత ఆచరణ వల్ల విగతకల్మషుడై, విశుద్ధుడై, అరిషడ్వర్గాన్ని జయించి - పరమ వైష్ణవుడు అయి ఏ ఏ దేశాలలో, ఏ ఏ క్షేత్రాలలో, తీర్థాలలో విష్ణువునే అన్ని విధాలుగా పూజించడం వలన తన జన్మ తరిస్తుందా! అనే తపనతో వుండేవాడు. అంతగా హరిసేవ సంవిధాన తప్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి 'పురంజయా! కావేరితీరంలో శ్రీరంగక్షేత్రం ఉంది. శ్రీరంగనాథుడనే  పేరున అక్కడ వెలసివున్న విష్ణువును కార్తీకమాసంలో అర్చించి, జననమరణాల నుంచి కడతేరమని ప్రబోదించడంతో రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి తగినంత చతురంగ బలంతో అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్యవిధిగా శ్రీహరిని అర్చిస్తూ కావేరీలో ఉన్న భూలోకవైకుంఠం శ్రీరంగాన్ని చేరుకొని, కార్తీక మాసం అంతా కావేరీనదిలో స్నానాదులనీ, శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ ప్రతిక్షణమూ కూడా 'కృష్ణా! గోవిందా! వాసుదేవా! శ్రీరంగనాథా! అని హరినే స్మరిస్తూ జప, దాన మొదలైన విద్యుక్తధర్మాలన్నిటినీ నిర్వర్తించి కార్తీకమాస వ్రతం పూర్తిచేసుకుని తిరిగి అయోధ్య చేరుకున్నాడు. తరువాత ధర్మకామం వలన సత్ప్రవర్తన కలిగిన పుత్రులను పొంది, కొన్నాళ్ళకు సర్వభోగాలు విడనాడి, భార్యాసమేతంగా వానప్రస్థం స్వీకరించి, కార్తీక వ్రతాచరణ, విష్ణుసేవలోనే లీనమై పుణ్యవశాన అంత్యంలో వైకుంఠం చేరుకున్నాడు.

ఇరవై ఒకటి, ఇరవై రెండు, ఇరవై మూడు అధ్యాయాలు సమాప్తం

పదకొండవ రోజు పారాయణ సమాప్తం

కార్తీక పురాణము విశిష్టత - పదకొండవ రోజు పారాయణం వీడియో  యు. ఆర్. యల్ . లు చూడండి...


Note: 

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe,Also see my  Youtube channel bdl Telugu tech-tutorials like share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుందథాంక్యూ.