8, మార్చి 2020, ఆదివారం

అద్భుత చిత్రకారుడు రాజా రవి వర్మ గురించి తెలుసుకుందామా

wowitstelugu.blogspot.com

అద్భుత చిత్రకారుడు రాజా రవివర్మ    గురించి   తెలుసుకుందామా

రాజా రవి వర్మ  చిత్రకారుడు 

రాజా రవి వర్మ చిత్రకారుడు ఇతను 1846 ఏప్రిల్ 29 వ తేదీన కీలా మానుర్ , కేరళ రాష్ట్రము లో జన్మించారు. భార్య పేరు రాణీ భగీరధీ బాయ్. తండ్రి పేరు నీలకంఠన్ భట్టాద్రి ప్రసాద్, తల్లి ఉమాంబా  తాంబూరట్టి.

చిన్నతనం :

  • రవి వర్మ రామాయణమహాభారతములలోని ఘట్టాలను చిత్రాలుగా మలచి మంచి గుర్తింపు పొందాడు. 

  • భారతీయ సాంప్రదాయిక, పాశ్చాత్య చిత్రకళా మెళకువల సంగమానికి అతని చిత్రాలు చక్కని మచ్చుతునకలు. 

  • చీరకట్టుకున్న స్త్రీలను అందంగా, చక్కని వంపు సొంపులతో చిత్రించడంలో అతనికి అతనే సాటి. 

  • 1873లో జరిగిన వియన్నా కళా ప్రదర్శనలో మొదటి బహుమతిని గెలుచు కున్నప్పుడు  ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది. 

  • తరువాత వాటిని అధికారికముగా తిరువనంతపురములోని చిత్రా ఆర్ట్ గ్యాలరీకి అందజేశారు.

  • చిన్నతనములోనే ఇతను చూపిన ప్రతిభ వలన ఇతనిని, ట్రావెన్కూర్ మహారాజా అయిల్యమ్ తిరునాళ్ చేరదీసి ప్రోత్సహించాడు. 

  • అక్కడి ఆస్థాన చిత్రకారుడయిన శ్రీ రామస్వామి నాయుడు శిష్యరికం చేశాడు. తైల వర్ణ చిత్రకళను బ్రిటీషు దేశస్థుడయిన థియోడార్ జెన్సన్ వద్ద నేర్చుకున్నాడు.

  • పాశ్చాత్య చిత్రకళలోని శక్తి, కొట్టొచ్చినట్లున్న భావ వ్యక్తీకరణ, రవివర్మను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అవి భారతీయ చిత్రకళాశైలికి ఎంతో భిన్నంగా కనిపించాయి.

  • భారతీయ చిత్రకళా చరిత్రలో గొప్ప చిత్రకారునిగా గుర్తింపు పొందిన రాజా రవి వర్మ, 1906లో, 58 సంవత్సరాల వయసులో మధుమేహంతో మరణించాడు. 

  • ఈయన మరణించేనాటికి కిలామానూరు ప్యాలెస్‌లో 160 దాకా రవివర్మ చిత్రాలు ఉండేవని ప్రతీతి. 

వృత్తి కార్య కలాపాలు :

  • రవి వర్మ  తన చిత్రాల ఇతివృత్తాల కోసము భారత దేశమంతటా పర్యటించాడు. 
  • ఆయన హిందూ దేవతాస్త్రీల చిత్రాలను దక్షిణ భారత స్త్రీలలాగా ఊహించి చిత్రించేవాడు. వారు ఎంతో అందంగా ఉంటారని ఆయన భావించేవారు. 
  • ముఖ్యముగా మహాభారతములోని నలదమయంతుల, శకుంతలాదుష్యంతుల కథలలోని ఘట్టాలను చిత్రాలుగా చిత్రించి ఎంతో పేరు సంపాదించాడు. 
  • రాజా రవివర్మ తరువాత నుండి భారతీయుల ఊహలలో పౌరాణిక పాత్రలన్నీ రవివర్మ చిత్రాలలాగా మారిపోయాయి.
  •  రవివర్మ తరచుగా తన చిత్ర శైలిలో ప్రదర్శనాత్మకంగానూ, ఛాందసంగానూ ఉంటాడన్న విమర్శలను ఎదుర్కొన్నాడు. అయినా అతని పనితనం భారత దేశములో ఎంతో ప్రశస్తి పొందింది.
  • 1894 లో లిథోగ్రాఫిక్ యంత్రాలు, చిత్రించడానికి అనువైన రాళ్ళూ, సాంకేతిక నిపుణులను జర్మనీ నుంచి తెప్పించాడు 
  • రవివర్మ. దేశంలోనే మొదటి సారిగా అత్యాధునిక ప్రెస్ ను ముంబైలో ప్రారంభించాడు. 
  • అయితే అక్కడ స్థలాభావం కారణంగా, భయంకరమైన ప్లేగు వ్యాపించడం వల్ల, కార్మికులు సరిగా లభించకపోవడం వలన నాలుగు సంవత్సరాల తరువాత మహారాష్ట్ర లోనే కొండ కోనల నడుమ ఉన్న మలవాలి అనే గ్రామాన్ని ఎంచుకున్నాడు. 
  • ప్రెస్ పక్కనే తన నివాసాన్ని కూడా ఏర్పరుచుకున్నాడు. ప్రింటింగ్ పనులు బాగా సాగడంతో కేరళ నుంచి తరచుగా ఈ గ్రామాన్ని సందర్శిస్తుండే వాడు.
  • రవివర్మ చనిపోవడానికి రెండేళ్ళ ముందు ప్రెస్ ను తన స్నేహితుడైన ఒక జర్మన్ సాంకేతిక నిపుణుడికి విక్రయించాడు. 
  • దానితో పాటు వంద చిత్రాలకు కాపీరైట్ కూడా ఇచ్చాడు. 
  •  1972లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రెస్ కు భారీ నష్టం జరిగింది. 
  •  మిగిలిన చిత్రాలను, రాళ్ళనూ ప్రెస్ చుట్టు పక్కల నివసించేవారికి పంచి పెట్టేశారు. 
  • ఆ తరువాత ముంబై, పుణే ప్రభుత్వాలు కొన్నింటిని మాత్రమే భద్రపరచగలిగాయి.

రాజా రవి వర్మ కు పేరు తెచ్చిన చిత్రాలు :

  • దమయంతి హంస సంవాదము

  • పల్లె పడుచు

    • లేడీ విత్ ఫ్రూట్స్

    • స్వర్బత్ ప్లేయర్

    • శకుంతల

    • హార్ట్ బ్రోకెన్

    • శ్రీ కృష్ణ రాయబారము

    • రావణ జటాయు వధ

    • ఇంద్రజీత్ విజయము

    • బిక్షకుల కుటుంబము

    • లేడీ ప్లేయింగ్ స్వర్బత్

    • గుడి వద్ద దానాలు ఇస్తున్న స్త్రీ

    • వరుణుని జయించిన రాముడు

    • నాయర్ల స్త్రీ

    • శృంగారంలో మునిగిన జంట

    • కీచకుని కలవటానికి భయపడుతున్న ద్రౌపది

    • శంతనుడు మత్స్యగంధి

    • ప్రేమలేఖ వ్రాస్తున్న శకుంతల

    • కణ్వుని ఆశ్రమములోని బాలిక. (ఋషి కన్య)

    • అలోచనలో మునిగిపోయిన స్త్రీ

    • వాద్యకారుల బృందము

    • సుభద్రార్జునులు

    రాజా రవివర్మ పేరిట పురస్కారాలు :

    రాజా రవివర్మ చిత్రకళకు చేసిన మహోన్నత ఉపకారానికిగానూ కేరళ ప్రభుత్వము ఆయన పేరిట రాజా రవివర్మ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. ఈ పురస్కారము ప్రతి ఏటా కళలు,సంస్కృతి అభ్యున్నతికై,విశేష కృషి సల్పిన వారికి ఇస్తుంది.

    ఆ  అవార్డు గ్రహీతలలో

    • కె.జి.సుబ్రహ్మణియన్ (2001)

    • ఎమ్.వి.దేవన్ (2002)

    • ఎ.రామచంద్రన్ (2003)

    • వాసుదేవన్ నాయర్ (2004)

    • కనై కున్హిరామన్ (2005)

    • వి.ఎస్.వల్లిథాన్ (2006)

    ఇతర గౌరవాలు 

    • రాజా రవివర్మ పేరిట కేరళలోని మావలికెరలో ఒక ఫైన్ఆర్ట్స్ కళాశాలను  నెలకొల్పారు. 

    • రవివర్మపై గల ఆసక్తి వల్ల సినిమా, వీడియోలలో కుడా అతని చిత్రాలను ఉపయోగించుకుంటున్నారు.

    • ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అయిన దాదాసాహెబ్ ఫాల్కే కూడా రవివర్మ చిత్రాల వల్ల ప్రభావితమైనవాడే.

    రాజా రవి వర్మ పై వెలువడిన గ్రంధాలు :

    ఆంగ్ల పుస్తకాలు :

    • రాజా రవివర్మ మరియు ముద్రింపబడిన హిందూ దేవతలు,ఎర్విన్ న్యూ మేయర్,క్రిస్టీన్ స్కెల్బెర్గెర్.న్యూ ఢిల్లీ  ఆక్స్ఫర్డ్  యూనివర్సిటీ ప్రెస్.2003.

    • రాజా రవివర్మ,ప్రఖ్యాతి గాంచిన భారతీయ చిత్రకారుడు 1848-1906,క్లాసిక్ కలెక్షన్,వాల్యూమ్ 1,2.పర్సు రామ్ మంఘా రామ్, బెంగుళూరు.2005.

    • రాజా రవివర్మ: చిత్రకారుని ముఖచిత్రం, డైరీ  ఆఫ్ సి.రాజరాజవర్మ,ఎడిటెడ్ బై ఎర్విన్ న్యూ మేయర్, క్రిస్టీన్ స్కెల్బెర్గెర్.న్యూ ఢిల్లీ ,ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రెస్.2005.

    • దేవుని చిత్రకళ,ఎన్రికో కాస్టెల్లి, గియోవాన్ని ఏప్రిల్.న్యూ ఢీల్లి. ఇల్ తామ్బురోపార్లాన్టి డాక్యుమెన్టేషన్ సెంటర్, ఎథ్నోగ్రాఫిక్ మ్యూసియమ్.2005.

    • ఫొటోస్ ఆఫ్ గాడ్స్,ది ప్రింటెడ్ ఇమేజ్ అండ్ పొలిటికల్ స్ట్రగుల్ ఇన్ ఇండియా. బై క్రిస్టోఫర్ పిన్నె, లండన్, రీక్షన్ బుక్

    మలయాళం పుస్తకాలు :

    • రాజా రవివర్మయు మరియు చిత్రకళయు, కిలమానూర్ చంద్రన్,కేరళ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ప్రచురణ.1999.

    • చిత్రమెళుదు  కొయితంబురాన్, పి.ఎన్.నారాయణ పిళ్ళై.

    • రాజా రవివర్మ,ఎన్.భాస్కరన్ నాయర్.

    రాజా రవి వర్మ పైన గల విమర్శలు :

    • రవివర్మ తనదైన శైలిలో చిత్రించిన చిత్రాలను వివిధ రకాల ఉపయోగాల కోసం విపరీతంగా ముద్రించడం వల్ల సాంప్రదాయ చిత్ర కళ విలువ కోల్పోయింది అన్నారు.  

    • భారతీయ ఇతిహాసాలను తనదైనశైలిలో చిత్రించటము వలనా సాంప్రదాయ భారతీయ చిత్ర కళా శైలి మరుగున పడిపోయింది అనేది కూడా  విమర్శకుల అభిప్రాయం

    • పౌరాణిక పాత్రల రూపకల్పనలోని పౌరాణిక సూత్రాలను విస్మరించటం (ఉదాహరణకు  ద్వారా రవివర్మ గొప్పవైన పౌరాణిక నాయకులను,  సామాన్య మానవుల స్థాయికి దిగజార్చాడు.

    ఈ క్రింది వీడియో యు .ఆర్ .యల్ లు లేదా లింక్ లు చూద్దాం రండి.

    Telugu Actress Gives Life To Ravi Varma Paining | Calendar ...



     - ఈ పేజీని అనువదించు

    శోథన ఫలితాలు

    శోథన ఫలితాలు

    వెబ్ ఫలితాలు

    శోథన ఫలితాలు

    వెబ్ ఫలితా

    నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

    నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe 

    చేయండి .   అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, shareand subscribe చేయండి.   

    నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

    నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

    కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.


    ఈ క్రింది యు. ట్యూబ్ లో రాజా రవి వర్మ వీడియో చూడండి 







    4, మార్చి 2020, బుధవారం

    నవగ్రహాల దోష నివారణకు నవ నారసింహ క్షేత్రాల దర్శనం ఎంతో విశిష్టం ఎంతో పుణ్యం

    https://wowitstelugu.blogspot.com

    నవగ్రహాల దోష నివారణకు నవ నారసింహ క్షేత్రాల దర్శనం ఎంతో విశిష్టం ఎంతో పుణ్యఫలం


    హిరణ్యకశిపుడిని సంవరించి వికటహట్ట్ హాసాలు చేస్తూ అహోబిల కొండల్లో తిరుగుతూ తొమ్మిది ప్రదేశాల్లో వివిధ రూపాల్లో నరసింహ స్వామి వెలసారని ప్రతీతి

  • 1. జ్వాలా నరసింహ స్వామి
  • 2. అహోబిల నరసింహ స్వామి 

  • 3. మాలోల నరసింహ స్వామి
  • 4. వరాహ నరసింహస్వామి (క్రోడా)

  • 5. కారంజ నరసింహస్వామి
  • 6. భార్గవ నరసింహస్వామి

  • 7. యోగానంద నరసింహస్వామి
  • 8. చత్రవట నారసింహస్వామి

  • 9. పావన నరసింహ స్వామి

  • 1. జ్వాలా నరసింహ క్షేత్రము.

    (కుజగ్రహా అనుగ్రహానికి దోషాలు పోవడానికి..)

    • నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా యాదగిరి గుట్ట. హైదరాబాద్ నుండి 65 కి మీ దూరంలో ఉంది.

    • పూర్వం యాదవ మహర్షి ఈ కొండ పైన తపస్సు చేసాడట.అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమవ్వగా తనకు నరసింహమూర్తిని మూడు అంశాలతో దర్శనం అనుగ్రహించమని కోరాడట.అప్పుడు స్వామి గండబేరుండ నరసింహుడు,జ్వాల నరసింహుడు,యోగానంద నరసింహుడు అనే రూపాలలో కనిపించాడట.

    • ఎప్పటికి స్వామి తన కళ్ళముందే ఉండవలసిందిగా యాదవ మహర్షి కోరటం వలన స్వామి అలాగే కొండపైన వెలసాడట.

    • స్వామి వెలసిన స్థలం కొండ పైన గుహలో ఉంది.

    • వైకుంఠవాసుని అశురుడు (హిరణ్యకశిపుడు) నిందించినను శ్రీమన్నారాయణుడు తొణకలేదు,

    • కాని తన భక్తుడైన ప్రహ్లదుని హింసించడం సహించలేక పోయాడు. అందుకే హరి నరహిగా ఆవిర్భవించాడు. 

    • ప్రహ్లదుని కొరకు స్ధంభమునందు వెలసి ప్రహ్లదుని మాట సత్యం చేసి అతి భయంకర రూపంతో హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చి సంహారం చేసినందుకు ఈ స్వామిని "జ్వాలా నరసింహుడు" గా వ్యవహరిస్తారు.

    • ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే కుజగ్రహ దోషాలు తొలుగుతాయి అని భక్తుల నమ్మకం.

    2. అహోబిల నరసింహస్వామి.
    (గురుగ్రహ అనుగ్రహానికి దోషాలు పోవడానికి..)
    • నారాయణుడు ఉగ్రనారసింహ అవతారం దాల్చి హిరణ్యకశపుని చీల్చి చెండాడిన క్షేత్రమిదేనని స్థల పురాణం చెబుతుంది.

    • హిరణ్యకశపుని చీల్చి చెండాడిన నరసింహ స్వామిఉగ్ర రూపాన్ని చూసి దేవతలు అహో .. బలం, అహో బలం అని ఆశ్చర్యంతో పొగడేరటా.

    • అందుకీ ఈ క్షేత్రానికి అహోబిల నరసింహ స్వామి దేవాలయంగా పేరు వచ్చింది అని చెబుతారు.

    • ముక్కోటి దేవతలు స్తోత్రము చేసిన కోపము తగ్గని నృసింహ స్వామిని ప్రహ్లాదుడు తపస్సు చేయగా "స్వయంభు" తనకు తానే సాలగ్రామముగా, ఎవరు ప్రతిష్ఠచేయని మూర్తిగా ఈ బిలమునందే వెలసినారు.

    • ప్రహ్లాదుడు ప్రార్ధించగా గరుడాద్రి పర్వత క్రింద భవనాశిని తీరమునందు గుహలోపల స్వయంభువుగా వెలసి ప్రహ్లాదునికి దర్శనమిచ్చినదియే ఈ అహోబిలం.

    • ఈ అహోబిలానికి దేవతలు స్తుతించినందున అహోబలం అని, బిలం నందు స్వయముగా వెలసినందుకు అహోబిలం అని రెండు విధాలుగా అభివర్ణించారు.

    • ఈ నరసింహా స్వామిని పూజించిన వారికి గురుగ్రహా దోషాలు నివారణ అవుతాయి.


    3. మాలోల నరసింహ స్వామి..
    (శుక్రగ్రహ అనుగ్రహానికి.. దోషాలు పోవడానికి..)
    • వేదాద్రి పర్వతంమీద లక్ష్మీనృసింహ స్వామిగా "మా" అనగ లక్ష్మి లోల యనగ "ప్రియుడు" అని అర్ధం.

    • ఈ దేవాలయానికి మార్కొండలక్ష్మమ్మపేటు అని కూడా పిలుస్తారు.

    • ఎగువ అహోబిలానికి 1 కి.మీ దూరం లో ఈ ఆలయం కలదు.

    • స్వామి వారు ప్రసన్నాకృతిలో దర్శనమిస్తారు.

    • వేదాద్రి శిఖరాన చదునైన ప్రదేశంలో ఈగుడి నిర్మించబడినది.

    • ఇక్కడి శిల్పము వామపాదాన్ని మడుచుకొని, దక్షిణపాదాన్ని వంచి కిందకు వదలి సుఖాసీనుడై ఉన్నాడు.

    • స్వామివారి ఎడమ తొడపై లక్ష్మీదేవి స్వామివారి వామ హస్తము లక్ష్మీదేవిని ఆలింగనము చేసుకొన్నట్లుగా యున్నది.

    • స్వామి శంఖు, చక్ర, వరద, హస్తాలతో యున్నది. భూతలం నుండి ఆవిర్భవించిన తామరపై లక్ష్మీదేవి పాదాలు ప్రకాశిస్తున్నాయి.

    • ఇదొక ప్రశంతమైన సుందరమైన చోటు,

    • ధ్యాన అనుష్టాలకు చక్కని వేదిక.

    • ఈ నరసింహా స్వామిని పూజించినవారికి శుక్రగ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుందని ప్రతీతి.

    4. వరాహ నరసింహస్వామి (క్రోడా)
    (రాహుగ్రహ అనుగ్రహానికి దోషాలు పోవడానికి)

    • వేదాద్రి పర్వతముయందు వేదములను భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని పోగా వరాహ నరసింహుడుగా శ్రీమన్నారాయణుడు అవతరించి భూలోకం కిందకు వెళ్ళి సోమకాసుని సంహరించి భూదేవి సహితంగా పైకితెచ్చినందుకు ఈ క్షేత్రానికి వరాహ నరసింహ క్షేత్రమని పేరు.

    • భూదేవిని ఉద్ధరించిన వరాహస్వామి.

    • ఈ నరసింహా మూర్తిని దర్శించిన రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి.

    5. కారంజ నరసింహస్వామి.
    (చంద్రగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి)
    • కారంజ వృక్ష స్వరూపిమైన శ్రీ కారంజ నరసింహ మూర్తికి కరంజ వృక్షము క్రింద పద్మాసనంతో వేంచేసియున్న స్వామికి కారంజ నరసింహస్వామి అని పేరు.

    • పగడలువిప్పి నిలిచిన ఆదిశేషుని క్రింద ధ్యాననిమగ్నుడైన మూర్తి.

    • గోబిలుడనే మహర్షి తపస్సు చేసినందుకు ఆయనకు ప్రత్యక్షమైనారని తెలియుచున్నది

    • శ్రీ ఆంజనేయస్వామి ఇక్కడ తపస్సు చేయగా నృసింహస్వామి దర్శనమివ్వగా అందుకు ఆంజనేయుడు "నాకు శ్రీరామ చంద్రమూర్తి తప్ప వేరెవ్వరు తెలువదని చెప్పగా అప్పుడు

    • " నృసింహుడు నేనే శ్రీరాముడనేనే నృసింహస్వామి సాంగ (ధనస్సు) హస్తములతో దర్శన మివ్వగా ఈ స్వామికి కారంస్వామి అని పేరు.

    • ఈ స్వామికి పాలనేత్రము (త్రినేత్రము) కలదు.

    • అందుకే అన్నమయ్య "పాలనేత్రానల ప్రబల విద్ద్యులత కేళి విహార లక్ష్మీనరసింహ" అని పాడారు.

    • ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి చంద్రగ్రహ అనుగ్రహం లభించును.

    6. భార్గవ నరసింహస్వామి.
    (సూర్యగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి..)

    • పరశురాముడు ఈ అక్షయ తీర్ధ తీరమందు తపస్సు చేయగా శ్రీ నృసింహాస్వామి హిరణ్యకశిపుని సంహరం చేసే స్వరూపంగా దర్శనమిచ్చాడు.కావున ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రమని పేరు.

    • ఈ స్వామిని "భార్గోటి" అని ప్రాంతీయ వాసులు పిలుస్తారు.

    • పరశురాముని పూజలందుకున్న దివ్యధామము ఇది .

    • ఈ ఆలయం దిగువ అహోబిలానికి 2 కి.మీ. దూరం లో ఉత్తర దిశ (ఈశాన్యము) యున్నది.

    • స్వామి వారి విగ్రహం, పీఠంపై చతుర్బాహయుతమైశంఖు చక్రాన్వితములైన ఊర్ద్వబాహువుల, అసురుని ప్రేవులను చీలుస్తు రెండు హస్తాలు, ఖడ్గహస్తుడైన హిరణ్య కశిపుడు,ప్రక్కలోనే అంజలి ఘటిస్తున్న ప్రహ్లాదుడు,

    • ప్రభావళి నందు దశావతారములతో ఈ విగ్రహము కలిగియున్నది.

    • ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి సూర్యగ్రహ అనుగ్రహం లభించును.
    7. యోగానంద నరసింహస్వామి.
    (శనిగ్రహ అనుగ్రహానికి దోషాలు పోవడానికి..)
    • యోగమునందు ఆనందమును ప్రసాదించుచున్నాడు. కాబట్టి స్వామివారికి యోగానంద నరసింహ స్వామి అని పిలవబడుచున్నాడు.

    • యోగపట్టంతో, విలసిల్లినాడు,

    • ప్రహ్లాదుని ఈ యోగ నృసింహుని అనుగ్రహంతో యోగాభ్యాసం చేసినాడట.

    • మనశ్చాంచల్యము కలిగిన బ్రహ్మ నరసింహుని గురించి తపస్సు చేసి మన:స్ధిరత్వమును సాధించెను.

    • ఈ ప్రదేశము యోగులకు, దేవతలకు నిలయం.

    • ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి శనిగ్రహ అనుగ్రహం లభించును.


    8. చత్రవట నారసింహస్వామి.
    (కేతుగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి)
    • పద్మాసనంతో అభయహస్తాలతో నల్లగా నిగనిగలాడుతున్న ఈమూర్తి చాలా అందమైన ఆకర్షణీయమైన మూర్తి. "హా హా" "హుహ్వా" అను ఇద్దరు గంధర్వులు అతి వేగముతో గానం చేసి నృత్యం చేయగా నృసింహస్వామిసంతోషించి వారికి శాప విమోచనం గావించెను.

    • కిన్నెర, కింపుర, నారదుల ఈ క్షేత్రం నందు గానం చేసిరి. సంగీతాన్ని అనుభవించినట్లు ఉండే ఈ స్వామిని

    • చత్రవట స్వామి అని పిలుస్తారు.

    • ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి కేతుగ్రహ అనుగ్రహం లభించును.


    9. పావన నరసింహ స్వామి.
    (బుధగ్రహ అనుగ్రహానికి దోషాలు పోవడానికి)
    • పరమపావన ప్రదేశం లో ఏడుపడగల ఆదిశేషుని క్రింద తీర్చిదిద్దిన మూర్తి.

    • ఈ స్వామివారి పేరులోనే సమస్త పాపములను, సంసారం లో జరిగే సుఖ:దుఖా:లను తొలగించగలిగేవాడని అర్ధమగుచున్నది.

    • "భరద్వాజ" ఋషి ఇచ్చట తపస్సు చేయగా స్వామి వారు మహాలక్ష్మీ సహితంగా వారికి దర్శనమిచ్చారు.

    • ఈ స్వామికి పావన నరసింహస్వామి అని పేరు. ఈ క్షేత్రాన్ని పాములేటి నరసింహస్వామి అని కూడా పిలుస్తారు.

    • ఎగువ అహోబిలానికి 6 కి.మీ. దూరములో దక్షిణ దిశలో యున్నది.

    • పాపకార్యములు చేసినవారు ఈ స్వామిని దర్శించినంతనే పావనులగుదురు.

    • బ్రహ్మోత్సవముల దగ్గరనుండి ప్రతి "శనివారం" నృసింహ జయంతి వరకు అద్భుతంగా వేడుకలు జరుగును.

    • ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో వారి వారి కష్టములను, పాపములను భగవంతుని ప్రార్ధనా రూపముగా సేవించి దర్శించుకుంటారు.

    • ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి బుధగ్రహ అనుగ్రహం లభించును.
    ఇంకా వివరాలకు ఈ క్రింది వీడియో యు .ఆర్. యల్ లు చూడండి.

    Pudami : అహోబిలం | Narasimha Swamy Temple ... - YouTube


    నోట్ :

    నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

    నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe 

    చేయండి .   అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, shareand subscribe చేయండి.   

    నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

    నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

    కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.










    2, మార్చి 2020, సోమవారం

    విశ్వకర్మ లు ఎవరు మూలాలూ వారి గోత్రాలు ఇంటిపేర్లు వారి చరిత్ర గురించి తెలుసుకోండి

    wowitstelugu.blogspot.com

    విశ్వకర్మ లు ఎవరు మూలాలూ వారి గోత్రాలు  ఇంటిపేర్లు వారి చరిత్ర గురించి తెలుసుకోండి 


    విశ్వకర్మలు బ్రహ్మ స్వరూపాలు  విశ్వకర్మలు భగవంతుడి రూపాలు విశ్వకర్మలు ఎవరు ఎందరో తెలుసు కొందాము విరాట్ విశ్వకర్మ భగవానుడు (పంచముఖుడు) ఐదు ముఖములు కలవాడు. విరాట్ విశ్వకర్మ యొక్క పంచ ముఖాల నుండి 

    • మను, 

    • మయ, 

    • త్వష్ట, 

    • శిల్పి

    • విశ్వజ్ఞ బ్రహ్మలు ఉద్భవించారు, 

    • ఈ పంచ బ్రహ్మల నుండి వారి సంతతి అయిన ఐదుగురు (5)

    • సనగ, సనాతన, అహభౌసన, ప్రత్నస, సుపర్ణస.) పంచార్షేయబ్రాహ్మణులు(విశ్వబ్రాహ్మణులు)ఉద్భవించారు 

    • వీరి ద్వారా శాస్త్రములు  మరియు వృత్తులు నిర్ధేశింపబడినవి లేదా ఏర్పాటు చేయబడినవి.

    • వీటితో పాటు పౌరోహిత్యం కూడా వారి వృత్తులలో భాగమే అని చెప్పవచ్చు.

    1 ) పరమాత్మ విశ్వకర్మ (విరాట్ విశ్వకర్మ)


    ఐదు ముఖాలు, పది హస్తాలు కలిగిన రూపం. ఇతను ప్రధాన దేవతలకు కనిపించును (పుట్టుక) లేదు.మాగశుద్ధ త్రయొదశి నాడు పరమాత్మ విశ్వకర్మను పూజిస్తారు.

    శ్లో||
    నభూమి నజలం చైవ నతేజో నచ వాయవ:
    నచబ్రహ్మ నచవిష్ణు నచ రుద్రస్య తారకః
    సర్వశూన్య నిరాలంబో స్వయంభూ విశ్వకర్మణ:
    తా||
    భూమిజలముఅగ్నివాయువుఆకాశము, బ్రహ్మవిష్ణుమహేశ్వరఇంద్రసూర్య నక్షత్రంబులు లేని వేళ విశ్వకర్మ స్వయంభు రూపమైయుండెను. భూమి నీరు అగ్ని గాలి బ్రహ్మ విష్ణు రుద్రుడు నక్షత్రా లేమియు లేనపుడు విశ్వకర్మ తనంతట తాను సంకల్ప ప్రభావంచేత ఆవతరించాడు.
    శ్లో||
    పూర్వావనా త్సానగః దక్షణా త్సనాతనః
    అపరా దహభూవః ఉద్వీచ్యాం ఉర్ధవాత్సుపర్ణః
    తా||
    తూర్పు ముఖమునందు సానగ ఋషి, దక్షిణ ముఖములో సనాతన ఋషి, పశ్చిమ ముఖములో అహభూన ఋషి, ఉత్తర ముఖములో బ్రత్న ఋషి, ఊర్ధ్వముఖములో సుపర్ణ ఋషులుద్బవించిరి.
    2) భువన పుత్ర విశ్వకర్మ

    • ఐదు ముఖాలు, పది హస్తాలు కలిగిన రూపం. ఇతను ప్రధాన దేవతలకు కనిపించును (పుట్టుక) లేదు. ఏనుగు వాహనంగా కలవాడు భువనపుత్ర విశ్వకర్మ (ఏనుగు నల్లదా తెల్లదా అనేది ముఖ్యము కాదు)  భువనపుత్ర విశ్వకర్మఅంగీరస వంశములో జన్నించిన ఋషి.

    • పరబ్రహ్మ విశ్వకర్మని సాక్షాత్ కారం చేసుకున్నా మొట్ట మొదటి విశ్వబ్రాహ్మణుల గురువులైయిన భువన విశ్వకర్మ పూజ ప్రతి సంవత్సరం చైత్రశుక్ల పంచమి నాడు పూజ జరుపుకుంటారు. 

    • ఇతనిని  ముఖ్యంగా కర్మాగారాలు మరియు పారిశ్రామిక ప్రాంతాలలో తప్పకుండా పూజలు జరుపుతారు. వారి పనిముట్లను విశ్వకర్మ ముందుంచి పూజిస్తారు.

    3) దేవశిల్పి విశ్వకర్మ
    • హంసవాహనంగా కలవాడు దేవశిల్పి విశ్వకర్మ

    • దేవశిల్పి విశ్వకర్మను పూజిస్తారు. ఒక తల రెండు హస్తాలు, 

    • ఇతని జయంతి సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశించినపుడు ఇంచుమించుగా సెప్టేంబర్ 17 న జరుపుకుంటారు.

    • ఇతను  లోకాలను పట్టణాలను  4 యుగాలలోను సృష్టించాడు 

    • హిందూ పురాణాల ప్రకారం ఎన్నో పట్టణాలను నాలుగు యుగాలలో నిర్మించాడు.

    • సత్యయుగంలో దేవతల నివాసం కోసం స్వర్గలోకం నిర్మించాడు.

    • త్రేతాయుగంలో సువర్ణ లంకను శివుని కోసం నిర్మించాడు. 

    • ద్వాపర యుగంలో ద్వారక నగరాన్ని మరియు 

    • కలియుగంలో హస్తినాపురం మరియు ఇంద్రప్రస్థం నిర్మించాడు.

    విశ్వకర్మలు ఎవరు ?

    • విశ్వకర్మ ఋగ్వేదంలో, కృష్ణ యజుర్వేదంలో, శుక్ల యజుర్వేదంలో సృష్టి కర్తగా పేర్కొన బడినాడు. 

    • అథర్వణ వేదంలో ఆహార ప్రదాతగా వర్ణించబడినాడు. 

    • పురుష సూక్తంలో విరాట్ పురుషుడుగా కీర్తించ బడినాడు. 

    • సహస్ర బాహుగా, సహస్ర చక్షుగా, సహస్ర పాదుడుగా, సహస్ర ముఖుడుగా అన్ని వేదాలలో వర్ణించబడినాడు. 

    • సకల వేదముల ప్రకారం విశ్వకర్మయే సృష్టికర్త. కానీ కొన్ని పురాణాలు చతుర్ముఖ బ్రహ్మను సృష్టికర్తగా వేద విరుద్ధంగా పేర్కొంటాయి. 

    • అంతేగాక విశ్వకర్మను చతుర్ముఖ బ్రహ్మ కుమారుడిగా చెప్తాయి. ఇది వేద విరుద్ధం

    • వేదములు విశ్వకర్మను సర్వపాప సంహర్తగా పేర్కొనాయి. సర్వ దిక్కులను పరికించు దృష్టి కలిగిన అమిత శక్తి కలవాడు కనుకనే ఈయన భగవంతుడు అని ఋగ్వేదము ఈయనను భగవంతునిగా పరిగణించింది. 

    • మహాభరతము ఈయనను వేయికళలకు అధినేతగా అభివర్ణించింది. ఈతని అర్చామూర్తిని విశ్వకర్మ పురాణము పంచ శీర్షుడుగా వర్ణించింది. 

    • సృష్టి తొలినాళ్ళ నుంచి సుప్రసిద్దులైన శిల్పకారులు ఐదు మంది ఉన్నారు. వారు విశ్వకర్మకు జన్మించారు.

    విశ్వకర్మలు 5 గురు కలరు వారు వరుసగా  కమ్మరి,వడ్రంగి, కంచరి, శిల్పులు, స్వర్ణకారులు,

    • విరాట్ విశ్వకర్మ యొక్క పంచ ముఖాల నుండి... 

    • 1. మను, (శివుడు ఆధార  ) 2. మయ (విష్ణు ఆధారిత) , 3.త్వష్ట, (బ్రహ్మ ఆధారిత) 4.శిల్పి/ దైవజ్ఞ  (ఇంద్ర ఆధారిత ), 5.విశ్వజ్ఞ (సూర్య ఆధారిత)  బ్రహ్మలు ఉద్భవించారు, 

    ఈ పంచ బ్రహ్మల నుండి వారి సంతతి అయిన ఐదుగురు - 
    1. (సనగ బ్రహ్మర్షి తర్కశాస్త్రము  (వృత్తిపని కమ్మరి)

    2. సనాతన బ్రహ్మర్షి (వ్యాకరణము శాస్త్రం  (వృత్తి పని వడ్రంగి) ,

    3 .అహభౌసన బ్రహ్మర్షి (ధర్మశాస్త్రం)  (వృత్తి కంచరి పని చేయువారు  )

    4. ప్రత్నస బ్రహ్మర్షి  మీమాంస శాస్త్రము  (వృత్తి రాతి శిల్పాలు చెక్కువారు ),

    5. సుపర్ణస బ్రహ్మర్షి.  వైద్యం,జ్యోతిష్యం (వృత్తి  బంగారు ఆభరణాలు చేయడం       వృత్తి 

    • పంచార్షేయబ్రాహ్మణులు నుండి  విశ్వబ్రాహ్మణులు ఉద్భవించారు వీరి ద్వారా చేయు శాస్త్రం మరియు వృత్తులు నిర్ధేశింపబడినవి.

    • వీటితో పాటు పౌరోహిత్యం కూడా వారి వృత్తులలో భాగమే


    01. కమ్మరి పని వారుఅయోకారుడు  లేదా ఇనప పనిని చేసేవారు 

    02. వడ్రంగి పని చేసేవారు సూత్రకారుడు  లేదా చెక్క పని కొయ్య పని చేసేవారు 

    03. కంచరి పనివారు :  తామ్ర కారుడు లేదా కంచిరి పని రాగి ఇత్తడి, కంచు పాత్రలు             చేసేవారు 

    04. శిల్పకారులు : స్థపతి లేదా రాతిని చెక్కేవారు రాతి పైన బొమ్మలు చెక్కేవారు 

    05 స్వర్ణకారులు :  కంసాలి స్వర్ణకారుడు బంగారం తో ఆభరణాలు వస్తువులు చేసేవారు.


    • గ్రామంలో ఒక స్థలంలో ఈ ఐదు వృత్తులనూ చేస్తూ గ్రామానికి కావల్సిన వస్తువులను సమకూర్చేవారు. ఈ

    • స్థలాన్నే విశ్వకర్మశాల అని ఆ రోజుల్లో వ్యవహరించేవాళ్ళు. క్రమేణా ఆ పేరు కాస్తా 'కర్మశాల'గా మారి, 'కమశాల'గా మారి, 'కంసాలి' కులం పేరుగా, 

    • ఈ  కులంలో పుట్టిన వారిని 'కంసాలి' గా పిలవడం జరుగింది.

    ఉపకులాలు :

    రుంజలు:- 
    • తెలుగు కులాలలోని కొన్ని కులాలను ఆశ్రిత (కులాలు) జాతులు ఉన్నాయి. వీటినే పరిశోధకులు, జానపదవృత్తి గాయకులు అని వ్యవహరిస్తుంటారు. అలాంటి వారిలో రుంజలు కూడా ఉన్నారు.

    • పంచార్షేయుల(విశ్వ బ్రాహ్మణుల) గోత్రాలను, వంశానామాలను పొగడి విశ్వకర్మ పురాణం చెప్పేవారే రుంజలు. 

    • వారు కథ చెబుతూ వాయించే వాయిద్యమే రుంజ. 

    • చర్మ వాయిద్యాలలో చాలా పెద్దది రుంజ దీని శబ్దం కూడా రెండు, మూడు కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. 

    • వృత్తి గాయకుల వాయిద్యాలలో ఇంత పెద్దది మరొకటిలేదు. రుంజ కారుడు మోయలేని బరువుగానే దీనిని మోస్తుంటరు. "నా సంసార బరువును అది మోస్తున్నపుడు దీని బరువును మెము మోయలేమా" అని ఆ కళాకారులంటారు. 

    • రుంజ వాయిద్యకులు ఒక గ్రామానికి వచ్చారంటే, ముందుగా భేరి మోతలతో రుంజ వాయిద్యాన్ని ఉధృతంగా అగమకాలనిస్తూ వాయించడంతో రుంజ వారు గ్రామంలోకి వచ్చారనేది అందరికీ అర్థమైపోతుంది.


    పనసలు:- Panasa's (పనసలు)
    1. అగ్ని మహాదేవికి విశ్వకర్మ తెజస్సుతో ఆవిర్బవించిన బాలుడు పనసచెట్లలో పెరిగాడు. ఆ బాలుడు వంశకర్తగా కలిగిన కులాలవారే పనసలు. 
    2. వీరు కూడా పంచార్షేయబ్రాహ్మణ(విశ్వబ్రాహ్మణ) కుటుంబాల ఇల్లకు వార్షికంగా వెళ్లి శబ్దం, గానం చేసి ఆదరణను పొందుతుంటారు, 
    3. భోజన తాంబుల - దక్షిణలతో జీవితాలను కొనసాగిస్తుండేవారు - క్రమం క్రమంగా వీరి జాడ కనుమరుగవుతున్నది. 
    పౌరోహిత్యం: 
    పౌరోహిత్యము ఒక వృత్తి మాత్రమే, పౌరోహిత్యము చేయువానిని పురోహితుడు అని అంటారు, 
    • పురోహితుడు అనగా పురజనులకు (ప్రజలకు) హితము పలికెడి వాడు అని అర్థం. అనగా, మనము ఏదైన పనిచేయబోయినప్పుడు, ముందుగా, అతనిని సంప్రదిస్తే, ఆ పని చేయడం లోని మంచి, చెడ్డలను చెప్పి, ఆ పని చేయడం యోగ్యమయిన దయితే, దానిని నిర్వర్తించే విధానం తెలిపేవాడు పురోహితుడు. 
    • ఒకపనిని, స్వప్రయోజనాన్ని ఆశించిగాని, లేదా ఇతర కారణముల వలన గాని మన చేత చేయిస్తే, దాని వలన వచ్చే పాపము పురోహితునికే వెడుతుందిగాని, మనకు కాదు. అందువలన, ఏ పనిచేయడానికైనా ముందు పురోహితుని అనుజ్ఞ తీసుకోవాలి. 
    • పాలకుడైన వాడు పాలితుల ( ప్రజల ) పాపములకు బాధ్యుడు, పాలకుని పాపములకు పురోహితుడు బాధ్యుడు.
    • రాజా రాష్ట్రకృతం పాపం రాజ పాపం పురోహితః  అని ఆర్యోక్తి.
    • పురోహితుడు చేసే పనిని పౌరోహిత్యము అంటున్నారు. పూర్వకాలంలో, రాజ్యానికి శుభములు సమకూడేందుకు, పరరాజుల దండయాత్రల వంటి విషమ పరిస్థితులలోను మంత్రి, పురోహితులతో రాజు సమాలోచనలు జరిపేవాడు. వివాహాది షోడశకర్మలు, పూజలు, వ్రతాలు మరియు యజ్ఞయాగాదులు, జరుపడానికి సామన్యప్రజలు పురోహితుడునీ తప్పక ఆశ్రయించాలి
    • పౌరోహిత్యము చేయువారు కేవలం సప్తార్షేయ బ్రాహ్మణులే కానక్కరలేదు. పంచార్షేయ బ్రాహ్మణ కులస్థులు కూడా వైదిక బ్రహ్మణులే కనుక పంచ వృత్తులతో పాటు పౌరోహిత్యం కూడా వారి వృత్తియే. అలాగే పౌరోహిత్యం గురు ముఖముగా నేర్చుకున్న ఎవ్వరైనను పౌరోహిత్యము చేయవచ్చును, ప్రస్తుతం వివిధ కులాలకు సంబంధించిన వారు కూడా పౌరోహిత్యము నిర్వర్తిస్తున్నారు.

     విశ్వకర్మ ధ్వజము :



    విశ్వకర్మలకు ఒక జెండా కూడా ఉంది అది ఎలా ఉండాలో కూడా వ్రాసి ఉంది. 

    శ్లో|| 
    గగనం నీల వర్ణం చ మారుతం ధూమ్ర వర్ణకం
    పావకో రక్త వర్ణం చ సలిలం శుభ్ర వర్ణకం
    హరిద్రా వర్ణకం పృధ్వి పఞ్చ భూతాని ఇతి క్రమాత్||
    తా|| 
    ఆకాశము - నీలం రంగు,  వాయువు - గచ్చకాయ రంగు,  అగ్ని - ఎరుపు రంగు ,నీరు - తెలుపు రంగు, భూమి - పసుపు రంగు ఓం - బంగారు రంగు ఈ విధం గా ఉండాలి .

    • ఇది పంచభుత సహిత పరమాత్ముని యొక్క ధ్వజము (జెండా), 

    • దీనిని ప్రతీ మానవుడు తమ ఆధ్యాత్మిక కార్యకలాపాలు చేయు ముందు ఈ ధ్వజమును ప్రతిస్ధాపన చేయవలెను.

    • మన ప్రాచీన శాస్త్రముల ప్రకారము ఈ పరమాత్మ ధ్వజమును ప్రతీ మానవుడు తమ తమ ఇండ్ల పై, కార్యాలయముల పై, పనిచేయు కర్మాగారముల పై, దేవాలయముల పై ప్రతిస్ధాపన చేయవలెనని బుుషులు, జ్యోతీష్య పండితులు తెలియజేయుచున్నారు. 

    • ఈ విధముగా ధ్వజ స్ధాపన చేయుట వలన గ్రహముల నుండి వచ్చు దుష్ట ప్రభావము జీవజాలములపై (మనపై) చూపవు. 

    • పరమాత్మ నిరాకారుడు (ఆకారము లేనివాడు అని అర్ధము) అందుచేత ధ్వజము యొక్క మధ్యభాగములో ఉన్న చిహ్నం ఏ జీవమున్న రూపము గాని, జంతు రూపము గాని, మానవాకారం గాని పొందు పరచబడలేదు.

    • ఓం కారం కూడా ఒక ఆకారము ఐనప్పటికిని మానవుని నిర్మితం కాదు. ఓం కారం కేవలం ఒక శబ్ధము. పరమాత్ముని యొక్క చిహ్నం. పరమాత్మునిని ఏ మానవుడు వర్ణింపజాలడు. 

    • పరమాత్ముని ఉనికిని తెలుసుకొనుటకు మాత్రమే ఈ ధ్వజములో పంచభుతములు మరియు ఓం కారం సాక్షీభుతములు.
    విశ్వకర్మ - గోత్రములు - ఇంటిపేర్లు  

    • Suthaksha Brahmarushi (Surname Dhavileswarapu)
    • Chithrasena Brahmarushi(surname Kadaru)
    • Viswadatta Brahmarushi (Surname Pedapudi), Chandravaram, west godavari
    • Devasena Brahmarushi (Kandukoori)
    • Viswatomuka Brahmarushi
    • Manu Vishwakarma Braharushi (Amalapurapu)sirikondagothram
    • Vamadeva Bramarushi
    • Sumedhaka Brahmarushi
    • Vibraja Brahmarushi( Javvadi )
    • Sanaga Brahmarushi (surname Addugula, Boddoju)
    • Sanathana Brahmarushi
    • Abhuvamsha Brahmarushi
    • Pratanasa Brahmarushi
    • Kardhama Brahmarushu(surname Gannavarapu)
    • Suparnasa Brahmarushi ( Nemalipuri vishwabrahmin )
    • Viswagna Brahmarushi
    • Jayasena Brahmarushi ( Mudapaka )
    • Manibhadra Brahmarushi (Surname Bennabhakthula)
    • Subarnasa Brahmarushi
    • Sankyana Brahmarushi
    • Santwa Brahmarushiala
    • Architha Brahmarushi
    • Viswabhadra Brahmarushi (surname Kanasani)
    • anagaRushi
    • Isunandana Brahmarushi
    • Yagnapala Brahmarush
    • Sangoju gotram
    • Kasyapa brahmarshi (Kaduri)
    • KusaDharma Brahmarushi (surname: nzarojugothramNara)
    • Vidyantha Bramharshi (Murumulla)
    • Baswantha Brahmarushi (Surname: Sanagapati)
    • yagnabrahmarushi(buragapu)
    • Abhyasa (surname chelikacherala) AKOJU
    విశ్వకర్మలు గురించి మరింత తెలుసు కోవడానికి ఈ క్రింది వీడియో యు. ఆర్.యల్. లు చూడండి .

    ABOUT VISWABRAHMIN.../విశ్వబ్రాహ్మణులు ఎవరు ...

    Burrakatha |SRE VEERA BRAHAMGARI CHARITRA ...

    Vishwakarma charitra - YouTube

    Special Story On Vishwakarma Community | Bathuku Chitram ...

    https://www.youtube.com › watch

    శోథన ఫలితాలు

    vishwakarma celebrities in tollywood - YouTube

    నోట్ :

    నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

    నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe 

    చేయండి .   అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, shareand subscribe చేయండి.   

    నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

    నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

    కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.