9, ఆగస్టు 2020, ఆదివారం

శ్రీ కృష్ణ జన్మాష్టమి గురించి తెలుసుకొని శ్రీ కృష్ణ అష్టకములు పఠించండి

wowitstelugu.blogspot.com

శ్రీ కృష్ణ జన్మాష్టమి గురించి తెలుసుకొని  శ్రీ కృష్ణ అష్టకములు పఠించండి 


యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |

ధర్మమునకు హాని కలిగినప్పుడు అధర్మము పెచ్చరిల్లినప్పుడును నన్ను నేను సృజించుకొందును. అనగా నాసాకార రూపముతో ఈ లోకమున నాకు  నేను అవతరింతును, అని భగవద్గీతలో చెప్పియున్నాడు. ఈ భారతావని లో  శ్రీ కృష్ణ పరమాత్ముడిని గురించి  తెలియని వారంటూ ఉండరు. ఆయనే ఈ నవభారత నిర్మాణానికి సూత్రధారుడని పురాణాలు కూడా చెబుతున్నాయి.

శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి కి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడి చెరసాలలో జన్మించాడు. శ్రీ ముఖనామ సంవత్సర దక్షిణాయన వర్షఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రం నాల్గోపాదం బుధవారం నాడు అర్థరాత్రి యదువంశంలో దేవకీదేవీ, వసుదేవుల పుత్రునిగా "శ్రీకృష్ణుడు" జన్మించాడు.  (క్రీ!!పూ!! 3228 సంవత్సరం) శ్రీ మహావిష్ణువు   బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడు జన్మదినము. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు.

కృష్ణాష్టమి నాడు భక్తులు  ఉపవాసం ఉండి, శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే రకరకాల పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఉయాల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని కూడా పిలుస్తారు.

కృష్ణాష్టకము

అచ్యుతాష్టక౦

గోవిందాష్టకం

బాల ముకుందాష్టకం

మధురాష్టకం

కృష్ణాష్టకము


వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ |
దేవకీ పరమానన్దం కృష్ణం వన్దే జగద్గురుమ్ ||
అతసీ పుష్ప సఙ్కాశం హార నూపుర శోభితమ్ |
రత్న కఙ్కణ కేయూరం కృష్ణం వన్దే జగద్గురుమ్ ||
కుటిలాలక సంయుక్తం పూర్ణచన్ద్ర నిభాననమ్ |
విలసత్ కుణ్డలధరం కృష్ణం వన్దే జగద్గురమ్ ||
మన్దార గన్ధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ |
బర్హి పింఛావ చూడాఙ్గం కృష్ణం వన్దే జగద్గురుమ్ ||
ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్ |
యాదవానాం శిరోరత్నం కృష్ణం వన్దే జగద్గురుమ్ ||
రుక్మిణీ కేళి సంయుక్తం పీతామ్బర సుశోభితమ్ |
అవాప్త తులసీ గన్ధం కృష్ణం వన్దే జగద్గురుమ్ ||
గోపికానాం కుచద్వన్ద కుఙ్కుమాఙ్కిత వక్షసమ్ |
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వన్దే జగద్గురుమ్ ||
శ్రీవత్సాఙ్కం మహోరస్కం వనమాలా విరాజితమ్ |
శఙ్ఖచక్ర ధరం దేవం కృష్ణం వన్దే జగద్గురుమ్ ||
కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ||

అచ్యుతాష్టక౦

అచ్యుతం కేశవం రామనారాయణం 
కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్ |
శ్రీధరం మాధవం గోపికా వల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే || 1 ||
అచ్యుతం కేశవం సత్యభామాధవం
మాధవం శ్రీధరం రాధికా రాధితమ్ |
ఇందిరామందిరం చేతసా సుందరం
దేవకీనందనం నందజం సందధే || 2 ||
విష్ణవే జిష్ణవే శంకనే చక్రిణే
రుక్మిణీ రాహిణే జానకీ జానయే |
వల్లవీ వల్లభాయార్చితా యాత్మనే
కంస విధ్వంసినే వంశినే తే నమః || 3 ||
కృష్ణ గోవింద హే రామ నారాయణ
శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే |
అచ్యుతానంత హే మాధవాధోక్షజ
ద్వారకానాయక ద్రౌపదీరక్షక || 4 ||
రాక్షస క్షోభితః సీతయా శోభితో
దండకారణ్యభూ పుణ్యతాకారణః |
లక్ష్మణోనాన్వితో వానరైః సేవితో
అగస్త్య సంపూజితో రాఘవః పాతు మామ్ || 5 ||
ధేనుకారిష్టకా‌உనిష్టికృద్-ద్వేషిహా
కేశిహా కంసహృద్-వంశికావాదకః |
పూతనాకోపకః సూరజాఖేలనో
బాలహోపాలకః పాతు మాం సర్వదా || 6 ||
బిద్యుదుద్-యోతవత్-ప్రస్ఫురద్-వాససం
ప్రావృడమ్-భోదవత్-ప్రోల్లసద్-విగ్రహమ్ |
వాన్యయా మాలయా శోభితోరః స్థలం
లోహితాఙ్-ఘిద్వయం వారిజాక్షం భజే || 7 ||
కుంచితైః కుంతలై భ్రాజమానాననం
రత్నమౌళిం లసత్-కుండలం గండయోః |
హారకేయూరకం కంకణ ప్రోజ్జ్వలం
కింకిణీ మంజులం శ్యామలం తం భజే || 8 ||
అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం 
ప్రేమతః ప్రత్యహం పూరుషః సస్పృహమ్ |
వృత్తతః సుందరం కర్తృ విశ్వంభరః 
తస్య వశ్యో హరి ర్జాయతే సత్వరమ్ ||

