శీలం అంటే ఏమిటి? దాన్ని ఎలా సంపాదించాలి? దాన్నిఎలా నిలుపుకోవాలి ?
తత్తు కర్మ తథా కుర్యాద్యేన శ్లాఘ్యేత సంసది।
శీలం సమాసేనైతత్తే కథితం కురుసత్తమ॥
ఏ పని చేస్తే నలుగురి మెప్పునీ పొందుతామో, అటువంటి పనినే తలపెట్టాలి. ఇలాంటి ఆమోదయోగ్యమైన పనులు చేసే వ్యక్తిత్వాన్నే శీలం అంటాము.
ఈ క్రింది లక్షణాలు ఉన్న వారిని శీలవంతులు అని చెప్పా వచ్చును ...
- అందరిని ఒకేదృష్టితో చూడడం దూషించాడు అని కోపగించుకోకపోవడం
- పొగిడాడు అని పొంగిపోకుండా ఉండడం.
- కష్టం వచ్చినా, సుఖం వచ్చిన ఒకేలా స్వీకరించడం,
- పట్టు పీతంబరాలైన, చిరిగిన వస్త్రాలైన ఒకేలా భావించడం
- పంచభక్ష పరమాన్నాలు అయిన - కందమూలాలు అయినా ఒకటేలా స్వీకరించడం
- ఈరోజు అధికారం ఉందని గర్వించకుండా ఉండడం.ఎందుకంటే రేపు ఉండకపోవచ్చు.
- పండితుడు అయిన పామరుడు అయిన ఒకేలా చూడాలి
- సంపద అయిన అంటే ఈరోజు ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు సంపద ఉన్న లేక పోయిన ఒకేలా ఉండాలి
- తల్లితండ్రులు, బందువులు, స్నేహితులు, ఆప్తులు ఎవరైనా ఒకటేలా ఉండాలి. అందరిని సమదృష్టితో చూడాలినువ్వు నేను అనే తారతమ్యం లేకుండా ఉండాలి
- శుచి సుబ్రతా పాటించాలి.
- సూర్యోదయానికి ముందే లేచి దేవతార్చన పూర్తి చేయాలి.
- ఆహార నియమం పాటించాలి.
- భార్యా సంగమం విధులు పాటించాలి. పర కాంతను తాకనైనా తాకరాదు.
- క్రమం తప్పకుండ వేదాధ్యయనం చేస్తాను., గీత అధ్యనం, తమ తమ మాట సంప్రదాయాలు పాటించడం,
- దైవాన్ని, తల్లి,దండ్రులను, గురువులని పూజించి గౌరవించాలి .
- ఇలా దేన్నైనా సమదృష్టితో స్వీకరించాలి.
హిందూ పురాణాలలో దీనిపైనా ఒక కథ ఉంది ...
ఒకసారి ఇంద్రుడు ఒక విషయం లో ఆశ్చర్యపోయాడు...
తన పదవి హిరణ్యకశిపుడు కొడుకు ప్రహ్లాదుడికి ఎందుకు వెళ్ళిపోయిందా అని?. యుద్ధం చేయలేదు. కనీసం చిన్న గొడవ కూడా జరగలేదు. కాని ఎలా జరిగిందో తెలియలేదు. ఏమి జరిగిందో కూడా తెలిదు. కానీ పదవి పోయింది. ఏమి చేయాలో తెలియక బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. ఏమైందో తెలియదు నా పదవి ప్రహ్లాదుడు పరం అయింది. మా వాళ్ళు సంపద అంత ప్రహ్లాడుడికే ఇచ్చేస్తున్నారు, ఏమి జరిగింది. అంత సచ్చీలుడు ఎలా అయ్యాడు అతను. అని అడిగాడు .
అప్పుడు బ్రహ్మ! విధంగా చెప్పారు. ప్రహ్లాదుడు నా శిష్యుడు...
తనకి నేను అపకారం చేయలేను. కాని ఒక మార్గం ఉంది. నువ్వే వెళ్లి అడుగు. ప్రహ్లాదుడు ఉత్తముడు కనుక చెప్తాడు అన్నాడు. దేవతలంటే ప్రహ్లాదుడుకి పడదు కదా. అందునా నేనంటే అసలు పడదు. మరి ఎలా అని అలోచించి మారు వేషంలో నీ శిష్యుడిని, నీ సేవచేసుకోవాలని వచ్చాను. అని ప్రహ్లాదుడు దగ్గరికి వెళ్లి కాళ్ళ మీద పడ్డాడు. ప్రహ్లాదుడు సంతోషించి సరే అన్నాడు. అలా కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రహ్లాదుడు పూర్తిగా నమ్మేశాడు. ఇంకా పర్వాలేదు అనుకోని ఒక మంచి సమయం చూసి గురువుగారు నాకు ఒక సందేహం ఉంది అడగమంటారా? అన్నాడు. సరే అనగానే ఇంద్రుడి పదవి మీ వశం అయింది, మీరేమో యుద్ధం మాటే తలపెట్టక ప్రజలని దేవతలని, మిత్రులని, సన్నిహితులనీ ఒకేలా చూస్తున్నారు. ఇంతటి శీలం ఎక్కడినుంచి వచ్చింది అని అడిగాడు.
తన పదవి హిరణ్యకశిపుడు కొడుకు ప్రహ్లాదుడికి ఎందుకు వెళ్ళిపోయిందా అని?. యుద్ధం చేయలేదు. కనీసం చిన్న గొడవ కూడా జరగలేదు. కాని ఎలా జరిగిందో తెలియలేదు. ఏమి జరిగిందో కూడా తెలిదు. కానీ పదవి పోయింది. ఏమి చేయాలో తెలియక బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. ఏమైందో తెలియదు నా పదవి ప్రహ్లాదుడు పరం అయింది. మా వాళ్ళు సంపద అంత ప్రహ్లాడుడికే ఇచ్చేస్తున్నారు, ఏమి జరిగింది. అంత సచ్చీలుడు ఎలా అయ్యాడు అతను. అని అడిగాడు .
అప్పుడు బ్రహ్మ! విధంగా చెప్పారు. ప్రహ్లాదుడు నా శిష్యుడు...
తనకి నేను అపకారం చేయలేను. కాని ఒక మార్గం ఉంది. నువ్వే వెళ్లి అడుగు. ప్రహ్లాదుడు ఉత్తముడు కనుక చెప్తాడు అన్నాడు. దేవతలంటే ప్రహ్లాదుడుకి పడదు కదా. అందునా నేనంటే అసలు పడదు. మరి ఎలా అని అలోచించి మారు వేషంలో నీ శిష్యుడిని, నీ సేవచేసుకోవాలని వచ్చాను. అని ప్రహ్లాదుడు దగ్గరికి వెళ్లి కాళ్ళ మీద పడ్డాడు. ప్రహ్లాదుడు సంతోషించి సరే అన్నాడు. అలా కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రహ్లాదుడు పూర్తిగా నమ్మేశాడు. ఇంకా పర్వాలేదు అనుకోని ఒక మంచి సమయం చూసి గురువుగారు నాకు ఒక సందేహం ఉంది అడగమంటారా? అన్నాడు. సరే అనగానే ఇంద్రుడి పదవి మీ వశం అయింది, మీరేమో యుద్ధం మాటే తలపెట్టక ప్రజలని దేవతలని, మిత్రులని, సన్నిహితులనీ ఒకేలా చూస్తున్నారు. ఇంతటి శీలం ఎక్కడినుంచి వచ్చింది అని అడిగాడు.
అప్పుడు ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు... మా తండ్రి గారు హిరణ్యకశిపుడుని సంహరించిన తరువాత విష్ణువు నన్ను రాజ్యాభిషిక్తుడిని చేశాడు. అప్పటి నుంచి నేను అందరిని ఒకేదృష్టితో చూస్తున్నాను. దూషించాడు అని కోపగించుకోను, పొగిడాడు అని పొంగిపోను, కష్టం వచ్చినా, సుఖం వచ్చిన ఒకేలా స్వీకరిస్తాను, పట్టు పీతంబరాలైన, చిరిగిన వస్త్రాలైన, పంచభక్ష పరమాన్నాలు అయిన కందమూలాలు అయినా ఒకటే . ఈరోజు అధికారం రాజ్యం ఉందని గర్వించను. ఎందుకంటే రేపు ఉండకపోవచ్చు. ఇలా దేన్నైనా సమదృష్టితో స్వీకరిస్తాను. పండితుడు ని అయినా పామరుడు అయినా ఒకేలా చూస్తాను.
సంపద అయిన ఉంటే ఈరోజు ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు, తల్లితండ్రులు, బందువులు, స్నేహితులు, ఆప్తులు ఎవరైనా ఒకటే నాకు. అందరూ ఒకటే. కాబట్టి అందరిని సమదృష్టితో చూస్తాను. నువ్వు నేను అనే తారతమ్యం నాకు ఉండదు శుచి శుభ్రతను పాటిస్తాను. సూర్యోదయానికి ముందే లేచి దేవతార్చన చేస్తాను. ఆహార నియమం తప్పక పాటిస్తాను. భార్యా సంగమం విధులు పాటిస్తాను. పర కాంతను తాకనైనా తాకను. క్రమం తప్పకుండ వేదాధ్యయనం చేస్తాను. గురువులని పూజిస్తాను. ఇందువల్లనే సచ్చీలత నా సొంతం అయింది. అని చెప్పాడు ప్రహ్లదుడు.
సంపద అయిన ఉంటే ఈరోజు ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు, తల్లితండ్రులు, బందువులు, స్నేహితులు, ఆప్తులు ఎవరైనా ఒకటే నాకు. అందరూ ఒకటే. కాబట్టి అందరిని సమదృష్టితో చూస్తాను. నువ్వు నేను అనే తారతమ్యం నాకు ఉండదు శుచి శుభ్రతను పాటిస్తాను. సూర్యోదయానికి ముందే లేచి దేవతార్చన చేస్తాను. ఆహార నియమం తప్పక పాటిస్తాను. భార్యా సంగమం విధులు పాటిస్తాను. పర కాంతను తాకనైనా తాకను. క్రమం తప్పకుండ వేదాధ్యయనం చేస్తాను. గురువులని పూజిస్తాను. ఇందువల్లనే సచ్చీలత నా సొంతం అయింది. అని చెప్పాడు ప్రహ్లదుడు.
నీ సేవకి సంతృప్తి చెందాను. ఏ వరం కావాలో కోరుకో అన్నాడు ప్రహ్లాదుడు. అడిగింది లేదు అనకుండా ఇస్తాను అంటేనే అడుగుతాను అన్నాడు ఇంద్రుడు మాట తప్పకూడదు అన్నాడు. సరే అన్నాడు ప్రహ్లాదుడు. ఐతే నీ శీలం నాకు ఇచ్చేయి అన్నాడు.ఒక్కక్షణం ఆశ్చర్యపోయి ఇంతకి ఎవరు నువ్వు అనగానే నేను ఇంద్రుడిని. నీ సచ్చీలత వల్ల నా పదవిని కోల్పోయాను. ఎందుకు కోల్పోయానో ఇప్పుడే అర్ధం అయింది. ఓ మహానుభావా! ప్రహ్లాదా! నీ చరిత్ర మహనీయం, నీ గుణగణాలు అపూర్వం. ఈ ముల్లోకాలలో నిన్ను మించినవాడు, నీకు సరితూగ గలిగినవాడు లేడు. నన్ను కరుణించి శీలం అనుగ్రహించండి. అని ప్రాధేయపడ్డాడు. దానికి ప్రహ్లాదుడు ఏ మానవుడికైన, దానవుడికైనా శీలం ప్రధానం. ఇది లేని నాడు బ్రతికిన చనిపోయిన వారితో సమానం. ఇది లేకపోతె ధర్మం నశిస్తుంది, ఆయువు తగ్గుతుంది, దేహం యొక్క తేజస్సు తగ్గుతుంది. కాబట్టి శీలం అముల్యమైనది. సరే అడిగినది లేదు అనకూడదు కనుక, సాక్షాత్తు ఇంద్రుడివి నువ్వే అడిగావు కనుక సంతోషంగా ఇచ్చేస్తున్నాను తీసుకో అని శీలాన్ని ధారపోశాడు.అలా శీలాన్ని ఇచ్చేయగానే దేహంలో నుంచి ఒక తేజస్సు బయటికి వచ్చింది.
- ఇంద్రుడు ఆశ్చర్యపోయి అమ్మా ఎవరు నువ్వు. అని అడిగాడు.
- నేను లక్ష్మిని. ప్రతి మానవుడికి శుచి, శీలం, తనదైన ఆచారం, ధర్మాచరణం. తప్పని సరి. ఇవి లేని ఇంట నేను ఉండజాలను. కాని నేడు శీలాన్ని నీకు ధారపోశాడు ఈ ప్రహ్లాదుడు. ఇతని తేజస్సు తగ్గిపోతుంది. నువ్వు శీలవంతుడివి అయ్యావు కనుక నీతో వచ్చేస్తున్నాను అన్నది. సరే రామ్మా అని తనలోకి తీసుకున్నాడు.
- ధర్మం, శుచి, ఇలా అన్ని రూపాలు ధరించి బయటికి వచ్చి ఇంద్రుడిలో ఇక్యం అయిపోయాయి. తరువాత క్రమంగా ప్రహ్లాదుడి కళావిహీనుడు అయ్యాడు. మళ్ళీ తరువాత విష్ణువు వచ్చి ప్రహ్లాదుడికి శీలం ఇచ్చి కాపాడాడు.
కాబట్టి తొందరపడి ధర్మాన్ని వదలకండి. ఎందుకంటే ప్రహ్లాదుడు విష్ణువుకి పరమ భక్తుడు కనుక వెంటనే వచ్చి కాపాడుకున్నాడు.
- మనం చేస్తున్న పనులకి ధర్మాల్ని వదిలేస్తే ఎవరూ కాపాడలేరు..
- మనం పరమ భక్తులం కాదు కదా? సామాన్య భక్తులం కూడా కాదు. కాబట్టి జాగ్రత్త.
పూర్తి వివరాలు క్రింద చూడండి.యూ.ర్.యల్. వీడియో లు చూడండి ...
శీలం ఇంగ్లీషులో chastity అంటారు. ప్రతివ్యక్తికీ ఈ శీలసంపద ముఖ్యమని అన్ని మతాలు ఘోషిస్తున్నాయి. వ్యభిచరించిన వ్యక్తికి ఈ శీలం పోయిందంటారు. మంచి నడత కలిగిన స్త్రీని సుశీల అని పిలుస్తారు.