హిందువులు ఆరాధించే ముఖ్యమైన అష్టాదశ శక్తి పీఠాలు
హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథల,ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని స్థలాలను శక్తిపీఠాలుఅంటారు.
అష్టాదశ శక్తి పీఠాలు -పురాణ కథ:
- ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంట బెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. విషయం తెలుసుకున్న శివుడు వీరభద్రుణ్ని సృష్టించి దక్షయాగాన్ని ధ్వంసం చేశాడు. సతీదేవి పార్థివదేహాన్ని భుజాన వేసుకుని ప్రళయతాండవం చేశాడు. ఉగ్రశివుణ్ని శాంతింపజేసేందుకు చక్రప్రయోగం చేసి , సతీదేవి శరీరాన్ని ఖండించాడు విష్ణువు. ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే అష్టాదశ శక్తి పీఠాలు' అని చెబుతోంది దేవీభాగవతం.
- కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్ర సాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది.
అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్ధనా శ్లోకం:
లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే
అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే
హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా
వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్
సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్
ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. వీటిలో 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. మనం 18 శక్తి పీఠాలు గురించి తెలుసుకొందాం...
![]() |
శాంకరి - శ్రీలంక |
ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం ఇది దేశం తూర్పుతీరంలో ట్రిన్కోమలీలో ఉండవచ్చును.17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో 'త్రికోణేశహవర స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.లంకాయాం శాంకరీదేవి,అష్టాదశ శక్తిపీఠాల్లో మొదటిది.
- భారతదేశమునకు పొరుగున గల సింహళద్వీపం(శ్రీలంక) నందు ఉండేది. శ్రీలంక ద్వీపం నందు తూర్పు తీరప్రాంతములో ట్రింకోమలిపుర (ట్రింకోమ్లీ) పట్టణము వుంది.
- ఇది సతీదేవి కాలిగజ్జెలు పడిన ప్రదేశముగా ప్రసిద్ధి. ఇక్కడ శాంకరీదేవి మందిరము ఉండేది అని పూర్వీకుల వాదన. బౌద్ధమతం, క్రైస్తవమతం అభివృద్ధితో హిందూ మతమునకు రాజపోషణ కరువయింది.
- దీనితో ప్రజల ఆదరణ కూడా క్షీణించింది. కొంతకాలమునకు హిందూ దేవాలయములు శిథిలముగా మారినాయి. కొన్ని కాలగర్భంలో కలిసి పోయినాయి. శాంకరీదేవి మందిరము కూడా కాలగర్భంలో కలిసిపోయి వుండవచ్చును. నేడు శ్రీలంకను శోధిస్తే, ఎక్కడా శాంకరీదేవి ఆలయం కనిపించుటలేదు. ప్రస్తుతం శాంకరీదేవి దర్శనం దుర్లభమే. శ్రీలంకలో తమిళులపై దాడులు హింసాత్మకమవటంతో, వాటిని తట్టుకోలేక పారిపోయి కెనడా, ఇండియా మొదలగు దేశములకు చేరిన హిందువుల సంఖ్య అధికం. క్రమక్రమంగా శ్రీలంకలో హిందూమతమునకు, హిందూ దేవాలయములకు ఆదరణ కరువయింది.
స్థలపురాణం:
త్రేతాయుగంలో రావణాసురుడు, లోకనాథుడైన పరమేశ్వరునితో పాటు శాంకరీదేవిని నిత్యం పూజించినట్లు పురాణ కథనం. ట్రింకోమలీ నందు శాంకరీదేవి ఆలయ దర్శనం నేడు శూన్యం అయినా, క్షేత్ర మహాత్యం, క్షేత్ర దర్శనము ఆనందదాయకమే. కొలంబో పట్టణము పశ్చిమతీరంలో వుండగా, ట్రింకోమలీ పట్టణము తూర్పుతీరంలో వుంది. రెండు పట్టణముల మధ్య రవాణా సదుపాయములు కలవు. మహాపట్టణం, గలోయపట్టణం మీదుగా శ్రీలంక ప్రభుత్వ రైలు మార్గం వుండగా, కాండిపట్టణం, గలోయ పట్టణముల మీదుగా రోడ్డు మార్గం కలదు.
2. కామాక్షి - కాంచీపురం
తమిళనాడు - మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాంచీపురం మోక్షదాయకమైన పట్టణాలలో ఒకటిగా ప్రసిద్ధి. కామాక్షీదేవి పీఠం అష్టాదశ శక్తి పీఠాలలో శ్రీ కామాక్షి అమ్మవారు రెండవ పీఠంగా పరిగణింప బడుతుంది.
సతీదేవి కంకాళము పడినచోటుగా ప్రసిద్ధి.
"కామాక్షీ కామదాయినీ” అని లలితా సహస్రనామాలు పేర్కొన్నాయి. తన కరుణామయైన కంటి చూపుతోనే భక్తుల కోర్కెలను తీర్చగలిగే మహాశక్తి. అమ్మను ఆరాధించి మూగవాడైన భక్తుడు వాక్కును సంపాదించుకొని అయిదు వందల శ్లోకాలతో అమ్మను కీర్తించాడు.
సతీదేవి కంకాళము పడినచోటుగా ప్రసిద్ధి.
"కామాక్షీ కామదాయినీ” అని లలితా సహస్రనామాలు పేర్కొన్నాయి. తన కరుణామయైన కంటి చూపుతోనే భక్తుల కోర్కెలను తీర్చగలిగే మహాశక్తి. అమ్మను ఆరాధించి మూగవాడైన భక్తుడు వాక్కును సంపాదించుకొని అయిదు వందల శ్లోకాలతో అమ్మను కీర్తించాడు.
స్థల పురాణం:
- పురాణ కాలంలో పార్వతీదేవి, పరమశివుని కనులు తన హస్తములతో మూయగా ప్రపంచమంతా చీకటితో నిండిపోయింది. పాప పరిహారానికై మట్టితో శివలింగము తయారుచేసి పూజించెను. అంతట శివుడు పార్వతిని అనుగ్రహించాడు. నాటినుంచి కాంచీపురమున ఫాల్గుణమాసంలో పార్వతీదేవి కళ్యాణం అత్యంత వైభముగా జరుపుచున్నారు. కాంచీ క్షేత్రమును సత్యవ్రతక్షేత్రమని, భాస్కరక్షేత్రమని, తేజసక్షేత్రమని, శివశక్తి క్షేత్రమని, శక్తి క్షేత్రమని పేర్కొనబడింది. క్షేత్రంలో వెలసిన శైవ, వైష్ణవ, జైన, బౌద్ధ దేవాలయములు భారతీయ కళా సంస్కృతి కి ప్రతీకలుగా నిలిచాయి.
- శ్రీ కామాక్షి దేవాలయము నందు అమ్మవారి గర్భాలయము వెనుక భాగమున శ్రీ ఆదిశంకరుల ప్రతిమ ప్రతిష్ఠించబడింది. జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు కాంచీపురము నందు శంకరమఠమును క్రీ.పూ. 482 సంవత్సరములో స్థాపించారు. శ్రీ ఆదిశంకరాచార్యులు తొలి పీఠాధిపతి. భారతీయ ధార్మిక జీవనంలో అవ్యవస్థ నెలకొన్నప్పుడు అజ్ఞానం ముసురుకొన్నప్పుడు, ఆచార కొండల పేరిట ఆర్భాటాలు తోడయినప్పుడు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు ఉదయించారు.
- కేరళ రాష్ట్రంలోని, త్రిచూర్ సమీపమున, పవిత్ర పూర్ణానది తీరంలో గల కాలడి గ్రామం నందు జన్మించారు శ్రీ శివగురు, ఆర్యాంబ దంపతులకు లేకలేక కలిగిన సంతానం జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యులు. శ్రీ శంకరుడు సకల విద్యలనూ నభ్యసించి, దేశం నలుదిక్కులా మూడుమాట్లు పర్యటించి, అద్వైత ప్రభలను ఉజ్జ్వలంగా నిలిపారు. భారత ఖండంలో నాలుగువైపుల నాలుగు పీఠాలు స్థాపించారు. ఉత్తరాన గల హిమాలయ పర్వతాల్లో జోషీమఠమును, అలకనంద తీర్థమున గల బదరికాశ్రమం నందు స్థాపించారు.
- ఇచ్చట శ్రీ నారాయణుడు మరియు శ్రీ పున్నాకరీ అమ్మవారి దర్శనం లభ్యమవుతుంది. దక్షిణాన కర్ణాటక రాష్ట్రంలోని తుంగానది తీరం నందు శ్రీ శృంగేరీ మఠమును స్థాపించారు. ఇచ్చట శ్రీ ఆది వరాహమూర్తి మరియు శ్రీ కామాక్షి అమ్మవారు కొలువైనారు. తూర్పున ఒరిస్సా రాష్ట్రంలోని, పూరి క్షేత్రము నందు మహారధి తీర్థమున గోవర్ధన మఠమును స్థాపించారు. క్షేత్రం నందు శ్రీ జగన్నాథుడు మరియు శ్రీ విమలాదేవిని దర్శించగలము.
- పడమరన గుజరాత్ రాష్ట్రమున ద్వారకా క్షేత్రం నందలి గోమతి నదీ తీరంలోగల శ్రీ ద్వారకాధీశుని ఆలయమునకు ఎడమవైపున శ్రీ శారదాపీఠం స్థాపించారు. ఇచ్చట శ్రీ సిద్ధేశ్వరుడు మరియు శ్రీ భద్రకాళి అమ్మవారు వెలిశారు. ఇవిగాక సన్యాసీ సంప్రదాయంతో సుమారు 1200 మఠాలున్నట్లుగా తెలుస్తోంది. శ్రీ ఆదిశంకరాచార్యులు దేశంలోని అష్టాదశ శక్తిపీఠాలను దర్శించి, శ్రీ చ్రకములను స్థాపించారు.
3.శృంఖల దేవి:
![]() |
శృంఖల దేవి |
ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ - ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.ఒక సాధువు ఆరాధ్యదైవముగా వెలసిన తారమాత, బెంగాలు నివాసులతోపాటు దేశంలోని వారందరికి ఆరాధ్య దైవమయింది. భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారమయింది. నమ్మినవారికి కొండంత శక్తిని ప్రసాదించే శక్తి స్వరూపిణి. ప్రతి నిత్యం యాత్రికులతో క్రిక్కిరిసి వుంటుంది. తారనది తీరంలో, కొంత ఎత్తైన ప్రదేశములో అమ్మవారి ఆలయం వుంది. బస్ హాల్ట్ నుంచి సుమారు అరకిలోమీటరు నడక ప్రయాణము చేయగా తారమాత దర్శనమిస్తుంది.
- ఆలయ రహదారి నిండా పూజా సామాగ్రీలు విక్రయించు షాపులు, పండాల నివాసములతో నిండి వుంటుంది. ఆలయం నందు పూజలు, హోమాలు మొదలగునవి పండాలు నిర్వహించుతారు. తారామాతకు భక్తులు భక్తిశ్రద్ధలతో పాలకోవా, మందారపువ్వులు మొదలగునవి సమర్పించుకుంటారు.
- ఆలయము నందు అమ్మవారి స్వరూపం దేదీప్యమానంగా, తేజోవంతంఆ దర్శనమిస్తుంది. అమ్మవారి నాలుక బయటకు వచ్చి నోరంతా రక్తపుమరకలతో నిండి వుంటుంది.
- తారమాత నిజరూపం మరోవిధముగా వుంటుంది. నల్లటి రాతిమీద ఒక దృశ్యం కానవచ్చును. దానవులతో యుద్ధంచేసి శక్తిహీనుడైన పరమేశ్వరుడుని, శక్తిరూపిణియగు ఆదిశక్తి తన ఒడిలో పరుండపెట్టి చన్నుబాలు నిచ్చి తిరిగి శక్తివంతుడ్ని చేయు దృశ్యమును చూడగలము.
- తిరిగి రాత్రి 8 గంటలకు నిజరూప దర్శనము లభ్యమవుతుంది. భక్తులు అమ్మవారికి అభిషేకములు, కానుకలు మొదలగునవి సమర్పించుకుంటారు. పండాలు నిజరూప దృశ్య వివరణ భక్తులకు తెలియచేస్తారు. నిజరూప దర్శనాంతరము పండాలు అమ్మవారిని అలంకరించుతారు.
- ఆలయ ప్రాంగణములో శివాలయం, గణపతి మందిరము, సాధువు మూర్తి విగ్రహం, వాసుదేవ మందిరము కలవు. అమ్మవారికి ఎదురుగా మూడు మండపములు కలవు. మొదటి మండపమునందు భక్తులు మాత తారను దర్శించుటకు, రెండవ మండపము నందు హోమం మొదలగునవి నిర్వహించుటకు, మూడవ మండపమునందు బలిపీఠమునకు సదుపాయములు కలవు. వీటితోపాటు పూజా సామాగ్రీలు విక్రయించుశాలలు కూడా కలవు. తారమాతను మొదటి మండపము నుంచి దర్శించుకుంటారు.
- నిజరూప దర్శన సమయము నందు అమ్మవారికి కుడివైపున గల ద్వారం నుంచి గర్భాలయములోనికి ప్రవేశము కల్పిస్తారు.
- శంథియ రైలు జంక్షన్కు పశ్చిమవైపుగా సియూరి మీదగా అండల్ వరకు బ్రాంచి రైలు మార్గము కలదు. శంథియ రైలు జంక్ష్కు 19 కి.మీ. దూరమున సియూరి రైలు స్టేషన్ వస్తుంది. దీనికి పశ్చిమంవైపుగా, సుమారు 15 కి.మీ. దూరమున బక్రేశ్వర్ క్షేత్రం కలదు. ఇది శక్తి పీఠంగా ప్రసిద్ధి.
- సతీదేవి అమృత హృదయం పడిన ప్రదేశంగా ఖ్యాతి చెందినది. అహ్మద్పూర్ రైల్వే స్టేషన్ నుంచి కూడా బస్సులో ప్రయాణము చేయవచ్చును. శంథియ రైల్వే జంక్షన్కు దక్షిణం వైపున 14 కి.మీ. దూరమున అహ్మదాపూర్ రైల్వే జంక్షన్ వస్తుంది. దీనికి పశ్చిమం వైపుగా బక్రేశ్వర్ క్షేత్రం కలదు. బర్ధమాన్ జిల్లాలో రెండు శక్తిపీఠాలున్నాయి. మొదటి లాభపూర్ – ఖాట్వారోడ్ మార్గములో లాభపూర్కు 35 కి.మీ. దూరమున కేతుగ్రామ్ అను క్షేత్రం నందు కలదు.
- క్షేత్రంలోని శక్తిరూపమును దేవిబహులుగా పిలుస్తారు. అష్టాదశ శక్తిపీఠాల్లో మూడవ పీఠముగా పరిగణించబడుతోంది. సతీదేవి ఎడమ భుజముపడినట్లుగా ప్రతీతి. ఆలయమునకు ఎదురుగా మండపము వుంది. పందాలు మండపము నందు హోమములు మొదలగునవి నిర్వహించుతారు.
- ఆలయమునకు మండపమునకు మధ్యన బలిపీఠం వుంది. విజయదశమి మొదలగు పర్వదినముల నందు అమ్మవారికి పశుబలి సమర్పించుకుంటారు. కానీ ఇది చట్ట విరుద్ధం .
![]() |
చాముండేశ్వరి |
4. చాముండేశ్వరీ దేవి
చాముండి- క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక కర్ణాటక రాష్ట్రమునకు ప్రధాన నగరం బెంగుళూరు. దీనికి సుమారు 140 కి.మీ. దూరమున ఆగ్నేయం వైపున మైసూరు పట్టణం వుంది. ఇది ఒడయార్ వంశీయులకు రాజధానిగా వుండేది. చక్కటి తోటలు, గొప్ప భవనములతో కూడిన మైసూరు పట్టణము పర్యాటకుల మనస్సును ఆహ్లాదం కలిగిస్తుంది. మైసూర్ పట్టణమునకు సుమారు 13 కి.మీ. దూరమున చాముండీ పర్వతం వుంది. సతీదేవి దివ్యాభరణాలు పడిన ప్రదేశముగా ప్రసిద్ధి.
పురాణగాథ:
మార్కండేయ పురాణంలో దేవి ఉత్పత్తిని గురించి ప్రస్తావించబడింది. మాత మూడవ అవతారంలో మహామాయ, మహాసరస్వతీ రూపిణిగా శుంభ, నిశుంభలనే రాక్షసులను వధించింది. ఆమె దేహం నుంచి వెలువడిన కాళికాదేవి చండు, ముండులను సంహరించి ”చాముండి”గా ప్రసిద్ధి పొందినది.పురాణ కాలములో మహిషాసురుడు పాలించిన పురమును మహిషాసురపురముగా పిలిచెడివారు. కాలక్రమేణా మైసూరుగా మారిందని ప్రతీతి. మహిషాసురుడు మహాబలవంతుడు. మరణంలేని వరాన్ని కోరుతూ ఘోరతపము చేసెను. అది అసాధ్యమని బ్రహ్మ తెలుపగా అంతట మహిషాసురుడు స్త్రీని అబలగా భావించి, స్త్రీ తప్ప ఇతరుల చేతిలో మరణంలేని వరం పొందినాడు. బ్రహ్మ యిచ్చిన వర ప్రభావంతో ముల్లోకములను జయించి దేవతలను, ఋషులను బాధించసాగెను. దుష్టపాలనతో ప్రజాకంటకుడుగా మారిన మహిషాసురుడు సంహరించుటకు జగన్మాత చాముండేశ్వరిగా అవతారము దాల్చి, రాక్షస సంహారము చేసెను. రాక్షస సంహారానంతరం చాముండేశ్వరి మాత మహిషాసురమర్ధినిగా ఖ్యాతి పొందినది. చాముండేశ్వరిదేవి అష్టాదశ శక్తి పీఠాలలో నాలుగవది. మాత మైసూరు ప్రభువులకు కులదైవము మరియు ఆరాధ్యదైవమయినది.
- చాముండి పర్వతము సముద్ర మట్టానికి సుమారు 1200 మీటర్లు ఎత్తుగా వున్నది. కొండమీదకి మెట్లు మార్గంతోపాటు రోడ్డు మార్గము కూడా కలదు. మూడోవంతు మెట్టెక్కేసరికి సమున్నతరగా కనబడు ప్రదేశములో 16 అడుగుల ఎత్తుగల ఏకశిలా నిర్మితమైన నంది విగ్రహం వుంది. నందీశ్వర శిలా విగ్రహం చూపరులను విశేషముగా ఆకర్షించుతుంది. కొండపైకి మహిషాసుర విగ్రహమును చూడవచ్చును. వీటితోపాటు ఒడయారు మహారాజు, మహారాణి విగ్రహములు కూడా దర్శనీయం. నేటి చాముండేశ్వరాలయం 1827వ సంవత్సరములో పునరుద్ధరింపబడింది.
- చాముండి పర్వతమున, తూర్పువైపుగా ”దేవకెరె” అను తీర్థం కలదు. దేవికెరెకు సంబంధించిన కథ ఒకటి గలదు. పాపహరిణియగు గంగానదిలో స్నానమాచరించిన భక్తులు పుణ్యం సంపాదించి, విష్ణులోకం చేరుకొనుచున్నారు. వారి పాపములను గంగామాత స్వీకరించి, తాను మాత్రము క్షీణించుచుండెను. ఒకనాడు గంగామాత బ్రహ్మతో తన బాధను మొరపెట్టుకుంది. బ్రహ్మ ఆజ్ఞ ప్రకారము దక్షిణ భారతదేశమున, పవిత్రమైన కావేరినది ప్రాంతమున గల మహాబలాద్రి పర్వతమున జన్మించి, మహాబలేశ్వర లింగమును ఆరాధించి, తిరిగి స్వచ్ఛత తెచ్చుకుంది. ఇంతటి పుణ్యత గలిగిన జలము నందు స్నానమాచరించి, ఆషాడమాసంలోని కృష్ణపక్షము నందు, రేవతి నక్షత్రం వున్న శుక్రవారం దినమున శ్రీ చాముండేశ్వరి మాతను చంపకమాలతో ఆరాధించిన భక్తుల యొక్క సకలబాధలు తొలగి, వారి కోర్కెలు తీరగలవు.
- సూర్యుడు మేషరాశిలో వుండగా, శుక్లపక్ష సప్తమి దినమున పాతాళ వాహినిలో స్నానమాచరించి, మహాబలాద్రి క్షేత్రమున గల మహాబలేశ్వర స్వామిని ఆరాధించిన వారి కోర్కెలను స్వామి తీర్చగలడు. వైశాఖమాసం, శుక్లపక్ష, శుక్రవారం దినము పాతాళవాహినిలో స్నానమాచరించి రామనాధగిరిలోని స్వామిని ఆరాధించినా సర్వపాపములు తొలగి, సుఖసంతోషములతో జీవించగలరు. మాఘమాసం, శుద్ధపూర్ణిమ, ఆదివారం దినమున పాతాళగంగలో స్నానమాచరించి, రామనాధగిరిలోని స్వామిని ఆరాధించిన సూర్యలోకమును పొందగలరు.
- పురాణ, ఇతిహాసకాలము నందు చాముండిపర్వతమును మహాబలాద్రి పర్వతముగా పిలిచెడివారు. దీనినే మహాబలగిరి అని కూడా సంబోధించేవారు. మహాబలద్రి పర్వతమున స్వయంభువ లింగముగా వెలసిన శ్రీ మహాబలేశ్వర ఆలయం కూడా పురాతనమైనది. శివాలయం నందలి లింగము చాల మహిమాన్వితమైనది. భక్తులు తమ కోర్కెల సాఫల్యం కోసం, నియమంగా స్వామిని ఆరాధించుదురు. వారి సర్వబాధలు తొలగి, సమస్యలకు పరిష్కారం లభించగలదు అని గట్టి నమ్మకం. శ్రీ చాముండేశ్వరి ఆలయమునకు కుడివైపున,
- కొంతదూరమున శ్రీ మహాబలేశ్వరాలయం వుంది. జీర్ణావస్థలో వున్నా, నిత్యం పూజాది కార్యక్రమాలు జరుగుతుంటాయి. శ్రీ మహాబలేశ్వర దర్శనం పుణ్యదాయకం. శివాలయమునకు వెనుక భాగమున శ్రీ నారాయణ స్వామి ఆలయం కూడా కలదు. శ్రీ నారాయణస్వామి దర్శనము కూడా పుణ్యదాయకం.
![]() |
జోగులాంబ ఆలంపూర్ |
5. జోగులాంబ ఆలంపూర్, ఆంధ్రప్రదేశ్
కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో 'తుంగ', 'భద్ర' నదులు తుంగభద్రా నదిగా కలిసే స్థలంలోఉన్నది. ఆంధ్రప్రదేశ్ లోని మహబూబ్ నగర్ జిల్లాలో అలంపురం క్షేత్రంనందు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీ జోగులాంబాదేవి మరియు శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి కొలువైనారు.
- క్షేత్రమున సతీదేవి శరీరాంతర్గత వజ్రాస్తికులు పడినట్లు ప్రతీతి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ పీఠముగా పరిగణించబడుతోంది.
- శ్రీ జోగులాంబను ”విశృంఖలా” అని లలితాసహస్రనామములో చెప్పబడింది. నిత్యానాధ సిద్ధుని " రసరత్నాకరము” నందు అమ్మను యోగాంబ గాను, తాంత్రికుడగు మహాభైరవుడు తన "ఆనందకరము”లో యోగేశ్వరి గాను పేర్కొన్నారు.
- శ్రీ బాలబ్రహ్మేశ్వరాలయమున కు ఆగ్నేయ దిశలో శ్రీ జోగులాంబా ఆలయం వుండేది.
- పూర్వకాలము నాటి ఆలయం శిథిలముకాగా, అమ్మవారి మూలవిగ్రహమును, శ్రీ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయము నందు భద్రపరచినారు. శ్రీ జోగులాబా అమ్మవారి నూతన ఆలయమునకు దేవస్థానము వారు సంకల్పముచేసి, శ్రీశైలదేవస్థానము మరియు కంచి కామాక్షీపీఠం తాలూకా సహాయముతో ఆలయమును పూర్తిచేసినారు. శ్రీబాల బ్రహ్మేశ్వరాలయములోని శ్రీ జోగులాంబా మూల విగ్రహమును నూతన ఆలయం నందు తిరిగి ప్రతిష్ఠించినారు.
- అలంపుర క్షేత్రంలోని ఆలయ సమూహం నందు శ్రీ జోగులాంబా ఆలయముతోపాటు బాలబ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, గరుడబ్రహ్మ, స్వర్గబ్రహ్మ, తారకబ్రహ్మ మరియు పద్మబ్రహ్మ అను నవబ్రహ్మాలయాలున్నాయి. వీటిలో తారకబ్రహ్మ ఆలయం ధ్వంసమైనది. ఆలయములోని శివలింగము రక్షింపబడినది.
- మిగిలిన ఎనిమిది ఆలయాలల్లో శ్రీ బాలబ్రహ్మేశ్వరాయలము ప్రధానమైనది. నవబ్రహ్మాలయముల నందు ప్రతిష్ఠించిన శివలింగాలు ప్రాచీనమైనవి. ఆలయ సమూహమునకు పశ్చిమదిశలో మహాద్వారం వుంది. శిల్పసృష్టితో మహాద్వారమును చాలా ప్రశస్తమైనది. నాటి ముస్లింపాలకులు పశ్చిమద్వారమును ఆక్రమించి, దర్గా నిర్మించినారు.
- శ్రీ బాల బ్రహ్మేశ్వరాలయమునకు చుట్టు కట్టబడిన ప్రాకారములపై, బండలమీద కొన్ని సంకేతములు చెక్కబడినవి. తాంత్రిక చిహ్నముల నెరిగినవాటి సంకేతముల భావములను గ్రహింపగలరు.
- ఆలయసమూహంలోని శిల్పాలు, కళాఖండాలు తాంత్రిక చిహ్నములు కొన్ని కాలగర్భంలో కలిసిపోయినాయి. ఆలయం బయట గల పురాతన వస్తు ప్రదర్శనశాల నందు మరికొన్ని దర్శించగలము.
- శ్రీ జోగులాంబా సిద్ధులకు ఆరాధ్యదైవం. మంత్ర సిద్ధిని పొందగోరినవారు, అలంపుర క్షేత్రమున జపమొనరించినా, సిద్ధి కాగలదని ఆర్యులు నమ్మకం.
- శ్రీ జోగులాంబా అమ్మవారికి ప్రత్యేకముగా ఆలయం వుండేది. శ్రీ జోగులాంబా మహోగ్రురాలై యుండేది. శ్రీ ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రాన్ని తగ్గించుటకు తగిన ప్రక్రియ యంత్రశక్తిని స్థాపించి, అమ్మవారి ఉగ్రరూపాన్ని తగ్గించారని ప్రతీతి.
- 16వ శతాబ్దంలో బహమనీసుల్తాన్ శ్రీ జోగులాంబా ఆలయ విధ్వంసానికి పూనుకొన్నాడు. ధ్వంసమైన ఆలయంలో శ్రీ జోగులాంబా విగ్రహమును, శ్రీ బాలబ్రహ్మేశ్వరాలయములోని నవగ్రహములు సమీపమున శ్రీ ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించినారు.
- సుమారు 630 సంవత్సరములు తరువాత దేవస్థానంవారు, అదే పవిత్ర స్థలము నందు నూతన ఆలయం నిర్మించి, 13 ఫిబ్రవరి 2005వ సంవత్సరములో శ్రీ జోగులాంబా విగ్రహమును పునఃప్రతిష్ఠ చేశారు. నూతన ఆలయం చక్కటి ఆహ్లాదకరమైన ప్రాంతములో నిర్మించబడినది.
- ఆలయమంతా ఎర్రని ఇసుకరాయితో నిర్మించారు. ఆలయమండపము నందు అష్టాదశ శక్తి పీఠాలను పొందుపరచినారు. ఆలయం చుట్టూ చక్కటి ఉద్యాన వనము వుంది. తూర్పున 5 అంతస్తులు మరియు పశ్చిమాన 3 అంతస్తులు గాలిగోపురములు కలవు.
- శ్రీ జోగులాంబా కుడివైపున పవిత్రమైన తుంగభద్రానది మరియు ఎడమవైపున శ్రీ బాలబ్రహ్మేశ్వరాలయ సమూహం కలవు.
- అమ్మవారి ఆలయం ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తిరిగి మధ్యాహ్నం 2 నుంచి 8 గంటల వరకు తెరచివుండును. సర్వదర్శనము ఉదయం 7.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు లభ్యమవుతుంది. అర్చనలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించుతారు. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ప్రత్యేక అర్చనలు మరియు 7 గంటలకు మహామంగళహారతి సేవ జరుగుతాయి.
- ఆలయం బయట పూజాసామాగ్రీలు విక్రయించు షాపులు కలవు. ఆశ్వయుజ మాసమున దేవీనవరాత్రులు, రథోత్సవాలు జరుగుతాయి. ప్రతి మంగళవారం, శుక్రవారం సేవలు విశేషముగా వుంటాయి.
![]() |
భ్రమరాంబిక - శ్రీశైలం |
6. భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి సమేతురాలై ఉంది.
ఇది శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి.ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లా, నందికొట్కూరు తాలూకా, నల్లమల్ల అడవులతో నిండిన కొండల ప్రాంతము నందు శ్రీశైలం కలదు. ఇది పురాణ ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగములలో రెండవది అయిన శ్రీ మల్లిఖార్జున లింగము మరియు అష్టాదశ శక్తిపీఠాలలో ఆరవది అయిన శ్రీ భ్రమరాంబికా పీటమును శ్రీశైలం నందు దర్శించగలము.
- సతీదేవి కంఠభాగము పడినచోటుగా ప్రసిద్ధి చెందినది. అష్టాదశ శక్తి పీఠాల్లో ఆరవ పీఠముగా పరిగణించబడుతోంది. ఆలయ ప్రశస్తి స్కందపురాణం, శ్రీశైలఖండము, బ్రహ్మాండపురాణం, శివపురాణం, శేషధర్మము మొదలగు పురాణాల్లో వుంది. మార్కండేయ పురాణంలో, దేవి సర్వోత్పత్తి గురించి ప్రస్తావించబడింది.
- దేవి తన తొమ్మిదవ అవతారంలో అరుణుడు అనే రాక్షసుని భ్రమరాలు (తుమ్మెదలు) సహాయంతో వధించి, జగతికి శాంతి చేకూర్చినందున, భక్తులు దేవిని ”భ్రామరి”గా కీర్తించారు. ప్రకృతి రూపిణియగు పరాశక్తిని ”భ్రమారాంబికా”గా వర్ణించారు.
- శ్రీశైల స్థలపురాణములు అనేకం. శిలాదుడు అను మహర్షి మహాశివభక్తుడు. అతనికి యిద్దరు కుమారులను పరమేశ్వరుడు అనుగ్రహించినాడు. వారే నందికేశుడు మరియు పర్వతుడు. వీరు కూడా గొప్ప శివభక్తులు. వారి కోర్కెల ప్రకారము నందికేశుడు స్వామివారికి వాహనము గాను, పర్వతుడు స్వామివారి నివాస స్థలముగాను సేవలు చేయుచున్నారు. స్వామివారు వెలిసినప్పటి నుంచి పర్వతుడు ”శ్రీ పర్వతము”గా ప్రసిద్ధిచెందినాడు. కైలాసం నందు విఘ్నేశ్వరునిచే పరాభవం పొందిన కుమారస్వామి కోపించి, శ్రీ పర్వతానికి చేరుతాడు. పుత్రుని ఎడబాటు సహించలేని ఆదిదంపతులు శ్రీ పర్వతము చేరి నివాసం ఏర్పర్చుకొంటారు.
- మల్లిఖార్జున సామ్రాజ్యమును చంద్రగుప్తుడు అను రాజు పాలించుచుండెను. ఇతని కుమార్తె చంద్రావతి కూడా తండ్రివలె గొప్ప శివభక్తురాలు. యౌవనదశలో నున్న చంద్రావతిపై చంద్రగుప్తుడు అమానుష చర్యకు పూనుకొంటాడు. తండ్రి అమానుష చర్యకు భయపడి శ్రీశైలం చేరి, స్వామిని మల్లెపూలతో అర్చించి, అత్యంత ప్రీతిపాత్రమైనది. మల్లెపూలతో అర్చించుటవలన స్వామికి మల్లిఖార్జునుడుగా పేరు వచ్చింది. ఒకనాడు పరమేశ్వరుడు సాక్షాత్కరించి ఆమె ప్రార్ధనను అంగీకరించి, చంద్రమాంబ అనుపేరిట తన దేవేరిగా స్వీకరించాడు. చంద్రావతి శ్రీ భ్రమరాంబికాదేవే అని కొంతమంది వాదన.
- పూర్వం నల్లమల్ల అడవులతో నిండిన కొండల ప్రాంతము నందు గల శివాలయం చుట్టుప్రక్కల చెంచుజాతివారు నివసించుచుండెడివారు. చెంచుజాతి వారి కన్యను స్వామి వివాహమాడాడని ఒక గాథ వుంది. చెంచుజాతి వారు స్వామిని చెంచు మల్లయ్యగా పిలుస్తారు. శివరాత్రి పర్వదినాన జరిగే ఉత్సవాలలో రథంలాగే కార్యక్రమమును చెంచుజాతివారు తమ వంతుగా చేపట్టి, తమ భక్తిని ప్రదర్శించుతారు. కర్ణాటక రాష్ట్ర ప్రాంతములో మరో గాథకలదు. వీరు మల్లయ్యను చెవిటి మల్లయ్యగా సంబోధించుతారు.
![]() |
మహాలక్షి కొల్హాపుర్ |
7.మహాలక్ష్మి - కొల్హాపూర్, మహారాష్ట్ర:
ఈ ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతోచేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రంఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపైసూర్యరశ్మి పడుతుంది. దక్షిణ మహారాష్ట్రము నందుకొల్హాపూర్ జిల్లా కలదు. జిల్లా ముఖ్యకేంద్రమైన కొల్హాపూర్పట్టణం పంచగంగానది ఒడ్డున వుంది. ఇది దక్షిణకాశీగా ప్రఖ్యాతి చెందినది.
ఈ ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతోచేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రంఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపైసూర్యరశ్మి పడుతుంది. దక్షిణ మహారాష్ట్రము నందుకొల్హాపూర్ జిల్లా కలదు. జిల్లా ముఖ్యకేంద్రమైన కొల్హాపూర్పట్టణం పంచగంగానది ఒడ్డున వుంది. ఇది దక్షిణకాశీగా ప్రఖ్యాతి చెందినది.
- రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి 'అంబాబాయి'గా కొల్హాపూర్ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. కొల్హాపూర్ వాసులు ఈ అమ్మవారిని భవానీమాత గానూ కరవీర వాసిని గానూ కొలుస్తారు. కొల్హాపురీ మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల.
- అమ్మవారి తలపై ఆది శేషుడు తన ఐదుపడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి రెండు కన్నులు సరిపోవంటారు భక్తులు. మహాప్రళయకాలంలిో కూడా లక్ష్మీదేవి ఈక్షేత్రాన్నివీడదని పురాణప్రతీతి. అందుకే కొల్లాపూర్ను 'అవిముక్త క్షేత్రం'గా వ్యవహరిస్తారు.
పురాణ కథ:
- ఒకానొప్పుడు మరాఠా రాజ్యానికి ప్రధాన రాజధానిగా విలసిల్లిన క్షేత్రరాజ్యం. ప్రాచీనకాలం నందు ఈ పట్టణము కరవీరపురంగా పిలిచేవారు. నేడు కొల్హాపూర్గా వ్యవహరించుచున్నారు
- కొల్హాపూర్ అనగా కనుమలోయలోని పట్టణము అని అర్థం. క్షేత్రంలోని శ్రీమహాలక్ష్మి అష్టాదశ శక్తి పీఠాలల్లో ఏడవదిగా గణ్యత చెందినది. సతీదేవి వామహస్తం పడిన ప్రదేశముగా ప్రసిద్ధి గాంచినది. శక్తిరూపమైన శ్రీ మహాలక్ష్మితోపాటు శ్రీ మహాదేవలింగము కలదు. అమ్మవారితోపాటు శ్రీ మహాదేవ లింగమునకు ప్రాముఖ్యత వుంది.
- శ్రీ మహాలక్ష్మి ఆలయం 9వ శతాబ్దంలో నిర్మించారు. ఆలయముపైన ఐదు గోపురాలు దర్శనమిస్తాయి. ప్రధానాలయమునందు శ్రీ మహాలక్ష్మికి ఇరువైపుల శ్రీమహాకాళి, శ్రీమహాసరస్వతి కొలువైనారు. వీరితోపాటు శ్రీమహాగణపతి దర్శనము కూడా లభ్యమవుతుంది.
- శ్రీ మహాదేవలింగమునకు ప్రత్యేకముగా, ఆలయ ప్రాంగణములో స్థానము వుంది. జగన్మాత మహాలక్ష్మి గర్భాలయ బయట, శ్రీయంత్రం వుంది. భక్తులు శ్రీయంత్రమునకు పూజలు నిర్వహించుతారు. అమ్మవారికి ఎదురుగా సింహవాహనము దర్శనమవుతుంది.
- శ్రీమహాలక్ష్మి అమ్మవారికి బంగారు పాదుకులున్నాయి. వీటిని భక్తులు దర్శించటానికి వీలుగా, బయటకు తీసి మరల అలంకరించడానికి వీలుగా వుండును. దేవి శిరస్సు మీద ఒక నాగపడగ, పడగనందు శివలింగము యోని ముద్ర వున్నాయి.
- ప్రధానాలయం తెల్లవారి 4 గంటలకు తెరచి తిరిగి రాత్రి 10 గంటలకు మూయబడును. ప్రతి నిత్యము అమ్మవారికి ఐదు పర్యాయములు హారతి సేవ జరుగుతుంది. ఆలయం తెరచినప్పుడు జరుగు హారతి సేవ కాగడ హారతిగా పిలుస్తారు.
- ఉదయం 8 గంటలకు జరుగు మహాపూజ సమయంలో మంగళహారతి సేవ జరుగుతుంది. మధ్యాహ్నం 11 గంటలకు నైవేద్యం సమర్పించు సమయములో పరిమళమైన పుష్పములు, కుంకుమ, కర్పూరముతో హారతి సేవ జరుగుతుంది.
- అమ్మకు నైవేద్యంగా ఘనమైన వంటకాలు, పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనె మొదలగునవి సమర్పించుకుంటారు. నైవేద్య సేవ ప్రతి శుక్రవారం రాత్రి కూడ జరుగుతుంది. ప్రతి నిత్యం రాత్రి 7 గంటలకు జరుగు సేవను భోగహారతిగా పిలుస్తారు.
- రాత్రి 10 గంటలకు సేజ హారతి సేవ (పవళింపు హారతి సేవ) జరుగుతుంది. కర్పూర హారతి సేవ అనంతరము అమ్మవారి ఆభరణములు దేవస్థాన ఖజానాలో జమ చేయుదురు.
- ప్రతి గురువారం, శుక్రవారం మరియు పండుగలకు హారతి సేవల సంఖ్యయే అధికమవుతుంది.
![]() |
ఏకవీరికా దేవి |
8. ఏకవీరిక దేవి:
మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర. ఇక్కడి అమ్మవారిని 'రేణుకామాత'గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించు కొనవచ్చును. మాహుర్యం లేదా మహార్, నాందేడ్జిల్లా, మహారాష్ట్ర ఇక్కడి అమ్మవారిని 'రేణుకా మాత'గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈమాతను దర్శించు కొనవచ్చును.
- ఈ ప్రదేశంలోని 3 పర్వతాలున్నాయి. ఒక శిఖరం మీద దత్తాత్రేయ స్వామి, రేండవ పర్వతంపైన అత్రి, అనసూయల ఆలయాలు ఉన్నాయి. మూడవ శిఖరం సతీదేవి కుడిస్తం పడిన శ్రీ క్షేత్రం.. ఈ శిఖరంపైన గల ఆలయంలోగల ఏకవీరాదేవి విగ్రహం భయంకర రూపంలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారి పెద్ద తల మాత్రమే ఉంటుంది.
- ఆ అమ్మను బుద్ధి అనే అక్షింతల అర్చన చేస్తూ హృదయమనే కమలంలో సుస్థిరంగా నిలుపుకోవాలి. అమ్మ కోసం మనం తపిస్తే అమ్మ మనకోసం పరితపిస్తుంది. ఇక అమ్మ ఏకవీరికా దేవిగా వెలసిన మయూర పురం దర్శనం ఎంతో పుణ్యప్రదమైనది.
- సహ్యద్రి పర్వత శ్రేణులో ఒక శిఖరంపై గల ఈ పీఠాన్ని దర్శించేందుకు ఎందరో తాంత్రికులు, క్షుద్రోపాసకులు వచ్చి బలులు ఇచ్చి అమ్మను సంతృప్తిపరుస్తారు. దీనినే మహాగ్రామమని, తులజాపూర్ అని అంటుంటారు. ఈ క్షేత్రాన్ని ఛత్రపతి శివాజీ కూడా దర్శించాడని అంటారు.
9. మహాకాళి ఉజ్జయిని
మధ్య ప్రదేశ్ - ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉన్నది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే. మధ్య ప్రదేశ్లోని ఇండోర్కు 55 కి|| మీ|| దూరంలో క్షిప్రానదీ తీరంలో ఉజ్జయినీ క్షేత్రం ఉన్నది. ఈ ఉజ్జయిని పూర్వనామం అవంతిక. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వర లింగం, మహాకాళీ శక్తి పీఠం ఉన్న శక్తి ప్రదేశమే ఉజ్జయిని. సతీదేవి మోచేయి పడిన ఈ ప్రాంతానికి అష్టాదశ శక్తి పీఠలలో ఒక విశిష్ఠ స్థానం ఉంది. అదేమిటంటే ఈ క్షేత్రాన్ని భూమికి నాభిగా పేర్కొంటారు. ప్రతి 12 సం||లకు ఒకసారి ఇక్కడ “కుంభమేళా” ఉత్సవం జరుగుతుంది.ఇక్కడి స్వామివారైన మహాకాళేశ్వరునకు కన్నులుండటం అనగా శివలింగానికి కన్నులుండటం విశేషం.
- ఈ ఉజ్జయిని కుశస్థలి, కనకశృంగి, పద్మావతి, కుముద్వతి, అమరావతి, విశాల అనే పేర్లతో కాల పరిస్థితులను బట్టి మారింది. సప్తమోక్ష పురలలో ఒకటి ఈ ఉజ్జయిని. అదిగో చూడండి ! మహాకాలుని ఎదుట మహాకాళి ఆనంద తాండవం చేస్తోంది. ఒక్కసారి ఆ ఆదిదంపతులను స్మరించి మనసుతో ఆ ఆనంద తాండవాన్ని తిలకించండి.
10. పురుహూతిక:
పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ - కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు. ఈ పిఠాపుర క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి నుండి 60కి||మీ|| దూరంలోను మరియు కాకినాడకు 18 కి||మీ దూరంలోను ఉంది. భీహారులో ఉన్న ప్రదేశాన్ని “విష్ణుగయ” లేదా “శిరోగయ” అని, పాదాలు పిఠాపురంలో ఉన్నందున ఆ ప్రదేశానికి “పాదగయ” అనే పేరు వచ్చింది. అలా శివ, శక్తి, విష్ణు పీఠాలతో పవిత్రమైన ఈ పిఠాపురం మంగళప్రద మహాత్మ్యలకు ఆలవాలమై ఉన్నది.
11. గిరిజ ఓఢ్య:
జాజ్పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒరిస్సా - వైతరిణీ నది తీరాన ఉన్నది.
గిరిజ అనగా గిరి (హిమవంతుడు)కి జనియించినది. జన్మించినది మొదలు జటధారిపై మనసు నిలిపి ధ్యానంతో కొలిచేది.
విరజానది పాపులను పుణ్యలను చేసే పావన జల ప్రవాహం. ఓఢ్యాణము అనగా ఓడ్రదేశము. అదే నేటి ఒరిస్సా రాష్ట్రము. ఈ రాష్ట్రంలోని కటక్ సమీపంలో వైతరిణి నది ఉన్నది. ఈ నదీ తీరంలో వైతరిణి అనే గ్రామం కూడా ఉంది. ఇప్పటి ఒరిస్సాలోని జాజ్పూర్ రోడ్కి సుమారు 20 కి|| మీ|| దూరంలో ఉంది ఓఢ్యాణము.
12. మాణిక్యాంబ
దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ - కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో.
పంచ భూతాకారమైన ప్రపంచానికి పంచముఖేశ్వరుడు మించి సిద్ధినందుటకు జనులకందించిన పంచాక్షరీ ప్రణవ నాదమే “ఓం నమః శివాయ ” అన్న మంత్రం. దక్షప్రజాపతి యజ్ఞ చేసిన ప్రదేశం కనుక “దక్షారామం” అని మిక్కిలి ద్రాక్ష తోటలుండటం వలన “ద్రాక్షారామం” అని పేరు వచ్చింది. “ద్రాక్షారం” అనే మరోపేరు కూడా కలదు. ఇక్కడ శంకరుడు “భీమేశ్వరుడై” స్వయంభువుడై వెలిశాడు. కనుక శక్తి ఈశ్వరుల సంగమస్థానమే ఈ ద్రాక్షారామం. ఈ ప్రాంతాన గోదావరీ నదికి “సప్త గోదావరమని” పేరు.
13. కామరూప హరిక్షేత్రం
గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం - బ్రహ్మపుత్రా నది తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.ఈ ఆలయం సమీపంలోగల “ఉర్బసీ కుండం”లో స్నానమాచరించి కామాఖ్యా ఆలయంలో ప్రవేశించాలి.మరో విశేషమేమిటంటే “అంబూషి మేళ”గా పిలువబడే సమయంలో అమ్మవారికి కట్టిన వస్త్రాలు ఎర్రబడతాయి. మృగశిరకార్తెవెళ్ళి ఆర్త్రకార్తె ప్రవేశించేవేళ, భూమి రజస్వలవుతుందని దేవీ భాగవతంలో ఉంది. ఈ సమయంలో 3 రోజులపాటు అమ్మవారి ఆలయాలను, చుట్టుపక్కల ఆలయాలను మూసివేస్తారు. నాల్గవరోజున అమ్మవారికి తలంటిపోసి ఆలయ సంప్రోక్షణ జరిపి అమ్మవారి దర్శనం కోసం ఆలయం తెరుస్తారు. కామాఖ్యాదేవి ఆలయం చుట్టుపక్కల ఏడుగురు అమ్మవార్ల ఆలయాలున్నాయి. అవి : 1. కాశి, 2. తార, 3.భువనేశ్వరి, 4.భైరవి, 5. చిన్న మస్తా, 6. భగళీ, 7.ధూమావతి ఆలయాలతోపాటు 1. కామేశ్వర, 2. సిద్ధేశ్వర, 3.కోటిలింగ, 4. అఘోర, 5. అమృతేశ్వర అనే పంచశివాలయాలున్నాయి.ఈ క్షేత్ర సందర్శకులకు నిత్యమూ మహిమా చూపి ఆదరిస్తున్న బంగారు తల్లి కోర్కెలు తీర్చే కామాఖ్యమాత అనడంలో ఎటువంటి సందేహం లేదని ఎందరో భక్తులు కొనియాడుతున్నారు.
14. మాధవేశ్వరి ప్రయాగ (అలహాబాదు):
ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో - ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు. “ప్ర” అనగా గొప్ప. “యాగ” అనగా యాగము. కావున గొప్ప యాగము చేసిన ప్రదేశమైనందు వలన ఈ ప్రదేశమునకు “ప్రయాగ” అను పేరు వచ్చినది. ఉత్తర ప్రదేశ్లోని అలహాబాద్లో ఈ ప్రయాగ క్షేత్రం వుంది. సతీ దేవి హస్తాంగుళీయం ఇక్కడ పడింది. ఈ క్షేత్రంలో సతీదేవి చేతివేలు పడింది. కావున ఇది ఒక శక్తి క్షేత్రంగా పూజలందుకుంటోంది. అక్బరు నిర్మించిన కోటలో అనాదిగా ఒక వటవృక్షం ఉంది. దాన్ని “అక్షయ వటము” అని పిలుస్తారు. ఈ వటవృక్షం శ్రీహరికి గొడుగుగా ఉంటుందని పురాణ సారం.
15. వైష్ణవి జ్వాలాక్షేత్రం:
కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ - ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి. ఈ ప్రాంతంలో గల “కాలధరమనే” పర్వతంపై సతీదేవి నాలుక నిలువుగా పడినందువలన ఆ ప్రదేశంలో అప్పటి నుండి ఈ నాటి వరకు “అగ్నిజ్వాల” బయటకు వస్తూనే ఉంది. ఈ అగ్నిజ్వలనే జ్వాలాముఖియని, అమ్మవారిని జ్వాలాముఖీశ్వరీ దేవియని, జ్వాలాజీ అని భక్తులు పిలుస్తున్నారు, కొలుస్తున్నారు.
16. మంగళ గౌరి
భీహార్ రాష్ట్రంలోని పాట్నాకు సుమారు 74 కి||మి|| దూరంలో గల గయాక్షేత్ర శక్తి స్వరూపిణి మంగళగౌరి, సర్వమంగళ, విష్ణు సోదరియైన మాంగల్య గౌరి నిత్యానంద దాయినిగా వర ప్రదాయినిగా భక్తుల కోర్కెలు తీరుస్తోంది..
1. గయ : బిహార్ రాష్ట్రంలో ఫల్గుణీ నదీ తీరంలో “శిరోగయ”గా వెలసింది.
2. జాజాపూర్: ఒరిస్సా రాష్ట్రంలో వైతరణి నదీ తీరంలో వున్న ప్రదేశంను “నాభిగయ” అని అంటారు.
3. పిఠపురం: ఆంధ్ర ప్రదేశ్లో గయని పాదాలుండటం వలన అవి వున్న ప్రదేశం పిఠాపురాన్ని “పాదగయ” అంటారు.
4. మాతృహయ గుజరాత్ రాష్ట్రంలో మహేషన జిల్లాలో సరస్వతీ నదీ తీరంలో గల ప్రాంతాన్ని “మాతృహయ” అని అంటారు. బిందు సరోవరమనే మరో పేరు కూడా కలదు. అహమ్మదాబాదుకు 32 కి||మి|| దూరంలో గల మాతృగయలో మాతృవంశం వారికి పిండప్రదానం మరింత ముఖ్యం. ఒరిస్సాలోని భువనేశ్వర్కి 33 కి||మి|| దూరంలో వున్న బిందు సరోవరం వద్ద కూడా పిండ ప్రదానాలు చేస్తారు.
5. బధరీనాథ్:
ఉత్తర ప్రదేశ్లోని అలకనందా నదీ తీరంలో గల “బ్రహ్మకపాలం” అనే ప్రదేశాన్ని “పితృగయ” అంటారు.
గయాక్షేత్రంలో సతీదేవి యొక్క శరీర భాగం ఒకటి పడింది. కనుక శక్తి క్షేత్రముగా, ఇక్కడి అమ్మవారు సర్వమంగళాదేవిగా దేవతల, మునులచే పూజింపబడుచున్నది. ఫల్గుణీ, మధుర, శ్వేత అనే 3 నదుల సంగమమై ప్రయాగ క్షేత్రంతో సమానమై ఫలం అందిస్తోంది. ఈ ప్రాంతానికి బుద్ధగయ అనేపేరు కూడా కలదు. జన్మకు ఒకసారైన పితృదేవతలకు గయలో పిండప్రదానం చేయాలని ప్రతి హిందువూ కోరుకుంటారు.
17. విశాలాక్షి :
విశాలమైన అక్షములు (కనులు) గలది కావున విశాలాక్షి. ఆ తల్లి కొలువున్న శక్తి క్షేత్రం కాశీ. ఈ కాశీకే “వారణాసి” అను మరోపేరు కూడా కలదు. వరుణ, అసి అను రెండు నదులు కలసి ప్రవహించే ప్రదేశమే వారణాసి. సప్త మోక్షపురులలో కాశీ కూడా విశిష్ఠ స్థానం గల శక్తి పీఠం మరియు జ్యోతిర్లింగ క్షేత్రం అయిన కాశీని ఆనంద కాననమని, మహాశ్మశానమని, శివానందక్షేత్రమని కూడా పిలిచేవారు. ఈ కాశి క్షేత్రం శివునికి కైలాసానికన్నా ప్రియమైన ప్రదేశమని కూడా అంటారు. కాశీక్షేత్రం, వేద విద్యలకు నిలయం, అక్కడ నిరంతరం శిష్యగణంతో వ్యాసమహర్షి నిత్య విశ్వేశ్వర, అన్నపూర్ణాంబికను ఆరాధించేవాడు కనుక “వ్యాసకాశి” అనికూడా ఈ క్షేత్రాన్ని పిలుస్తారు.
18. సరస్వతి:
ఈ సరస్వతీ దేవి ఆలయం కాశ్మీరంలో ఉందని పురాణేతిహాసాల నిర్వచనం. కానీ ఈ ఆలయం ఇప్పుడు కాశ్మీరంలో లేదు. కాని కాశ్మీర్లో కొంతమంది సరస్వతిని కీర్ భవానీగా కొలుస్తారు. ఆ కీర్ భవాని ఆలయం శ్రీనగర్కు పది కిలో మీటర్ల దూరంలో వుంది. భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన 2 సరస్వతుల ఆలయాల్లో ఒకటి కాశ్మీరం, రెండవది బాసరలో వుందని పెద్దలు చెబుతారు. సతీదేవి కుడి చెంప భాగం ఈ కాశ్మీరంలో పడిందని ఆర్యుల ఉవాచ. మాఘ శుద్ధ పంచమి సరస్వతీ దేవి జన్మదినం. అందుకని ఆనాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు.
ఇంకా వివరాలకు ఈ క్రింది యూ.ఆర్. యల్. లు చూడండి..
https://te.wikipedia.org/wiki/శక్తిపీఠాలుTranslate this page
18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలుఅంటారు.పురాణ కథ · 18 శక్తిపీఠాలు · 51 శక్తిపీఠాలు
18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలుఅంటారు.పురాణ కథ · 18 శక్తిపీఠాలు · 51 శక్తిపీఠాలు
ఇంకా వివరాలకు ఈ క్రింది యు ట్యూబ్ వీడియో యూ.ఆర్. యల్. లు చూడండి...
Oct 12, 2015 - Uploaded by Ramesh Babu
అష్టాదశ శక్తి పీఠాలు - 18 Shakti Peetas. ... 18 Shakti Peethas 18 శక్తిపీఠాలు. Ramesh Babu. Loading... Unsubscribe from ...
Feb 10, 2014 - Uploaded by Bhakthi TV
Subscribe For More Videos: http://goo.gl/u65VBV. Alampur Jogulamba Devi Nijarupa Darshanam_Part 1 ...
Sep 19, 2014 - Uploaded by Bhakthi TV
Bhakthi TV - How Many Shakti Peethas? - Shakthi Peetha Rahasyalu - Episode 1 _ Part 1. Subscribe For More ...
Jun 16, 2017 - Uploaded by Planet Telugu
For Daily Telugu Mystery Videos,.....Subscribe here ▻▻: https://www.youtube.
Sep 28, 2016 - Uploaded by Dokka Dharanei Telugu Devotional
అత్యంత శక్తివంతమైన అష్టాదశ శక్తి పీఠాలు The Greatness of 18 teen Astha Dasa Shakthi Peetas. హిందువులు పార్వతీ ...
Feb 19, 2018 - Uploaded by Gusa Gusalu
18 shakti peethas names and places in telugu | Gusa Gusalu live this video about 18 sakthi peetalu dharshan ...
Feb 10, 2014 - Uploaded by Bhakthi TV
Subscribe For More Videos: http://goo.gl/u65VBV. Alampur Jogulamba Devi Nijarupa Darshanam_Part 2 ...
Dec 3, 2012 - Uploaded by kiranmai g
Astadasa Sakti Peethas Sthothram ... Astadasa Sakthi Peetam | Alampur Jogulamba Devi Nijarupa ...
Sep 24, 2016 - Uploaded by Bhakti
Ashta Dasa Shakthi Peetha Stotram | Shakti Stothram | Dussehra ... శక్తి పీఠాలు || The Greatness of 18 teen Shakthi ...
Jun 10, 2016 - Uploaded by Dokka Dharanei Telugu Devotional
Astadasha Shakti Peetam Pithapuram Puruhutika Devi Temple.
Sep 27, 2016 - Uploaded by Bhakti
... 2017 | Story Behind the Formation of Asta Dasa Shakti Peetas | Bhakti ... story behind Goddess Sati and ...
Aug 8, 2015 - Uploaded by Hindu Devotional Slokas
Astadasha Shakti Petalu in India astadasha shakti peethas 18 shakti peethas.
Sep 3, 2016 - Uploaded by venkat kaviti Shivoham
19:47. Astadasa Sakthi Peetam | Alampur Jogulamba Devi Nijarupa Darshanam_Part 1 - Duration: 9 ...
Oct 22, 2012 - Uploaded by etv2teerthayatra
The Shakti Peethas (Sanskrit: शक्ति पीठ, Bengali: শক্তিপীঠ, Śakti Pīṭha, seat of Shakti) are places of worship consecrated to the ...
Jun 19, 2010 - Uploaded by sastry kvar
The song on Astadasa Shakthi petalu is taken from a MP3 Audio CD- Bhavani yathra sold by Sankeertana ...అలాగే నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like,share and subscribe చేయండి. నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com చూడండి చూసి like,share and subscribe చేయండి. మరియు అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like,share and subscribe చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ .