అయోధ్య నగరం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అయోధ్య నగరం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, నవంబర్ 2018, బుధవారం

Ayodhyanagar is a renowned historic pilgrimage city in India

భారతదేశం లో అయోధ్యనగరం ఒక ప్రఖ్యాత చారిత్రాత్మక పుణ్య క్షేత్రం!

ప్రఖ్యాత పట్టణం పుణ్య క్షేత్రం అయోధ్య:
  • సరయు నది ఒడ్డున ఉన్న హిందువుల ప్రఖ్యాత పుణ్య క్షేత్రం అయోధ్య. విష్ణుమూర్తి అవతారాలలో ఏడవ అవతారం అయిన భగవాన్ శ్రీ రాముడితో పట్టణానికి ఎంతో అనుబంధం ఉంది. రామాయణం అనే ఇతిహాసం ప్రకారం.
  • శ్రీ రాముడు జన్మించిన రఘు వంశీకుల యొక్క రాజధానిగా పురాతనమైన అయోధ్య నగరం వ్యవహరించేది. రాకుమారుడైన రాముడి చుట్టూ నే రామాయణం కథ మొత్తం తిరుగుతుంది. శ్రీ రాముడు వనవాసానికి 14 ఏళ్ళ పాటు వెళ్ళి వచ్చిన తరువాత సందర్భాన్ని పురస్కరించుకుని దీపావళి పండుగని జరుపుకుంటారు.
ఆధ్యాత్మికత లో ప్రత్యేకమైన అయోధ్య నగరం:
  1. హిందూ మతం తో పాటు అయోధ్య లో బౌద్ధ మతం, జైన మతం మరియు ఇస్లాం మతం జాడలు కూడా కనిపిస్తాయి. జైన్ తీర్థంకరు లో అయిదుగురు ఇక్కడే జన్మించారని నమ్ముతారు. మొదటి తీర్థంకరుడు అయిన రిషబ్దేవ్ కూడా ఇక్కడే జన్మించారని అంటారు.
  2. అయోధ్య కొన్ని చెడు అనుభవాలని కూడా రుచి చూసింది. 1527 లో శ్రీ రాముడి జన్మ స్థలం గా పరిగణించబడిన ప్రాంతం లో మొఘల్ చక్రవర్తి బాబ్రీ మసీదు ని నిర్మించాడు. 1992 లో మసీదు కొందరి చేత ద్వంసం చేయబడింది. తరువాత ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి కొన్ని మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
అయోధ్యలోని పర్యాటక ప్రదేశాలు:
  • హిందువుల యొక్క అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం అయోధ్య. ఆధ్యాత్మిత కలిగిన వ్యక్తులకి అయోధ్య పర్యాటకశాఖ ఎన్నో అందిస్తుంది. శ్రీ రాముడి పుత్రుడు కుశుడి చేత నిర్మించబడిన నాగేశ్వరనాథ్ ఆలయం మరియు చక్ర హర్జి విష్ణు ఆలయాలు ఇక్కడ సందర్శించదగిన ఆలయాలు. తులసీదాస్ యొక్క జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం చేత నిర్మించబడిన తులసీ స్మారాక్ భవన్ ఇక్కడ ఉంది. 1992 లో ద్వంసం చేయబడిన బాబ్రీ మసీదు రామ జన్మ భూమిలో ఉండేది
  • బంగారపు కిరీటాలు ధరించిన సీతారాముల చిత్రాలని కనక భవన్ లో గమనించవచ్చు. హనుమాన్ గర్హి అనే భారీ నిర్మాణం ప్రతిములలో వృత్తాకార కోట బురుజుల తో ఉంటుంది. శ్రీ రాముడి తండ్రి కి సంబంధించిన దసరథ్ భవన్ ని ఇక్కడ గమనించవచ్చు. ట్రేటా కే ఠాకూర్ అనే ప్రదేశం లో నే శ్రీ రాముడు అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడని తెలుస్తోంది.
  • రామ  జన్మభూమి ఆలయానికి సమీపం లో సీత కి రాసోయి ని గమనించవచ్చు. శ్రీ రాముడి తో వివాహం తరువాత సీతాదేవి మొట్ట మొదటి సారి ఇక్కడే వంట చేసిందని అంటారు. సరయు నది వద్ద ఉన్న రామ్ కి పైది అనే స్నానపు ఘాట్స్ ఉన్నాయి. తరువాత, మని పర్బాత్ అనే బౌద్ధుల విహార ప్రదేశం ఉంది. 
  • తరువాత హిందువుల ఆలయం గా మారింది. ఇక్కడ నుంచి నగరం యొక్క సుందరమైన వీక్షణలు చెయ్యవచ్చు.
చూడవలసిన ప్రదేశాలు:
  • అయోధ్యలో ముఖ్యమైన ప్రదేశాలు చూడాలంటే రిక్షాలు మాట్లాడుకుని వాటిలో వెళ్ళి చూడాలి. రిక్షా నడిపేవారు ఇక్కడ ముఖ్యమైన ఆలయాలు మరియు మందిరాలను ఒక్కొక్కటిగా చూపుతారు. రామజన్మభూమిని కూడా అలాగే చూడాలి.
సరయూనది స్నానఘట్టం:

  • సరయు నది. వేదాలలో మరియు రామాయణంలో నది ప్రస్తావించబడింది. ఇది గంగానదికి ఉపనది. ఇది అయోధ్య పట్టణాన్ని ఆనుకొని ప్రవహిస్తుంది. నదిలోనే శ్రీరామలక్ష్మణులు మునిగి అవతారములు చాలించిరి.
రామజన్మభూమి ఆలయనిర్మాణ ప్రదేశం:
  • ఇక్కడ రామజన్మభూమిలో వివాదం ముగిసాక ఆలయనిర్మాణం కొరకు అవసరమైన శిల్పాలు మొదలైనవి నిర్మించి సిద్ధంగా ఉంచబడ్డాయి. సుమారు నిర్మాణానికి అవసరమైన పని 80% సిద్ధంగా ఉన్నాయని అంచనా.
అన్నదాన సత్రాలు సమాజములు:
  • అయోధ్యలో భిక్షువులు ఉండకూడదన్న ఉద్దేశంతో సాధువులకు ఏర్పాటు చేసిన అన్నదాన సత్రం. ఇక్కడ దాతల సహాయంతో నిధి వసూలు చేసి ప్రతిరోజు సాధువులకు అన్నదానం చేస్తుంటారు. అలాగే ఇక్కడ ఉన్న గోశాలలో 200 కు పైగా గోవులు ఉన్నాయి. గోక్షీరం ఆశ్రమనిర్వహణకు ఉపయోగించబడతాయి.
కౌసల్యాదేవి మందిరం వివరాలు :
  • శ్రీరామునికి జన్మనిచ్చిన కౌశల్యాదేవికి ఇక్కడమాత్రమే మందిరం నిర్మించబడి ఉంది. మందిరంలో కౌశల్యాదేవి, దశరథులతో రామచంద్రుడు ఉండడం విశేషం.
హనుమద్ మందిరం వివరాలు :

  • ఇక్కడ ఉన్న హనుమదాలయంలో నిరంతరం అఖండ భజన కొనసాగుతూ ఉంటుంది.
వాల్మికీ మందిరం వివరాలు 
  • వాల్మికీ మందిరంలోని పాలరాతి గోడల మీద వాల్మికీ రామాయణంలోని 24 వేల శ్లోకాలు లిఖించబడి ఉన్నాయి. ఇక్కడ మూల మందిరంలో వాల్మికి మహర్షితో లవకుశులు ఉండడం విశేషం.
కనక మహల్  గురించిన వివరాలు :

  • సీతారాములు వివాహానంతరం అయోధ్యలో ప్రవేశించిన తరువాత కైకేయీ, దశరథులు వివాహ కానుకగా సీతారాములకు భవనం ఇవ్వబడిందని విశ్వసించబడింది. ప్రస్తుతభవనం విక్రమాదిత్యుడు నిర్మించాడని విశ్వసించబడుతుంది
  • విక్రమాదిత్యుడు సరయూ నదిలో స్నానం ఆచరించి అయోధ్యా నగరంలో ప్రవేశించిన తరువాత ఆయనకు ఇక్కడ గతంలో ఉన్న భవనాలు కళ్లకు కట్టినట్లు గోచరమైయ్యాయని తరువాత విక్రమాదిత్యుడు ఇక్కడ ఆలయాలు, భవనాలు నిర్మించబడ్డాయని విశ్వసించబడుతుంది.
హనుమదాలయం:
  • హనుమదాలయం. రామచంద్ర పట్టాభిషేకం తరువాత రామచంద్రుడు తనకు సాయం చేసిన వారందరికి కానుకలు సమర్పించిన తరువాత తనకు అత్యధికంగా సహకరించి సాహసించిన హనుమంతునికి తన నివాసానికంటే ఎత్తైన ప్రదేశంలో నివాసానికి యోగ్యమైన స్థలం ఇచ్చాడని అక్కడ ప్రస్తుతం ఆలయనిర్మాణం జరిగిందని విశ్వసించబడుతుంది.
  • పురాణ ప్రసిద్దమైన ఆలయం కొంచం ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. ఆలయానికి సుమారు 90 మెట్లుంటాయి. ఆలయ ప్రాంగణంలో సీతారాముల ఆలయం ఉంది.
చివరగా రామజన్మ భూమి: 
బాబర్ మసీదు నిర్మించిన ప్రదేశంలో రామజన్మ భూమిలో తాత్కాలికంగా అతి చిన్నదైన రామాలయంలో సితారాములకు పూజాధికాలు నిర్వహించబడు తున్నాయి.  అత్యంత రక్షణ వలయంలో క్యూపద్ధతి లో ప్రయాణించి  ఈ  ఆలయాన్ని చూడాలి. లోపలకు ప్రవేశించడానికి కఠినమైన నియమాలు ఉన్నాయి. అలాపోతూ పోతూనే ఆలయాన్ని దర్శించాలి. ఎక్కడా నిలవడానికి రక్షణసిబ్బంద్జి అనుమతించదు. సెల్ పోన్, కెమెరాలు, పెన్నుల వంటివి కూడా లోపలకు అనుమతించరు. లోపల కనీసం 2 లేదా 3 కిలోమీటర్లు నడవాలి కనుక చెప్పులు వేసుకుని లోపలకు వెళ్లి విడవవలిసిన చోట దగ్గర్లో చెప్పులు విడవాలి .

ఈ క్రింది వీడియో యూ.ఆర్. ఎల్ .చూసి అయోధ్య గురించి మరింత తెలుసుకోండి :

Ayodhya is a city located near Faizabad in Uttar Pradesh, India. It is identified with the ..... UnderIndian government no one was permitted near the site for 200 yards, and the gate was locked to the outside. Hindu pilgrims, however, began ...


















Note:  
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండి .
అలాగే నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and subscribe  చేయండి  నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com  చూడండి చూసి  like,share and subscribe  చేయండి. మరియు  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి. కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ .