21, నవంబర్ 2020, శనివారం

10 కార్తీక పురాణము విశిష్టత - పదవ రోజు పారాయణం

wowitstelugu.blogspot.com

10 కార్తీక పురాణము విశిష్టత - పదవ రోజు పారాయణం


పంతొమ్మిదొవ అధ్యాయము

జ్ఞాన సిద్ధి ఉవాచ: 

వేదవేత్తల చేత - వేదవిద్యునిగానూ, వేదాంత స్థితునిగానూ, రహస్యమైన వానిగానూ, అద్వితీయునిగానూ కీర్తించబడేవాడా! సూర్యచంద్ర శివబ్రహ్మాదుల చేతా - మహారాజాది రాజులచేతా స్తుతింపబడే రమణీయ పాదపద్మాలు గలవాడా! నీకు నమస్కారం. పంచాభూతాలూ, సృష్టిసంభూతాలైజ్న సమస్త చరాచరాలు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి. శివసేవిత చరణాః నువ్వు పరమముకంటే కూడా పరముడవు. నువ్వే సర్వాదికారివి. స్థావరజంగరూపమైన సమస్త ప్రపంచమూ కూడా దాని కారణ బీజమైన మాయలో సహా నీయందే ప్రస్ఫుటమవుతోంది. సృష్ట్యాదినీ, నడుమతోనూ, త దంతానాకూడా ప్రపంచమంతా నువ్వే నిండివుంటావు. భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యరూప చతుర్విధాన్న రూపుడవూ, యజ్ఞస్వరూపుడవూ కూడా నీవే. అమృతమయమూ, పరమ సుఖప్రదమూ అయిన ణీ సచ్చిదానందరూప సంస్మరణ మాత్రము చేతనే - ఈ సంసారం సమస్తమూ "వెన్నట్లో సముద్రంలా'' భాసిస్తోంది. హే ఆనందసాగారా ! ఈశ్వరా ! జ్ఞానస్వరూపా! సమస్తానికీ ఆధారమూ, సకల పురాణసారమూ కూడా నీవే అయివున్నావు. ఈ విశ్వం సమస్తం నీవల్లనే జనించి తిరిగి నీయందె లయిస్తూ వుంది. ప్రాణులందరి హృదయాలలోనూ ఉండేవాడివీ, ఆత్మవాచ్యుడవూ, అఖిలవంద్యుడవూ, మనోవా గగోచరుడవూ అయిన నువ్వు - కేవల మాంసయమయాలైన భౌతికనేత్రాలకు కనిపించవు గదా తండ్రీ ! ఓ కృష్ణా! ఈశ్వరా! నారాయణా! నీకు నమస్కారం. నీ ఈ దర్శనఫలంతో నన్ను ధన్యుడిని చెయ్యి. దయామతివై నన్ను నిత్యమూ పరిపాలించు. జగదేక పూజ్యుడవైన నీకు మ్రోక్కడం వలన నా జన్మకు సాఫల్యాన్ని అనుగ్రహించు. దాతవు, నేతవు, కృపాసముద్రుడవూ అయిన నీవు సంసారసాగరంలో సంకటాల పాలవుతున్న నన్ను సముద్దరించు. హే శుద్ధచరితా! ముకుందా! త్రిలోకనాథా! త్రిలోకవసీ! అనంతా! ఆదికారణా! పరమాత్మా! పరమహంసపతీ, పూర్నాత్మా! గుణాతీతా! గురవే! దయామయా! విష్ణో! నీకు నమస్కారం. నిత్యానందసుధాబ్దివాసీ! స్వరగాపవర్గ ప్రదా! అభేదా! తేజోమయా! సాధుహృ త్పద్మస్థితా! ఆత్మారామా! దేవదేవేశా! గోవిందా! నీకిదే నమస్కారం. సృష్టిస్థితి లయంకారా! వైకుంఠవాసా! బుద్దిమంతులైనవారు నీ పాదాలయందలి భక్తీ అనే పడవచేత సంసారసాగరాన్ని తరించి నీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారో అటువంటి తెజోస్వరూపాలైన ణీ పాదాల కివే నా ప్రమాణాలు. వేదాల చేతగాని, శాస్త్రతర్క పురాణ నీతివాక్యాదుల చేతగాని మానవులు నిన్ను దర్శించలేరు. నీ పాదసేవా, భక్తీ అనే అన్జనాలను దరించగలిగినవాళ్ళు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి, ఆత్మస్వరూపునిగా గుర్తించి తరించగలుగుతున్నారు. ప్రహ్లాద, ధృవ, మార్కండేయ, విభీషణ, ఉద్ధవ, గజేంద్రాది భక్తకోటులను రక్షించిన నీ నామస్మరణ మాత్రంచేతనే సమస్త పాపాలూ నశించిపోతున్నాయి. ఓ కేశవా! నారాయణా! గోవిందా! విష్ణూ! మధుసూదనా! త్రివిక్రమా! వామనా! శ్రీధరా! హృషీకేశా! పద్మనాభా! దామోదరా! సంకర్షణా! వాసుదేవా! నీకు నమస్కారం నాన్ను రక్షించు'' ఈ విధంగా తెరిపిలేని పారవశ్యంతో తనను స్తుతిస్తున్న జ్ఞానసిద్ధుణ్ణి చిరునవ్వుతో చూస్తూ 'జ్ఞానసిద్ధా! నీ స్తోత్రానికి నేను సంతోషభరితుడినయ్యాను. ఏం వరం కావాలో కోరుకో'' అన్నాడు విష్ణుమూర్తి. "హే జగన్నాథా! నీకు నాయందు అనుగ్రహమే ఉన్నట్లయితే, నాకు సాలోక్యాన్ని (వైకుంఠం) ప్రసాదించు''మని కోరాడు జ్ఞానసిద్ధుడు. "తథాస్తు'' అని దీవించి తార్క్ష్యవాహనుడు అయిన శ్రీహరి ఇలా చెప్పసాగాడు. "జ్ఞానసిద్ధా! నీ కోరిక నెరవేరుతుంది. కాని, అత్యంత దురాత్ములతో నిండిపోతున్న ఈ నరలోకంలో మహాపాపాత్ములు సైతం సులువుగా తరించే సూత్రాన్ని చెబుతున్నాను విను. సత్పురుషా! నేను ప్రతీ ఆషాఢశుద్ధ ద్వాదశినాకు మేల్కొంటాను. నాకు నిద్రాసుఖాన్ని ఇచ్చే ఈ నాలుగునేలలూ ఎవరైతే  సద్వ్రతాలను ఆచరిస్తారో, వారు విగతపాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు. విజ్ఞులూ, వైష్ణవులూ అయిన నీవూ, నీ సహవ్రతులూ కూడా నేను చెప్పిన చాతుర్మాస్యవ్రతాన్ని పాటించండి. ఎవరైతే ఈ చాతుర్మాస్య వ్రతాచరణ చేయరో వాళ్ళు బ్రహ్మహత్యాపాతక ఫలాన్ని పొందుతారని తెలుసుకోండి. నిజానికి నాకు నిద్ర-మెలకువ-కల అనే అవస్థాత్రయ మేదీ కూడా లేదు. నేను వాటికి అతీతుడిని. అయినా నా భక్తులను పరీక్షించడానికే నేను అలా నిద్ర ,మిషతో జగన్నాటకాన్ని రచిస్తూ ఉంటానని గుర్తించు. హాతుర్మస్యానే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలాలా పఠించేవాళ్ళు కూడా తరిస్తారు. వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుం కట్టు'' ఈ విధంగా చెప్పి, ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమినాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పంపై శయనించాడు. 

అంగీరస ఉవాచ: ఓయీ! నీవు అడిగిన చాతుర్మాస్య వ్రత మహిమ ఇదే. దుర్మాతులైనా, పాపులైనా సరే హరిహరాయణులై ఈ చాతుర్మాస్య వ్రతాచరణ చేసే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, స్త్రీజాతుల వారందరూ కూడా తరించి తీరుతారు. ఈ వ్రతాన్ని చేయనివాళ్ళు గో, గోత్రా హత్యాఫలాన్నీ, కోటిజన్మలు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు. శ్రద్ధాభక్తులతో ఆచరించేవాళ్ళు వందయజ్ఞాలు చేసిన ఫలాన్నీ, అంత్యంలో విష్ణులోకాన్నీ పొందుతారు.   


పంతొమ్మిదొవ అధ్యాయము  సమాప్తం

ఇరవైవ ధ్యాయము

జనకుని కోరికపై వశిష్టుడు ఇంకా ఇలా చెప్పసాగాడు. 

ఓ మిథిలరాజ్య దౌరేయా! ఈ కార్తీక మహత్యం గురించి అత్ర్యగస్త్య మునుల మధ్య జరిగిన సంవాదం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకనాడు అత్రిమహాముని, అగస్త్యుడిని చూసి "కుంభసంభవా! లోకత్రయోపకారం కోసం కార్తీక మహాత్యబోధకమైన ఒకానొక హరికథను వినిపిస్తాను, విను. వేదంతో సమానమైన ఒకానొక హరిగాథను వినిపిస్తాను విను. వేదంతో సమానమైన శాస్త్రంగాని, ఆరోగ్యానికి ఈడైన ఆనందంగాని, హరికి సాటి అయిన దైవంగాని, కార్తీకంతో సమానమైన నెలకాని లేవయ్యా! కార్తీకస్నాన, దీపదానాలూ, విష్ణు అర్చనల వలన సమస్త వాంఛలూ సమకూరుతాయి. ముఖ్యంగా కలియుగ ప్రాణులు కేవలం విష్ణు భక్తివలన మాత్రమే విజయవివేక విజ్ఞానయశోధన ప్రతిష్ఠాసంపత్తులను పొందగలుగుతారు. ఇందుకు సాక్షిభూతంగా పురంజయుడి ఇతిహాసాన్ని చెబుతారు.

పురంజయ పాఖ్యానము

త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడు అయిన ఉరంజయుడు అనేవాడు అయోధ్యను పరిపాలించేవాడు. సర్వశాస్త్ర విదుడు, ధర్మజ్ఞుడు అయిన రాజు. అత్యధిక ఐశ్వర్యం కలగడం అహంకారం కలవాడై, బ్రాహ్మణ ద్వేషి, దేవా బ్రాహ్మణ భూహర్త, సత్యషౌచత్యకుడు, దుష్ట పరాక్రమ యుక్తుడు, దుర్మార్గావర్తనుడై ప్రవర్తించసాగాడు. దానిద్వారా అతని ధర్మబలం నశించడంతో సామంతులైన కాంభోజ కురుజాదులు అనేకమంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టి, ముట్టడించారు. ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా బలమదంతో శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. పెద్దపెద్ద చక్రాలున్నదీ, ప్రకాశించేదీ, జెండాతో అలంకరించబదినదీ, అనేక యుద్ధాలలో విజయం సాధించినదీ, చక్కటి గుర్రాలు పూన్చినదీ, తమ సూర్యవంశ అన్యవమైనదీ అయిన రధాన్ని అధిరోహించి సాది, విషాది, రథి, పత్తి అనబడే నాలుగు రకాల సేనాబలగంతో నగరం నుంచి వెలువడి చుట్టుముట్టిన శతృమూకలపై విరుచుకుపడ్డాడు.


పందొమ్మిది - ఇరవై అధ్యాయాలు సమాప్తం

పదవరోజు పారాయణ సమాప్తము 

ఈ క్రింది వీడియో.యు. ఆర్. యల్ ల లో వీడియో లు చూడండి





Note: 

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe,Also see my  Youtube channel bdl Telugu tech-tutorials like share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుందథాంక్యూ.


20, నవంబర్ 2020, శుక్రవారం

9 కార్తీక పురాణము విశిష్టత - తొమ్మిదవ రోజు పారాయణం

wowitstelugu.blogspot.com

9 కార్తీక పురాణము విశిష్టత  - తొమ్మిదవ రోజు పారాయణం

అద్భుత పురుషుడికి అంగీసరుడు ఇలా ఉపదేశిస్తున్నాడు - నాయనా! ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను శ్రద్ధగా విను.

అద్భుత పురుషుడికి అంగీసరుడు చేసిన ఆత్మజ్ఞాన బోధ         


శ్లో  || కర్మబందశ్స ముక్తైశ్చ కార్యంకారణ మేవ చ !

          స్థూలసూక్ష్మం తథా ద్వంద్వం సంబంథో దేహముచ్యతే !!

కర్మబన్ధం, ముక్తి కార్యం, కారణ - స్థూలం సూక్ష్మం ఈ ద్వంద్వ సంబంధితమే, దేహ     మనబడుతుంది

శ్లో ||     అత్రబ్రూమ న్సమాధానం కొన్యోజీవస్య మేవహి 
             స్యయం వృచ్చ సిమాంకోహం బ్రహ్మై వాస్మి న సంశయః !!

జీవుదంటే వేరెవరూ కాదు, నీవే. అప్పుడు నేనెవర్ని? అని నువ్వే ప్రశ్నించుకుంటే 'నేనే బ్రహన్ నై వున్నాను. ఇది నిశ్చయము' అనే సమాధానమే వస్తుంది. 

పురుష ఉవాచ :

అంగీరసా! నువ్వు చెప్పిన వ్యాఖ్యాలను అర్థం చేసుకునే జ్ఞానం నాకు తట్టడం లేదు. నేనే 'బ్రహ్మన్ ను' అనుకోవడానికైనా 'బ్రహ్మన్' అనే పదార్ధం గురించి తెలిసి ఉండాలి కదా! ఆ పదార్థజ్ఞానం కూడా లేనివాడినైన నాకు మరింత వివరంగా చెప్పమని కోరుతున్నాను.


అంగీకసర ఉవాచ: 

అంతఃకారణానికి, తద్వ్యాపారాలకి, బుద్ధికి, సాక్షి - సత్, చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకో. దేహం కుండవలె రూపంగా ఉన్నా పిండశేషమూ, ఆకాశాది పంచభూతాల వలన పుట్టినదీ అయిన కారణంగా ఈ శరీరం ఆత్మేతరమైనదే తప్ప 'ఆత్మ' మాత్రం కాదు. ఇదే విధంగా ఇంద్రియాలుగాని, ఆగోచరమైన మనస్సుగాని, అస్థిరమైన ప్రాణంగాని ఇవేవీ కూడా ఆత్మ కాదు అని తెలుసుకో. దేవివలన అయితే దేహంలోని ఇంద్రియాలన్నీ భాసమానాలవుతున్నాయో అదే 'ఆత్మగా' తెలుసుకో. ఆ 'ఆత్మ పదార్థమే నేనై వున్నాను' అనే విచిక్సను పొంది ఏ విధంగా అయితే అయస్కాంతమణి ఇతరాల చేత ఆకర్షంచబడకుండా ఇనుమును తాను ఆకర్షిస్తుందో అదేవిధంగా తానూ నిర్వికారి అయి బుద్ధ్వాదులను ఐటం చలింప చేస్తున్నదే ఆత్మ వాచ్యమైన 'నేను'గా గుర్తుచు. దేని సాన్నిధ్యం వలన జడాలైన దేహేంద్రియ మనః ప్రాణాలు భాసమానాలు అవుతున్నాయో అదే జనన మరనరహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికారమై నిద్రాజాగ్రత్ స్వప్నాలనూ, వాది ఆద్యంతాలనూ గ్రహిస్తున్నదో అదే 'నేను'గా స్మరించు. ఘటాన్ని ప్రకాశింప చేసే దీపం ఘటేతరమైనట్లే దేహేతరమై 'నే' ననబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమానాలు అవుతున్నాయి. సమస్తం పట్ల ఏర్పడుతూ ఉండే అనూహ్య, అగోచర ప్రేమైకాకారమే 'నేను'గా తెలుసుకో. దేహేంద్రియ మనః ప్రాణాహంకారాల కంటే విభిన్నమైనదీ-జనితత్వ, అస్తిత్వ, వృద్ధిగతత్వ పరిణామత్వ, క్షీణత్వ, నాశంగతత్వాలనే షడ్వికారాలూ లేనిదీయే ఆత్మగా - అదే నీవుగా ఆ నీవే నేనుగా నేనే నీవుగా 'త్వమేనాహం'గా భావించు. ఈ విధంగా 'త్వం' (నీవు) అదే పదార్థజ్ఞానాన్ని పొంది, తత్కారణాత్ వ్యాపించే స్వభావం వలన సాక్షాద్విధిముఖంగా తచ్చబ్దర్థాన్ని గ్రహించాలి ('తత్' శబ్దానికి 'బ్రహ్మన్' అని అర్థం)


శ్లో   ||   అతద్వ్యావృత్తిరూపేణ సాక్షాద్విది ముఖేవ చ 
            వేదాంతానాం ప్రవృత్తిస్యా ద్విచార్య సుభాషితం !!  


'అతః' శబ్దానికి బ్రాహ్మణ్యమైన ప్రపంచమని అర్థం. 'వ్యావృత్తి' అంటే - ఇది కాదు - ఇదీ కాదు - (నేతి=న+ఇతి, న+ఇతి = ఇది కాదు, ఇదీ కాదు) అనుకుంటూ = ఒకటొకటిగా ప్రతీదానినీ కొట్టి పారవేయడం - అంటే ఏ చెయ్యి 'బ్రహ్మన్ (ఆత్మ) కాదు ఈ కాలు 'ఆత్మ (బ్రహ్మన్)కాదు అనుకుంటూ - సర్వావయవేంద్రియ సంపూర్ణ దేహాన్నీ కూడా 'నేతి' (ఇది కాదు) అనుకుంటూ 'ఇది కాకపొతే మరి 'అది' ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేది 'బ్రహ్మన్' (ఆత్మ) అని అర్థం. ఇక - సాక్షా ద్విధిముఖాత్ అంటే - 'సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ' అనే వాక్యాలద్వారా సత్యత, జ్ఞానం, ఆనందాలవల్లనే 'ఆత్మ' నరయగలగాలి అని అర్థం. ఆ 'ఆత్మ' సంసారం లక్షణావేష్టితం కాదనీ, సత్యమనీ, దృష్టి గోచరం కాదనీ, చీకటి నెరుగనిదని లేదా చీకటికి అవతలిదనీ, పోల్చి చెప్పడానికి వీలులేనంతటి ఆనందమయమనీ, సత్వ ప్రజ్ఞాది లక్షణయుతమనీ, పరిపూర్ణమనీ - పూర్వోక్త సాధనల వలన తెలుసుకో. అబ్బాయీ! ఏదైతే 'సర్వజ్ఞం పరేశం సంపూర్ణ శక్తిమంతం'గా,వేదాలు కీర్తిస్తున్నాయో అ 'బ్రహ్మన్' "నేనే"నని గుర్తించు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ. అదే నువ్వు, అదే నేను 'త దను ప్రవిశ్య' ఇత్యాది వాక్యాలచేత జీవాత్మరూపాన జగత్ప్రవేశమూ  - ప్రవేశిత జీవులను గురించిన నియంతృత్వము - కర్మఫల ప్రదత్వమూ - సర్వజీవ కారణకర్తృత్వమూ - దేనికైతే చెప్పబడుతూ వుందో అదే 'బ్రహ్మన్'గా తెలుసుకో. 'తత్ త్వమసి' = 'తత్' అంటే బ్రహ్మన్, లేదా ఆత్మ - త్వం అంటే నువ్వే - అనగా - నువ్వే పరబ్రహ్మన్ వని అర్థం. ఓ జిజ్ఞాసా! అద్వయానంద పరమాత్మయే ప్రత్యగాత్మ. ఈ ప్రత్యగాత్మే ఆ పరమాత్మ - ఈ ప్రకారమైన తాదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే 'తత్' శబ్దార్థం తనేననీ, 'త్వం' శబ్దసాధనమేగాని ఇతరం గాదనీ తేలిపోతుంది. నీకు మరింత స్పష్టంగా అర్థమవడం కోసం చెబుతున్నాను, విను. తత్వమసి = తత్+త్వం+అసి. ఈ వ్యాక్యానికి అర్థం తాదాత్మ్యము అనే చెప్పాలి. ఇందులో వాక్యార్థాలైన కించిజ్ఞాత్వ, సర్వజ్ఞాతా విశుష్టులైన జీవేశ్వరులను ప్రక్కనపెట్టి లక్ష్యార్థాలైణ ఆత్మలనే గ్రహించినట్లయితే 'తాదాత్మ్యం' సిద్ధిస్తుంది. (ముఖ్యార్థ వేధాశంక కలిగితే లక్షణావృత్తి నాశ్రయించాలి. అందులో 'భాగాలక్షణ' అనే దానివలన ఇది సాధింపబడుతూ వుంది. ఉదా ... సో యం దేవదత్త) ఆత్మసంపన్నా! 'అహం బ్రహ్మోస్మిన్' అనే వ్యాకార్థ బోధ స్థిరపడే వరకు కూడా శమదమాది సాధన సంపత్తితో - శ్రవణమననాదికాలను ఆచరించాలి. ఎప్పుడైతే శృతివల్లనో, గురు కటాక్షంవల్లనో తాదాత్మ్యబోధ స్థిరపడుతుందో, అప్పుడీ వర్తమాన సంసార లంపటం దానికదే పుటుక్కున తెగిపోతుంది. అయినా కొంతకాలం ప్రారబ్ధకర్మ పీడిస్తూనే వుంటుంది. అది కూడా క్షయమవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిని చేరతాము. దానినే ముక్తి - మోక్షం అంటారు. అందువల్ల, ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్టులుగా వుండి, తత్ఫలాన్ని దైవార్పణం చేస్తుండడం వలన -ప్రారబ్ధాన్ని అనుసరించి ఆ జన్మలోనేగాని, లేదా - ప్రారబ్ధ కర్మఫలం అధికమైతే మరుజన్మలోనైనా వివిధ మోక్షవిద్యాభ్యాసపరులై, జ్ఞానులై, కర్మబంధాల్ని త్రెంచుకుని ముక్తులు అవుతారు. 'నాయనా! బందించేవి - ఫలవాంఛిత  కర్మలు. ముక్తిని ఇచ్చేవి - ఫలపరిత్యాగ కర్మలు' అని ఆపాడు అంగీరసుడు.

పదిహేడవ అధ్యాయం సమాప్తం

పద్దెనిమిదొవ అధ్యాయం

అంగీరసుడు చెప్పింది విన్న అద్భుత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగీరసుడు ఇలా చెబుతున్నాడు: చక్కటి విషయాన్ని అడిగావు. శ్రద్ధగా విను. సుఖదుఃఖాది ద్వంద్వాలన్నీ దేహానికేగాని, దానికి అతీతమైన ఆత్మకు లేవు. ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి, దానిద్వారా చిత్తశుద్ధిని పొందినవాడై ఆత్మజ్ఞాని కావాలి. దేహాదారి అయినవాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలయిన స్నానశౌచాదిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి.


శ్లో    స్నానేన రహితం కర్మ హస్తిభుక్త కపిత్థవత్ !
       
 ప్రాతః స్నానం ద్విజాతీనాం శాస్త్రం చ శృతిచోదితం !!      

స్నానం చేయకుండా చేసే ఎటువంటి కర్మలైనా సరే - ఏనుగు తినిన వెలగపండులా నిష్ఫలమే అవుతుంది. అందునా బ్రాహ్మణులకు ప్రాతఃస్నానం వేదోక్తమై వుంది.


శ్లో     ప్రాతస్నానే హ్యశక్తశ్చే త్పుణ్యమాసత్రయోత్తమం !
          తులా సంస్థే దినకరే కార్తిక్యాంతు మహామతే !!
          మకరస్థే రవౌ మాఘే వైశాఖే మేషణే రవౌ !

  • ప్రతిరోజునా ప్రాతఃస్నానం చెయ్యలేనివాళ్ళు - తులా - కార్తీక, మకర, మాఘ, మేష - వైశాఖాలలోనైనా చెయ్యాలి. జీవితంలో ఈ మూడు మాఆలైనా ప్రాతఃస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్నే పొందుతాడు. 

  • చాతుర్మాస్యాది పున్యకాలాలలోగాని, చంద్ర, సూర్య గ్రహణ పర్వాలలోగాని స్నానం చాలా ప్రధానం. గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యం. 

  • సర్వకాలాలా బ్రాహ్మణులకు, పుణ్యకాలాలలో సర్వ ప్రజలకూ స్నానసంధ్యా జప, హోమ, సూర్యనమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి. 

  • స్నానాన్ని వదలినవాడు రౌరవ నరకగతుడై - పునః కర్మ భ్రష్టుడిగా జన్మిస్తాడు. 
    ఓ వివేకవంతుడా! పుణ్యాకాలలన్నింటా సర్వోత్తమమైనదీ కార్తీకమాసం. వేదాన్ని మించిన శాస్త్రం, గంగను మించిన తీర్థం, భార్యతో సమానమైన సుఖం, ధర్మతుల్యమైన స్నేహం, కంటికంటే వెలుగూ లేనట్లుగానే, కర్తీకమాసంతో సమానమైన పుణ్యకాలంగాని, కార్తీక దామోదరుడికన్నా దైవంగాని లేడని గుర్తించు.
    కర్మమర్మాన్ని తెలుసుకుని, కార్తీకంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠం చేరతాడు.

  • నాయనా! విష్ణువు లక్ష్మీ సమేతుడై, ఆషాఢ హుక్ల దశమ్యాంతంలో పాలసముద్రాన్ని చేరి నిద్రామిషతో శయనిస్తాడు.

  • పునః హరిబోధినీ అనబడే కార్తీకశుక్ల ద్వాదశినాడు నిడురలేస్తాడు. ఈ నడుమ నాలుగు మాసలనే చాతుర్మాస్య (వ్రతం)  అంటారు. 

  • విశువుకు నిద్ర సుఖప్రదమైన ఈ నాలుగు నెలలూ కూడా ఎవరైతే హరిధ్యానం, పూజలూ చేస్తుంటారో వాళ్ళ పుణ్యాలు అనంతమై, విష్ణులోకాన్ని పొందుతారు. ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను. 

  • ఒకానొక కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా - నారదుడు అక్కడకు వెళ్ళి వారికి మ్రొక్కి 'హే శ్రీహరీ! భూలోకంలో వేదవిధులు అడుగంటాయి. 

  • జ్ఞానులు సైతం గ్రామ్యసుఖాలకు లోనైపోతున్నారు. ప్రజలంతా వికర్ములై వున్నారు. వారెలా విముక్తులు అవుతారో తెలియక నేను దుఃఖితుదిని అవుతున్నాను' అని విన్నవించాడు. 

  • నారదుడి మాటలను విశ్వసించిన నారాయణుడు, సతీసమేతుడై వృద్ధబ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాలలోనూ, బ్రాహ్మణ పరిషత్ పట్టణాలలోనూ పర్యటించసాగాడు. 

  • కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు. కొందరు హేళన చేశారు. ఇంకొందరు లక్ష్మీ నారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్ళను తిరస్కరించారు. కొందరు అభక్ష్యాలను భుజిస్తున్నారు. 

  • ఇలా ఒకటేమిటి? అతి తక్కువ పుణ్యకార్యాచరుణులనీ, అత్యధిక పాపాచరణాల్ని చూసిన శ్రీహరి ప్రజల ఉద్ధరణ చింతనా మనస్కుడై చతుర్భుజాలతో, కౌస్తుభాది ఆభరణాలతో యధారూపాన్ని పొంది ఉండగా, జ్ఞానసిద్ధుడు అనే ఋషి తన శిష్యగణ సమేతంగా వచ్చి ఆయనను ఆరాధించాడు. అనేక విధాలుగా స్త్రోత్రించాడు.

పదిహేడు - పద్దెనిమిది అధ్యాయాలు సమాప్తం


తొమ్మిదవ రోజు పారాయణ సమాప్తం


ఈ క్రింది వీడియో యు. ఆర్.యల్. లు. ;లో 9 వ రోజు పారాయణంచూడండి...


Search Results


గమనిక :
.
నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share, and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share, and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుందిథాంక్యూ.


8 కార్తీక పురాణమువిశిష్టత - ఎనిమిదవ రోజు పారాయణం

wowitstelugu.blogspot.com

8 కార్తీక పురాణము విశిష్టత  - ఎనిమిదవ రోజు పారాయణం

ఎనిమిదవ రోజు పారాయణం  

పదిహేనవ అధ్యాయము

వశిష్ట ఉవాచ 

  • ఓ జనక నరేంద్రా! కార్తీకమాసంలో ఎవరైతే హరిముందర నాట్యం చేస్తారో, వాళ్ళు శ్రీహరి మందిర వాసులు ఆవుతారు. 
  • కార్తీక ద్వాదశినాడు హరికి దీపమాల అర్పించే వారు వైకుంఠంలో  సుఖిస్తారు. కార్తీకమాస శుక్లపక్ష సాయంకాలాలలో విష్ణువుని అర్చించే వాళ్ళు స్వర్గనాయకులు అవుతారు. 
  • ఈ నెలరోజులూ నియమంగా విష్ణువు ఆలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకునేవాళ్ళు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు. 
  • అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకూ ఒక్కొక్క అశ్వమేథ యజ్ఞఫలాన్ని పొందుతారు. 
  • కార్తీకమాసంలో అసలు విష్ణుమూర్తి గుడికే వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకానికో, కాలసూత్ర నరకానికో వెళతారు. 
  • కార్తీకశుద్ధ ద్వాదశినాడు చేసే ప్రతి సత్కర్మా అక్షయ పుణ్యాన్నీ, ప్రతీ దుష్కర్మా అక్షయపాపాన్నీ కలిగిస్తాయి. 
  • శుక్ల ద్వాదశినాడు బ్రాహ్మణసాహితుడి భక్తియుతుడై గంధపుష్పాక్షత దీపధూపాజ్యభక్ష్య నివేదనలతో విష్ణువును పూజించేవారి పుణ్యానికి మితి అనేది లేదు. 
  • కార్తీక శుద్ధ ద్వాదశినాడు శివాలయంలోగాని, కేశవ ఆలయంలోగాని లక్షదీపాలను వెలిగించి సమర్పించేవాళ్ళు పుష్పవిమానం అధిరోహించి దేవతలచేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరుకొని సుఖిస్తారు. 
  • కార్తీకం నెల్లాళ్ళూ దీపం పెట్టలేనివాళ్ళు శుద్ధ ద్వాదశీ, చతుర్థశీ, పూర్ణిమ ఈ మూడు రోజులు అయినా దీపం పెట్టాలి. 
  • ఆవునుండి పాలు పితికేందుకు పట్టేటంత సమయమైనా, దైవసన్నిధిలో దీపం వెలిగించనివాళ్ళు పుణ్యాత్ములే అవుతారు. 
  • ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రబోధింప చేసినవాళ్ళు పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి. ఇతరులు ఉంచిన దీపం ఆరిపోయినట్లయితే, దాన్ని తిరిగి వెలిగించేవాడు ఘనమైన పాపాలనుండి తరించిపోతాడు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను. 

ఎలుక దివ్యపురుషుడు అవడం

సరస్వతీ నదీతీరంలో అనాదికాలంగా పూజాపునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణువు ఆలయం ఒకటి ఉండేది. కార్తీకస్నానం కోసం నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూసి, తన తపోధ్యానాల కోసం ఆ ఏకాంత ప్రదేశం అనువుగా ఉంటుందని భావించి, ఆ గుడిని తుడిచాడు, నీళ్ళు జల్లాడు. దగ్గరలోని గ్రామానికి వెళ్ళి ప్రత్తి, నూనె, పన్నెండు ప్రమిదలూ తెచ్చి దీపాలు వెలిగించి 'నారాయణార్పణమస్తు' అనుకుని తాను ధ్యానం చేసుకోసాగాడు. ఈ యతి ప్రతిరోజూ ఇలా చేస్తూ ఉండగా, కార్తీకశుద్ధ ద్వాదశినాటి రాత్రి, బైట ఎక్కడా ఆహరం దొరకకపోవడం వలన ఆకలితో తన కడుపులోనే ఎలకలు పరుగెడుతున్న ఒక ఎలుక ఆ గుళ్ళోకి వచ్చి, ఆహార అన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణంగా తిరిగి, మెల్లగా దీపాల దగ్గరకు చేరింది. అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వలన ఆరిపోయిన వత్తి మాత్రమే వుంది. తడిగా వున్న ఆ పత్తినుండి వచ్చే నూనెవాసనకు భ్రమపడిన] ఎలుక, అదేదో ఆహారంగానే భావించి - ఆ పత్తిని నోటకరచుకుని పక్కనే వెలుగుతున్న మరొక దీపం దగ్గరకు వెళ్ళి పరిశీలించబోయింది. ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసివున్న ఆ ఆరిపోయిన వత్తికోన వెలుగుతూ ఉన్న పత్తి అగ్నితో కలిసి ఉండడంతో ఎలుక దాన్ని వదిలేసింది. అది ప్రమిదలోపడి రెండు వత్తులూ చక్కగా వెలగసాగాయి. రాజా! కార్తీకశుద్ధ ద్వాదశినాడు విష్ణుసన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపం ఆరిపోగా, అదీ విధంగా ఎలుక వలన తిరిగి ప్రజ్వలితమై - తన పూర్వ పుణ్యవశాన, ఆ మూషికం ఆ రాత్రి గుడిలోనే విగతజీవియై దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది. అప్పుడే ధ్యానంలోనుండి లేచిన యతి ఆ పూర్వపురుషుణ్ణి చూసి 'ఎవరివి నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు?' అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు 'ఓ యతీంద్రా! నేను ఒక ఎలుకను. కేవలం గడ్డిపరకలవంటి ఆహారంతో జీవించేవాడిని ... అటువంటి నాకు ఇప్పుడు దుర్లభమైన మోక్షం ఏ పుణ్యం వలన వచ్చిందో తెలియడంలేదు. పూర్వజన్మలో నేను ఎవర్ని? ఏ పాపం వలన అలా ఎలుకను అయ్యాను? ఏ పుణ్యం వలన ఈ దివ్యదేహం పొందాను? తపస్సంపన్నుడివి అయిన నువ్వే నాకు వివరించు. నేను నీ శిష్యుణ్ణి, దాసుణ్ణి' అని అంజలి ఘటించి ప్రార్థించాడు. తక్షణమే ఆ యతి తన జ్ఞానేత్రంతో అంతా దర్శించి ఇలా చెప్పసాగాడు.    

                  
బాహ్లికొపాఖ్యానము : 

నాయనా! పూర్వం నువ్వు జైమినోగోత్ర సంజాతుడవైన బాహ్లికుడు అనే బ్రాహ్మణుడవు. బాహ్లిక దేశ వాస్తవ్యుడి అయిన నువ్వు నిరంతరం సంసార పోషణకోసం స్నానసంధ్యలు విసర్జించి, వ్యవసాయం చేపట్టి, వైదిక కర్మానుష్టానులైన బ్రాహ్మణులను నిందిస్తూ ఉండేవాడివి. దేవతార్చనలను అన్నింటినీ విడిచిపెట్టి సంభావనలపై ఆశతో శ్రాద్ధ భోజనాలు చేస్తూ, నిషిద్ధ దినాలలో కూడా రాత్రింబవళ్ళు తినడమే పనిగా బ్రతికావు. చివరకు కాకబలులూ, పిశాచబలులు కూడా భోంచేస్తూ వేదమార్గాన్ని తప్పి తిరిగావు, అందగత్తె అయిన నీ భార్య కందిపోకుండా, ఇంటిపనులలో సహాయార్థం ఒక దాసీదాన్ని తాకుతూ, దానితో మాట్లాడుతూ, హాస్యాలు ఆడుతూ, నీ పిల్లలకు దానిచేతే భోజనం వగైరా పెట్టిస్తూ, నువ్వు కూడా దాని చేతికూటినే తింటూ అత్యంత హీనంగా ప్రవర్తించావు. నీకంటే దిగువవారికి పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి అమ్ముకుంటూ సొమ్ములు కూడబెట్టావు. అంతేగాదు, ధనానికి ఆశపడి నీ కూతురిని కూడా కొంత ద్రవ్యానికి. ఎవరికో విక్రయించేశావు. ఆ విధంగా కూడబెట్టినది అంతా భూమిలో దాచిపెట్టి, అర్థాంతరంగా మరణించావు. ఆయా పాపాల వలన నరకాన్ని అనుభవించి, పునః ఎలుకవై పుట్టి ఈ జీర్ణ దేవాలయంలో ఉంటూ బాటసారులు దైవపరంగా సమర్పించిన దేవద్రవ్యాన్ని అపహరిస్తూ బ్రతికావు. ఈ రోజు మహాపుణ్యవంతమైన కార్తీక శుద్ధ ద్వాదశి కావడం వలన ఇది విష్ణు సన్నిధానమైన కారణంగానూ నీ ఎలుక రూపం పోయి ఈ నరరూపం సిద్ధించింది'

పై విధంగా యతి చెప్పింది విని తాను గతజన్మలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంతో ఆ యతి యొక్క మార్గదర్శకత్వంలోనే ఆ మరునాటినుండి కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్థశి పౌర్ణములు మూడు రోజులూ సరస్వతీనదిలో ప్రాతఃస్నానాన్ని ఆచరించి, ఆ పుణ్యఫలం వలన వివేకవంతుడై బ్రతికినంత కాలమూ ప్రతీ సంవత్సరం కార్తీక వ్రత ఆచరణ, మంచివాడిగా మసులుతూ, అంత్యంలో సాయుజ్య మోక్షాన్ని పొందాడు. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశినాడు భగవత్పరాయణుడై స్నాన, దాన, పూజా దీపమాలార్పనలు మొదలైనవి ఆచరించేవాడు శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడు, పాపవిముక్తుడు అయి సాయుజ్యపదాన్ని పొందుతాడు అని విశ్వసించు.

 పదిహేనవ అధ్యాయం సమాప్తం

పదహారవ అధ్యాయం ప్రారంభం.  

జనక మహారాజా! దామోదరుడికి అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీకం నెలరోజులూ నియమంగా తాంబూల దానం చేసేవాళ్ళు మరుజన్మలో భూపతులుగా జన్మిస్తారు. ఈ నెలలో పాడ్యమి మొదలు రోజుకి ఒక్కొక్క దీపం చొప్పున విష్ణు సన్నిధిలో వెలిగించేవాళ్ళు వైకుంఠవాసులు అవుతారు. సంతానం కోరుకునేవాడు కార్తీక పౌర్ణమినాడు కోరిక సంకల్ప పూర్వకంగా సూర్యుడిని ఉద్దేశించి స్నానదానాలు చేయడం వలన సంతానవంతులు అవుతారు. విష్ణు సన్నిధిలో కొబ్బరికాయ, దక్షిణ, తాంబూలాలతో సహా దానం ఇచ్చిన వాళ్ళకి వ్యాధులు రావు. దుర్మరణాలు కానీ, సంతాన విచ్చేదాలు కాని జరగవు.                   

స్థూపదీపము

పూర్ణిమనాడు విష్ణు సన్నిధిలో స్థూపదీపం వెలిగించడం వలన వైకుంఠం సిద్ధిస్తుంది. రాతితోగాని, కొయ్యతోగాని స్థంభం చేయించి దాన్ని విష్ణు ఆలయం ముందు పాతి, ఆ తరువాత శాలిధ్యానం, వ్రీహిధ్యానం, నువ్వులు పోసి, దానిపై నేటితో దీపం పెట్టినవాళ్ళు హరిప్రియులు అవుతారు. ఈ స్థూపదీపాన్ని చూసినంత మాత్రం చేతనే సమస్త పాపాలూ నశించిపోతాయి. ఈ దీపం పెట్టినవాళ్ళు వైకుంఠంలో స్థానం పొందుతారు. ఇక దీపాన్ని దానం చేయడం వలన కలిగే పుణ్యాన్ని వర్ణించడం నావల్ల అయ్యే పనికాదు. అని చెప్పసాగాడు వశిష్టుడు.                    

కొయ్యమొద్దుకు కైవల్యం కలగడం 

నానా తరుజాల మండితమైన మతంగముని ఆశ్రమంలో ఒక విష్ణువు ఆలయం ఉండేది. ఎందరెందరో మునులు ఆలయానికి వచ్చి, కార్తీకవ్రతాలు అయిన ఆ నెల్లాళ్ళూ శ్రీహరిని షోడశోపచారాలతోనూ అర్చిస్తూ ఉండేవారు. ఒకానొక కార్తీకమాసంలో వ్రతస్థులలోని ఒక ముని 'కార్తీకంలో విష్ణుసన్నిధిని స్తంభదీపం పెట్టడం వలన వైకుంఠం లభిస్తుందని చెబుతారు. ఈ రోజు కార్తీకపూర్ణిమ కాబట్టి, మనం కూడా విష్ణు ఆలయ ప్రాంగణంలో స్తంభదీపాన్ని వెలిగిద్దాం' అని సూచించాడు. అందుకు సమ్మతించిన ఋషులు అందరూ, ఆ గుడి ఎదుటనే కొమ్మలూ, కణువులూ లేని స్థూపాకరపు చెట్టును ఒకదాన్ని చూసి, దానినే స్తంభంగా నిమంత్రించి, శాలి, వీహ్రి, తిలా సమేతంలు దానిపై నేతితో దీపాన్నివేలిగించి, విష్ణువుకి అర్పణ చేసి, మళ్ళీ గుడిలోకి వెళ్ళి పురాణకాలక్షేపం చేయసాగారు. అంతలోనే వారికి చటచ్చటా శబ్దాలు వినడంతో వెనుతిరిగి స్తంభదీపం వంక చూశారు. వాళ్ళు అలా చూస్తూ ఉండగానే ఆ స్థూపం ఫటఫటా శబ్దాలతో నిలువునా పగిలి నేలపై పడిపోయింది, అందులోనుంచి ఒక పురుషాకారుడు వెలివడటంతో, విస్మయం చెందినవారైన ఆ ఋషులు 'ఎవరు నువ్వు? ఇలా స్థాణువుగా ఎందుకు పడి వున్నావు? నీ కథ ఏమిటో చెప్పు' అని అడిగారు. అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు ' ఓ మునివరేణ్యులారా! నేను గతంలో ఒక బ్రాహ్మణుడిని అయినా వేదశాస్త్ర పఠనం కాని, హరికథా శ్రవణం కాని, క్షేత్ర పర్యటనలు కాని చేసి ఎరుగను. అపరిమిత ఐశ్వర్యం వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి - రాజునై పరిపాలన చేస్తూ దుష్టబుద్దితో ప్రవర్తించేవాడిని. వేదపండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములూ అయిన బ్రాహ్మణులను నీచమైన ఆసనాలపై కూర్చుండబెట్టి, నేను ఉన్నతమైన ఆసనంపై కూర్చునేవాడిని. ఎవరికీ దానధర్మాలు చేసేవాణ్ణి కాదు. తప్పనిసరి అయినప్పుడు మాత్రం 'ఇంతిస్తాను అంతిస్తాను' అని వాగ్దానం చేసేవాణ్ణి తప్ప ద్రవ్యాన్ని మాత్రం యిచ్చేవాడిని కాదు. దేవ, బ్రాహ్మణ డబ్బులను స్వంతానికి ఖర్చు చేసుకునేవాడిని దాని ఫలితంగా మరణం తరువాత నరకంలో ఉండి, తరువాత 52 వేల సార్లు కుక్కగాను, పదివేలసార్లు కాకిగాను, మరొక పదివేల సార్లు పురుగులుగానూ, కోటిజన్మలు చెట్టుగానూ గత కోటి జన్మలుగా ఇలా మొద్దులా పరిణమించి కాలం గడుపుతున్నాను. ఇంతటి పాపినైన నాకు, ఇప్పుడు ఎందుకు విమోచనం కలిగిందో ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చిందో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి'.

ఆ అద్భుత పురుషుడి మాటలను విన్న ఋషులు తమలో మాటగా ఇలా అన్నారు 'ఈ కార్తీక వ్రతఫలం యదార్థమైనది సుమా! ఇది ప్రత్యక్ష మోక్షదాయకం. మన కళ్ళముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగింది కదా! అందునా కార్తీక పూర్ణిమనాడు స్తంభదీపం పెట్టడం సర్వత్రా శుభప్రదం, మనచే పెట్టబడిన దీపం వల్ల ఈ మొద్దు ముక్తిని పొందింది. మొద్దయినా మ్రాను అయినా సరే కార్తీకంలో దైవసన్నిధిలో దేపాన్ని పెట్టడం వలన దామోదరుడి దయవల్ల మోక్షం పొందడం తథ్యం' ఇలా చెప్పుకుంటున్న వారి మాటలను విన్న అద్భుత పురుషుడు 'అయ్యలారా! దేహి ఎవరు? జీవి ఎవరు? జీవుడు దేనిచేత ముక్తుడు - దేనిచేత బద్ధుడూ అవుతున్నాడో, దేనిచేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరించరే' అని ప్రార్థించడంతో ఆ తాపసులలో వున్న అంగీరసుడనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు.

పదిహేను - పదహారు అధ్యాయాలు సమాప్తం

ఎనిమిదవ రోజు పారాయణ సమాప్తం


గమనిక :
నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండినా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share, and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share, and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials like share and  Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుందిథాంక్యూ.

19, నవంబర్ 2020, గురువారం

7 కార్తీకపురాణం విశిష్టత - 7వ రోజు పారాయణం

wowitstelugu.blogspot.com

7 కార్తీకపురాణం విశిష్టత  - 7వ రోజు పారాయణం

కార్తీకమాసంతో సమానమైనమాసం, విష్ణువుతో సమానమైన దైవం, వేదంతో సమానమైన శాస్త్రం,గంగతో సమానమైన తీర్దం లేదని చెప్తారు. సూర్యుడు తులారాశిలోకి రాగానే కార్తీకమాసం ఆరంభమైంది. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది.

కార్తీక మాస మహత్యాన్ని మొదటగా వశిష్ట మహర్షి జనక మహరాజునకు వివరించగా శౌనకాది మునులకు సూతుడు మరింత వివరంగా చెప్పాడు. ఈ మాసంలో ప్రతీరోజూ పుణ్యప్రదమైనదే. అయితే ఏ తిథిన ఏమి చేస్తే మంచిదో తెలుసుకుని దానిక ప్రకారం ఆచరిస్తే మరిన్ని ఉన్నత ఫలితాలు కలుగుతాయి. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది

కార్తీకపురాణం - 7వ అధ్యాయం

శివకేశవార్చన విధులు

కార్తీకమాసానికి సంబంధించి వశిష్టులవారు జనకమహారాజుకు ఇంకా ఇలా చెబుతున్నారు…

  • ఓ రాజా! కార్తీక మాసం, దాని మహత్యం గురించి ఎంత తెలిసినా… ఎంత చెప్పినా తనివి తీరదు. ఈ మాసంలో శ్రీమహావిష్ణువును సహస్ర కమలాలతో పూజించినవారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. తులసీదళాలతోగానీ, సంహస్రనామ పూజ చేసినవారికి జన్మరాహిత్యం కలుగుతుంది. కార్తీకమాసంలో ఉసిరి చెట్టుకింద సాలగ్రామం పెట్టి భక్తితో పూజించిన వారికి మోక్షం కలుగును. అలాగే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టుకింద భోజనం పెట్టి, తను తినిన సర్వపాపాలు తొలగిపోవును.

  • కార్తీకమాసంలో దీపారాధనకూ ప్రత్యేక స్థానముందని ఇదివరకే చెప్పాను. అయితే అలా రోజూ దీపారాధన చేయలేనివారు ఉదయం, సాయంత్రం వేళల్లో ఏదైనా గుడికి వెళ్లి భక్తితో సాష్టాంగ నమస్కారాలు చేసినా… వారి పాపాలు నశించును. సంపత్తిగలవారు శివకేశవుల ఆలయాలకు వెళ్లి భక్తితో దేవతార్చన చేయించినట్లయితే… వారికి అశ్వమేథ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. అంతే కాకుండా వారి పితృదేవతలకు కూడా వైకుంఠం ప్రాప్తి కలుగుతుంది. శివాలయానికి గానీ, విష్ణువు ఆలయానికి గానీ జంఢా ప్రతిష్టించాలి. అలా చేసినవారి దరిని కూడా యమ కింకరులు సమీపించలేరు. కోటి పాపాలైనా… సుడిగాలిలా కొట్టుకుపోతాయి.
  • ఈ కార్తీక మాసంలో తులసికోట వద్ద ఆవుపేడతో అలికి, వరిపిండితో శంఖు చక్ర ఆకారాలతో ముగ్గులు పెట్టి, నువ్వులు ధాన్యము పోసి, వాటిపై నిండా నువ్వుల నూనె పోసిన దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం రాత్రింబవళ్లు ఆరకుండా చూడాలి. దీనినే నంద దీపం అంటారు. ఈ విధంగా చేసి, నైవేద్యం పెడుతూ… కార్తీకపురాణం చదివినట్లయితే.. హరిహరులు ఇద్దరూ సంతసిస్తారు. అలా చేసిన వ్యక్తి కైవల్యం పొందుతాడు. అందుకే కార్తీకమాసంలో శివుడిని జిల్లేడుపూలతో అర్చిస్తారు. 

  • దీనివల్ల ఆయుర్వృద్ధి కలుగుతుంది. సాలగ్రామానికి ప్రతినిత్యం గంధం పట్టించి, తులసిదళంతో పూజించాలి. ఏ మనిషీ ధనబలం కలిగి ఉంటాడో… అతను ఆ మాసంలో పూజాదులు చేయడో… అతను మరుజన్మలో కుక్కలా పుట్టి, తిండి దొరక్క ఇంటింటికీ తిరిగి, కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో మరణాన్ని పొందుతాడు. కాబట్టి కార్తీకమాసంలో నెలరోజులై పూజలు చేయలేనివారు ఒక్క సోమవారమైనా చేస్తే… అవి విశకేశవులను పూజించిన ఫలితాన్నిస్తుంది. అందుకే ఓ మహారాజ… నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించు” అని చెప్పారు.

"నమ శివాభ్యం నవ యౌ వనాభ్యాం పరస్ప రాశ్లి ష్ట వపుర్ధ రాభ్యాం
నాగేంద్ర కన్యా వృష కేత నాభ్యం నమో నమ శంకర పార్వతీ భ్యాం

స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి ఏడవ అధ్యాయము

ఏడవ రోజు పారాయణము సమాప్తము

ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. లు. చూడండి



గమనిక :
నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share, and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share, and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుందిథాంక్యూ.