20, ఏప్రిల్ 2020, సోమవారం

భూమి లాంటి వాతావరణం ఉన్న గ్రహాన్ని ఆరు గ్రహాల కూటమిని కనుగొన్న కెప్లెర్ టెలీస్కోప్

wowitstelugu.blogspot.com

భూమి లాంటి వాతావరణం ఉన్న గ్రహాన్ని  ఆరు  గ్రహాల  కూటమిని  కనుగొన్న కెప్లెర్  టెలీస్కోప్


New Earth like planet 

చాలాకాలం పనిచేయ కుండా ఉన్న
 నాసా యొక్క కెప్లర్  స్పేస్ టెలిస్కోప్  గోల్డిలాక్స్ జోన్లో తన నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భూమి లాంటి గ్రహాన్ని కనుగొంది.  గ్రహాంతరవాసుల జీవితాన్ని కనుగొనటానికి మానవుల సుదీర్ఘ అన్వేషణ సఫలీకృతం అయ్యే  అవకాశాలున్నాయేమో అని శాస్త్రజ్ఞులు సంతోషిస్తున్నారు.  ఈ గ్రహాలపైనా మరింత పరిశోధన చేసి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి అవకాశం కలుగు తుందని శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు.

బహిర్గతమైన గ్రహం కెప్లర్ -1649  ఈ  గ్రహం భూమికి సుమారు 300 కాంతి సంవత్సరాల దూరం లో స్పష్టంగా ఉంది. ఈ రాతి గ్రహం యొక్క కొంత భాగాన్ని గురించి మనం చెప్పుకొనేది  ఏమిటంటే,  శాస్త్రజ్ఞులు అంచనా   వేసిన ఉష్ణోగ్రత భూమికి చాలా పోలి క ఉంది. ఈ గ్రాహం లో  నీటి శాతం ఎక్కువుగా ఉన్నటు కనుగొన్నారు. అట్లాంటిక్ శాస్త్రవేత్తల బృందం అదనంగా, కొత్తగా ఎక్సోప్లానెట్ 75% సౌర శక్తిని పొందుతుందని తమ నివేదికలో తెలియ జేశారు.  ఈ కారణగానే  క్రిమ్సన్ డ్వార్ఫ్  అంతటా ఈ గ్రహం తిరుగుతుంది.


Earth and new earth-like planet Kepler 


కెప్లర్ -1649 భూమి కంటే చాలా వేగంగా తిరుగుతుంది- కెప్లర్ -1649 లో ఒక సంవత్సరం లో కేవలం 19.5 రోజుల్లో తిరుగుతుంది . ఇది కక్ష్యలో ఉన్న పెద్ద పేరును నక్షత్ర మంట-అప్స్ అని పిలుస్తారు, చివరికి పరిసరాలు ఉనికిలో ఉండటం అసాధారణంగా కష్టతరం చేస్తుంది. నాసా యొక్క కెప్లర్ ఏరియా టెలిస్కోప్  మార్చి 7, 2009  న రౌండ్ 03:49:57 UTC వద్ద భూమి-పరిమాణలో ఉన్న  ఎక్స్ ప్లానెట్లను వాటి పైభాగంలో ఉన్న  కక్ష్యలు గురించి  సమీక్షించడానికి ప్రవేశ పెట్టబడింది.

టెలిస్కోప్‌లో ఉత్పత్తి చేయబడిన భారీ మొత్తంలో సమాచారాన్ని సేకరించి ఉంచడానికి  పరికర  గాడ్జెట్- రోబోవెట్టర్ కెప్లెర్ లో నిక్షిప్తం చేయబడి ఉంది. మునుపటి సిగ్నల్స్ ను  తిరిగి విశ్లేషించడానికి డేటా ఆపరేటింగ్ సిబ్బందిరక రకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు.గ్రహాలను గుర్తించడానికి ఉపయోగించే సంకేతాలు  కొన్ని లోపాలను (ఎర్రర్స్) సృష్టిస్తున్నాయని  నాసాలోని పరిశోధకులు విశ్వసిస్తున్నారు.  ఆస్టిన్లోని కాలేజ్ ఆఫ్ టెక్సాస్ శాస్త్రవేత్తలు కెప్లర్ -1649 ను  పరిశోధించారు.


ఈ టెలిస్కోప్ గ్రహం యొక్క స్థాయిని మరియు స్థలాకృతిని మాత్రమే  గుర్తించింది, అయితే గ్రహం యొక్క అమరికతో సంబంధం ఉన్న మిగతా  జ్ఞానాన్ని మనకు  ఇవ్వలేదు. ఈ కొత్త గ్రహం గురించి అదనపు విషయాలు  అర్థం చేసుకోవడానికి విశ్లేషణ జరుగుతోందని నాసా నివేదించింది, అయితే ప్రస్తుతానికి, పెద్ద సంఖ్యలో ఇందులో తప్పులు ఉండవచ్చని భావిస్తున్నారు.

ఈ క్రింది యు.ఆర్.యల్.లు క్లిక్ చేసి మరింత తెలుసు కోండి. 

Search Results

Search Results

Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 

నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ.








19, ఏప్రిల్ 2020, ఆదివారం

ధన్వంతరి ఎవరు ? కరోనా తో సహా అనేక రోగాల నివారణకు ధన్వంతరి మంత్రం

wowitstelugu.blogspot.com

ధన్వంతరి ఎవరు ? కరోనా  తో సహా అనేక రోగాల నివారణకు ధన్వంతరి మంత్రం గురించి తెలుసుకోండి

ధన్వంతరి భగవానుడు 

ధన్వంతరి అర్ధం:

ధన్వన్తరి శబ్దానికి "ధనుఃశల్యం, తస్య అంతం పారం ఇయర్తి, గచ్ఛతీతి, ధన్వన్తరిః" అని వ్యుత్పత్తి (Etymology) చెప్పబడింది. మనస్సు, శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా దోషాలు, రోగాలు, శరీరం లోపల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైన వాటిని నివారించే వానిగా చెప్పవచ్చును. పురాతనకాలం నుంచి భారతదేశంలో శస్త్ర చికిత్సా కుశలులైన వారికి "ధాన్వన్తరీయులు" అని వ్యవహరించడం వాడుకలో ఉంది.

ధన్వంతరి ఎవరు :

ధన్వంతరి అనే అతనికి భిన్న కథనాలు ఉన్నాయి అవి ఏమిటో తెలుసుకొందాము. ధన్వంతరిని హిందూ  సంస్కృతి  ప్రకారం   ఒక ఉన్నతమైన వ్యక్తి. ఆయుర్వేదం కి  ఒక ఆదర్శ మూర్తి మరియు రోగాలు పారద్రోలే ఒక దేవుడు లేదా వైద్యవృత్తికి  మూల విరాట్ గా భావిస్తారు . 

  • భాగవతంలో క్షీరసాగర మధనం సమయంలో అమృత కలశాన్ని చేబట్టుకొని అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారంని ధన్వంతరి అంటారు .

  • బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం భాస్కరుని (సూర్యభగవానుని) వద్ద ఆయుర్వేదం నేర్చుకొన్న  వ్యక్తి ని ధన్వంతరి అంటారు. ఇతడు సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడు.

  • కాశీరాజు దేవదాసు ధన్వంతరి (అంటే "ధన్వంతరి" అన్న బిరుదు కలిగిన కాశీరాజు "దేవదాసు") - ఇతడు శుశ్రుతునికి ఆయుర్వేదం, శస్త్ర చికిత్స నేర్పాడు. ఇతడు పురాణాలలో చెప్పబడిన ధన్వంతరి అవతారమన్న విశ్వాసం ఉంది.

  • పూర్వకాలంలో గొప్ప గొప్ప ఆయుర్వేద వైద్యులను "ధన్వంతరి" అనే బిరుదుతో సత్కరించేవారు. కనుక వివిధ ధన్వంతరుల కథలు చరిత్రలో కలగలుపు అయి ఉండవచ్చును.

  • విక్రమాదిత్యుని ఆస్థానంలో "నవరత్నాలు"గా ప్రసిద్ధులైన పండిత ప్రతిభామూర్తులలో ఒకడు. ఇతడే "ధన్వంతరి నిఘంటువు" అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంథాన్ని రచించాడని ఒక అభిప్రాయం.
భాగవతం అష్టమ స్కంధంలో ఏమని ఉందంటే 

  • క్షీరసాగర మధనం సమయాన ముందుగా హాలాహలం ఉద్భవించింది. దానిని  మహాదేవుడు  హరించాడు. కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరించారు. తరువాత రమాదేవి అవతరించి విష్ణువు వక్షోభాగాన్ని అలంకరించింది. తరువాత ధన్వంతరి అవతరించాడు.

  • "అప్పుడు సాగర గర్భంనుండి ఒక పురుషుడు, పీనాయుత బాహు దండాలను, కంబుకంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్షఃప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణికుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశాన్ని దాల్చినవాడు ఆవిర్భవించాడు. అతని విష్ణుదేవుని అంశాంశ వలన పుట్టినవాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి "ధన్వంతరి" అని పేరు పెట్టినారు.

  • భాగవతం లోనే నవమ స్కంధంలో కాశీరాజు ధన్వంతరి గురించి పురూరవ  వంశక్రమంలో ఉంది.

  • ఆ ప్రకారం పురూరవునికి క్షత్రవృద్ధుడు, అతనికి సుహోత్రుడు, సుహోత్రునకు కాశ్యుడు, అతనికి కాశి,  కాశికి దీర్ఘతపుడు, దీర్ఘతపునికి ధవ్వంతరి జన్మించారు.

  • ధన్వంతరి హరి అంశతో ప్రభవించి ఆయుర్వేద ప్రవర్తకుడయ్యాడు. 

  • విష్ణుపురాణంలో కూడా ఈ వంశక్రమం ఉంది. ధన్వంతరికి మూడవ తరంవాడు దివోదాసుడు (దివోదాస ధన్వంతరి).

ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రాన్ని ఎనిమిది (8) భాగాలుగా (ఆష్టాంగాలుగా) విభజించారట. అవి...
  • కాయ చికిత్స (Internal Medicine)

  • కౌమారభృత్య లేదా బాలచికిత్స (Paediatrics)

  • భూతవైద్యం లేదా గ్రహచికిత్స (Psychiatry)

  • శలాక్యతంత్ర(Otto-Rhino-Laryngology & Opthalmology )

  • శల్యతంత్ర (Surgery)

  • విషతంత్ర (Toxicology)

  • రసాయన తంత్ర (Geriatrics)

  • వశీకరణ తంత్ర (The therapy for male sterility, impotency and the promotion of virility)
  • కేరళలో సిద్ధ, ఆయుర్వేద వైద్య విధానంలో "అష్టవైద్యం" అనే ఒక విధానం ప్రసిద్ధి చెందింది. ఇది శతాబ్దాల తరబడి అవిచ్ఛిన్నంగా, పెద్దగా మార్పులు లేకుండా సాగుతున్నది. 

  • ఇలాంటి వైద్యం చేసే కుటుంబాలు ధన్వంతరిని పూజిస్తుంటారు. తమ ఆశ్రమాల లో ధన్వంతరి ఆలయాలను, విగ్రహాలను ప్రతిష్ఠించారు
  • అలయిత్తూర్, కుట్టంచేరి, తైక్కాడ్, వయస్కార, వెల్లోడ్, చిరత్తమన్‌లలో అష్టవైద్య విధానాన్ని అనుసరించే కుటుంబాలున్నాయి.

  • కొట్టక్కల్ పులమంటల్ గ్రామంలోను, వడక్కంచేరి వద్ద, త్రిసూర్ పెరుంగ్వా వద్ద అలాంటి ఆలయాలున్నాయి. , 

ధన్వంతరి ఆలయాలు :

  • ధన్వంతరి ఆలయాలు ప్రత్యేకంగా కనిపించడం అరుదు. వారాణసి లోని    సంస్కృత విశ్వవిద్యాలయం మ్యూజియంలో ఒక ధన్వంతరి విగ్రహం ఉంది. ఢిల్లీలోని "ఆయుర్వేద, సిద్ధ పరిశోధన మండలి కేంద్రం" (Central council for Research in Aurveda and Siddha) లో ఒక పెద్ద, ఒక చిన్న ధన్వంతరి విగ్రహాలున్నాయి.

  • ఆంధ్రప్రదేలోని  తూర్పు గోదావరి జిల్లాలోని చింతలూరు లో న  ప్రసిద్ధమైన ధన్వంతరి భగవానుని దేవాలయం ఉంది.