గోవిందాష్టకం

సత్యం ఙ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశమ్ |
గోష్ఠప్రాంగణరింఖణలోలమనాయాసం పరమాయాసమ్ |
మాయాకల్పితనానాకారమనాకారం భువనాకారమ్ |
క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందమ్ || 1 ||
మృత్స్నామత్సీహేతి యశోదాతాడనశైశవ సంత్రాసమ్ |
వ్యాదితవక్త్రాలోకితలోకాలోకచతుర్దశలోకాలిమ్ |
లోకత్రయపురమూలస్తంభం లోకాలోకమనాలోకమ్ |
లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందమ్ || 2 ||
త్రైవిష్టపరిపువీరఘ్నం క్షితిభారఘ్నం భవరోగఘ్నమ్ |
కైవల్యం నవనీతాహారమనాహారం భువనాహారమ్ |
వైమల్యస్ఫుటచేతోవృత్తివిశేషాభాసమనాభాసమ్ |
శైవం కేవలశాంతం ప్రణమత గోవిందం పరమానందమ్ || 3 ||
గోపాలం ప్రభులీలావిగ్రహగోపాలం కులగోపాలమ్ |
గోపీఖేలనగోవర్ధనధృతిలీలాలాలితగోపాలమ్ |
గోభిర్నిగదిత గోవిందస్ఫుటనామానం బహునామానమ్ |
గోపీగోచరదూరం ప్రణమత గోవిందం పరమానందమ్ || 4 ||
గోపీమండలగోష్ఠీభేదం భేదావస్థమభేదాభమ్ |
శశ్వద్గోఖురనిర్ధూతోద్గత ధూళీధూసరసౌభాగ్యమ్ |
శ్రద్ధాభక్తిగృహీతానందమచింత్యం చింతితసద్భావమ్ |
చింతామణిమహిమానం ప్రణమత గోవిందం పరమానందమ్ || 5 ||
స్నానవ్యాకులయోషిద్వస్త్రముపాదాయాగముపారూఢమ్ |
వ్యాదిత్సంతీరథ దిగ్వస్త్రా దాతుముపాకర్షంతం తాః
నిర్ధూతద్వయశోకవిమోహం బుద్ధం బుద్ధేరంతస్థమ్ |
సత్తామాత్రశరీరం ప్రణమత గోవిందం పరమానందమ్ || 6 ||
కాంతం కారణకారణమాదిమనాదిం కాలధనాభాసమ్ |
కాళిందీగతకాలియశిరసి సునృత్యంతమ్ ముహురత్యంతమ్ |
కాలం కాలకలాతీతం కలితాశేషం కలిదోషఘ్నమ్ |
కాలత్రయగతిహేతుం ప్రణమత గోవిందం పరమానందమ్ || 7 ||
బృందావనభువి బృందారకగణబృందారాధితవందేహమ్ |
కుందాభామలమందస్మేరసుధానందం సుహృదానందమ్ |
వంద్యాశేష మహాముని మానస వంద్యానందపదద్వంద్వమ్ |
వంద్యాశేషగుణాబ్ధిం ప్రణమత గోవిందం పరమానందమ్ || 8 ||
గోవిందాష్టకమేతదధీతే గోవిందార్పితచేతా యః |
గోవిందాచ్యుత మాధవ విష్ణో గోకులనాయక కృష్ణేతి |
గోవిందాంఘ్రి సరోజధ్యానసుధాజలధౌతసమస్తాఘః |
గోవిందం పరమానందామృతమంతస్థం స తమభ్యేతి ||
ఇతి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీగోవిందాష్టకం సమాప్తం

బాల ముకుందాష్టకం

కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతమ్ |
వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి || 1 ||
సంహృత్య లోకాన్వటపత్రమధ్యే శయానమాద్యంతవిహీనరూపమ్ |
సర్వేశ్వరం సర్వహితావతారం బాలం ముకుందం మనసా స్మరామి || 2 ||
ఇందీవరశ్యామలకోమలాంగమ్ ఇంద్రాదిదేవార్చితపాదపద్మమ్ |
సంతానకల్పద్రుమమాశ్రితానాం బాలం ముకుందం మనసా స్మరామి || 3 ||
లంబాలకం లంబితహారయష్టిం శృంగారలీలాంకితదంతపంక్తిమ్ |
బింబాధరం చారువిశాలనేత్రం బాలం ముకుందం మనసా స్మరామి || 4 ||
శిక్యే నిధాయాద్యపయోదధీని బహిర్గతాయాం వ్రజనాయికాయామ్ |
భుక్త్వా యథేష్టం కపటేన సుప్తం బాలం ముకుందం మనసా స్మరామి || 5 ||
కలిందజాంతస్థితకాలియస్య ఫణాగ్రరంగేనటనప్రియంతమ్ |
తత్పుచ్ఛహస్తం శరదిందువక్త్రం బాలం ముకుందం మనసా స్మరామి || 6 ||
ఉలూఖలే బద్ధముదారశౌర్యమ్ ఉత్తుంగయుగ్మార్జున భంగలీలమ్ |
ఉత్ఫుల్లపద్మాయత చారునేత్రం బాలం ముకుందం మనసా స్మరామి || 7 ||
ఆలోక్య మాతుర్ముఖమాదరేణ స్తన్యం పిబంతం సరసీరుహాక్షమ్ |
సచ్చిన్మయం దేవమనంతరూపం బాలం ముకుందం మనసా స్మరామి || 8 ||

మధురాష్టకం

అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురమ్ |
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 1 ||
వచనం మధురం చరితం మధురం
వసనం మధురం వలితం మధురమ్ |
చలితం మధురం భ్రమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 2 ||
వేణు-ర్మధురో రేణు-ర్మధురః
పాణి-ర్మధురః పాదౌ మధురౌ |
నృత్యం మధురం సఖ్యం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 3 ||
గీతం మధురం పీతం మధురం
భుక్తం మధురం సుప్తం మధురమ్ |
రూపం మధురం తిలకం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 4 ||
కరణం మధురం తరణం మధురం
హరణం మధురం స్మరణం మధురమ్ |
వమితం మధురం శమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 5 ||
గుంజా మధురా మాలా మధురా
యమునా మధురా వీచీ మధురా |
సలిలం మధురం కమలం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 6 ||
గోపీ మధురా లీలా మధురా
యుక్తం మధురం ముక్తం మధురమ్ |
దృష్టం మధురం శిష్టం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 7 ||
గోపా మధురా గావో మధురా
యష్టి ర్మధురా సృష్టి ర్మధురా |
దలితం మధురం ఫలితం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 8 ||
|| ఇతి శ్రీమద్వల్లభాచార్యవిరచితం మధురాష్టకం సంపూర్ణమ్ ||
ఈ క్రింది వీడియో యు ఆర్. యల్ . ల లో. కృష్ణుడి వీడియో లు చూడండి

Story of Janmashtami in Hindi | Birth of Lord Krishna | Indian ...

గమనిక :  

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,
నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe  చేయండి.  
అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండి
అలాగే నా  ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe  చేయండి
అలాగే నా  ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండి
Also, see my  Youtube channel  bdl 1tv  like, share  and subscribe,
Also, see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుందథాంక్యూ.










7, ఆగస్టు 2020, శుక్రవారం

అమ్మవారి నాభిస్థానంలో పంచముఖ శివుడు ఆసీనుడై కనిపించే అద్భుతం శ్రీ జగజ్జననిఆలయం

wowitstelugu.blogspot.com
అమ్మవారి నాభిస్థానంలో పంచముఖ శివుడు ఆసీనుడై కనిపించే అద్భుతం శ్రీ జగజ్జనని ఆలయం

➽ త్రిమూర్తులు సహా ముక్కోటి దేవతలందరినీ నడిపించే తల్లి జగజ్జనని. సకల చరాచర జగత్తును సృష్టించిన తల్లి జగజ్జనని. అలాంటి శక్తి స్వరూపిణిని కాళీ, దుర్గ, లక్ష్మి, సరస్వతి రూపాల్లో దర్శనం చేసుకుంటాం. కానీ జగజ్జనని రూపం లో ఆ తల్లిని మాత్రం చాలా తక్కువమంది దర్శించుకొని ఉంటారు. ఇలా జగజ్జన ని రూపంలో ఆ తల్లి వెలసిన ఆలయాలు ప్రపంచంలో రెండు మాత్రమే ఉన్నవి. మరి ఆ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? ఆ అమ్మవారి రూపం ఎలా ఉంటుంది? ఆ ఆలయం విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసు కుందాం.

➤ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, నంద్యాలలో శ్రీ జగజ్జనని ఆలయం ఉంది. ఈ అమ్మవారి ఆలయాలు ప్రపంచంలో రెండు ఉండగా అందులో ఒకటి హిమాలయ పర్వతాల్లోని మానస సరోవరం లో ఉండగా, మరొక ఆలయం ఈ ప్రాంతంలో ఉందని చెబుతారు. ఇక మానస సరోవరంలో వెలసిన అమ్మవారు స్వయంభువు అని చెబుతారు. కానీ ఆ విగ్రహం ప్రస్తుతం శిధిలావస్తలో ఉందని చెబుతారు. ఇక ఈ ఆలయంలో వెలసిన అమ్మవారి విగ్రహాన్ని చూస్తే ప్రతి ఒక్కరికి ఒక కొత్త అనుభూతి వస్తుందని అంటారు.
ఈ ఆలయ స్థల పురాణం
➤పూర్వం నంద్యాలకు చెందిన శివనాగపుల్లయ్య అనే వ్యక్తి భవానీ మాత భక్తుడు. అతను ప్రతి సంవత్సరం కూడా తప్పకుండ భవానీ మాల ధరించేవాడు. అయితే 1983 వ సంవత్సరంలో అయన భవానీ దీక్షలో ఉన్నపుడు యాత్రలో భాగంగా అహోబిలానికి వెళ్లగా అక్కడ కొంతమంది యోగులని కలిసాడు. అప్పుడు వారి మధ్య ఆధ్యాత్మిక చర్చ జరుగగా జగజ్జనని ప్రస్తావన వచ్చినది. అందులో ఉన్న ఒక యోగి జగజ్జనని రూపం గురించి తెలియచేసి అతడికి ఆ అమ్మవారి రూపం ఉన్న ఒక చిత్ర పటాన్ని ఇవ్వగా అందులో ఉన్న అమ్మవారి దివ్య మంగలా రూపాన్ని చూసి ముగుడై ఈ అమ్మవారి రూపాన్ని ఇప్పటివరకు చూడలేదే అని చాలా ఆవేదన చెందాడు. ఇలా అమ్మవారి ఆలయ కేవలం హిమాలప్రాంతంలో ఉన్న మానస సరోవరంలో మాత్రమే ఉందని తెలుసుకున్న అతడు ఎలాగైనా తన ప్రాంతంలో ఆ అమ్మవారి ఆలయాన్ని నిర్మించాలని భావించాడు.
శ్రీ జగజ్జననీ ఆలయ నిర్మాణ విశేషాలు
  • 'సంకల్పోహి జనానాం చిత్త సమ్యక్కరణసాధనం, తదన్యత్ర ఫలాఫలాని దైవేైన నిశ్చయితవ్యం'' - ఇతి ప్రాజ్ఞా ఊచు. అని ప్రాచీన వార్తికం. మనిషి ఒక 'రోబోట్' లాంటి వాడు. రిమోట్ కంట్రోల్తో దానిని నడిపించే సాంకేతిక మేధావి ఆ పరమాత్మ. ఆయన తన ఇష్ట ప్రకారము మనిషిని నడుపుతుంటాడు.

  • మనిషిపనల్లా తన జన్మ యెందుకోసమో కాస్తయినా గ్రహించి తన ధర్మపథంలో తాను నడుస్తోండడం, అలా నడుస్తూ పోతుంటే తన కిష్టమైన పద్ధతిలో నడిపేవాడు ఆ పరమాత్మ.

  • పుణ్యమూర్తి శివనాగపుల్లయ్య అలాంటి ఓ సాధారణ మనిషి. తానెందుకీ మానవ జన్మనెత్తాడో ఆలోచన లేని వ్యక్తి. దైవం నడిపినట్లు నడిచే యాంత్రికపాణి అలా భగవన్నిర్ణయంగా 1983లో భవాని దీక్షలో ఉన్నప్పుడు అహోబిలం వెళ్ళడం  అక్కడ ఎగువ అహోబిళంలో అత్యంత తేజస్సంపన్నులైన యోగుల బృందం జగజ్జననీ మూర్తి వున్న చిత్రాన్ని శివనాగపుల్లయ్య చేతికిచ్చి ''ఇది హిమాలయాల్లో వుండేదని మా గురువులు చెప్పేవారు. నిన్ను చూడగానే ఈ అమ్మవారికి ఆలయ నిర్మాణ ప్రేరణ నీలోనే కలిగించాలనేది ఆ తల్లి సంకల్పం. అమ్మకు ఆలయం కట్టు. కట్టుతావు. ఇక నీకన్నీ జయాలే'' అన్నారు.

  • ఆశ్చర్య సంభ్రమం నుండి పుల్లయ్య తేరుకోనే లోగానే వాళ్ళు అవుపించలేదు. అదీ సంకల్పం. అది కలిగించిందా పరాశక్తి. ఫోటో పుల్లయ్య చేతిలో వుంది.

  • తర్వాత పుష్కర కాలానికి గానీ మళ్ళీ ఆలయ నిర్మాణ సంకల్పం శివనాగపుల్లయ్యకు కలుగలేదు. అంటే 1996లో అమ్మవారి ఆలయ నిర్మాణానికి అనువైన స్థలాన్ని పట్టణం ఈశాన్యంలో లక్షలు వెచ్చించి కొనుగోలు చేశాడు.

  • ఈ సంకల్పానికి వూతమిచ్చింది యువసైన్యమే. 1988లోనే భవానీ దీక్షో పాల్గొనే మిత్రబృందం అందరూ కలిసి ''శ్రీ దుర్గ ఫ్రెండ్స్ యూనిట్'' అని యేర్పడ్డారు.

  • ఈ ఆస్తిక భక్త యువ బృందమంతా అన్నదాన కార్యక్రమములు, చలివేంద్రములు, పేదలకు ఆర్థిక సహాయము, అనేక విపత్తులలో పలు విధాల సేవా కార్యక్రమాలకు అలవాటు పడిన ఈ యూనిటం.

  • జగజ్జననీ ఆలయ నిర్మాణ సంకల్పం బూనింది. పూనిందీ అంటే పరాశక్తి కల్గించింది.సేకరించిన స్థలానికి కంచి, శృంగేరీ స్వాముల వారి శుభాశీరనుమతులూ లభించాయి.

  • తరువాత 3 సం.లకు 1999 జనవరిలో శిలాన్యాసం జరిగింది. అమ్మవారి విగ్రహం 9. ల ఎత్తుది చేయించి తాత్కాలిక పూజలు నిర్వహించే కుటీరం ఏర్పాటు జరిగాక త్రిశరనాగసర్పం ఒక రాత్రి అమ్మవారి విగ్రహానికి ఫణిచ్ఛాయ పట్టిందన్న వింత, నమ్మినా నమ్మకున్న  జరిగిన సత్యం. ఈ అపూర్వ సత్య సంఘటన 1999 జులైలో జరిగింది.

  • ఆ తరువాత శిల్పులను మాట్లాడడం మొదలుకొని బృహత్ శిలలు తెప్పించటం, మలిపించటం, అగాధంగా పునాదులు, మహత్తర శిల్పాలు, మహోన్నత స్తూపాలు, నిలువెత్తు అధిష్ఠానం, గర్భగుడి, రంగ, ఆస్థాన మంటపాది ప్రణాళికలు, గోపుర నిర్మాణం తద్బాహ్య దృశ్యమాన సకల దేవతా మూర్తులు - ప్రకృతి ప్రతిబింబ దేవతాకృతులు - తదితర శిల్ప కళా వైభవ సంస్కృతీ ప్రదర్శనం వరకూ.

  • లక్షల రూపయల వ్యయం తో  ఏళ్ళ తరబడీ అమ్మవారి ఆలయ నిర్మాణం కొనసాగిస్తుండడం అమ్మ భక్తుడు శివనాగపుల్లయ్య, అతని అనుచర బృందం ఎలా సాధిస్తుందనడం ఆ జగన్మాతకే ఎరుక!

  • పలువిధాల యాచనలతో పరమార్థ దృక్పథములో పరమాత్మికాలయ నిర్మాణం సాగించటం శ్రీ దుర్గ ఫ్రెండ్స్ యూనిట్ కు తలకుమించిన భారమే అవుతున్నా అపోహలకు తావివ్వని రీతిలో ఐచ్ఛిక విరాళాలతో - అర్థించే తీరుతో ఈ అపూర్వ నిర్మాణాన్ని సాగించడం ఆశ్చర్యమే.

  • అయినా  క్రియ నెరిగి ఉదారులే ముందుకు రావాలన్న తపన తప్ప  యాచించి అలుసుకావడం ఇష్టంలేని పట్టుదల అమ్మవారిపై నమ్మకం ఈ ఆస్తిక బృందాన్ని ముందుకు నడుపుతూనే వున్నా ఏ భక్త ఆస్తిక ఉదారమహాశయులో సహకరించక పోరా అని ఆశ, అది జరగాలి  విశ్వంలోనే అవూర్వమైన ఈ ఆలయం జగజ్జేగీయమానం కావాలి.
అమ్మవారి విగ్రహం వివరాలు

➤ఇలా ఆ అమ్మవారి ఆలయాన్ని ఈ ప్రాంతంలో నిర్మించాడు. ఇక ఈ ఆలయంలో గర్భాలయంలో జగజ్జనని నల్లరాతితో చేసిన తొమ్మిది అడుగుల ఎత్తు ఉంది ఎన్నో ప్రత్యేకతలతో దర్శనం ఇస్తుంది. అమ్మవారి నాభిస్థానంలో పంచముఖ శివుడు ఆసీనుడై కనిపిస్తాడు. పాదపీఠ భాగంలో శ్రీ మహావిష్ణువును కొలువు తీర్చిన తీరు అద్భుతం. ఈ అమ్మవారు అష్టభుజాలతో దర్శనం ఇవ్వగా, కుడివైపున ఉన్న చేతుల్లో చంద్రమండలం, సూర్యమండలం, భూమండలం, అభయహస్తం, లక్ష్మీదేవి, త్రినేత్రం, త్రిశూలం ఉంటాయి. ఎడమవైపు ఒక చేతిలో శంఖం, రెండో చేతిలో డమరుకం, మూడొచేతిలో ధనుస్సు, నాల్గవ చేతిలో బ్రహదేవుడు ఉంటారు. ఇంకా 17 తలల ఆదిశేషుడు అమ్మవారికి చత్రంగా కనిపిస్తాడు. ఇలా అమ్మవారు సింహవాహనం పై దర్శనం ఇస్తూ భక్తులని మంత్రముగ్దుల్ని చేస్తుంది.
శ్రీ జగజ్జననీ ఆలయం- ప్రాశస్త్యం
  • అపూర్వ శిల్ప శోభారమణీయంగా నిర్మాణంలో ఉన్న శ్రీ జగజ్జననీ ఆలయం వెలసిన నంద్యాల అనాదికాలం నుండే ప్రముఖ శైవక్షేత్రం అనే చెప్పాలి.
  • ఎందుకంటే ఇది నవనంది - ఆలయం ఆ విధంగా ఈ జగజ్జననీ ఆలయ క్షేత్రానికి అతి సమీప దూరంలోనే ప్రముఖ శైవక్షేత్రాలయిన శ్రీశైలం (ఆత్మకూరు రస్తా) మహానంది (నల్లమల తూర్పు) పడమన ఎర్రమలలు - నల్లమలల సంధి ప్రదేశంలో భోగేశ్వరం, ఎర్రమలలలోనే ప్రముఖ శైవక్షేత్రం యాగంటి, గుండం మల్లికార్జున స్వామి, బ్రహ్మగుండం, మద్దులేటి లక్ష్మీ నారసింహస్వామి, అహోబిల నరసింహక్షేత్రం, సర్వ నరసింహక్షేత్రం, ఇటు ప్రముఖ శక్తి స్థానమైన నందవరం చౌడేశ్వరీ నిలయం, కొత్తూరు సుబ్బరాయుడు క్షేత్రాలు అన్నీ చేరువలోనే ఉండడం జగజ్జననీ ఆలయ సందర్శకులకు ఎందో సౌకర్యంగా వుంటుంది.
  • ఇంకా ''ఓంకారం, నెమిలిగుండం, మోక్షగుండం, కొమ్ముచెరువు ఆంజనేయస్వామి, కాల్వబుగ్గ రామేశ్వర తీర్థం'' కూడా ఈ ఆలయ కేంద్రం నుండి అతి సులభంగా ప్రయాణింప వీలున్నంత దూరంలోనే, నిరంతరయాన సౌకర్యాలతో అలరారడం విశేషం.

కళ్యాణం-కమనీయం
➤ శివ పార్వతులు, శ్రీ లక్ష్మీ విష్ణువు, సిద్ధి బుద్ధి విఘ్నేశ్వర, శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, బ్రహ్మ సరస్వతుల కళ్యాణము ప్రతి రోజు జరుపబడును.
➽ క్రింది వీడియో యు .ఆర్.యల్ .లు చూడండి...

శోథన ఫలితాలు

➽గమనిక :  

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,
నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe  చేయండి.  
అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండి
అలాగే నా  ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe  చేయండి
అలాగే నా  ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండి
Also, see my  Youtube channel  bdl 1tv  like, share  and subscribe,
Also, see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుందథాంక్యూ.



మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు వాటివెనుక ఉన్న శాస్త్రీయత యొక్క గొప్పతనం తెలుసుకుందాము రండి

wowitstelugu.blogspot.com
మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు వాటివెనుక ఉన్న శాస్త్రీయత యొక్క గొప్పతనం తెలుసుకుందాము రండి
మన పూర్వీకులు మనకు చెప్పిన ప్రతి సంప్రదాయం వెనక లాజిక్ ఉంది.కొన్నేళ్లుగా వస్తున్న ఈ ఆచారాలను మన పెద్దలు ఊరికే చెప్పలేదు. అవన్నీ మనకు ఎంతో ప్రయోజనాలను చేకూర్చేవిగా ఉన్నాయి అందుకే వారు వాటిని సంప్రదాయం రూపంలో పాటించేలా అమలు చేశారేమే అనుకోవాలి
మన భారతీయులు పాటించే కొన్ని సంప్రదాయాలు, వాటి వెనక ఉన్న శాస్త్రీయత గురించి తెలుసుకుందాం. ఇవన్నీ మనల్ని ఆశ్చర్యపరచడమే కాదు ఇకపై వాటిని వదల కుండా పాటించేలా మీ ఆలోచనల్ని మారుస్తాయి.
1)
స్త్రీలు గాజులు వేసుకునే సంప్రదాయము పూర్వకాలంలో మగవాళ్లు చాలా కష్టపడేవాళ్లు. శారీరకంగా చాలా పనులు చేసేవాళ్లు. కానీ.. మహిళలు కేవలం ఇంటిపనికే పరిమితం అయ్యేవాళ్లు. ఇలా ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ఇంట్లోనే ఉండటం వల్ల మహిళలు ఎక్కువగా హైబ్లడ్ ప్రెజర్ సమస్యతో బాధపడేవాళ్లు. కాబట్టి మహిళలు ఇలాంటి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలని భావించిన మన పూర్వీకులు వాళ్ల చేతులకు గాజులు వేసుకునే సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. మణికట్టుపై ఉండే గాజులు శరీరాన్ని యాక్టివేట్ చేస్తాయి. గాజులు ఒకదానికొకటి రాపిడి చేయడం వల్ల బ్లడ్ ప్రెజర్ నార్మల్ గా ఉంటుంది. గాజుల ద్వారా చర్మానికి ఎలక్ట్రిసిటీ అందుతుంది.
2)
చిన్నపిల్లలకు చెవులు కుట్టించే సంప్రదాయం దీనిని అందరూ పాటిస్తారు. చిన్నపిల్లలకు ఏడుపు తెప్పించే ఈ సంప్రదాయం వెనక ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ దాగుంది. అందుకే ఈ ఆచారాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తారు.మన భారత దేశం లో చాలా ప్రాంతాల్లో అమ్మాయిలకు, అబ్బాయిలకు ఇద్దరికీ చెవులు కుట్టిస్తారు. చెవుల బయటవైపు చాలా ఆక్యుపంక్చర్ పాయింట్స్ ఉంటాయి. ఇవి.. ఆస్తమా నయం చేయడానికి చాలా ఉపయోగపడతాయి. అందుకే ఈ సంప్రదాయం తీసుకొచ్చారు మన పూర్వీకులు.
3)
హిందూ సంప్రదాయంలో రావిచెట్టుకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. చాలా పవిత్రంగా పూజిస్తారు. దీనివెనక ఆసక్తికర రహస్యం ఉంది.రావిచెట్టు అన్ని చెట్ల కంటే ఎక్కువ ఆక్సిజన్ ని రాత్రి పూట ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఇలాంటి అరుదైన గుణం కలిగి ఉండటం వల్ల ఈ చెట్టుని పూజించడం వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ గ్రహించవచ్చనే ఉద్ధేశ్యంతో ఈ చెట్టుకి పూజలు చేసే సంప్రదాయాన్ని మన పూర్వీకులు తీసుకొచ్చారు.
4)
వివాహిత మహిళలు మట్టెలు ధరించడం మన హిందూ సంప్రదాయంలో భాగం. చాలా వరకు వివాహిత మహిళలంతా ఈ పద్ధతి పాటించితీరాలి. ఈ మట్టెలను కాళి రెండో వేళికి ధరిస్తారు. కాలి రెండోవేళికి మట్టెలు ఎందుకు ధరిస్తారంటే ఈ వేలు గర్భాశయం, గుండెకు కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మట్టెలు ధరించడం వల్ల రక్త ప్రసరణ సజావుగా జరిగి రుతుక్రమం క్రమపద్ధతిలో ఉండేలా చేస్తుంది. వెండి మట్టెలే ధరించడం వల్ల అది పోలార్ ఎనర్జీని గ్రహించి, శరీరం మొత్తానికి అందిస్తుంది.
5)
గంటలు కొట్టడం వల్ల మైండ్ ని స్వేద చేకూరి చేసి ఏకాగ్రత పొందుతామని శాస్త్రం చెబుతుంది. ఈ గంటలు కొట్టినప్పుడు ఉత్పత్తి అయ్యే శబ్ధం మెదడుకి చెందిన ఎడమ, కుడి వైపు భాగాలను ఉత్తేజపరుస్తుంది. ఒకసారి గంట కొడితే ఏడు శబ్ధాలు వస్తాయట. ఇవి మన శరీరంలోని ఏడు చక్రాలను ఉత్తేజపరుస్తాయి. ఈ శబ్దాలు మనలోని నెగటివిటీని తొలగిస్తాయి. అలాగే గంట తయారు చేయడానికి ఉపయోగించిన లోహం వైబ్రేషన్స్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది గాలిలోని బ్యాక్టీరియా, క్రిములను నాశనం చేస్తుంది.
6)
దక్షిణాన తలపెట్టుకుని పాడుకోవాలి ఉత్తరాన పడుకున్నప్పుడు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్టే మనుషుల శరీరానికి కూడా ఉంటుంది. మనం నిద్రపోయేటప్పుడు ఇది వ్యతిరేక పొజిషన్ లో మారుతుంది. మనం నిద్రపోయేటప్పుడు శరీరంలోని గురుత్వాకర్షణ, భూమి గురుత్వాకర్షణకు పూర్తీగా అసమానంగా మారుతుంది. దీనివల్ల బీపీ సమస్యలు, గుండె సమస్యలు ఎదురవుతాయి.అలాగే శరీరం కూడా కొంత ఇనుము కలిగి ఉంటుంది. ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకున్నప్పుడు ఐరన్ మెదడు దిశగా వెళ్లి.. తలనొప్పికి కారణమవుతుంది. అలాగే అల్జీమార్లు, ఏకాగ్రత కోల్పోవడం, మెదడు సమస్యలు ఎదురవుతాయి. అందుకే మనపూర్వీకులు ఆనాడే ఆలోచించి అటువైపు తలపెట్టుకోకూడని చెప్పేవాళ్లు.
7)
కుంకుమ పసుపు, ధరించడం వల్ల బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేసి, లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెర్క్యురీ ఒత్తిడిని తొలగిస్తుంది.
8)
నమస్కారం పెట్టే సంప్రదాయం వెనకా రహస్యం ఉంది. నమస్కారం పెట్టడానికి రెండు చేతులు జోడించడం వల్ల అరచేతులు, వేళ్ల చివర్లు కలుస్తాయి. వేళ్ల చివరి భాగాలు కళ్లకి, చెవులకి, మెదడుకి ప్రెజర్ పాయింట్స్. రెండు చేతులు జోడించినప్పుడు.. మనం నమస్కరిస్తున్న వ్యక్తిని ఎక్కువకాలం గుర్తుపెట్టుకునేలా చేస్తుంది. అందుకే.. ఈ సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. ఈ నాడు కరోనా వైరస్ రావడం వాళ్ళ మన నమస్కారం ప్రాధాన్యత ఎంత గొప్పదో ప్రపంచానికి తెలిసింది.
9)
గోరింటాకు పెట్టుకోవడం గోరింటాకు అందంగా కనిపించడమే కాదు అద్భుతమైన మూలిక కూడా గోరింటాకు ఎక్కువగా పెళ్లిళ్లలో పండుగలలో పెట్టుకుంటారు పెళ్లి అంటే చాలా హడావుడి, ఆందోళన అని మనందరికీ తెలుసు. మెహందీ నరాలకు సాంత్వన అందించి శరీరానికి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆందోళనను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. తలనొప్పి, జ్వరం కూడా రాకుండా కాపాడుతుంది. చేతులు, పాదాలకు అప్లై చేయడం వల్ల నరాల చివర్లకు గోరింటాకు అంది ఒత్తిడిని దూరం చేస్తాయి.
10)
పద్మాసనము లేదా సుఖాసనము మనం నేలపై కూర్చుని తినే అలవాటుని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. అదికూడా కాళ్లు మడతపెట్టి కూర్చుంటాం. దీన్ని పద్మాసనము లేదా సుఖాసనము అని పిలుస్తారు. ఇలా కూర్చుని తినడం వల్ల జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది. శరీరానికి సాంత్వన ఇస్తుంది.
11)
చివరగా తీపి పదార్దాలు ఎందుకు తినాలో తెలుసా? మనందరం ముందుగా స్పైసీ ఫుడ్ తిన్నప్పటికీ చివరగా తీపి పదార్దాలు తీసుకుంటాం. ఎందుకు అని ఎప్పుడు ఆలోచించలేదా ? దీనివెనక సైంటిఫిక్ రీజన్ ఉంది. స్వీట్లు జీర్ణక్రియను తగ్గిస్తాయి కాబట్టి ముందుగా స్పైసీ ఫుడ్ తినడం వల్ల జీర్ణరసాలు, ఆమ్లాలు పొట్ట దాచుకుని తర్వాత మెరుగ్గా సాగడానికి సహాయపడుతుంది.
12)
పూర్వీకులు రాగి నాణేలను నదుల్లోకి విసిరేసేసి నదీమ తల్లికి నమస్కారం చేసేవారు పూర్వకాలం డబ్బులు రాగి నాణేల రూపంలో ఉండేవి. ఇప్పుడు స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారు చేస్తారు. అప్పట్టో నదుల ద్వారా మాత్రమే నీళ్లు పొందేవాళ్లు. మన పూర్వీకులు రాగి నాణేలను నదుల్లోకి విసిరేసే సంప్రదాన్ని పాటించేవాళ్లు.ఇప్పటికి కొంతమంది పాటిస్తుంటారు. రాగి నాణేలను నదుల్లోకి విసిరేయడం వల్ల రాగి ఎక్కువకాలం నీటిలో ఉండి నీటిని శుద్ధి చేస్తుంది. ఈ కారణంగా ఆలయాల్లో కూడా రాగి పాత్రలు ఉండేవి. రాగి నీటిని 99.9 శాతం ప్యూరిఫై చేస్తుంది.
13)
ఆయుర్వేదం ప్రకారం శరీరంలోని జీర్ణవ్యవస్థలో చాలా మలినాలు పేరుకుపోయి ఉంటాయి. కాబట్టి శుభ్రంచేసే వ్యవస్థ కావాలి. దానికి ఉపవాసాన్ని క్లినింగ్ సిస్టమ్ గా మార్చారు.ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో.. జీర్ణ వ్యవస్థ విశ్రాంతి తీసుకుంటుంది. దీనివల్ల శరీరం శుభ్రమవుతుంది. మనుషుల శరీరం 80 శాతం నీళ్లు, 20 శాతం పదార్థాలతో తయారై ఉంటుంది. మనం ఉపవాసం ఉన్నప్పుడు.. శరీరంలో యాసిడ్ కంటెంట్ తగ్గిపోయి.. శరీరం సాధారణ స్థితికి రావడానికి సహాయపడుతుంది.ఉపవాసం డయాబెటిస్, రోగనిరోధకతకు సంబంధించిన సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ రిస్క్ ని తగ్గిస్తాయి.
14)
మహిళలు బొట్టు పెట్టుకునే భాగం ముఖ్యమైన నరం ఉంటుంది. శరీరం కోల్పోయిన ఎనర్జీ తిరిగి పొందడానికి బొట్టు సహాయపడుతుంది. అలాగే ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. అందుకే పూజల సమయంలో.. బొట్టు పెట్టుకుంటారు. బొట్టు నుదుటిపై పెట్టుకోవడం వల్ల ఏకాగ్రత మెరుగుపడుతుంది. అలాగే రక్త ప్రసరణ చురుగ్గా సాగుతుంది.
15)
మంగళ సూత్రాలలో ఆడవారు పగడాన్నీ,ముత్యాన్నీ ధరిస్తారు. అవి కేవలం అలంకార ప్రాయంగా కాకుండా ఆడవారికి ఎంతో మేలు చేస్తాయి.మంగళ సూత్రాలు స్త్రీ పసుపు కుంకుమలతో పాటుగా ఆమె ఆరోగ్యాన్ని కూడా పరిరక్షిస్తాయి. పగడం సూర్యునికి మరియు కుజునికి , ముత్యం చంద్రుని కి ప్రతీకలు. ఆ రెండూ సూర్య, చంద్ర తేజాలను తమలో నిక్షిప్తం చేసుకుని ఉంటాయి. స్త్రీ శరీరానికి కావలసిన ఉత్తేజాన్ని పగడం అందిస్తుంది. నాడీ మండలాన్ని చురుకుగా ఉంచుతుంది. ముత్యం అతివేడిని తగ్గిస్తుంది. ప్రశాంతతను సహనాన్ని ప్రసాదిస్తుంది.
16)
గర్భిణి స్త్రీలు కొబ్బరికాయ కొట్ట కూడదు తమిళంలో చిదరు కాయ్ అంటారు దానిని కొట్ట కూడదు ఎందుకంటె ఆ అదురు కు గర్భము జారిపోవచ్చు, అదే మాదిరి శూర టెంకాయ కొట్టే స్తలములో కూడా ఉండకూడదు.
17)
భారతీయ స్త్రీలు మెట్టెలు ధరించడం ఒక సంప్రదాయం. ఐతే ఈ మెట్టెలు ధరించడానికి, అందులోను కాలి రెండవ వ్రేలుకు ధరించడానికి కూడా చక్కని కారణాలు ఉన్నాయి. మెట్టెలు ధరించడం వల్ల ముందు ఆ స్త్రీకి వివాహం అయిందనే విషయం తెలుస్తుంది. ఇక ఆరోగ్య విషయానికొస్తే మెట్టెలు ధరించడం వల్ల గర్భశయానికి చాలా మంచిది. కాలి రెండవ వేలి నుండి గర్భాశయానికి ఒక నాడి అనుసంధానమై ఉంటుంది. గుండెను కూడా ఈ నాడీ కలుపుతుంది. కాలి వేలికి మెట్టెలు ధరించడం వల్ల గర్భాశయం దృఢపడుతుంది. రక్తప్రసరణను నియంత్రించి, శరీర క్రియలు సక్రమంగా జరిగేటట్లు చేసి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. వెండితో చేసిన మెట్టెలను ధరించడం భారతీయ సంప్రదాయ పద్ధతి. వెండి మంచి ఉష్ణ వాహకం కావడం వల్ల భూమి నుండి ధృవావేశాలను గ్రహించి శరీర ఇతర అవయాలకు అందజేస్తుంది. కావున ఆధునిక పోకడలకు పోకుండా వివాహమైన స్త్రీలు మెట్టెలు ధరిస్తే , చక్కని ఆర్యోగ్యాన్ని పొందిన వారవుతారు.
18)
మన ఇంట్లో డబ్బుల బీరువాలో మరియు రోజు వాడే డబ్బుల పరుసు లోను మన వీలును బట్టి 786 (ఓం- సంకేతం) నంబరు ఆఖరుగ ఉన్న అంటే (ఉదాహరణకు నంబరు 9HH 9000786) పది, వంద , వెయ్యి ఏ నోటు అయినా పెట్టుకోవాలి .ఆ నోటును ఎప్పుడు ఖర్చుకు వాడరాదు.యిలా చేయడం అదృష్టం కలిసి రావటానికి ఇది సంకేతం.

19)
కాకికి అన్నము పెట్టండి ప్రతి రోజు భోజనమునకు ముందు కాకికి అన్నము పెట్టండి ఇది పితృ దేవతలకు ప్రీతి కాకికి మనము భోజనము చేయుటకు ముందు కుక్కకు మనము తిన్న తర్వాత పెట్టాలి అయితే కుక్కలను ఎల్లప్ప్పుడు కన్న సంతానానికంటే ఎక్కువగా లాలిస్తూ దాని నోటికి ఆకులోంచి అందిస్తూ భోజనము చేయడము ఎక్కువై పోయింది.

ఇంకా ఈ క్రింది ఉదహరించిన సంప్రదాయాలు కూడా పాటించండి
  • మీరు మీ పిల్లల తో దిండు పైన కూర్చో వద్దు ఐతే ఈ కాలములో అందరు దీనిని తప్పక చేస్తుంటారు.
  • ఉప్పు మిరప చింతపండు వీటిని ఎవరికి ఇచ్చిన చేతిలో ఇవ్వకూడదు కింద పెట్టండి వాళ్ళే తీసుకొంటారు ఈ మద్య కాలంలో ఉప్పు చేతితో వడ్డించడం చాల చోట్లలో గమనిస్తాము
  • గ్రహణ సమయమందు భూమ్యాకర్షణ శక్తి మార్పు చెందుతుంది. దాని పరిమాణము మనపై చాల ఉంటుంది ముఖ్యముగా మన కడుపులో ఆహార పదార్థములు జీర్నమవడానికి కావలసిన ఆమ్లములు ఉరవు అందువల్ల జీర్ణము కాదు ఈ కారణముగానే గ్రహణ సమయమునకు ముందుగ మూడు గంటలకు పూర్వమే మన కడుపులో ఏమి ఉండకూడదు అంటారు
  • మీ భర్త పిల్లలు మంగళ వారము నాడు క్షవరము గడ్డము గీసుకోవడము చేయనీయ వద్దు ఈ ప్రక్రియ దరిద్రాన్ని సంభవింప చేయును.
  • మంచి పనులను శుక్ల పక్షము నందే అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయ వలెను.
  • స్త్రీలు రాత్రి సమయమున గాజులు కమ్మలు తీయరాదు.
  • కోత్త వస్త్రములను ధరించే ముందు దానికి కొంత పసుపు ఏదైనా ఒక మూల రాయాలి పసుపు క్రిమి నాసిని.
  • ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోడదు అయితే ఈ మధ్య కాలములో ఈ పని చాల చోట్లలో సహజమై పోయింది.
  • నలుపు రంగు వస్తువులు బట్టలు దరించ కండి ఈ మధ్య కాలంలో సువాసిని స్త్రీలుకుడా నలుపు రంగు వస్తువులు ధరించడం ఎక్కువై పోయింది.
  • కొబ్బరి ాచిప్ప ఇచ్చేటప్పుడు మూడు కండ్లు వుండే భాగము మీరు ఉంచుకొని మిగతా భాగము ఇతరులకు ఇవ్వవలెను
  • స్త్రీలు ఎప్పుడు జుట్టు విరవ పోసుకొని ఉండకూడదు ఇది జ్యేష్టాదేవి స్వరూపము ఇంటిలో మంగళము జరుగుటకు విఘ్న కారణమవుతుంది ఈ చర్య ప్రతి గృహములో ఇప్పుడు ఒక తప్పని సరి అయిపొయింది
  • శుక్రవారమునాడు గాని జీతము రాగానే గాని ఆ డబ్బుతో మొట్ట మొదటి సారి ఉప్పు కొనండి ఈ చర్య పైపై డబ్బులు చేరటానికి అవకాసము ఎక్కువ
  • కాలిపైకాలు వేసుకొని కుర్చోవడము, కాల్లాడిస్తూ కూచోవడం ఒంటి కాలితో నిలవడం స్తిరముగా నిలవక ఉగుతుండడం లాంటి పనులు చేయకూడదు ఇందువల్ల ఒకటి దారిద్ర హేతువు మరియొకటి ఆ ప్రదేశములు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశములు ఎక్కువ ఎల్లప్పుడు ఇచ్చి పుచ్చుకోవడానికి కుడి చేతిని అలవాటు చేయాలి ఎడమ చేతిని ఉపయోగించ కూడదు.
  • సుమంగళి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి ఆహారము తినకుండా నిద్రించ కూడదు
  • స్త్రీలు బహిష్టు సమయమందు పూలు తలలో పెట్టుకోరాదు.
  • పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పు రాదు రేపు తీసుకుంటాను అని అనవలెను
  • ఎప్పుడు మన నోటినుండి పీడ దరిద్రం శని పీనుగా కష్టము అనే పదములను ఎప్పుడు ఉపయోగించ కూడదు
  • ఇంటిలో దుమ్ము ధూలి సాలెగూడు కట్టడం లాంటివి దారిద్ర హేతువు పదిరోజులకు ఒకమారు మంగళ శుక్ర వారములు కాకుండా దులిపి శుభ్రము చేయవలెను.
ఈ క్రింది వీడియో యు.ఆర్.యల్.లు చూడండి
Note:  
నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,
నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండిAlso, see my  Youtube channel  bdl 1tv  like, share  and subscribe, Also, see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి.