12, ఏప్రిల్ 2020, ఆదివారం

దేవుడిని మనం ఎలా ఏ కోరికలు కోరుకోవాలి మన ఇంట్లో చేయకూడని పొరపాట్లు ఏమిటి

wowitstelugu.blogspot.com
దేవుడిని మనం ఎలా ఏ కోరికలు కోరుకోవాలి మన ఇంట్లో చేయకూడని పొరపాట్లు ఏమిటి

ప్రతి రోజు మన దేవుడిని నేను బాగుండాలనో, డబ్బు బాగా సంపాదిం చాలనో, లేక ఇల్లు కట్టుకోవాలనో, మన ఇష్ట దైవానికి లేదా దేవుళ్ళకి కోరుకుంటాం. స్వార్థం తో కోరుకొనే కోరికలు దేవుడు అనుగ్రహించడు . నిజం గా మనం కష్టాల్లో ఉండి నీకు అవి తీర్చ గలిగే కష్టాలైతేనే దేవుడు తీరుస్తాడు కోరికలు, కోరుకోవడాని కూడా కొన్ని నియమాలు ఉన్నాయి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం

  • మన ఇంట్లో నేను నిత్య పూజ రోజు చేయాలి అని కోరుకోవాలి అంటే నీ ఆరోగ్యం బాగుంటే నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉంటే నీ ఇంట్లో నిత్య పూజ చేస్తావు.

  • మనం బతికి ఉన్నంత కాలం ధార్మిక కార్యాలు మీ సంపదతో చేయాలి అని కోరుకోవాలి, అంటే ఎప్పుడూ మీరు ఇచ్చే స్థితిలో ఉండాలి అని అర్థం అంటే ఎప్పటికీ మీకు సంపాదన ఉంటుంది అని అర్ధం .

  • నా ఇంట్లొ దైవానికి నిత్య నైవేద్యం ఉండాలి అని కోరుకోవాలి అంటే నీ ఇంట్లో ధాన్యం ఎప్పుడూ నిలువ ఉంటుంది.
  • భాగవతులతో నీ గడప నిండుగా ఉండాలి అని కోరుకోవాలి అంటే నీకు సమాజంలో తగిన గౌరవం మంచి పేరు రావాలి అని కోరుకోవడం
  • మీ కుటుంబం అంతా సంతోషం గా క్షేత్ర దర్శనం చేసుకోవాలనుకోవడం
  • మీ ఇంటికి ఎవ్వరు వచ్చినా కడుపునిండా భోజనం చేసి వెళ్ళాలి అని కోరుకోవాలి అంటే నీకు అనుకూల వతి అయిన ధర్మపత్నీ (పతి) భాగస్వామి అవుతుంది.
  • నేను నా చివరి దశ వరకు నీ క్షేత్రానికి దర్శనానికి రావాలి అంటే నీకు సంపూర్ణ మైన ఆరోగ్యాన్ని ఇవ్వమని అడగటం..
  •  నువ్వు ఆరోగ్యంగా, ఆర్ధికంగా, కుటుంబం లో అన్యోన్యంగా ఉంటేనే మీ క్షేత్ర దర్శనం జరుగుతుంది ఇంక ఏమీ కావాలి మీ జీవితానికి
  • చివరిగా నేను (స్త్రీ ) పండు ముత్తైదువుగా సంతోషంగా కాలం చేయాలి అని కోరుకోవాలి అంటే భర్తకు సంపూర్ణ ఆయువు ఆరోగ్యం కోరుకోవడం..
  • మనకు తల్లిదండ్రులు ఆ దైవమే వారినికాక మరి ఇంక ఎవరిని అడుగుతాము కానీ ఆ అడిగే కోరిక కూడా ఇలా ఉంటే ఆ దైవం కూడా అనుగ్రహిస్తుంది

ఈ పొరబాట్లు మనం ఎప్పుడు చేయకూడదు ఇవే మన పాలిట మహా గ్రహాపాట్లు...
తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరబాట్లు చాలా సమస్యలకు కారణం అవుతుంది.. ఇది చాదస్తం అనుకునే వారు దయచేసి చడవకండి, హిందూ సంప్రదాయాలను నమ్మే వాళ్ళు మటుకు తెలుసుకుంటే ఆచరిస్తారా లేదా అనేది మీ వ్యక్తిగతం విషయం. ఇవన్నీ మన పెద్దవాళ్ళు ఆచరించిన నియమాలు కనుక తెలియ చేయడం వరకు నా బాధ్యత అవి ఏమిటో తెలుసుకుని పాటించడం పాటించక పోవడం అనేది అది మీ ఇష్టం .

  • పొద్దు ఎక్కేవరకు ఇంట్లో నిద్రపోకూడదు, ఆ టైం లో వాకిలి చిమ్ముకో కూడదు, సూర్యుని మోహన నీళ్లు చల్లినట్టు అప్పుడు నీళ్లు చల్ల కూడదు.
  • నిద్ర లేవగానే ఆ దుప్పటి విదిలించి మడవాలి లేకుంటే దరిద్రదేవత అసనంగా అక్కడ కూర్చుంటుంది.
  • తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలా సేపు కూర్చో కూడదు..తిన్న స్థలం నుండి కాస్త జరిగి అయినా కూర్చో వాలి కానీ చై కడిగి అక్కడే కూర్చుంటే రోగం వస్తుంది అంటారు.
  • మాసిన బట్టలు ఉతికాక స్నానం చేయాలి,బట్టలు అలిచిన నీటిని కాళ్లపైన పోసుకో కూడదు అందులో జేష్ఠ దేవికి ప్రవేశం దొరుకుతుంది.
  • ఇళ్లు ఊడ్చిన చీపురు నిల్చో బెట్టకూడదు.
  • వంట గదిలో వాడిన మసి బట్టలను పొద్దు పోయాక ఉతక కూడదు..
  • సంధ్య కాలంలో సంసారం నిషేధం ,నిద్రపోకూడదు, ఆహారం తిన కూడదు గొడవలు పడకూడదు, ఆ సమయం ప్రదోషం కాలం ,ధ్యానం పూజ,మంచి ఫలితం ఇస్తుంది.
  • పూజ గదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉండకూడదు , లోహం అయితే ఎత్తు తక్కువగా ఉండాలి, కొంచెం పెద్దగా ఉంటే వెనుక వీపు భాగం ఉండకుండా ఉండాలి,
  • పోయిన ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకుని ఇంటినిండా పెట్టకూడదు, మీ పెద్దలు నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు.
  • పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం కచ్చితంగా మంచినీరు ఉంచాలి,
  • ఒక్క కుంది దీపం పెట్టె వాళ్ళు 3 ఒత్తులు వేయాలి, రెండు అంత కన్నా ఎక్కువ పెట్టేవారు రెండు ఒత్తులు వేస్తే సరిపోతుంది..
  • రోజూ వారి దీపారాధన కు మీరు వాడే నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా పర్వాలేదు కానీ వ్రతము,నోము, దీక్ష,పరిహారాలు,సమయంలో, దీపారాధన నూనె అని మార్కెట్ లో దొరికెవి తెచుకోకండి నువ్వుల నూనె, ఆవు నైయి స్తోమత లేకపోతే ఆముదం తెచ్చుకోండి, కొబ్బరి నూనె తెచ్చుకోండి..కానీ కల్తీ నూనె వాడకండి..
  • పూజ చేసిన వెంటనే ఆ ఆసనం తెసివేయాలి అలానే 5 min కూడా ఉంచకూడదు
  • సాయంత్రం ఆరు దాటాక సూది, ఉప్పు,నూనె,కోడి గుడ్లు. ఇంటికి తెచుకోకండి అవి శని స్థానాలు మీ వెంట కొని తెచుకున్నట్టు..
  • పొద్దు పోయాక పెరుగు, ఊరగాయాలు, మిరపొడి ఎవ్వరికీ ఇవ్వకండి ముఖ్యముగా శుక్రవారం, మంగళవారం ఇవ్వకండి అవి లక్ష్మీ స్థానాలు.
  • .శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసము ఇంటికి తెచుకోకూడదు, మీకు తినే అలవాటు ఉంటే గుడ్లు ముందు రోజు తెచ్చుకోండి..
  • జాతకంలో కుజ దోషం ఉన్న వారు,వ్యాపారం లో గొడవలు ఇబ్బందులు ఉన్న వారు మంగళవారం రోజు గుడ్లు తినకండి దాని ప్రభావం ఇంకా ఎక్కువ అవుతుంది.
  • శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకొని రాకండి, ఎవరైనా శనివారం రోజు బహుమతులు గా ఇనుము వస్తువులు, నల్లటి,నీలి,వస్త్రాలు, గొడుగు, చెప్పులు ఇస్తే తీసుకోకండి.

  • ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రం గా ఉంచండి,పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి.

  • పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు
  • రాత్రి పూట గాజులు, తాళి పక్కన తీసి పెట్టకూడదు, తాళిబొట్టులో దేవతా విగ్రహాలు డాల్లర్స్ వేసుకో కూడదు, పిన్నిసులు వేయకూడదు, దేవుడికి వాడిన పసుపు మాత్రమే మంగళసూత్రంకి పెట్టాలి.
  • అపశకునపు మాటలు మాటలాడకూడదు తథాస్తు దేవతలు మన భుజాల పైనే ఉంటారు.
  • వారానికి ఒక్కసారి అయినా ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేయాలి. డబ్బు నగలు పెట్టె బీరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తల దువ్వడం లాంటివి చేస్తే డబ్బు అసలు నిలవదు.
  • వంట చేసే వారు మాట్లాడుతూ అరుస్తూ చేయ కూడదు
  • ఇంటి ముందు భాగంలో అరటి చెట్టు ఉంచకూడదు
  • దేవాలయం లో పూజించే విధంగా గాని గుడిలో గాని ఫ్లూట్ ఉన్న కృష్ణుడు ఉండాలి.
  • గృహంలో ఫ్లూట్ ఊదు తున్నట్టు కృష్ణుడి విగ్రహం ఉండకూడదు.
  • శివలింగం ఇంట్లో పెట్టుకుంటే మన బొటన వీలుకు మించి ఉండకూడదు
  • ప్రతినిత్యం శివలింగానికి అభిషేకం చేయాలి.
  • నటరాజు ప్రతిమ ఇంట్లో ను దేవుడి గదిలోనూ ఉండకూడదు.నాట్య శాల లో ఉంటె తప్పు లేదు
  • ఆవుతో ఉన్న కృష్ణుడు విగ్రహం ఇంట్లో ఉంటె మంచిది.
  • తులసి చెట్టు ఆకులు గోటితో గిల్ల కూడదు ఆడవారు అసలు కోయకూడదు.
  • పొద్దు పోయాక తులసికి నీరు పోయాకుడదు, ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడు గా భావించాలి.
  • ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టి పంపాలి.
  • స్నానం చేసి విడిచిన బట్ట మళ్ళీ కట్టకూడదు
  • మంగళవారం, శుక్రవారం క్షుర సంస్కారం చేయకూడదు.
  • మంగళవారం, శుక్రవారంగోర్లు తీయకూడదు
  • మంగళవారం, శుక్రవారంపేనులు తీయడం, పేలు దువ్వడం చేయకూడదు.
  • మన రెండు చేతులతో తల గోక కూడదు.
  • ఎప్పుడు చేతులతో గోర్లు కొరుకుతూ ఉండకూడదు
  • కాలుపై కాలు వేసి ఆడిస్తూ ఉండటం మంచిది కాదు
  • గుమ్మం గొళ్ళెం, చిలుక ఆడించ కూడదు.
  • తినే టప్పుడు తుమ్మితే చై కడిగి మళ్ళీ తినాలి.
  • వెండి వస్తువులు బహుమతులు గా ఇవ్వకూడదు.
  • ఇంటి గుమ్మాo ముందు చెప్పులు వదల కూడదు కొంచెం దూరంగా వదలాలి,
  • ఇంట్లో మైలు ఉన్న స్త్రీలు వారు తాగే నీరు తిని మిగిలినవి ఎవరికి పెట్టకూడదు, ముఖ్యంగా భర్తకు ఎగిలి చేసినవి ఆ సమయంలో పెట్టకూడదు.
  • దీపం పెట్టిన కుంది కింద పళ్ళెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కరువు లేకుండా ఉంటుంది.
  • విడిచిన బట్టలు కాలితో తొక్క కూడదు,
  • స్నానం చేసి తుడుచుకున్న టవల్ ఇంటి తలుపు పైన వేయకూడదు.
  • ప్రతి రోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి ఒక్క సారి అయినా గడపకు పసుపుకుంకుమ పెట్టాలి.

  • ఉదయం లేవగానే మొహం కడుక్కో కుండా అద్దం చూడకూడదు, తల దువ్వ కూడదు.

  • భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని తిట్టకూడదు.

ఇవన్నీ పెద్ద కష్టమై పనులేవీ కాదు మనము తప్పని సరిగా పాటించాల్సిన కనీస నియమాలు ఇవన్నీఇవి ఏవీ పాటించ కుండా ఎదో విధంగా కానిచ్చాం అంటూ పైగా ఆ పూజలు చేశాము ఈ పూజలు చేశాము అంటే దాని వల్ల ఏమీ ఫలితం ఉండదు. దయచేసి ఇది గ్రహించండి.

ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింక్ లో చూడండి 



అన్నం తిన్నకంచంలో చేయికడగకూడదా | Annam ...ఈ క్రింది వీడియో లింక్ లు చూడండి... Search Results
https://www.youtube.com › watch

Search Results

ఇంట్లో ఈ మూలన చీపురు ఉంటే ఐశ్వర్యం ...

https://www.youtube.com › watch

గమనిక :

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and  subscribe చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv like,share and subscribe  చేయండి

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.














11, ఏప్రిల్ 2020, శనివారం

కరోనా మనల్నిచేరకుండా హనుమాన్ చాలీ సా తెలుగులో ధ్యానం చేసుకుంటూ ఇంట్లో నే ఉండండి

wowitstelugu.blogspot.com

కరోనా మనల్నిచేరకుండా హనుమాన్ చాలీ సా తెలుగులో ధ్యానం చేసుకుంటూ ఇంట్లో నే ఉండండి



ఇది రాముని సుప్రసిద్ధ  ప్రసిద్ధ భక్తుడైన   తులసీదాసు  అవధి భాషలో వ్రాసినదని హిందువులు పండితులు  నమ్ముతున్నారు. తులసీదాసు యొక్క ప్రసిద్ధ రచన  రామ చరితమానస. "చాలీసా" అనే పదం "చాలీస్" అనే పదం నుండి వ్యుత్పత్తి అయినది. 

దీని అర్థం హిందీ భాషలో నలభై అని. అనగా హనూమన్ చాలీసాలో నలభై శ్లోకములు ఉంటాయి. చాలీసా అంటే సాహిత్యపరంగా హనుమంతుని యొక్క నలుబది శ్లోకములు అని చెబుతారు.

రామచరిత మానసము అనే గ్రంథము వ్రాసిన శ్రీ తులసి దాసుకు హనుమంతుని దర్శనము జరిగిన పిదప ఆ ఆనందములో హనుమాన్ చాలీసా వ్రాసారని ప్రతీతి

యధాతథ తెలుగు లిపి లో 

దోహా

శ్రీగురుచరణసరోజరజ నిజమన ముకుర సుధారి
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి |

బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవనకుమార
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార |

చౌపాయీ

జయ హనుమాన జ్ఞానగుణసాగర
జయ కపీశ తిహుం లోక ఉజాగర | 1

రామదూత అతులితబలధామా
అంజనిపుత్ర పవనసుతనామా | 2

మహావీర విక్రమ బజరంగీ
కుమతి నివార సుమతి కే సంగీ | 3

కంచనవరన విరాజ సువేసా
కానన కుండల కుంచిత కేశా | 4

హాథ వజ్ర అరు ధ్వజా విరాజై
కాంధే మూంజ జనేవూ సాజై | 5

శంకరసువన కేసరీనందన
తేజ ప్రతాప మహాజగవందన | 6

విద్యావాన గుణీ అతిచాతుర
రామ కాజ కరివే కో ఆతుర | 7

ప్రభు చరిత్ర సునివే కో రసియా
రామ లఖన సీతా మన బసియా | 8

సూక్ష్మ రూప ధరి సియహిం దిఖావా
వికట రూప ధరి లంక జరావా | 9

భీమ రూప ధరి అసుర సంహారే
రామచంద్ర కే కాజ సంవారే | 10

లాయ సంజీవన లఖన జియాయే
శ్రీరఘువీర హరషి ఉర లాయే | 11

రఘుపతి కీన్హీ బహుత బడాయీ
కహా భరత సమ తుమ ప్రియ భాయీ | 12

సహస వదన తుమ్హరో యస గావైం
అస కహి శ్రీపతి కంఠ లగావై | 13

సనకాదిక బ్రహ్మాది మునీశా
నారద శారద సహిత అహీశా | 14

యమ కుబేర దిగపాల జహాం తే
కవి కోవిద కహి సకే కహాం తే | 15

తుమ ఉపకార సుగ్రీవహిం కీన్హా
రామ మిలాయ రాజపద దీన్హా | 16

తుమ్హరో మంత్ర విభీషన మానా
లంకేశ్వర భయే సబ జగ జానా | 17

యుగ సహస్ర యోజన పర భానూ
లీల్యో తాహి మధుర ఫల జానూ | 18

ప్రభు ముద్రికా మేలి ముఖమాహీ
జలధి లాంఘి గయే అచరజ నాహీం | 19

దుర్గమ కాజ జగత కే జేతే
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే | 20

రామ ద్వారే తుమ రఖవారే
హోత న ఆజ్ఞా బిను పైసారే | 21

సబ సుఖ లహై తుమ్హారీ శరణా
తుమ రక్షక కాహూ కో డరనా | 22

ఆపన తేజ సంహారో ఆపై
తీనోం లోక హాంక తేం కాంపై | 23

భూత పిశాచ నికట నహిం ఆవై
మహావీర జబ నామ సునావై | 24

నాసై రోగ హరై సబ పీరా
జపత నిరంతర హనుమత వీరా | 25

సంకటసే హనుమాన ఛుడావై
మన క్రమ వచన ధ్యాన జో లావై | 26

సబ పర రామ తపస్వీ రాజా
తిన కే కాజ సకల తుమ సాజా | 27

ఔర మనోరథ జో కోయీ లావై
సోయీ అమిత జీవన ఫల పావై | 28

చారోం యుగ పరతాప తుమ్హారా
హై పరసిద్ధ జగత ఉజియారా | 29

సాధు సంత కే తుమ రఖవారే
అసుర నికందన రామ దులారే | 30

అష్ట సిద్ధి నవ నిధి కే దాతా
అస వర దీన జానకీ మాతా | 31

రామ రసాయన తుమ్హరే పాసా
సదా రహో రఘుపతి కే దాసా | 32

తుమ్హరే భజన రామ కో పావై
జనమ జనమ కే దుఖ బిసరావై | 33

అంత కాల రఘుపతి పుర జాయీ
జహాం జన్మ హరిభక్త కహాయీ | 34

ఔర దేవతా చిత్త న ధరయీ
హనుమత సేయి సర్వ సుఖ కరయీ | 35

సంకట హరై మిటై సబ పీరా -
జో సుమిరై హనుమత బలబీరా | 36

జై జై జై హనుమాన గోసాయీ
కృపా కరహు గురు దేవ కీ నాయీ | 37

జో శత బార పాఠ కర కోయీ
ఛూటహి బంది మహా సుఖ హోయీ | 38

జో యహ పఢై హనుమాన చలీసా
హోయ సిద్ధి సాఖీ గౌరీసా | 39

తులసీదాస సదా హరి చేరా
కీజై నాథ హృదయ మహ డేరా | 40


దోహా


పవనతనయ సంకట హరణ మంగల మూరతి రూప్
రామ లఖన సీతా సహిత హృదయ బసహు సుర భూప్ 

హనుమాన్ చాలీసా చదవడం వల్ల వచ్చే ఫలితం

  • హనుమంతుని స్మరించటం వలన బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, రోగము లేకపోవుట, వాక్సుద్ధి, సాధ్యం కాని పనులు సాధ్యమగుట మున్నవి కలుగును.

  • హనుమంతుని అరటి తోట మధ్యలో కాని, అరటి చెట్లతో ఏర్పరిచిన మందిరంలో కాని పుజించినచొ విశేష ఫలములు కలుగును. 

  • స్వేతార్క పుష్పాలను హనుమ పూజలో ఉపయోగించ వచ్చును. శ్వేతార్క పుష్పములతో అరటి తోటలో హనుమను పూజించు వార్కి విశేష ఫలములు కలుగును. 

  • హనుమంతుని  పుజించువారు సమస్త దేవతలను పూజించిన ఫలమును పొందెదరు. వారికీ భోగ మోక్షములు నిలిచి యుండును.

  • రోజుకు 11 పర్యాయములు హనుమాన్ చాలీసా నలభై రోజులు పారాయణ చేసిన వారికీ హనుమ అనుగ్రహముతో, వివాహం, ఉద్యోగం, ఆరోగ్యం, గ్రహ దోష నివారణ మొదలగునవి నిశ్చయముగా ప్రాప్తించును.

  • విపత్తు సమయాలలో, శుభ ముహుర్తాలలో (మృగశిర నక్షత్రం రోజుల్లో) 108 సార్లు గాని, రోజూ 11 సార్లు చదవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.

  • ఈ స్తోత్రాన్ని మంగళ, శని, గురు వారాలలో ఉదయం మరియు రాత్రి వేళలో చదవడం మంచిది.

  • హనుమాన్ చాలీసాను శని ప్రభావం ఉన్నవారు పఠించడం వల్ల  అన్ని రకాల శని దోషాలు తొలగిపోతాయి.

  • దీనిని తరుచుగా చదవటం వల్ల శరీర అస్వస్థత, దీర్ఘ కాలిక వ్యాధులు తొలగి దృష్ట శక్తుల ప్రభావం పోతుంది.

  • హనుమాన్ చాలీసాను శ్రద్ధతో పఠించటం వల్ల ఆర్థిక సంబంధిత సమస్యలు తొలగి మనశ్శాంతి, మనోబలం పెరుగుతాయి.


హనుమాన్ చాలీసా చరిత్ర



ఒక రోజు 'తులసీదాసు' నది వొడ్డున ఉన్న చెట్టు కింద రాముని ధ్యానంలో ఉన్నాడు. అదే పట్టణంలో ఒక వ్యక్తి మరణించాడు. అతడి అంత్య క్రియలు జరుగుతుండగా అతని భార్య చెట్టు క్రింద కూర్చొని వున్నతులసీదాసుని గమనించి అతని దగ్గరకు వొచ్చింది. తులసీదాసు ఆమెను చూసి దీర్ఘసుమంగళీభవ అని అంటాడు. అప్పుడు ఆమె “నా భర్త మరణించాడు మీరు ఇలా ఆశీర్వదిస్తున్నారు” అని అంటుంది. అప్పుడు తులసీదాసు అదేంటి రాముడు నాతో నిజమే చెప్పిస్తాడు అని అంటాడు. తులసీదాసు తన కలశంలోని నీటిని ఆ వ్యక్తిపై చల్లుతాడు. దానితో ఆ వ్యకి మళ్ళీ బ్రతుకుతాడు. దీనితో అందరూ ఆశ్చ్యర్య పోతారు.
ఈ విషయం చివరకు వారణాసి పట్టణ రాజు అక్బరు బాదుషాకు తెలిసి తులసీదాసుని ఆస్థానానికి పిలిపిస్తాడు. తులసీదాసుని అతను చేసిన మహిమలను మళ్ళీ ప్రదర్శించమటాడు. దానికి తులసీదాసు అందులో తన మహిమలు ఏవీ లేవని అంతా ఆ శ్రీ రాముని కృప అని అంటాడు. దీనితో రాజుకి కోపం వొచ్చి రాజభటులకి తులసీదాసుని కొరడాలతో కొట్టమని ఆదేశిస్తాడు. ఇదంతా  గమనించిన శ్రీ హనుమంతుడు కోతుల సమూహాలతో రాజభటులపై దాడి చేస్తాడు. దీనిని గ్రహించిన తులసిదాసు శ్రీ హనుమంతుని స్తుతిస్తూ స్తోత్రాన్ని పాడుతాడు. ఆ స్తోత్రమే శ్రీ హనుమాన్ చాలీసా. ఆంజనేయుడు తులసీదాసు స్తోత్రానికి మెచ్చి ఈ స్తోత్రాన్ని పఠించినవారికి తాను తోడు ఉండి వారి కష్టాలను దూరం చేస్తానని చెపుతాడు.
హనుమాన్ చాలీసా క్రింది వీడియో యు. ఆర్. యల్ .ల లో చూడండి...



గమనిక :

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, shareand subscribe చేయండి.   నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.









8, ఏప్రిల్ 2020, బుధవారం

శ్రీ హనుమాన్ జయంతి విశిష్టత ప్రాధాన్యత ఏమిటో తెలుసుకుందాం

wowitstelugu.blogspot.com

శ్రీ హనుమాన్ జయంతి విశిష్టత ప్రాధాన్యత ఏమిటో తెలుసుకుందాం 


శ్రీ హనుమత్ జయంతి అంటే శ్రీ ఆంజనేయ స్వామి వారు జన్మించిన దినం చైత్ర పౌర్ణిమ,  ఈ హనుమాన్ జయంతి తెలుగునాట కొన్ని ప్రాంతాల్లో చైత్ర శుద్ధ పౌర్ణిమ రోజున, కొన్ని ప్రాంతాల్లో వైశాఖ బహుళ దశమి రోజున జరుపు కుంటారు. ఏ ఇంటిలో  శ్రీరాముడు కొలువై ఉంటాడో ఎక్కడ ఆయన నామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు. హనుమంతుడిని మించిన భక్తుడు లేడంటూ రామచంద్రుడు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న భాగ్యశాలి శ్రీ హనుమంతుడు.

స్వామి వారి జన్మ వృతాంతం

ఒకసారి దేవలోకంలో ఇంద్రాది దేవతలు కొలువుదీరి ఉండగా, ‘పుంజికస్థల’అనే అప్సరస బృహస్పతితో పరిహాసమాడబోయింది. ఆమె చేష్టలకు ఆగ్రహించిన బృహస్పతి, భూలోకాన ‘వానర స్త్రీ’గా జన్మించమని శపించాడు.

  • తీవ్రమైన ఆందోళనకి లోనైన ఆమె శాపవిమోచనం ఇవ్వమంటూ కన్నీళ్లతో ప్రాధేయపడింది. కారణ జన్ముడైన వానరవీరుడికి జన్మను ఇచ్చిన తరువాత ఆమె తిరిగి దేవలోకానికి చేరుకోవచ్చునంటూ ఆయన అనుగ్రహించాడు.ఈ విధంగా ‘పుంజికస్థల’భూలోకాన ‘అంజనాదేవి’గా జన్మించి, కాలక్రమంలో ‘కేసరి’అనే వానరుడిని వివాహమాడింది. శాపవిమోచానార్ధం తనకి వీరుడైనటువంటి పుత్రుడిని ప్రసాదించమంటూ ఆమె వాయుదేవుడిని ప్రార్ధించింది.
  • ఈసందర్భంగా రాక్షస సంహారం కష్టతరంగా మారడంతో, పరమేశ్వరుడి అంశతో జన్మించినవాడి వలనే అది సాధ్యమని బ్రహ్మ – విష్ణు భావించారు. అయితే పరమశివుడి వీర్య శక్తిని పార్వతీదేవి భరించలేకపోవడంతో , వాయుదేవుడి ద్వారా దానిని స్వీకరించిన అంజనాదేవి గర్భం దాలుస్తుంది.
  • ఈవిధంగా శివాంశ సంభూతుడైన హనుమంతుడు ‘వైశాఖ బహుళ దశమి’ రోజున అంజనాదేవి గర్భాన జన్మించాడు.( చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపడం తెలంగాణాలో ఆచారం )
  • తల్లి దగ్గర అల్లారుముద్దుగా పెరుగుతోన్న హనుమంతుడు, ఆకాశంలోని సూర్యుడిని చూసి దానిని తినే పండుగా భావించి కోసుకురావాలనే ఉద్దేశంతో ఆకాశ మార్గాన బయలుదేరాడు. ఆయన్ని చూసిన ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని విసురుతాడు. దాని ధాటికి తట్టుకోలేక అక్కడి నుంచి కింద పడిపోయిన హనుమంతుడి ‘ఎడమ దవడ’కి గాయం కావడంతో స్పృహ కోల్పోయాడు. దాంతో దేవాధి దేవతలంతా అక్కడికి చేరుకొని హనుమంతుడు చిరంజీవిగా ఉండాలని ఆశీర్వదించారు.
  • ఈ విధంగా దేవతల నుంచి వరాలు పొందిన హనుమంతుడి అల్లరి చేష్టలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. దాంతో ఎవరైనా గుర్తు చేస్తే తప్ప, అతని శక్తి అతనికి తెలియకుండా ఉండేలా రుషులు శపించారు.
  • సూర్య భగవానుని అనుగ్రహంతో సకల విద్యలను అభ్యసించిన హనుమంతుడు, రామాయణానికి ఓ నిండుదనాన్ని తీసుకు వచ్చాడు. సుగ్రీవుడిలో కదలిక తీసుకు వచ్చి అతని సైన్యాన్ని(1) ముందుకు నడిపించడంలోనూ (2) లంకలో ఉన్న సీతమ్మవారి ఆచూకీ తెలుసుకోవడంలోను (3) వారధి నిర్మించడంలోను (4)యుద్ధరంగాన లక్ష్మణుడు మూర్చ పోయినప్పుడు ‘సంజీవిని’ పర్వతాన్ని పెకిలించి తీసుకు రావడంలోను హనుమంతుడు కీలకమైన పాత్రను పోషించాడు. అందుకే హనుమంతుడులేని రామాయణాన్ని అస్సలు ఊహించనే ఊహించలేము
హనుమ ఆరాధన
  • ‘త్రిపురాసుర సంహారం’ సమయంలో పరమ శివుడికి శ్రీ మహా విష్ణువు తన సహాయ సహకారాలను అందించాడు. అందువల్లనే లోక కల్యాణం కోసం శ్రీ మహా విష్ణువు రామావతారం దాల్చినప్పుడు, శివుడు … ఆంజనేయస్వామిగా అవతరించి, రావణ సంహారానికి తన సహాయ సహకారాలను అందించినట్టు పురాణాలు చెబుతున్నాయి. దుష్ట గ్రహాలను తరిమికొట్టి ఆయురారోగ్యాలను ప్రసాదించే హనుమంతుడిని పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా ఎంతో ఇష్టపడతారు
  • ఇక ప్రతి ఊరిలో రామాలయం వుంటుంది … ఆయనతో పాటు హనుమంతుడు కూడా అందుబాటులో ఉంటాడు. అందువలన ఈ హనుమజ్జయంతి రోజున ప్రతి ఊరిలో ఆయనకు ప్రదక్షిణలు చేయడం … ఆకు పూజలు చేయించడం … ఆయనకి ఇష్టమైన ‘వడ’ మాలలు వేయించడం జరుగుతుంటుంది. ఈ రోజున ఆంజనేయ స్వామి దండకం … హనుమాన్ చాలీసా చదవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

హనుమాన్ జయంతి:

యత్ర యత్ర రఘునాథకీర్తనం – తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్

భాష్పవారి పరిపూర్ణలోచనం – మారుతిం నమత రాక్షశాంతకామ్

“యెక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో, అక్కడక్కడ మారుతి ఆనందబాష్పములు నిండిన కళ్ళతో, చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును ”శ్రీ ఆంజనేయస్వామి వారి జన్మదినం చైత్ర శుక్ల పూర్ణిమ రోజున జరిగింది. ఈ రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు.

విశేషాలు:
ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక దినములు శనివారం, మంగళవారం ఇంకా గురువారం.

పురాణకధ ప్రకారం

ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచు కోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, యెగరవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే యెడున్నర యేళ్ళ శని దోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకొనవచ్చు.

స్వామికి ప్రీతి పాత్రమైన పువ్వులు:

తమలపాకుల దండ:

ఒక కధ ప్రకారం, అశోక వనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేసారట, దగ్గరలో పువ్వులు కనిపించక! అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు.

మల్లెలు:

గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చెయ్యడం చాల శ్రేష్టం.

పారిజాతాలు:

స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాల ప్రీతి. అందుకే పారిజాతంపూలతో పూజ చేస్తారు.

తులసి:

తులసి రాములవారికి ప్రీతిపాత్రమైనది, అందుకే హనుమంతునికికూడా ఇష్టమైనది

కలువలు:

కలువ పువ్వులు కూడా శ్రీరాములవారికి యెంతో ఇష్టమైన పూలు. భరతుని ఉన్న ఒక్క కోవెల ఇరింజలకుడ, కేరళలో అతనికి కలువ పూల మాల వెయ్యడం సాంప్రదాయం. శ్రీరాములవారికి హనుమంతుడంటే భరతుడు మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత, హనుమత్ స్వామికి కూడా కలువ మాల వేస్తారు.

పంచముఖ హనుమాన్:

శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడు గా వెలిసాడు.

ఈ పంచముఖముల వివరం ఇలా చెప్పబడింది.

👉తూర్పుముఖముగా హనుమంతుడు- పాపాలను హరించి, చిత్త సుధ్ధిని కలుగ చేస్తాడు.

👉 దక్షిణముఖంగా హనుమంతుడు కరాళ ఉగ్ర నరసింహ స్వామి -తృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.

👉 పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి- దుష్ట ప్రభావలను పోగొట్టీ,శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.

👉 ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి -గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.

👉 ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి -జ్ఞానాన్ని , జయాన్ని, మంచి జీవనసహచరిని, బిడ్డలను ప్రసాదిస్తాడు.

హనుమాన్ జయంతి రోజున పూజ ఎలాచేయాలి?:

చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమాన్ జయంతి రోజున జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో ఆంజనేయస్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలూ చేకూరుతాయి.

  • హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమాన్‌ను ఆలయంలో దర్శించుకుని, ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు, నువ్వులనూనెతో దీపమెలిగించే వారికి ఆయుర్దాయం, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.

  • హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ చేయించడం, హనుమాన్ కళ్యాణం జరిపే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే గృహంలో పూజచేసే భక్తులు, పూజామందిరమును శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి.

  • ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి బూరెలు, అప్పాలు, దానిమ్మ పండ్లు సమర్పించుకోవచ్చు.

  • పూజా సమయంలో హనుమాన్ చాలీసా ఆంజనేయ సహస్రము, హనుమచ్చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. 

  •  “ఓం ఆంజనేయాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించి, ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి. 

  • పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవడం మంచిది. ఇంకా అరగొండ, పొన్నూరు, కసాపురం, గండిక్షేత్రం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం. 

  • ఈ రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు, హనుమాన్‌ చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని నమ్మకం

హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యత:

  • హనుమాన్ చాలీసా అంటే ఆత్మలకు భయం అని మరియు హనుమంతుడు అంటేనే ధైర్యానికి మారుపేరు అని తెలియచెప్పిన ఈ చాలీసా అత్యంత ప్రసిద్ధి చెందింది.

  • అత్యంత శక్తివంతమైనది అని పిలువబడుతున్న ఈ హనుమాన్ చాలీసాను శ్రీరామచంద్ర భక్తుడు గొప్ప నైష్ఠిక భక్తుడు, తులసీదాస్ రచించారు.

  • తులసీదాస్, రచించిన రచనలలో అత్యంత ఉత్తమమైనది, ముఖ్యమైనది తులసీ రామాయణము.

  • హనుమాన్ చాలీసా ప్రాముఖ్యత ఏమిటి అనే ప్రశ్నకు వస్తే, చాలీసాలోని శ్లోకాలకు అర్థమేమిటి, దీనియొక్క శక్తివంతమైన మహిమ ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. ఈ వ్యాసం హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యత గురించి తెలియచెపుతుంది. దాదాపు హనుమాన్ చాలీసాలోని ప్రతి పదం అనేక రకాల ప్రయోజనాలతో ముడిపడి ఉంది.

  • వివిధ శ్లోకాలను దోహాలుగా కూడా పిలుస్తారు. చాలీసాలోని కొన్ని ముఖ్యమైన శ్లోకాలను మరియు హనుమాన్ చాలీసా చదవటంవలన కలిగే మొత్తం ప్రయోజనాలను మనం ఇక్కడ పరిశీలిద్దాం. హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యత హనుమాన్ చాలీసాలోని
  • ప్రారంభ దోహా “జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర ” వల్లే వెయటం వలన జీవితంలో స్వాభావిక దివ్య జ్ఞానాన్ని పొందుతారు. ఈ జ్ఞాన సహాయంతో, జీవితంలో ప్రతిష్టంభించిన అనేక సవాళ్లు, దాదాపు అసాధ్యం అనుకున్నవాటిని సాధించగలుగుతారు.

  • మహావీర్ విక్రమార్కుడుతో మొదలయ్యే ‘3వ దోహా’ ప్రజలలో బలాన్ని నింపుతుంది మరియు అవాంఛనీయమైన సహవాస ప్రభావాలనుండి బయట పడడానికి సహాయపడుతుంది.
  • చాలీసాలోని 7వ మరియు 8వ శ్లోకాలు, శ్రీరాముడి ఆత్మతత్వాన్ని అర్థం తెలియచేస్తాయి మరియు దేవుని దివ్యసన్నిధికి చేరువ చేస్తాయి. 14వ మరియు 15వ దోహాలు ఒక వ్యక్తి కీర్తిప్రతిష్టలు పొందటానికి సహాయం చేస్తాయి.

  • మీ పనులు నిర్వహించడానికి కావలసిన సామర్థ్యం మరియు మీ సామర్త్యం పట్ల అందరి ప్రశంసలు అందుకుంటారు. 11వ ఛౌపయి చదవటం వలన పాములు మరియు విషజంతువుల భయం తొలగించడానికి సహాయం లభిస్తుంది.

  • 16వ మరియు 17 ఛౌపయిస్ చదటం వలన జీవితంలో కోరుకున్న స్థానానికి ఎదగటానికి సహాయపడుతుంది. అది ఒక కార్యాలయంలో వద్ద ప్రమోషన్లు కావొచ్చు లేదా ఉద్యోగానికి సంబంధించినది అయిఉండవొచ్చు.

  • 20వ దోహా చదవటం వలన జీవితంలో అనేక సవాళ్లను అధిగమించవొచ్చు మరియు అనేక అడ్డంకులు తొలగిపోయి లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది.

  • 24వ ఛౌపయి, ముఖ్యమైనది, ఢాకిణి పిశాచాలు, భూతాలు మరియు చేతబడి ప్రభావాలు పడకుండా ఉండటానికి సహాయపడుతుంది.

  • చాలీసాలోని ప్రతి దోహాతో ముడిపడి జీవులకు అనేక లాభాలు ఉన్నాయి. అందువలన హనుమాన్ చాలీసాకు గొప్ప ప్రాముఖ్యత ఉన్నది.

ఆంజనేయస్వామికి సింధూరం ఎందుకు పూస్తారు?
దీనికో పౌరాణిక గాథ వుంది.
  • రామాయణకాలంలో సీతమ్మవారు పాపిడిలో సింధూరం ధరించేది. ఒకసారి ఆంజనేయస్వామి అది చూసి అలా ఎందుకు ధరిస్తున్నారని సీతమ్మని అడీగారు.
  • అందుకు సీతామాత నీ స్వామి, నాస్వామి అయిన శ్రీరామచంద్రుని ఆయుష్షు పెరగాలనీ ఆయనకి అన్నీ శుభాలు జరగాలనీ పాపిడిలో సింధూరం ధరిస్తాను. ఆడవారు పాపిడిలో సింధూరం ధరిస్తే మగవారి ఆయుష్షు పెరుగుతుంది, వారికి అన్నీ శుభాలు జరుగుతాయి అని చెప్పిందట.

  • ఆంజనేయస్వామి రాముడికి పరమ భక్తుడు. ఆయన వూరుకుంటాడా!? వెంటనే వెళ్ళి ఒళ్ళంతా సిధూరం పూసుకొచ్చాడు. సీతమ్మ అడిగిందట. ఒళ్ళంతా సిధూరం ఎందుకు పూసుకున్నావని.

  • దానికి హనుమంతుడి సమాధానం ఏమిటంటే , ‘అమ్మా, నువ్వు పాపిడిలో సింధూరం పెట్టుకుంటేనే స్వామి ఆయుష్షు పెరుగుతుందనీ, శుభం జరుగుతుందనీ అన్నావు కదా, మరి నేనాయన భక్తుణ్ణి, నేను ఒళ్ళంతా సింధూరం పూసుకుంటే నా స్వామికి ఇంకా ఎక్కువగా అన్నీ శుభాలే జరుగుతాయనీ, ఆయన చిరంజీవి కావాలని ఇలా పూసుకున్నాను’ అని చెప్పాడు.

  • ఇది వాల్మీకి రామాయణంలో కధకాదు. రామాయణాన్ని చాలామంది రచయితలు చాలాసార్లు రాశారు. తర్వాత వచ్చిన రామాయణంలో వచ్చిన కధ ఇది.

  • అది పురాణ కధ అనుకోండి. లౌకికంగా చూస్తే ఆంజనేయస్వామి వాయుదేవుని పుత్రుడు, సూర్యదేవుని శిష్యుడు. వారిరువురూ ఎంతో తేజస్సు కలవారు. అందుకే ఆంజనేయస్వామి అమిత తేజోమూర్తి.

  • ఎరుపు లేక సింధూరం తేజస్సుకి చిహ్నం. ఆయన తేజస్సుకి చిహ్నంగా ఆయనను సింధూరంతో అలంకరిస్తే స్వామి చూడటానికే ఎంతో తేజోవంతుడుగా కనుల విందు చేస్తాడనీ, ఆయన తేజస్సూ, శక్తీ మనకి వెంటనే స్ఫురిస్తుందనీ అలా అలంకరిస్తారు.

  • మనం తెలుసుకోవలసింది ఏమిటంటే ఆంజనేయస్వామి రామ భక్తుడుకదా. శ్రీరామ పూజ ఎక్కడ జరిగితే అక్కడ ఆంజనేయ స్వామి వుంటాడు. ఆ పూజ చూడటానికీ, ఆ నామ కీర్తన వినటానికీ.

  • అందుకే శ్రీరామచంద్రుని పూజ చేసేటప్పుడు ఒక ఖాళీ ఆసనాన్ని వేసి వుంచాలిట. అక్కడ ఆంజనేయస్వామి ఆసీనుడై శ్రీ రామ పూజ తిలకిస్తాడని నానుడి.

నుమాన్ గురించి మరింత ఈ క్రింది వీడియో లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి

Hanuman Stories in Telugu | Animated Devotional Stories ...


నోట్ :

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి . 

అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, shareand subscribe చేయండి.   నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.