19, నవంబర్ 2020, గురువారం

6 కార్తీక పురాణము విశిష్టత - ఆరవరోజు పారాయణము

wowitstelugu.blogspot.com

6 కార్తీక పురాణము విశిష్టత  ఆరవరోజు పారాయణము

వశిష్ట ఉవాచ: ఓ మహారాజా! కార్తీకమాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసెపూలతో పూజిస్తారో వాళ్ళకి చాంద్రాయణ ఫలం కలుగుతుంది. గరికతోనూ, కుశలతోనూ పూజించేవాళ్ళు పాపవిముక్తులై వైకుంఠం పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షం పొందుతారు. కార్తీక స్నానం ఆచరించి విష్ణుసన్నిధిలో దీపమాలికలు ఉంచే వాళ్ళూ, పురాణ పాఠకులూ, శ్రోతలూ కూడా విగతపాపులై పరమపదాన్ని చేరుతారు. ఇందుకు ఉదాహరణగా వినినంత మాత్రాననే సర్వపాపాలనూ నశింపచేసేదీ, ఆయురారోగ్యదాయినీ అయిన ఒక కథను వినిపిస్తాను విను. 

                    మంధరోపాఖ్యానము 

  • కళింగ దేశీయుడు అయిన మంధరుడు అనే ఒకానొక బ్రాహ్మణుడు స్నానసంధ్యా వందనాలు అన్నింటినీ వదిలేసి, పరులకు కూలిపనులు చేస్తూ ఉండేవాడు. అతనికి పతివ్రత, సర్వసాముద్రికా శుభలక్షణ సంపన్నురాలు, సద్గుణంతో ఉండటం చేత 'సుశీల' అని పిలువబడే భార్య ఉండేది. భర్త ఎంత దుర్మార్గుడు అయినా కూడా, అతనిపట్ల రాగమే తప్ప ద్వేషం లేనిదై పాతివ్రత్య నిష్టాపరురాలు అయి ఉండేది. కొన్నాళ్ళ తరువాత, కూలితో జీవించడం కష్టమని భావించిన మంధరుడు అరణ్యంలో ఉంటూ, ఖడ్గం చేతపట్టి దారులు కాసి బాటసారులను కొట్టి వారినుండి ధనం అపహరిస్తూ కాలం గడపసాగాడు. ఆ దొంగసొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకొని పోయి అమ్మి, ఆ సొమ్ముతో కుటుంబపోషణ చేసేవాడు.
  • ఒకసారి దొంగతనం కోసం దారికాసి ఉన్న మంధరుడు, బాటసారి అయిన ఒక బ్రాహ్మణుడిని పట్టుకొని అక్కడి మర్రిచెట్టుకి కట్టివేసి ఆ బ్రాహ్మణుడి డబ్బులన్నీ అపహరించాడు. ఇంతలోనే అటుగా వచ్చిన పరమ క్రూరుడైన ఒక కిరాతకుడు, దోచుకోనిన మంధరుడినీ, దోచుకోబడి బంధితుడై వున్న బ్రాహ్మణుడినీ ఇద్దరినీ కూడా చంపేసి, అ ద్రవ్యాన్ని తాను అహరించుకుని వెళ్ళబోయాడు. కాని, అదే సమయానికి అక్కడి కిరాత, మంధర, బ్రాహ్మణులనుండి వచ్చే నరవాసనను పసిగట్టిన దగ్గరలోని గుహలో ఉన్న పెద్దపులి గాండ్రుమంటూ వచ్చి, కిరాతకునిపై పడింది. పులి తన పంజాతోనూ, కిరాతకుడు ఖడ్గంతోనూ ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆ జగడంలో పులీ, కిరాతకుడు కూడా ఏకకాలంలోనే మరణించారు. ఆ విధంగా మరణించిన బ్రాహ్మణ, మంధర, పులి, కిరాతకుల జీవులు నలుగురూ యమలోకం చేరి, కాలసూత్రం అనే నరకాన్ని పొందారు. యమకింకరులు ఆ నలుగురినీ, పురుగులూ, అమేథ్యమూతో నిండివున్న రక్తకూపంలో పడేశారు. 
  • ఇక భూలోకంలో, భర్త మరణవార్త తెలియని మంధరుని భార్య అయిన సుశీల మాత్రం, నిత్యం భర్త ధ్యానం చేస్తూ, ధర్మవర్తనతో, హరిభక్తితో, సజ్జన సాంగత్యంతో జీవించసాగింది. ఒకనాడు- నిరంతర హరినామ సంకీర్తనా తత్పరుడు, అందరిలోనూ భగవంతుణ్ణి దర్శించువాడూ, నిత్యానంద నర్తకుడు అయిన ఒకానొక యతీశ్వరుడు - ఈ సుశీల యింటికి వచ్చాడు. ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్షవేసి 'అయ్యీ! నా భర్త కార్యార్థియై వెళ్ళి ఉన్నాడు. ఇంట్లో లేడు. నేను ఏకాకిని ఆయన ధ్యానంలోనే కాలం గడుపుతున్నాను' అని విన్నవించుకుంది. అందుకు ఆ యతీశ్వరుడు 'అమ్మాయీ! ఆవేదన పడకు. ఈరోజు కార్తీక పౌర్ణమి మహాపర్వదినం. ఈ రోజు సాయంకాలం నీ యింట పురాణపఠనం, శ్రవణం మొదలైనవి ఏర్పాటు చేయి. అందుకుగాను ఒక దీపం చాలా అవసరం. దీపానికి తగినంత నూనె నా దగ్గర వుంది. నీవు వత్తిని, ప్రమిదను సమర్పించినట్లయితే దీపం వెలిగించవచ్చును' అని సలహా ఇచ్చాడు. 
  • ఆ యతిశ్రేష్టుని మాటలను అంగీకరించి, సుశీల తక్షణమే గోమయంతో ఇల్లంతా పరిశుభ్రం చేసి, రెండువత్తులను చేసి, యతీశ్వరుని దగ్గర నూనెతో వాటినే వెలిగించి శ్రీహరికి సమర్పించింది. యతి, ఆ దీపసహితంగా విష్ణువును పూజించి మనశ్శుద్ధికోసం పురాణ పఠనం ఆరంభించాడు. సుశీల పరిసరాల యిండ్లకు వెళ్ళి, వారినందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది. అందరి నడుమా తాను కూడా ఏకాగ్రచిత్త అయి ఆ పురాణాన్ని వింది. అనంతరం ఆమెకు శుభాశీస్సులను అందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు. నిరంతర హరిసేవనం వలన క్రమక్రమంగా ఆమె జ్ఞాని అయి, తరువాత కాలధర్మం చెందింది. 
  • తక్షణమే శంకు చక్రాలు కలిగిన, చతుర్భాహువులు, పద్మాక్షులు, పీతాంబరధరులు అయిన విష్ణుదూతలు నందనవన సుందర మందారాది సుమాలతోనూ, రత్నమౌక్తిక ప్రవాళాదులతోనూ నిర్మించిన మాలికాంబర ఆభరణాలు అలంకరించుకుని వున్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందులో ఎక్కించుకుని వైకుంఠానికి తీసుకుని వెళ్ళసాగారు. అలా వైకుంఠానికి వెళుతున్న సుశీల, మార్గమధ్యంలోని నరకంలో మరి ముగ్గురు జీవులతో కలిసి బాధలు పడుతూ ఉన్న తన భర్తను గుర్తించి, విమానాన్ని ఆపించి, దానికి కారణం ఏమిటో తెలుపవలసిందిగా విష్ణుదూతలను కోరింది. అందుకు వారు 'అమ్మా! నీ భర్త అయిన ఆ మంధరుడు బ్రాహ్మణ కులంలో జన్మించినా కూడా వేద ఆచారాలను వదిలేసి, కూలీ అయి, మరికొన్నాళ్ళు దొంగ అయి దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనితో బాటే వున్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి. మిత్రుడు ఒకడిని చంపి, అతని ధనంతో పరదేశాలకు పారిపోయి వెళ్తూ నీభర్త చేత బందితుడు అయ్యాడు. అతగాడి పాపానికిగాను, ఇతను నరకం చేరవలసి వచ్చింది. ఇక నాలుగవ జీవి ఒక పులి. ఆ పులి అంతకు పూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణుడు అయి ఉండీ ద్వాదశి రోజున భక్ష్యాభక్ష్య విచక్షణ లేకుండా ఆచరించిన తైలంతో చేసిన భోజనం తినడం వలన నరకం పొంది - పులిగా పుట్టి - ఈ కిరాతకునితో దెబ్బలాటలో అతనితో పాటే నరకాన్ని చేరాడు. ఈ నలుగురి నరకయాతనలకూ కారణాలు ఇవే తల్లీ' అని చెప్పారు.
  • ఆ తరువాత సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యం చేసినట్లయితే వాళ్ళకు ఆ నరకం తప్పుతుందో చెప్పమని కోరగా, వైష్ణవులు 'కార్తీకమాసంలో నీచేత ఆచరించబడిన పురాణ శ్రవణ ఫలితాన్ని ధారబోయడం వలన నీ భర్తా -పురాణ శ్రవణార్థమై నువ్వు యింటికి వెళ్ళి ప్రజలను పిలిచినా పుణ్యం ధారపోయడం వలన మిత్రద్రోహి అయిన ఆ బ్రాహ్మణుడు, ఆ పురాణ శ్రవణార్థమై నువ్వు సమర్పించిన రెండు వత్తుల పుణ్యాన్ని చెరిసగం ధారపోయడం వలన కిరాత, వ్యాఘ్రాలు నరకం నుండి ముక్తిని పొందుతారు' అని పలికారు. అలా వాళ్ళు చెప్పిందే తడవుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాలను వారివారికి ధారబోయడంతో ఆ నలుగురూ నరకం నుండి విముక్తులై దివ్యవిమాన అధిరోహులై సుశీలను వివిధ విధాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తిపదానికై తీసుకుపోబడ్డారు. కాబట్టి ఓ జానక మహారాజా! కార్తీకమాసంలో చేసే పురాణ శ్రవణంవలన హరిలోకం తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో. 
                  
                    మంధరోపాఖ్యానము 
  • కళింగ దేశీయుడు అయిన మంధరుడు అనే ఒకానొక బ్రాహ్మణుడు స్నానసంధ్యా వందనాలు అన్నింటినీ వదిలేసి, పరులకు కూలిపనులు చేస్తూ ఉండేవాడు. అతనికి పతివ్రత, సర్వసాముద్రికా శుభలక్షణ సంపన్నురాలు, సద్గుణంతో ఉండటం చేత 'సుశీల' అని పిలువబడే భార్య ఉండేది. భర్త ఎంత దుర్మార్గుడు అయినా కూడా, అతనిపట్ల రాగమే తప్ప ద్వేషం లేనిదై పాతివ్రత్య నిష్టాపరురాలు అయి ఉండేది. కొన్నాళ్ళ తరువాత, కూలితో జీవించడం కష్టమని భావించిన మంధరుడు అరణ్యంలో ఉంటూ, ఖడ్గం చేతపట్టి దారులు కాసి బాటసారులను కొట్టి వారినుండి ధనం అపహరిస్తూ కాలం గడపసాగాడు. ఆ దొంగసొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకొని పోయి అమ్మి, ఆ సొమ్ముతో కుటుంబపోషణ చేసేవాడు.

  • ఒకసారి దొంగతనం కోసం దారికాసి ఉన్న మంధరుడు, బాటసారి అయిన ఒక బ్రాహ్మణుడిని పట్టుకొని అక్కడి మర్రిచెట్టుకి కట్టివేసి ఆ బ్రాహ్మణుడి డబ్బులన్నీ అపహరించాడు. ఇంతలోనే అటుగా వచ్చిన పరమ క్రూరుడైన ఒక కిరాతకుడు, దోచుకోనిన మంధరుడినీ, దోచుకోబడి బంధితుడై వున్న బ్రాహ్మణుడినీ ఇద్దరినీ కూడా చంపేసి, అ ద్రవ్యాన్ని తాను అహరించుకుని వెళ్ళబోయాడు. కాని, అదే సమయానికి అక్కడి కిరాత, మంధర, బ్రాహ్మణులనుండి వచ్చే నరవాసనను పసిగట్టిన దగ్గరలోని గుహలో ఉన్న పెద్దపులి గాండ్రుమంటూ వచ్చి, కిరాతకునిపై పడింది. పులి తన పంజాతోనూ, కిరాతకుడు ఖడ్గంతోనూ ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆ జగడంలో పులీ, కిరాతకుడు కూడా ఏకకాలంలోనే మరణించారు. ఆ విధంగా మరణించిన బ్రాహ్మణ, మంధర, పులి, కిరాతకుల జీవులు నలుగురూ యమలోకం చేరి, కాలసూత్రం అనే నరకాన్ని పొందారు. యమకింకరులు ఆ నలుగురినీ, పురుగులూ, అమేథ్యమూతో నిండివున్న రక్తకూపంలో పడేశారు. 

  • ఇక భూలోకంలో, భర్త మరణవార్త తెలియని మంధరుని భార్య అయిన సుశీల మాత్రం, నిత్యం భర్త ధ్యానం చేస్తూ, ధర్మవర్తనతో, హరిభక్తితో, సజ్జన సాంగత్యంతో జీవించసాగింది. ఒకనాడు- నిరంతర హరినామ సంకీర్తనా తత్పరుడు, అందరిలోనూ భగవంతుణ్ణి దర్శించువాడూ, నిత్యానంద నర్తకుడు అయిన ఒకానొక యతీశ్వరుడు - ఈ సుశీల యింటికి వచ్చాడు. ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్షవేసి 'అయ్యీ! నా భర్త కార్యార్థియై వెళ్ళి ఉన్నాడు. ఇంట్లో లేడు. నేను ఏకాకిని ఆయన ధ్యానంలోనే కాలం గడుపుతున్నాను' అని విన్నవించుకుంది. అందుకు ఆ యతీశ్వరుడు 'అమ్మాయీ! ఆవేదన పడకు. ఈరోజు కార్తీక పౌర్ణమి మహాపర్వదినం. ఈ రోజు సాయంకాలం నీ యింట పురాణపఠనం, శ్రవణం మొదలైనవి ఏర్పాటు చేయి. అందుకుగాను ఒక దీపం చాలా అవసరం. దీపానికి తగినంత నూనె నా దగ్గర వుంది. నీవు వత్తిని, ప్రమిదను సమర్పించినట్లయితే దీపం వెలిగించవచ్చును' అని సలహా ఇచ్చాడు. 

  • ఆ యతిశ్రేష్టుని మాటలను అంగీకరించి, సుశీల తక్షణమే గోమయంతో ఇల్లంతా పరిశుభ్రం చేసి, రెండువత్తులను చేసి, యతీశ్వరుని దగ్గర నూనెతో వాటినే వెలిగించి శ్రీహరికి సమర్పించింది. యతి, ఆ దీపసహితంగా విష్ణువును పూజించి మనశ్శుద్ధికోసం పురాణ పఠనం ఆరంభించాడు. సుశీల పరిసరాల యిండ్లకు వెళ్ళి, వారినందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది. అందరి నడుమా తాను కూడా ఏకాగ్రచిత్త అయి ఆ పురాణాన్ని వింది. అనంతరం ఆమెకు శుభాశీస్సులను అందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు. నిరంతర హరిసేవనం వలన క్రమక్రమంగా ఆమె జ్ఞాని అయి, తరువాత కాలధర్మం చెందింది. 

  • తక్షణమే శంకు చక్రాలు కలిగిన, చతుర్భాహువులు, పద్మాక్షులు, పీతాంబరధరులు అయిన విష్ణుదూతలు నందనవన సుందర మందారాది సుమాలతోనూ, రత్నమౌక్తిక ప్రవాళాదులతోనూ నిర్మించిన మాలికాంబర ఆభరణాలు అలంకరించుకుని వున్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందులో ఎక్కించుకుని వైకుంఠానికి తీసుకుని వెళ్ళసాగారు. అలా వైకుంఠానికి వెళుతున్న సుశీల, మార్గమధ్యంలోని నరకంలో మరి ముగ్గురు జీవులతో కలిసి బాధలు పడుతూ ఉన్న తన భర్తను గుర్తించి, విమానాన్ని ఆపించి, దానికి కారణం ఏమిటో తెలుపవలసిందిగా విష్ణుదూతలను కోరింది. అందుకు వారు 'అమ్మా! నీ భర్త అయిన ఆ మంధరుడు బ్రాహ్మణ కులంలో జన్మించినా కూడా వేద ఆచారాలను వదిలేసి, కూలీ అయి, మరికొన్నాళ్ళు దొంగ అయి దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనితో బాటే వున్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి. మిత్రుడు ఒకడిని చంపి, అతని ధనంతో పరదేశాలకు పారిపోయి వెళ్తూ నీభర్త చేత బందితుడు అయ్యాడు. అతగాడి పాపానికిగాను, ఇతను నరకం చేరవలసి వచ్చింది. ఇక నాలుగవ జీవి ఒక పులి. ఆ పులి అంతకు పూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణుడు అయి ఉండీ ద్వాదశి రోజున భక్ష్యాభక్ష్య విచక్షణ లేకుండా ఆచరించిన తైలంతో చేసిన భోజనం తినడం వలన నరకం పొంది - పులిగా పుట్టి - ఈ కిరాతకునితో దెబ్బలాటలో అతనితో పాటే నరకాన్ని చేరాడు. ఈ నలుగురి నరకయాతనలకూ కారణాలు ఇవే తల్లీ' అని చెప్పారు.

  • ఆ తరువాత సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యం చేసినట్లయితే వాళ్ళకు ఆ నరకం తప్పుతుందో చెప్పమని కోరగా, వైష్ణవులు 'కార్తీకమాసంలో నీచేత ఆచరించబడిన పురాణ శ్రవణ ఫలితాన్ని ధారబోయడం వలన నీ భర్తా -పురాణ శ్రవణార్థమై నువ్వు యింటికి వెళ్ళి ప్రజలను పిలిచినా పుణ్యం ధారపోయడం వలన మిత్రద్రోహి అయిన ఆ బ్రాహ్మణుడు, ఆ పురాణ శ్రవణార్థమై నువ్వు సమర్పించిన రెండు వత్తుల పుణ్యాన్ని చెరిసగం ధారపోయడం వలన కిరాత, వ్యాఘ్రాలు నరకం నుండి ముక్తిని పొందుతారు' అని పలికారు. అలా వాళ్ళు చెప్పిందే తడవుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాలను వారివారికి ధారబోయడంతో ఆ నలుగురూ నరకం నుండి విముక్తులై దివ్యవిమాన అధిరోహులై సుశీలను వివిధ విధాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తిపదానికై తీసుకుపోబడ్డారు. కాబట్టి ఓ జానక మహారాజా! కార్తీకమాసంలో చేసే పురాణ శ్రవణంవలన హరిలోకం తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో. 

పదకొండవ అధ్యాయం సమాప్తం

పన్నెండవ అధ్యాయం

మళ్ళీ వశిష్టుడు జనకునికి ఇలా చెప్పసాగాడు 'ఓ రాజా! కార్తీకమాసంలో వచ్చే సోమవార మహత్యం వినివున్నావు. ఆ కార్తీక సోమవారం ఎంత ఫలాన్ని ఇస్తుందో అంతకంటే కార్తీక శనిత్రయోదశి వందరెట్లు, కార్తీకపూర్ణిమ వెయ్యిరెట్లు, శుక్లపాడ్యమి లక్షరెట్లు, శుక్ల ఏకాదశి కోటిరెట్లు, ద్వాదశి లెక్కలేనంత, అనంతమైన ఫలాలనూ అదనంగా ప్రసాదిస్తాయి. మోహంచేత అయినా సరే శుక్ల ఏకాదశినాడు ఉపవాసం ఉండి, మరుసటిరోజు (ద్వాదశి) బ్రాహ్మణులతో కలిసి పారణ చేసేవాళ్ళు సాయుజ్య మోక్షాన్ని పొందుతారు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశినాడు అన్నదానం చేసినవారికి సమస్త సంపదలూ అభివృద్ధి చెందుతాయి. రాజా! సూర్యగ్రహణ సమయంలో గంగాతీరంలో కోటిమంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయడం వలన ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యమూ కూడా కేవలం కార్తీక ద్వాదశినాడు ఒక్క బ్రాహ్మణుడికి అన్నం పెట్టడం వలన కలుగుతుంది. వేయి గ్రహణపర్వాలు, పదివేల వ్యతీపాతయోగులూ, లక్ష అమావాస్యా పర్వాలూ ఏకమైన కూడా ఒక్క కార్తీక ద్వాదాశిలో పదహారవవంతు కూడా చేయవని తెలుసుకో. మనకు ఉన్న తిథులలో పుణ్య ప్రదాలైన తిథులెన్ని అయినా ఉండవచ్చునుగాక. కాని వాటన్నింటికంటే కూడా సాక్షాత్తు విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదం అని మరిచిపోకు.    
                  
  ద్వాదశీ దానములు
ఏకాదశినాడు రాత్రి సమయంలో కార్తీకశుద్ధ ద్వాదశినాడు క్షీర సముద్రం నుంచి శ్రీహరి నిద్రలేస్తాడు. అందువల్లనే దీనికి హరిబోధినీ ద్వాదశి అనే పేరు వచ్చింది. అటువంటి ఈ హరిబోధినినాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికి అయినా అన్నదానం చేస్తారో, వాళ్ళు ఇహంలో  భోగసేవలను, పరంలో భోగిశయన సేవలను పొందుతారు. కార్తీక ద్వాదశినాడు పెరుగూ, అన్నం దానం చేయడం సర్వోత్కృష్టమైన దానంగా చెప్పబడుతూ ఉంది. ఎవరైతే ఈ ద్వాదశినాడు పాలు ఇచ్చే ఆవును వెండి రెక్కలూ, బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానం చేస్తారో, వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలు అయితే ఉంటాయో, అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు. ఈ రోజు వస్త్రదానం చేసినవాళ్ళు సంచితార్థాలు అన్నీ సమసిపోయి వైకుంఠాన్ని వెళతారు అనడంలో ఎటువంటి వివాదమూ లేదు. పండ్లు, తాంబూలం, యజ్ఞోపవీతాలను సదక్షిణంగా దానం చేసేవాళ్ళు సమస్త భోగాలనూ అనుభవించి అంత్యంలో ఆ శ్రీహరిని చేరుతారు. ఓ మహారాజా! ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశినాడు సాలగ్రామాన్ని, బంగారపు తులసివృక్షాన్ని, దక్షిణా సమేతంగా దానం చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానం చేసినంత పుణ్యాన్ని పొందుతున్నారు. ఇందుకు నిదర్శనంగా ఒక గాథను చెబుతాను విను.


                    ధర్మవీరోపాఖ్యానము


పూర్వం గోదావరీతీరంలో దురాచారవంతుడూ, పరమ పిసినిగొట్టూ అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు, ఈ పిసినిగొట్టు దానధర్మాలు చేయకపోవడమే కాక, తాను కూడా తినకుండా ధనం ప్రోగుచేసేవాడు. దానధర్మాలే కాదు కనీసం ఎవరికీ మాటసాయమైనా చేసేవాడు కాదు. నిత్యం ఇతరులను నిందిస్తూ ఇతరుల డబ్బులపై ఆసక్తి చూపే ఈ పిసినిగొట్టు ధనాన్ని వడ్డీలకు తిప్పుతూ అంతకంతకూ డబ్బును పెంచుకోసాగాడు. 
ఒకానొక సారి ఈ పిసినిగొట్టు బ్రాహ్మణుడికి ఇచ్చిన అప్పు రాబట్టుకోవడం కోసం, అతని గ్రామానికి వెళ్ళి తాను ఇచ్చిన బాకీని వడ్డీతో సహా వెంటనే చెల్లించాల్సిందిగా పట్టుబట్టాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు 'ఓ ఋణదాతా! నేను నీ బాకీ ఎగవేసే వాడిని కాదు. ఎందుకంటావేమో


శ్లో     యో జీవతి ఋనిణీత్యం నియమం కల్పమశ్నుతే !
    పశ్చాత్తస్యసుతో భూత్వా తత్సర్వం ప్రతిదాస్యతి !!


ఎవడైతే ఋణం తీర్చకుండానే పోతాడో వాడు మరుసటి జన్మలో ఋణదాతకు సంతానం రూపంగా జన్మించి ఆ ఋణాన్ని చెల్లుబెట్టుకోవలసి వస్తుంది. అందుచేత ఎదో విధంగా సంపాదించి ఈ మాసం చివరిలో నీ ఋణం చెల్లుచేస్తాను. అంతవరకూ ఓర్పు వహించి ఉండు' అని చెప్పాడు. 

ఆ బ్రాహ్మణుని మాటలను పరాభవం మాటలుగా భావించిన పిసినిగొట్టు కోపంగా 'నీ కబుర్లు నా దగ్గర కాదు నీబాకీ వసూలు కోసం నెల్లాళ్ళు ఆగే సమయం నాకు లేదు. మర్యాదగా యిప్పుడే ఇవ్వు లేదా ఈ కత్తితో నిన్ను నరికేస్తాను' అన్నాడు. యదార్థంగానే ఆ సమయంలో దానం లేదనీ, అప్పటికప్పుడు తాను ఆ అప్పు తీర్చలేననీ చెప్పాడు బ్రాహ్మణుడు. మరింత మండిపడిన ఆ పిసినారి బ్రాహ్మణుడిని జుట్టు పట్టుకుని లాగి, నేలమీద పడద్రోసి, కాలితో తన్ని, అప్పటికీ కోపం తీరక కత్తితో ఒక వ్రేటు వేశాడు. 

సింహం యొక్క పంజా విసురుకు లేడిపిల్ల చనిపోయినట్లుగా, కోపంతో, ఆవేశంతో ఆ కోమటి కొట్టిన కత్తిదెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు. హత్యానేరానికి గాను రాజు తనను దండిస్తాడు అనే భయంతో త్వరగా ఇంటికి పారిపోయి గుట్టుగా బ్రతకసాగాడు. బ్రతికినంత కాలం గుట్టుగా ఉండగలమే కానీ గుట్టుగా ఉన్నంత మాత్రం చేత ఎల్లకాలం బ్రతకలేం కదా! అదే విధంగా ఆ కోమటి కూడా ఆయువు తీరి మృతిచెందాడు. తక్షణమే యమకింకరులు వచ్చి ఆ జీవుడిని నరకానికి తీసుకుని పోయారు. జనక భూపతీ! 'రురువు'లనే మృగాల చేతా, వాటి శృంగాలచేతా పీడింపచేసే ఒకానొక యాతననే 'రౌరవం' అంటారు. ఈ కోమటిని ఆ రౌరవం అనే నరక విభాగంలో వేసి శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు. యమకింకరులు ఆ ఆజ్ఞను అమలు చేయసాగారు. 

    ఇక భూలోకంలో ఆ పిసినిగొట్టు వైశ్యుడి కుమారుడు ధర్మవీరుడు అనే వాడు మహాదాత, పరోపకారీ అయి, పిత్రార్జితం అయిన ఆ అఖండ ధనరాశులతో ప్రజాశ్రేయస్సు కోసం చెరువులు, నూతులు త్రవ్వించి, తోటలు వేయించి, వంతెనలు కట్టించి, పేదలకు వివాహ ఉపనయనాలు వంటివి చేయిస్తూ యజ్ఞాలు, యాగాలు మొదలైనవి, ఆకలితో అలమటించే వారిని తరతమ భేదం లేకుండా అన్నదానాలు చేస్తూ ధర్మాత్ముడిగా పేరుపొందాడు. ఒకానొక రోజున ధర్మవీరుడు విష్ణుపూజ చేసే సమయంలో త్రిలోక సంచారి అయిన నారదమహర్షి యమలోకం నుండి బయలుదేరి, హరినామ స్మరణ చేసుకుంటూ ఈ ధర్మవీరుడిని దగ్గరకు వచ్చాడు. ముందుకు వచ్చిన మునిరాజు నారదుడిని చూసి, ధర్మవీరుడు భక్తీప్రవత్తులతో ప్రణమిల్లాడు. ఆర్ఘ్యపానాది వివిధ ఉపచారాలతోనూ నారదుడిని పూజించి 'నారదా! దేవర్షులైన మీరు ఇలా మా భూమండలానికి అందులోనూ నా గృహానికి విచ్చేయడం వలన నా జన్మ ధన్యమైంది. హే దివ్య ప్రభువా! నేను నీ దాసుడినే. నన్నేమి చేయమంటావో ఆజ్ఞాపించు. నువ్వేం చెబితే అది చేస్తాను' అని వినయపూర్వకంగా వేడుకున్నాడు. 

    అందుకు సంతోషించిన నారదముని చిరునవ్వు ముఖం కలవాడై 'ధర్మవీరా! నాకోసం నువ్వు ఏమే చేయనక్కరలేదు. నీ శ్రేయస్సు కోసం చెబుతున్న నా ఈ మాటలని శ్రద్ధగా విను కార్తీక ద్వాదశీ శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రియమైన రోజు. ఆ రోజున చేసిన స్నానదాన జపతపాలు వాటి కార్యాలు అన్నీ కూడా విశేషమైన ఫలాన్ని ఇస్తాయి. ధర్మవీరా! సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశినాడు ప్రాతఃస్నానం చేసి సాలగ్రామ దానం చేసే వారు దరిద్రులుకానీ, ధనికులుకానీ, యతులుకానీ, వానప్రస్థులుకానీ, బ్రాహ్మణులుకానీ, క్షత్రియులుకానీ, వైశ్యులుకానీ, శూద్రులూ, స్త్రీలేకానీ వాళ్ళు ఎవరైనా సరే జన్మజన్మాంతరాలలో చేసిన పాపాలను దహింపచేసుకున్న వాళ్ళే అవుతారు. మరో ముఖ్య విషయం చెబుతాను విను. నీ తండ్రి మరణించి, యమలోకంలో పడరాని పాట్లు పడుతున్నాడు. అతణ్ణి నరకబాధా విముక్తిని సంకల్పించి నువ్వు కార్తీక ద్వాదశినాడు సాలగ్రామ దానం చెయ్యి'.

    నారదుడు చెప్పినది అంతా విని నవ్వేశాడు. ధర్మవీరుడు ఇలా అడిగాడు 'నారదమునీంద్రా! నా తండ్రి పేరున గో, భూ, తిల, సువర్ణ మొదలైన దానాలు ఎన్నో చేశాను. వాటివల్ల వెలువరింపబడిన నరకయాతన కేవలం సాలగ్రామం అనే పేరు కలిగిన రాతిని దానం చేస్తే సాధ్యం అవుతుందా? అయినా ఆ సాలగ్రామం అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది? తినడానికి పనికిరాదు, అలంకారానికా నవరత్నాలలోనిది కాదు. ఏ రకంగానూ ఎవరికీ కూడా పనికిరాని దాన్ని నేను ఎందుకు దానం చేయాలి? రాతి దాతకు కీర్తీ వుండదు. ఆ దానం పట్టినవాడికి సుఖమూ వుండదు. కాబట్టి ఆ సాలగ్రామ దానం నేను చేయ్యనుగాక చెయ్యను' అన్నాడు. 

    నారదుడు ఎంత అనునయంగా చెప్పినా కూడా, ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలనూ లేదు, సాలగ్రామ దానానికి అంగీకరించనూ లేదు. అంతటితో నారదుడు వెళ్ళిపోయాడు. మరికొంత కాలానికి ధర్మవీరుడు మరణించాడు. గౌరవనీయులూ, సర్వహితాత్ములూ అయిన పెద్దల మాటలను పాటించని పాపానికి సాలగ్రామం దానం చేయకపోవడం వలన నరకానికి చేరుకున్నాడు. తరువాత మూడుసార్లు పులిగాను, మూడుసార్లు కోతిగానూ. అయిదు సార్లు ఆంబోతుగానూ, పది ఆర్లు స్త్రీగానూ జన్మించి వైధవ్య పీడ పొందడం జరిగింది. మళ్ళీ పదకొండవ జన్మలో కూడా ఒకానొక యాచకుడికి పుత్రికగా పుట్టవలసి వచ్చింది. పూర్వకర్మల వలన పెండ్లికుమారుడు తొందరగా మరణించడంతో ఒక్కగానొక్క కూతురికి కలిగిన వైధవ్యానికి చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞానదృష్టితో తన కూతురి పూర్వజన్మల పాపఫలాన్ని తెలుసుకున్నాడు. ఆ విషయాలు అన్నీ ఆమెకు వివరంగా చెప్పి కార్తీక సోమవారం రోజున వేదోక్తంగా, జన్మ జన్మార్జిత పాపనాశనం కోసం సాలగ్రామ దానాన్ని చేయించాడు. 

    ఆ పుణ్యఫలాల వ్యాప్తి వల్ల మరణించిన పెండ్లికొడుకు పునర్జీవితుడు అయ్యాడు. ఆ దంపతులు ఇహజీవితాన్ని ధర్మకామ సౌఖ్యాలతో గడిపి, కాలాంతరం తరురువాత స్వర్గం చేరి, పుణ్యఫలాలను అనుభవించే అర్హులు అయ్యారు. తరువాత ధర్మవీరుడు ఇరవై మూడవ జన్మగా ఒక బ్రాహ్మణ ఇంట్లో శిశువుగా పుట్టి, పూర్వజన్మలో చేసిన మహాత్వపూర్వకమైన సాలగ్రామా దాన పుణ్య విశేషం వల్ల జ్ఞాని అయి ప్రతి సంవత్సరం ప్రయుక్త కార్తీక సోమవార పర్వదినాలలో సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలం వల్ల 'రౌరవ' గతుడు అయిన ఇతని తండ్రి కూడా నరకం నుండి విముక్తుడు అయ్యాడు. కాబట్టి జనక మహారాజా! కార్తీకమాసంలో సాలగ్రామ దానం చేత ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేయడమే సర్వోత్తమైన ప్రాయశ్చిత్తం. 'ఇంతకు మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు' అనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు.

                పదకొండు పన్నెండు అధ్యాయాలు సమాప్తం

                        ఆరవరోజు పారాయణం సమాప్తం

    ఈ క్రింది వీడియో యువర్. ఆర్. యల్. లు . చూడండి ...




    Note:  

    నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share, and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share, and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుందిథాంక్యూ.



    18, నవంబర్ 2020, బుధవారం

    5 కార్తీక పురాణం విశిష్టత - ఐదవ రోజు పారాయణం

    wowitstelugu.blogspot.com

    5 కార్తీక పురాణం విశిష్టత  - ఐదవ రోజు పారాయణం 

    5 అధ్యాయము

    వనభోజన మహత్యం

    వశిష్టుడు తిరిగి జనకమహారాజుతో ఇలా అంటున్నాడు… 

    • ”ఓ జనక మహారాజా! కార్తీక మాసంలో స్నాన దాన పూజానంతరమున, శివాలయమున నందు గాని, విష్ణాలయము నందు గాని, శ్రీ మద్భగవద్గీతా పారాయణము తప్పక చేయాలి. అలా చేసినవారి సర్వ పాపములును నివృత్తియగును. 
    • ఈ కార్తీక మాసములో, కరవీర పుష్పములు, శివకేశవులకు సమర్పించినవారు, వైకుంఠమునకు వెళ్తారు. 
    • భగవద్గీత కొంత వరకు పఠించిన వారికీ, విష్ణులోకం ప్రాప్తిస్తుంది. ఒక్క శ్లోకములో ఒక్క పదమైననూ కంఠస్థం చేసినట్లయితే, విష్ణు సాన్నిధ్యం పొందుతారు. 
    • కార్తీక మాసంలో పెద్ద ఉసిరి కాయలతో నిండిఉన్న ఉసిరి చెట్టు కింద, సాలగ్రామమును యదోచితంగా పూజించి, విష్ణుమూర్తిని ధ్యానించి, ఉసిరి చెట్టు నీడన, భోజనం చేయాలి.
    • బ్రాహ్మణులకు కూడా, ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి, దక్షణ తాంబూలములతో సత్కరించి, నమస్కరించాలి. 
    • వీలును బట్టి, ఉసిరి చెట్టు కింద, పురాణకాలక్షేపం, చేయాలి. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు, నీచ జన్మంపోయి, నిజ రూపం కలిగింది” అని చెప్పారు. 
    • అది విన్న జనకుడు, ”ముని వర్యా! ఆ బ్రాహ్మణ యువకునకు, నీచజన్మం ఎలా కలిగింది? దానికి గల కారణమేమిటి?” అని ప్రశ్నించాడు. దానికి వశిష్టుడు ఇలా చెబుతున్నాడు…

    కిరాతుడు, ఎలుకలకు మోక్షం

    రాజా! కావేరి నదీ తీరంలో, ఒక గ్రామంలో, దేవశర్మ అనే బ్రాహ్మణుడున్నాడు. ఆయనకో కొడుకున్నాడు. అతని పేరు శివశర్మ. చిన్నతనం నుంచి భయం భక్తి లేక గారాబంగా పెరిగాడు. దీనివల్ల నీచ సహవాసాలు అలవాటయ్యాయి. అతని దురాచారాలు చూసిన తండ్రి, ఒకరోజు, అతన్ని పిలిచి, ”బిడ్డా…! నీ అపచారాలకు అంతు లేకుండా పోతోంది. నీ గురించి ప్రజలు ఎన్నో రకాలుగా చెప్పుకొంటున్నారు. నన్ను నిలదీస్తున్నారు. నీ వల్ల వస్తున్న నిందలకు నేను సిగ్గుపడుతున్నాను. నలుగురిలో తిరగలేకపోతున్నాను. కనీసం ఈ కార్తీక మాసంలోనైనా, నువ్వు బుద్ధిగా ఉండు. నదిలో స్నానం చేయి. శివకేశవులను స్మరించి, సాయంకాలం సమయంలో దేవాలయంలో దీపారాధన చేయి. నీ పాపాలు తొలగిపోయే అవకాశాలుంటాయి. నీకు మోక్షం ప్రాప్తిస్తుంది” అని చెప్పాడు. దానికి ఆ పిల్లాడు మూర్ఖంగా… ”స్నానం చేస్తే మురికి పోతుంది. అంతే…! దానికి వేరే ఏమైనా వస్తుందా? స్నానం చేసి పూజ చేస్తే దేవుడు కనిపిస్తాడా? గుళ్లో దీపం పెడితే లాభమేమిటి? ఇంట్లో పెడితే వెలుగైనా వస్తుంది కదా?” అని ఎదురు ప్రశ్నలు వేశాడు.

    దాంతో ఆ బ్రాహ్మడు ”ఓరీ నీచుడా! కార్తీక మాస ఫలాన్ని ఎంత చులకన చేస్తున్నావు. నీ అంతటి కొడుకు నాకెందుకు? నీవు అడవిలో ఉన్న రావిచెట్టు తొర్రలో, ఎలుక రూపంలో  బతుకుదువుగాక” అని శపించాడు. ఆ శాపంతో గజగజా వణికిపోయిన శివశర్మ, తండ్రి పాదాలపై పడిo… ”నన్ను క్షమించండి. అజ్ఞానాంధకారంలో పడి, దైవాన్ని, దైవకార్యాలను చులకన చేశాను. నాకు ఇప్పుడు పశ్చాత్తాపమైంది. నాకు శాపవిమోచనం చెప్పండి” అని కోరాడు. అంతట ఆయన, ”బిడ్డా! నా శాపం అనుభవించక తప్పదు. అయితే నీవు ఎలుక రూపంలో ఉన్నా.. కార్తీక మహత్మ్యాన్ని వింటే, నీకు పూర్వ దేహస్థితి కలిగి, ముక్తిని పొందుతావు” అని ఊరడించాడు.

    తండ్రి శాపంతో, శివశర్మ, ఎలుక రూపాన్ని ధరించి, అడవికి పోయి, చెట్టు తొర్రలో నివసిస్తూ, పండ్లు తింటూ బతకసాగాడు. కావేరీ నదీతీరాన ఉన్న రావిచెట్టు తొర్రలో, అతను నివాసమేర్పరుచుకోవడం వల్ల, నదీస్నానానికి వచ్చేవారు, అక్కడున్న వృక్షం కింద, విశ్రమించేవారు. నదీ స్నానం చేసేవారు, రామాయణ, మహాభారతాలు, పురాణగాథల్ని, చెప్పుకొనేవారు. కార్తీకమాసంలో, ఒకానొకరోజున, మహర్షి విశ్వామిత్రుడు, తన శిష్యులతో కలిసి అక్కడకు వచ్చాడు. ప్రయాణ బడలిక వల్ల, ఆ రావిచెట్టు కింద కూర్చుని, విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో, తన శిష్యులకు, కార్తీకపురాణ విశేషాన్ని బోధిస్తున్నారు. చెట్టు తొర్రలో ఎలుక రూపంలో ఉన్న శివశర్మ కూడా, ఆ కథను విన్నాడు. ఋషిదగ్గర ఉన్న పూజా సామాగ్రిలో, తినేందుకు ఏమైనా దొరుకుతుందేమోనని, చెట్టు మొదట నక్కి, చూస్తున్నాడు.

    అంతలో ఒక కిరాతకుడు, చెట్టుకింద ఉన్నవారిని దూరం నుంచి చూసి, ”ఓహో… ఈ రోజు నా పంట పండింది. ఈ బాటసారులను దోచుకుంటే, డబ్బేడబ్బు” అని, ఆలోచించసాగాడు. అతనలా ఆలోచిస్తూ దగ్గరకు వచ్చేసరికి, మునులను చూశాడు. ఒక్కసారిగా, అతని బుద్ధి మారిపోయింది. వారందరికీ నమస్కరించి, ”మహానుభావులారా…! మీరెవరు? ఎందుకు ఇక్కడకు వచ్చారు? మీ దివ్య దర్శనంతో, నా మనసు పులకించిపోతోంది” అని అన్నాడు. అంతట విశ్వామిత్రుడు ”ఓ కిరాతకా! మేం కావేరీ నదీ స్నానమాచరించేందుకు ఇక్కడకొచ్చాం. ఇప్పుడు కార్తీక పురాణం పఠిస్తున్నాం. నువ్వుకూడా ఇక్కడ కూర్చొని, వినవచ్చు” అన్నారు.

    అటు ఎలుక, ఇటు కిరాతకుడు, శ్రద్ధగా కథ వినసాగారు. కథ వింటుండగా… ,కిరాతకుడికి, తన పూర్వజన్మ వృంతాతమంతా, జ్ఞాపకమొచ్చింది. పురాణ శ్రవణం తర్వాత, రుషులకు దండం పెట్టి, సాష్టాంగం చేసి, వెళ్లిపోయాడు. ఎలుక కూడా, పురాణమంతా వినడం, చెట్టుకింద దొరికిన ఫలాలను బుజించడం వల్ల, తన స్వరూపాన్ని పొందగలిగింది. ఎలుక రూపం నుంచి విముక్తి పొందిన శివశర్మ, విశ్వామిత్రుడితో ”మునివర్యా! ధన్యుడనయ్యాను. మీ వల్ల నేను మూషిక రూపం నంచి విముక్తి పొందాను” అని తన వృత్తాంతమంతా చెప్పాడు.

    ”కాబట్టి జనకమహారాజా…! ఈ లోకంలో సిరిసంపదలు, పరమున మోక్షాన్ని కోరేవారు, తప్పక, ఈ కార్తీక పురాణాన్ని చదివి, ఇతరులకు వినిపించాలి. బంధుమిత్రులతో కలిసి వనభోజనమాచరించాలి” అని వివరించారు.

     స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి ఐదవ అధ్యాయము

    ఐదవ రోజు పారాయణము సమాప్తము.

    ఈ క్రింది  వీడియో యు. ఆర్.యల్. లు చూడండి.


    Note:  

    నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like,share and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe,Also see my  Youtube channel bdl telugu tech-tutorials like, share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుందిథాంక్యూ.


    4 కార్తీక పురాణం విశిష్టత - నాలుగో రోజు పారాయణం

    wowitstelugu.blogspot.com
    4 కార్తీక పురాణం విశిష్టత - నాలుగో రోజు పారాయణం

    • ఈ విధముగా వశిష్టుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా జనకుడు 'మహాతపస్వీ! తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివితీరకున్నది. కార్తీక మాసంలో ముఖ్యముగా ఏమేమి చేయవలెనో, ఎవరినుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడూ అని కోరగా, వశిష్టులవారు ఇట్లుచెప్పదొడగిరి.

    • జనకా! కార్తీక మాసమునందు సర్వ సత్కారములు చేయవచ్చును. దీపారాధనము అందు అతి ముఖ్యము. దీని వలన మిగులు ఫలమునొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్ధము శివాలయమున కానీ, విష్ణాలయమునందు కానీ దీపారాధనము చేయవచ్చును. సూర్యాస్తమయమందు, అనగా, సంధ్య చీకటి పడు సమయమున శివకేశవుల సన్నిధిని కానీ, ప్రాకారమునందు కానీ దీపం ఉంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠప్రాప్తినొందుదురు. 
    • కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ, ఏదీ దొరకనప్పుడు ఆముదముతో కానీ దీపమును వెలిగించి వుంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములుగా అగుటయే గాక అష్టైశ్వర్యములు కలిగి శివసన్నిధి కేగుదురు. ఇందుకొక కథ కలదు, వినుము.

    శతృజిత్కథ

    పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి, తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్టతో తపమాచరించుచుండగా నచ్చటకు పిప్పలాదుడను ముని పుంగవుడొచ్చి 'పాంచాల రాజా! నీవు ఎందులకింతటి తపమాచరించుచున్నావు? నీ కోరికయేమి?' అని ప్రశ్నించగా, 'ఋషి పుంగవా! నాకు అష్టైశ్వర్యములు, రాజ్యము, సంపదలు వున్ననూ, నా వంశము నిలుచుటకు పుత్రసంతానము లేక, కృంగి, కృశించి యీ తీర్థ స్థానమున తపమాచరించుచున్నానూ అని చెప్పెను. అంత మునిపుంగవుడు 'ఓయీ! కార్తీక మాసాన శివసన్నిధిన శివ దేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన యెడల నీ కోరిక నెరవేర గలదూ అని చెప్పి వెడలిపోయెను.


    వెంటనే పాంచాల రాజు తమ దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తికై అతి భక్తితో కార్తీక మాసము నెలరోజులూ శివాలయమున కార్తీక దీపారాధన చేయించి, దానధర్మాలతో నియమానుసారముగా,  వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచూ, విడువకుండా నెలదినములు అటుల చేసెను. తత్పుణ్యకార్యము వలన నా రాజు భార్య గర్భవతియై క్రమముగా నవమాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని కనెను. రాజ కుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సావం చేయించి, బ్రాహ్మణులకు దానధరమములు జేసి, ఆ బాలునకు 'శతృజిత్తూ అని నామకరణం చేయించి అమిత గారాబముతో పెంచుచుండిరి.


    కార్తీకమాస దీపారాధన వలన పుత్రసంతానము కలిగినందువలన తమ దేశమంతటను ప్రతి సంవత్సరం కార్తీకమాస వ్రతములు, దీపారాధనలు చేయుడని రాజు శాసించెను. రాకుమారుడు శతృజిత్తు దినదిన ప్రవర్ధమానుడగుచూ సకల శాస్త్రములు చదివి, ధనుర్విద్య, కత్తి సాము మొదలుగునవి నేర్చుకొనెను. కాని, యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను, తల్లిదండ్రుల గారాబము చేతను తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచూ, ఎదిరించిన వారిని దండించుచూ, తన కామవాంఛ తీర్చుకొనుచుండెను.


    తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన కుమారుడని చూసీచూడనట్లు, వినీవిననట్టు ఉండిరి. శతృజిత్తు ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డుజెప్పు వారను నరుకుదునని కత్తిపట్టుకొని ప్రజలను భయకంపితులను జేయుచుండెను. అటుల తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య. మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మధునికైననూ శక్యము గాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్య బొమ్మ వలె నిశ్చేస్టుడై కామ వికారముతో ఆమెను సమీపించి తన కామ వాంఛ తెలియజేసెను. ఆమె కూడా ఆతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడచి అతని చేయి బట్టుకొని తన శయన మందిరానికి తీసుకొని బోయి భోగములను అనుబవించెను.


    ఇట్లొకరికొకరు ప్రేమపరవశులగుట చేత వారు ప్రతి దినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచూ తమ కామ వాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటుల కొంతకాలము జరిగెను. ఎటులనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి, పసిగట్టి భార్యను, రాజకుమారుని ఒకేసారి చంపవలెనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను.


    ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురును శివాలయమున కలుసుకొనవలెనని నిర్ణయించుకొని, ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి ఎటులనో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కాముకులిద్దరునూ గుడిలో కలుసుకొని గాఢాలింగనమొనర్చుకొను సమయమున చీకటిగా ఉన్నది దీపముండిన బాగుండును గదా, అని రాజకుమారుడనగా, ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను. తర్వాత వారిరువురూ మాహానందముతో రతిక్రీడలు సలుపుటకు వుద్యుక్తులగుచుండగా, అదే అదునుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను, ఆ రాజకుమారుడిని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను.


    వారి పుణ్యము కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి, సోమవారమగుటవలన, ఆ రోజు ముగ్గురునూ చనిపోవుట వలనను శివదూతలు ప్రేమికులనిరువురినీ తీసుకొనిపోవుటకును, యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడికి వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు 'ఓ దూతలారా! నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరేల వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటేల? విచిత్రముగా వున్నదే!' అని ప్రశ్నించేను. 

    అంత యమకింకరులు 'ఓ బాపడా! వారెంతటి నీచులైననూ, ఈ పవిత్రదినమున, అనగా, కార్తీక పౌర్ణమి, సోమవారపు దినమున, తెలిసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిని దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నియూ నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారూ అని చెప్పగా యీ సంభాషణంతయు వినుచున్న రాజ కుమారుడు 'అలా ఎన్నటికినీ జరుగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురమునూ ఒకే సమయంలో ఒకే స్థలములో మరణించితిమి. కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే' అని, తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రహ్మణునికి దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానమెక్కించి శివసాన్నిధ్యమునకు జేర్చిరి.


    వింటివా రాజా! శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపము పోవుటయే గాక, కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన, కార్తీక మాసములో నక్షత్రమాల యందు దీపముంచిన వారు జన్మరాహిత్యమొందుదురు.


    స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి నాల్గవ అధ్యాయము

    నాల్గవ రోజు పారాయణము సమాప్తము.

    ఈ క్రింద వీడియో యు. ఆర్. యల్ . లు చూడండి

    Note: 

    నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe,Also see my  Youtube channel bdl Telugu tech-tutorials like share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుందథాంక్యూ.