  • తమిళనాడు లోని శ్రీరంగం రంగనాధస్వామి ఆలయం ఆవరణలో ఒక ధన్వంతరి మందిరంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. మందిరం వద్దనున్న శిలాఫలకం ప్రకారం అది 12వ శతాబ్దానికి చెందినది. అప్పటి గొప్ప ఆయుర్వేద  వైద్యుడు గరుడవాహన భట్టార్ ఈ మందిరంలో మూర్తిని ప్రతిష్ఠించినట్లు తెలుస్తున్నది. ఇక్కడ తీర్ధంగా కొన్ని మూలికల రసం (కషాయం) ఇస్తారు.

  • కేరళలో, గురువాయూర్, త్రిస్సూర్‌లకు మధ్య 20 కి.మీ. దూరంలో "నెల్లువాయ" అనే గ్రామంలో ఒక ధన్వంతరి గుడి ఉంది. ఇది గురువాయూర్ దేవస్థానం అంత పురాతనమైనదని భావిస్తారు. తమ చికిత్సావృత్తి ప్రాంభానికి ముందు చాలా మంది ఆయుర్వేద వైద్యులు ఈ మందిరాన్ని దర్శిస్తుంటారు.

  • కేరళలోనే కాలికట్ పట్టణం పరిసరాలలో ఒక "ధన్వంతరి క్షేత్రం" ఉంది. ఈ మందిరం ఇప్పుడు అధికంగా జనాదరణ పొందుతున్నది. వ్యాధి నివారణకు, ఆరోగ్యానికి ఇక్కడి దేవుడిని దర్శించి ప్రార్థనలు చేస్తుంటారు.

ధన్వంతరి వ్రతం: 

ఆయుర్వేద వైద్యులు ప్రతియేటా "ధన త్రయోదశి" (దీపావళికి రెండు రోజుల ముందు) నాడు భక్తితో ఈ వ్రతం జరుపుకొంటారు.

ధన్వంతరి మంత్రం:

"ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశ హస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్య నాథాయ శ్రీ మహా విష్ణవే నమః"


పై మంత్రాన్ని జబ్బుతో ఉన్నవారు 108 సార్లు జపిస్తే ఉపశమనం లభిస్తుందని కొందరి విశ్వాసం.


యూట్యూబ్ వీడియో లింక్ ల లో ఈ మంత్రాన్ని వినండి:


ధన్వంతరి మంత్రం పఠనాలు | కరోనా దూరంగా ఉంచడం కోసం ప్రార్థన ..



Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ.










16, ఏప్రిల్ 2020, గురువారం

ఈ అమ్మవార్లు దశ మహా విద్యలకు సంకేతం. వారిని అర్చించడం ద్వారా ఆయా విద్యలలో మనం ప్రావీణ్యం సాధించవచ్చు

wowitstelugu.blogspot.com
ఈ అమ్మవార్లు  దశ మహా విద్యలకు సంకేతం. వారిని అర్చించడం ద్వారా  ఆయా విద్యల లో మనం ప్రావీణ్యం సాధించవచ్చు 
దశమహావిద్యలు 
పది రకాలైన విద్యలకు పది మంది అమ్మవార్లు ప్రతీకలు.  వారు వరుసగా కాళీ ,తార, త్రిపుర సుందరి,  ధూమావతి,  భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, మాతంగి, భగలామతికమలాత్మిక వీరిని ఆరాదించడం ద్వారా ఆయా శక్తులు మానవుడికి వశమవుతాయి. 

1. కాళీ
కాళీ - కాల పరిణామము
2. తార
తార - వాక్కు, వ్యక్తావ్యక్తము
3. త్రిపుర సుందరి
త్రిపుర సుందరి - ఆనందము, సౌందర్యము
4. ధూమావతి
ధూమావతి - అంతరాళము, అతీత పరబ్రహ్మ శక్తి
5. భువనేశ్వరి
భువనేశ్వరి- అంతరాళము, అతీత పరబ్రహ్మ శక్తి
6. భైరవి
భైరవి - శక్తి, గతి, స్థితి
7. ఛిన్నమస్త
ఛిన్నమస్త - కాల పరిణామము
8. మాతంగి
మాతంగి - వాక్కు, వ్యక్తావ్యక్తము
9. బగళాముఖి
బగళాముఖి - శక్తి, గతి, స్థితి
10. కమలాత్మిక
కమల - ఆనందము, సౌందర్యము

1. తొలి మహా విద్య శ్రీకాళీదేవి

కృష్ణ వర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్రేయసంప్రదాయం చెబుతోంది. తంత్రోక్త మార్గంలో శ్రీకాళీ మహా విద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రు నాశనం, దీర్షాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది.

2వ మహావిద్య శ్రీతారాదేవి

దశ మహావిద్యలలో రెండవ మహా విద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. ఈ దేవిని నీలసరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధనవల్ల శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి లభిస్తుంది.

3వ మహా విద్య శ్రీషోడశీదేవి


అరుణారుణ వర్ణంతో ప్రకాశించే *శ్రీషోడశీదేవి* దశమహావిద్యలలో 3వ మహావిద్యగా ప్రసిద్ధిపొందింది. పరమ శాంతి స్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిరమాస పూర్ణిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపురసుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆసాధకుడికి అన్నిరకాల కష్టనష్టాలనుంచి విముక్తి మానసికశాంతి, భోగం, మోక్షం కలుగుతాయి.

4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి

దశ మహావిద్యలలో 4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమీ తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యధికారాన్ని సమస్త సిద్దుల్ని సకల సుఖభోగాల్ని ఈదేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు.

5వ మహావిద్య శ్రీ త్రిపుర భైరవీ దేవి

దశమహావిద్యలలో 5వ మహా విద్య వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర భైరవీ దేవి. ఈ దివ్యశక్తి స్వరూపిణికి మాఘమాసం పూర్జిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఆర్తత్రాణ పారాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సకల సుఖభోగాలను పొందే శక్తి, సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్షప్రాప్తి సాధకుడికి కలుగుతుంది.

6వ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి

దశ మహావిద్యలలో 6వ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి. ఈ దేవినే వజ్ర వైరోచినీ, ప్రచండ చండీ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. శాక్తేయ సంప్రదాయంలో భిన్నమస్తాదేవికీ ఎంతో ప్రశస్తివుంది. ఈ దేవిని నిష్టతో ఉపాసిస్తే సరస్వతీసిద్ధి, శత్రువిజయం, రాజ్యప్రాప్తి, పూర్వజన్మ పాపాలనుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు, ఎటువంటి కార్యాలనైనా ఆవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది.

7వ మహావిద్య శ్రీ ధూమవతీ దేవి

దశ మహావిద్యలలో 7వ మహావిద్య.. ధూమ వర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతి దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధనవల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది.

8వ మహావిద్య శ్రీ జగళాముఖీ దేవి

దశమహావిద్యలలో 8వ మహావిద్య.. పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీ జగళాముఖీ   దేవికి చెందింది. స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ మహాదేవికి వైశాఖమాస శుక్లపక్ష అష్టమీతిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది.

9వ మహావిద్య శ్రీ మాతంగీదేవి

దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య.. మరకతమ వర్ణంతో ప్రకాశించేశ్రీ మాతంగీ దేవి కి చెందింది. వశీకరణ దేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి వైశాఖమాసం శుక్లపక్ష తృతీయాతిథి ప్రీతిపాత్రమైనది. రాజమాతంగీ, లఘుశ్యామలా, ఉచ్చిష్టచండాలి, అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తుంటారు. ఈ దివ్య స్వరూపిణి ఉసాసనవల్ల వాక్సిద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణాశక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి.

10వ మహావిద్య శ్రీ కమలాత్మికాదేవి

పద్మాసనాసీనయై స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశ మహావిద్యలలో 10వ మహావిద్యగా ప్రశస్తిపొందింది. సకల ఐశ్వర్య ప్రదాయిని అయిన ఈదేవికి మార్గశిరే అమావాస్యతిథి ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక లక్ష్మీస్వరూపిణి అని అర్థం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది.

ఈ క్రింది వీడియో లింక్లు క్లిక్ చేయడం ద్వారా వీడియోలు చూడవచ్చు


దశమహా విద్యలు | Dasa Mahavidyalu | Dasa Mahavidya ...



Note:-

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ.















మణిద్వీపవర్ణనతో అమ్మవారిని ఎలా పూజించాలి. మణిద్వీప వర్ణన ఫలితం ఏమిటి

wowitstelugu.blogspot.com
మణిద్వీపవర్ణనతో  అమ్మవారిని  ఎలా పూజించాలి. మణిద్వీప వర్ణన ఫలితం ఏమిటి
రాజరాజేశ్వరి దేవి 
మణిద్వీపం అని తలచినంత మాత్రమే సకల దరిద్రాలూ దరిదాపుకు చేరవని శాస్త్ర ప్రమాణం. మణిద్వీపాన్ని మనసారా చదివినా లేక గానం చేసినా వచ్చేఫలితాలను వర్ణించడానికి వేయిపడగల ఆదిశేషుడుకి కూడా సాధ్యం కాదు అని ప్రతీతి.

పూజకి కావలసిన పసుపు కుంకుమ అగరువత్తుల కర్పూరం తాంబూలం దీపారాధన వస్తువులు మరియు

నవరత్నాలు .రాగి కంచు వెండి బంగారము మెదలగు లోహాలతో యదాశక్తి అమ్మకు పూజచేసుకుంటూ.సుగంధ ద్రవ్యాలతో మణిద్వీప నివాసినిని పూజిస్తారు.

ఈ బ్రహ్మాండమును కనురెప్పపాటులో సృష్టించి లయముచేయగల ముప్పదిరెండు మహాశక్తుల పరిరక్షణలో ఈ సమస్థ విశ్వమూ ఉండుటవలన ముప్పదిరెండురకాల పూలతో అమ్మవారిని పూజించాలి. 

వాటిలో ఈ క్రిందన ఉదహరించిన పూవులున్నాయి 

1. మల్లెపువ్వులు 

2. గులాబి 

3. సన్నజాజి 

4. విరజాజి 

5.సెంటుమల్లి 

6. డిసెంబరంపువ్వులు 

7. చామంతులు

8. లిల్లీ 

9. ముద్దగన్నేరుపువ్వులు 

10. నందివర్ధనం

11. పారిజాతపూలు 

12. చంద్రకాంతంపూలు 

13. సువర్నగన్నేరుపూలు 

14. కలువ పూలు 

15. పాటలీపుష్పాలు

16. ముద్దనందివర్ధనం 

17. గన్నేరుపూలు 

18. కదంబపూలు

19. మందారాలు 

20. తామరలు 

21. కనకాంబ్రాలు

22. దేవగన్నేరు పూలు 

23. అశోక పుష్పాలు 

24. నిత్యమల్లెపువ్వు

25. కుంకుమపువ్వు 

26. పొన్నపువ్వు 

27. మంకెనపువ్వు

28. రాధామనోహరాలు 

29. కాడమల్లె 

30. నాగమల్లె

31. విష్ణుక్రాంతం 

32. రామబాణం /లేక నూరు వరహాలు పూలు 

33. దేవకాంచన పూలు

34. చంపక ( సంపంగి)

 35. పున్నాగ పుష్పాలు

మొగలి పూవు బంతి పూవూ పూజకు పనికిరాదు
మందారాలలో గులాబీలలో చామంతులలో చాలా రకాలు ఉన్నా వాటన్నిటినీ ఒక్కొక్కటిగానే పరిగణించి ఈక్రింద ఇవ్వడము జరిగింది.మందారాలలో గులాబీలలో చామంతులలో చాలా రకాలు ఉన్నా వాటన్నిటినీ ఒక్కొక్కటిగానే పరిగణించి ఈక్రింద ఇవ్వడము జరిగింది. ఇవ్వికాక ఇంకేమైనా ఉన్నా, వీట్లో ఏమైనా అమ్మ పూజకు పనికిరావన్నా తెలియజేయండి

నైవేధ్యాలుగా 32 రకాలు  చేసి అమ్మవారికి సమర్పించాలి 

మణిద్వీప వర్ణన మహత్యం 
  • శ్రీచక్ర బిందు రూపిణి శ్రీ రాజరాజేశ్వరి శ్రీదేవి శ్రీ మహావిద్య శ్రీ మహాత్రిపురసుందరి శ్రీ లలితా జగన్మాత అమ్మవారు నివాసముండే పవిత్ర ప్రదేశమే మణి ద్వీపం.

  •  పదునాలుగు లోకాల అనంతరం సర్వలోకంలో ఆమె కొలువై వున్నారు. యావత్‌ జగతిని పరిరక్షించే అమ్మవారి మదిలో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకం ఉద్భవించింది. నాలుగువైపులా అమృతంతో కూడిన సముద్రం సరిహద్దులుగా వున్న ఈ ద్వీపాన్ని వర్ణించాలంటే మన శక్తి చాలదు. 

  • మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో పరివేష్టితయై వుంటారు. దేవీ భాగవతంలో మణి ద్వీపం గురించిన వర్ణన వుంది. అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు లాంటి నవనిధులతో పాటు బంగారు మయమైన కొండలు ఈ ద్వీపంలో వున్నాయి.

  •  అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు దర్శనమిస్తారు

  • మొదట వచ్చే ఇనుప ప్రాకారంలో భూమండలంలోని రారాజులు వుంటారు.వీరు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను పంపుతుంటారు

  •  అనంతరం కంచుతో చేసిన రెండో ప్రాకారం వుంటుంది. పచ్చటి అరణ్యములతో, వివిధ రకాల జంతువులు, పక్షుల కిలకిలరావాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనిస్తుంటుంది. ఇలా అనేక ప్రాకారాలు దాటిన అనంతరం చింతామణి గృహంలో అమ్మవారు వుంటారు.

  •  జ్ఞాన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తి మండపంలో మంత్రులతో చర్చలు నిర్వహిస్తారు. వైకుంఠం, కైలాసం కంటే అద్భుతమైన ప్రపంచం అమ్మవారి నివాసం.

  •  యావత్‌ విశ్వంలో ఎక్కడా లభించని అనంతమైన సంపద అక్కడ వుంటుంది. అన్నింటినీ మించి అమ్మ సన్నిధిలో వుండటమే మహావరం. అందుకనే మణిద్వీప వర్ణన పారాయణం చేస్తుంటారు.

  •  ఈ పారాయణంతో ఇంట్లోని వాస్తుదోషాలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలూ లభిస్తాయి.

ఫలశృతి:

  • పదునాలుగు లోకాలకూ పరంజ్యోతియగు మణిద్వీప నివాసిని, పరమేశ్వరిని, తొమ్మిది విధాలుగా కీర్తించుకొనుటకు తొమ్మిది దోహాలతో ఈ స్తోత్రం వ్రాయబడింది.

  •  అమ్మకు నవసంఖ్య ఇష్టంగాబట్టి దీనిని తొమ్మిది పర్యాయములు ప్రతిరోజు చదివిన ప్రతిమనిషి తరించవచ్చు.

  •  దీనిని శుక్రవారమునాడు పూజావిధాన ప్రకారము పూజించి తొమ్మిది మార్లు పారాయణ లేదా గానం చేసిన ధన, కనక, వస్తు, వాహనాది సంపదలు కలిగి భక్తి, జ్ఞాన, వైరాగ్య, సిద్ధులతో ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో తులతూగి, చివరకు మణిద్వీపం చేరగలరు. ఇది శాస్త్రవాక్యం.

  • మణిద్వీప వర్ణన, చింతామణ గృహవర్ణనలు వింటేనే సకల పాపాలూ నశిస్తాయని భక్తకోటి నమ్మకం

శ్రీమాత నివాసం చింతామణి గృహం

విజయదశమి పర్వదిన శుభవేళ ఆ జగజ్జనని, శివాత్మక మణిద్వీప నివాసినీ అయిన ఆ తల్లిని స్మరించుకోవటం ఎంతో శుభప్రదం.ఆ అమ్మ మణిద్వీపంలో   ఎలా అలరారుతోంది  అనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు వర్ణించి చెప్పే కథ.

దేవీభాగవతంలో వర్ణితమై ఉంది. నూతన గృహప్రవేశ శుభ సందర్భాలలో తరతరాలుగామణిద్వీప వర్ణన పారాయణం చేస్తూ ఉండటం ఓ ఆచారంగా వస్తోంది.

మణిద్వీప వర్ణన పూజ విధానం ఈ క్రింది వీడియో లలో చూడండి.

గమనిక :

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ.