27, ఫిబ్రవరి 2020, గురువారం

భార్య, భర్తల మధ్య మనస్పర్థలు తొలగి పోవడానికి ఉమామహేశ్వర స్తోత్రం

wowitstelugu.blogspot.com

భార్య, భర్తల మధ్య మనస్పర్థలు తొలగి పోవడానికి ఉమామహేశ్వర స్తోత్రం


ఉమామహేశ్వర స్తోత్రం అత్యంత శక్తివంతమైనదిభార్య, భర్తల మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు ఈ స్తోత్రం పఠించి ఆ పార్వతి, పరమేశ్వరుల అనుగ్రహం పొందవచ్చు

.  
నమశ్శివాభ్యం నవయౌవనాభ్యాం
పరస్పరాశ్లిష్ట వపుర్ధ రాభ్యాం
నగేంద్రకన్యా వృషే కేతనాభ్యాం
నమోనమ శ్శంకర పార్వతీభ్యాం

నమశ్శివాభ్యాం సరసోత్సవాభ్యాం
నమస్కృతాభీష్ట వరప్రదాభ్యాం
నారాయణే నార్చిత పాదుకాభ్యాం
నమోనమ శ్శంకర పార్వతీభ్యాం

నమశ్శివాభ్యాం వృషవాహనాభ్యాం
విరించి విష్ణ్వీంద్ర సుపూజితాభ్యాం
విభూతి పాటీర విలేపనాభ్యాం
నమోనమ శ్శంకర పార్వతీభ్యాం

నమశ్శివాభ్యాం జగదీశ్వరాభ్యాం
జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యాం
జంభారి ముఖ్యై రభివందితాభ్యాం
నమోనమ శ్శంకర పార్వతీభ్యాం

నమశ్శివాభ్యాం పరమౌషధాభ్యాం
పంచాక్షరీ పంజర రంజితాభ్యాం
ప్రపంచ సృష్టి స్థితి సంహృతాభ్యాం
నమోనమ శ్శంకర పార్వతీభ్యాం

నమశ్శివాభ్యా మతిసుందరాభ్యా
మత్యంత మాసక్త హృదయాంబుజాభ్యామ్
అశేష లోకైఅక హితం కరాభ్యాం
నమోనమ శ్శంకర పార్వతీభ్యాం

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం ఇతి ఉమామహేశ్వర స్తోత్రం.
 ఓం ఉమా మహేశ్వరాయ నమః 
 ఓం ఉమా మహేశ్వరాయ నమః 
 ఓం ఉమా మహేశ్వరాయ నమః 
 ఓం ఉమా మహేశ్వరాయ నమః 
 ఓం ఉమా మహేశ్వరాయ నమః 

ఉమామహేశ్వర స్తోత్రం వీడియో యూ .ఆర్ . యల్ . లు చూడండి.

శోథన ఫలితాలు

ఉమామహేశ్వర స్తోత్రం - ఈ సోమవారం చాలా ...

శోథన ఫలితాలు

ఉమామహేశ్వర స్తోత్రం - ఈ సోమవారం చాలా ...

Uma Maheshwara Stotram | Damaru | Adiyogi Chants ...

Sacred Chants : Uma Maheswara Stotram By Adhi Sankara ...

NAMASHIVABHYAM || UMA MAHESWARA STOTRAM ...

Note:
నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe 

చేయండి .   అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share
and subscribe చేయండి.   
నా యూట్యూబ్ ఛానల్   bdl 1tv
నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  
కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.











25, ఫిబ్రవరి 2020, మంగళవారం

తెలంగాణ లో హైదరాబాద్ గొప్పతనం గురించి తెలుసుకొందాము

wowitstelugu.blogspot.com

తెలంగాణ లో  హైదరాబాద్  గొప్పతనం గురించి తెలుసుకొందాము

Hyderabad City
హైదరాబాద్ మన దేశం లో కలిసినప్పుడు 7వ నిజామ్ నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అప్పటి హైదరాబాద్ రాజ్ ప్రముఖ్ గా ఉన్నారు అంటే ఇప్పటి రాష్ట్ర గవర్నర్ హోదా తో సమానమని అర్ధం.

  • భారత దేశం లో విద్యుత్ హైదరాబాద్ కు వచ్చిన 15 సంవత్సరాలకి వచ్చింది

  • ఇండియా కి  చైనా కి యుద్ధం జరుగుతున్నప్పుడు 7 లారీ ల తో  బంగారం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇచ్చారు .

  • భారత దేశానికీ స్వతంత్రం రాకముందే హైదరాబాద్ ఒక పెద్ద రాజ్యం గాఅభి వృద్ధి చెంది ఉండేది.

  • భారత దేశం అంతా బ్రిటిష్ రాజ్యం గా ఉండే నాటికీ హైదరాబాద్  నిజాం రాజ్యం మాత్రం విడిగా ఉండేది. 

  • 1947 లో భారత దేశం నించి వేలి పోయాక కూడా హైదరాబాద్ విడిగా 1950 వరకు ఉంది.సర్దార్ పటేల్ చొరవతో భారత దేశం లో కలిసింది .

  • తరువాత తెలంగాణ, ఆంధ్ర, మద్రాస్ ఒక రాష్ట్రము గా ఉండేవి . ఉమ్మడి రాజధానిగా చెన్నైఉండేది.

  • బాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు అయినా తరువాత ఆంద్ధ్రప్రదేశ్ (ఇప్పటి, ఆం.ప్ర తెలంగాణ )కి హైదరాబాద్ రాజధాని అయింది .

  • తెలంగాణ విడిపోయాక హైదరాబాద్ తెలంగాణ రాజధాని అయింది.

మనదేశం లో మొట్ట మొదట గా ప్రారంభమైనవి 

  • 1813 లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రారంభమైంది 
  • 1834 లో మొదటి ఇంగ్లీష్ పబ్లిక్ స్కూల్ ప్రారంభమైంది 
  • 1835 లో మొదటి రోమన్ కాథలిక్ స్కూల్ ప్రారంభమైంది
  • 1835 లో అల్ సెయింట్స్ కాన్వెంట్
  • 1835 రోసెరీ కాన్వెంట్ ప్రారంభమైంది
  • 1850 లో సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ ప్రారంభమైంది.
  • 1851 లో కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ (కేమ్) (ఇప్పుడు గాంధీ )హాస్పిటల్.
  • 1866 లో ఆఫ్జాల్ గూంజ్ హాస్పిటల్ ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ అంటారు
  • 1880 లో దారులు షిఫా హాస్పిటల్ ప్రారంభమైంది.
  • 1889 లో జాజి ఖన్నా క్వీన్ విక్టోరియా హాస్పిటల్ ప్రారంభమైంది
  • 1889 లో క్వీన్ విక్టోరియా జనన హాస్పిటల్ ప్రారంభమైంది
  • 1889 లో జి .హెచ్.యమ్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ ప్రారంభమైంది.
  • 1890లో  ఆయుర్వేద ఉన్నాయ్ హాస్పిటల్ ప్రారంభమైంది 
  • 1894 లో మెడికల్ కాలేజీ ప్రారంభమైంది 
  • 1897 లో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ప్రారంభమైంది 
  • 1854 లో దారుల్ యూ లూమ్ ఓరియంటల్ స్కూల్ ప్రారంభమైంది 
  • 1856 లో మన దేశం లో మొదటి పోస్ట్ ఆఫీస్ హైదరాబాద్ లోనే 
  • 1869 లో మొదటి సివిల్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రారంభమైంది 
  • 1871 లో సింగరేణి గనులు తవ్వకం ఇక్కడ మొదలైంది.
  • 1872 లో చందర్ ఘర్ స్కూల్ ఆరంభమైంది 
  • 1873 లో  స్పిన్నింగ్ మిల్ ఆరంభమైంది 
  • 1874 లో నిజాం కాలేజీ ప్రారంభం అయింది 
  • 1876 లో మొదటి ప్రింటింగ్ ప్రెస్ ఇక్కడే మొదలైంది
  • 1878 లో పిరాని ఫ్యాక్టరీ ప్రారంభమైంది 
  • 1879 లో ముఫైడెల్ అన్నం స్కూల్ ప్రారంభం అయింది.
  • 1881 లో చాందీర్ఘాట్ ఫస్ట్ గ్రేడ్ కాలేజీ ప్రారంభం 
  • 1882 లో  మహబూబ్ కాలేజీ ప్రారంభం అయింది 
  • 1884 లో సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీ 
  • 1885  లో టెలీకమ్యూనికేషన్స్ ప్రారంభమయ్యాయి 
  • 1887 లో నామ్ పల్లి గర్ల్స్ హైస్కూల్ ప్రారంభమైంది 
  • 1894 లో అసఫియా స్కూల్ మెడికల్ కాలేజీ ప్రారంభం
  • 1890 లో వరంగల్ తెలుగు స్కూల్ ప్రారంభం అయింది.

  • 1899 లో లా స్కూల్ ప్రారంభయ్యింది

  • 1904 లో వివేకా వర్దిని స్కూల్ ప్రారంభమైంది 

  • 1910 లో హైదరాబాద్ ఎలక్ట్రిసిటీ బోర్డు ప్రారంభమైంది.
  • 1910 లో థర్మల్ విద్యుద్ కేంద్రం 6 కోట్లకు అమ్మేయడం జరిగింది 
  • 1910 నించి విద్యుత్ వాడకం ప్రారంభయ్యింది. 
  • 1910 లో సోడా ఫ్యాక్టరీ,ప్రారంభం అయింది ఐరన్ ఫ్యాక్టరీ ప్రారంభం అయింది 
  • 1912 లో డిస్టిలేషన్ ప్లాంట్ ప్రారంభం అయింది.
  • 1913 లో బోన్ ఫ్యాక్టరీ స్టార్ట్ అయింది. 
  • 1916 లో డెక్కన్ బటన్ ఫ్యాక్టరీ ప్రారంభం 
  • 1916 లో హోమియోపతి కాలేజీ 
  • 1916 లో సెయింట్ విల్లియం బ్రాడ్  ఫోర్డ్ హాస్పిటల్ ప్రారంభమైంది 
  • 1919 లో వి.యస్.టి ప్రారంభమైంది రోజు 
  • 1920 లో సిటీ కాలేజీ , ఉస్మానియా యూనివర్సిటీ ప్రారంభం అయ్యాయి.
  • 1921 లో ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రారంభమైంది.
  • 1921 లో కెమికల్ ఫ్యాక్టరీ ప్రారంభం అయింది 
  • 1923 లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఓపెన్ అయింది.
  • 1924 లో మార్వాడి హిందీ విద్యాలయం ప్రారంభమైంది.
  • 1925 లో నీలోఫర్ హాస్పిటల్ ప్రారంభమైంది 
  • 1926 లో ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రారంభమైంది 
  • 1926 లో విక్టోరియా జనన మరియు పిల్లల,మెటర్నిటీ హాస్పిటల్ ప్రారంభం 
  • 1926 లో క్వారంటైన్ (కొరెంటై) హాస్పిటల్ లేదా ఫీవర్ హాస్పిటల్ ప్రారంభం  
  • 1926 లో నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ ప్రారంభమైంది 
  • 1926 లో హిందీ విద్యాలయం సికింద్రాబాద్ లో ప్రారంభమైంది
  • 1927 లో చార్మినార్ యునాని ఆయుర్వేద హాస్పిటల్ ప్రారంభమైంది 
  • 1930 లో ఫిసికల్ ఎడ్యుకేషన్ కాలేజీ ప్రారంభమైంది 
  • 1931 లో  అజాం జహి మిల్స్ ప్రారంభమయ్యాయి 
  • 1932 లో హైదరాబాద్ స్టీల్ అండ్ వరల్డ్ లిమిటెడ్  ప్రారంభమైంది 
  • 1933 లో కోహినూర్ గ్లాస్ ఫ్యాక్టరీ ప్రారంభమైంది.
  • 1933 లో తాజ్ క్లే వర్క్స్ లిమిటెడ్ ప్రారంభం.
  • 1936 లో ఇండియన్ హోమ్ పైప్ కంపెనీ ప్రారంభమైంది.
  • 1937 లో నిజం సుగర్ ఫ్యాక్టరీ ప్రారంభమైంది 
  • 1939 లో సిరిపూర్ పేపర్ మిల్ ప్రారంభమైంది 
  • 1940 లో తాజ్ గ్లాస్ వర్క్ (సనత్ నగర్) లో ప్రారంభం అయింది.
  • 1941 లో గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ ప్రారంభమైంది 
  • 1942 లో హైదరాబాద్ స్టేట్ బ్యాంకు ప్రారంభం అయింది 
  • 1943 లో  ప్రగా టూల్  ప్రారంభమైంది.
  • 1946 లో సూర్ సిల్క్ హైదరాబాద్ లో ప్రారంభం అయింది
  • 1946 లో వెటర్నరీ  ఎస్. సి . కాలేజీ,
  • 1946 లో కోటి ఉమెన్స్ కాలేజీ,ప్రారంభం అయ్యాయి
  • 1946 లో నాంపల్లి ఉమెన్స్ కాలేజీ ప్రారంభం అయ్యాయి
  • 1947 లో హైదరాబాద్ లామినేషన్ ప్రొడక్ట్స్, ప్రారంభమైంది 
  • 1947 లో డెక్కన్ క్రానికల్ వర్క్స్ ప్రారంభమైంది 
  • 1947 లో జిందా తిలిస్మాత్  ఫ్యాక్టరీ ప్రారంభమైంది 
  • 1947 లో ది బాబా వాటర్ మానుఫాటురిన్గ్ లిమిటెడ్ ప్రారంభమైంది.
  • 1947 లోవాసుదేవ ఆయుర్వేదిక్ ఫార్మసీ ఫ్యాక్టరీ ప్రారంభమైంది.
  • 1947 లోడెక్కన్ పొటారిస్ అండ్ ఎనామెల్ వరల్డ్  ఫ్యాక్టరీ ప్రారంభమైంది.
  • 1947 లో చార్మినార్ పొటరీస్  ఫ్యాక్టరీ ప్రారంభమైంది 

ఈ క్రింది యూట్యూబ్  వీడియో యు .ఆర్. యల్ .లు చూసి హైదరాబాద్ గురించి మరింత తెలుసుకొందాం 

శోథన ఫలితాలు

Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండి.   నా యూట్యూబ్ ఛానల్   bdl 1tv  ike,share and subscribe  చేయండి.  

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.











24, ఫిబ్రవరి 2020, సోమవారం

ద్వాదశ జోతిర్లింగాలు ఏమిటి, ఎలా ఆవిర్భవించాయి, ఏఏ పేర్లపై ఏర్పడ్డాయి వీటి గురించి వివరాలు తెలుసుకోండి

wowitstelugu.blogspot.com

ద్వాదశ జోతిర్లింగాలు ఏమిటి, ఎలా ఆవిర్భవించాయి, ఏఏ పేర్లపై ఏర్పడ్డాయి వీటి గురించి వివరాలు తెలుసుకోండి 


ద్వాదశ జ్యోతిరంగాలు అంటే ఏమిటి 

జ్యోతిర్లింగం ఒక శివలింగం అగ్నిని జ్వలిస్తూ ఒక కిరణంగా కన్పిస్తోందని చెప్పుతారు. జ్యోతిర్లింగం ఉదయం రుగ్వేదంగాను, మధ్యాహ్న సమయంలో యజుర్వేదం, సాయంత్రం సామవేదం, రాత్రి అధర్వణ వేదంలా కనిపిస్తుంది. ఇవి మొత్తం 12 లింగాలు వీటినే ద్వాదశ జ్యోతిరంగాలు అంటారు.

  • శివుడు భారతదేశంలో ఎక్కువగా పూజించే దేవుళ్లలో ఒకరు. త్రిమూర్తుల్లో ఒకరైన దేవుడే  శివుడు  సాధారణంగా శివుణ్ణి లింగ రూపంలో పూజిస్తారు. 
  • 12 జ్యోతిర్లింగాలు కు ఒకొక్క  ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శివుని నిజమైన భక్తులు జ్యోతిర్లింగాల వద్ద శివునికి ప్రణామాలు చెల్లించడానికి ప్రయత్నిస్తారు. 
  • అన్ని జ్యోతిర్లింగాలను ఒకే ప్రయాణంలో సందర్శించటం సాధ్యం కాదు. అందువలన, భక్తులు ఒక సమయంలో ఒకటి లేదా రెండు జ్యోతిర్లింగాలను సందర్శించాలి. 
  • ప్రతి ఒక్కరు వారి జీవితకాలంలో మొత్తం పన్నెండు  జ్యోతిర్లింగాల ను  సందర్శించటానికి ప్రయత్నించాలి. 
  • 12 జ్యోతిర్లింగాలను ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలుస్తారు. 
  • శివుడు ఒక్కో ప్రదేశంలో ఒక్కో శివలింగంగా వెలిశారు. 
  • జీవితంలో మొత్తం జ్యోతిర్లింగాలను సందర్శిస్తే ఆ వ్యక్తి మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడు.
  • శివుని పాదాల వద్ద మోక్షాన్ని సాధిస్తారు. జ్యోతిర్లింగం గురించి మరొక ప్రత్యేక నమ్మకం ఉంది. అది ఏమిటంటే జ్యోతిర్లింగం ఒక శివలింగం ఆకారంలో ఉంటుంది. 
  • అది ఒక దివ్య కాంతి లేదా 'జ్యోతి' కలిగి ఉంటుంది. ఈ జ్యోతిని అందరు చూడలేరు. 
  • ఒక వ్యక్తి అధిక ఆధ్యాత్మికత స్థాయికి చేరుకొని నిజమైన భక్తుడిగా మారినప్పుడు మాత్రమే జ్యోతిని చూడగలరు.
జ్యోతిర్లింగ శ్లోకము 

సౌరాష్ట్రే సోమనాథం చ, 

శ్రీశైలే మల్లికార్జునమ్

ఉజ్జయిన్యాం మహాకాళమ్,

ఓంకారమమరేశ్వరమ్

ప్రజ్వాల్యాం వైద్యనాథంచ, 

డాకిన్యాం భీమశంకరమ్ 

సేతుబంధే తు రామేశం, 

నాగేశం దారుకావనే 

వారాణస్యాం తు విశ్వేశం, 

త్ర్యంబకం గౌతమీ తటే 

హిమాలయే తు కేదారం, 

ఘృష్ణేశం చ శివాలయే 

  • ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి.

  • ప్రతి రోజు ద్వాదశ జ్యోతిర్లింగం శ్లోకాన్ని పఠిస్తే ఏడేడు జన్మలలో చేసిన పాపాలు అన్ని పోతాయని దీని తార్పర్యం 

శ్రీ సోమనాధేశ్వర జ్యోతిర్లింగం

లభ్యమైన ఆధారాలను బట్టి ఈ జ్యోతిర్లింగాలయం క్రీపూ. 200 సం.రాల నాటిది. 20వ శాతాబ్దం వరకు ఎన్నో యుద్ధబీభత్సాలకు గురైనా 1957లో పున:ప్రాణ ప్రతిష్ఠను పొందింది.


శ్రీశైలమల్లిఖార్జున జ్యోతిర్లింగం
ఏ శిఖర రూపంలో పర్వతుడు అవతరించాడో ఆ శిఖరం మీదే తపస్సు చేస్తున ఒకానొక భక్తురాలుకు శివసాక్షాత్కరం కలిగిన ఆచోటు తన పేరుతో నిలవాలని కోరడం వల్లన ఆ శిఖరం శ్రీశైలంగా పేరొందింది. మూడో శతాబ్దం నుండి ఈ క్షేత్రం ఉనికి కనిపిస్తుంది.


శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం
ఉజ్జయినిలో ఈ లింగంవుంది. చైనా యాత్రికుడయిన హ్యుయాన్‌ త్సాంగ్‌ తన పర్యటన గ్రంధంలో ఈ క్షేత్రం గూర్చి చక్కగా వర్ణించారు.

శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం

చారిత్రక ఆధారమంటూ ఈక్షేత్రం గూర్చి ఏమీ లేదు. ‘మాంధాత’ చేసిన తపస్సు ఫలి తంగా ఓంకారేశ్వడు అవిర్భవించాడు.

శ్రీ వైద్యనాథేశ్వరలింగం

మహా బలేశ్వరలింగమే వైద్యనాధేశ్వర లింగంగా ప్రసిద్ది చెందింది లంకేశ్వరుడైన రావణునికోరిక మేరకు సాంబ శివుడు ఈ ఆత్మలింగంను ప్రసాదించాడు.

శ్రీ భీమ శంకర జ్యోతిర్లింగం

భీముడు వల్ల వివత్తును తొలిగించి నందువల్ల ఆ జ్యోతిర్లింగం ప్రసిద్ధిచెందింది. దీనికి ఉపలింగం భీమేశ్వరలింగం.

శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం

తనని ఆరాధించిన వారికి సర్వ కష్టాలను నివారించి ప్రతిజ్ఞా పూర్వకంగా చెప్పి శివుడు జ్యోతిర్లింగంలోకి నాగేశ్వరుడుగా కలిసి పోతాడు. ఆ జ్యోతిర్లింగమే నాగేశ్వర జ్యోతిర్లింగము.

శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం

వైశ్రమణుని ఘోర తపస్సు వల్ల శివుడు లింగరూపంలో వెలసి ముక్తిని ప్రసాదిస్తాడు. ఆలింగమే విశ్వేశ్వర లింగం.

శ్రీ త్రియంబకేశ్వర జ్యోతిర్లింగం

శివుడు మూర్తిమంతమై విష్ణువు, బ్రహ్మలకు జ్ఞాన బోధచేయగా త్రిమూర్తులు ఏకమైన లింగంగా శ్రీత్రియంబకేశ్వర జ్యోతిర్లింగం వెలసింది.

శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం

ధర్ముడనే మునికి నరనారాయణలనే పేరిట విష్ణూవు ఇద్దరు పుత్రులుగా జన్మిస్తాడు. ఆ ఇద్దరి కోరిక మేరకు శివుడు బదరీ వనంలో ఈ లింగరూపంలో వెలిసాడు.

శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం

శ్రీరామాధిత దైవతలింగం గనుక ఆ జ్యోతిర్లింగమే శ్రీరామేశ్వర లింగంగా పేరు పొందింది.

శ్రీ ఘృశ్నేశ్వర జ్యోతిర్లింగం

శ్రీ ఘ్నశ్నే అనే భక్తురాలు కోరిక మేరకు శివుడు ఈ జ్యోతిర్లింగంగా వెలిసాడు. సంతాన నష్టం, అకాల మరణం నుండి ఈ లింగం తప్పిస్తుందని చెపుతారు.

ఈ క్రింది  వీడియోలు చూడండి :



Dwadasa jyothirlingastakam - YouTube



Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe 

చేయండి .   అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share
and subscribe చేయండి.   నా యూట్యూబ్ ఛానల్   bdl 1tv
నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  
కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.












23, ఫిబ్రవరి 2020, ఆదివారం

కాశీలోని చాలా మంది కి తెలియని కొన్ని వింతలు..విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం

wowitstelugu.blogspot.com

కాశీలోని చాలా  మంది కి తెలియని కొన్ని వింతలు విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం 


  • కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు కంపుకొట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.

  • కాశీలో పూర్వం  అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు.

  • కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ జాడ దొరకకుండా ఉంటుంది.

  • కాశీలో అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్యపోయ్యారు.

  • కాశీలో అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు.

  • కాశీలో కాస్మోర్స్ వస్తుంటాయి అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి ఎవరికీ తెలీదు.

  • కాశీలో అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.

  • కాశీలో కాశీి విశ్వేశ్వరునికి శవభస్మలేపనంతో పూజ ప్రారంభిస్తారు.

  • కాశీలో ని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది.

  • కాశీలో కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది; పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది.

  • కాశీలో విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.

  • కాశీలో  శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి.

  • కాశీలో ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం ఇక్కడే  వున్నది.

  • కాశీలో ని గంగా నది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి.

  • కాశీలో పూర్వం  దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది.

  • కాశీలో మహమ్మదీయ దండ యాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి ధ్వంసం చేసిన తరవాతి కాశిని మనం చూస్తున్నాము.

  • కాశీలో విశ్వనాథ, బిందు మాధవ తో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు.

  • కాశీలో నేటికీ విశ్వనాథ మందిరంలో నంది, మసీదు వైపు గల కూల్చ బడ్డ మందిరం వైపు చూస్తోంది.

  • కాశీలో శివుడు త్రిశూలం తో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది.

  • కాశీలో ఈరోజు మనం దర్శించే విశ్వనాథ మందిర అసలు మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యా బాయి హోల్కర్ గారు కట్టించారు

  • కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి. ఇందులో దేవతలు, ఋషులు, రాజుల తో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో వున్నాయి. 

కాశీ అందులో కొన్ని ఘాట్ లు వాటి విశిష్టత తెలుసుకుంటే చాల  ఆశ్చర్యం కలుగుతుంది

1) దశాశ్వమేధ ఘాట్:

బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజూ సాయకాలం విశేషమైన గంగా హారతి జరుగుతున్నది.

2) ప్రయాగ్ ఘాట్:

ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి.

3) సోమేశ్వర్ ఘాట్:

చంద్రుని చేత నిర్మితమైనది.

4) మీర్ ఘాట్:

సతీదేవీ కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తి పీఠం.ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.

5) నేపాలీ ఘాట్:

పశుపతి నాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు.

6) మణి కర్ణికా ఘాట్:

ఇది కాశీలో మొట్ట మొదటిది. దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది. ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలిగి పోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట.

7) విష్వేవర్ ఘాట్:

ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. ఇక్కడే అహల్యా బాయి తప్పసు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు.

8) పంచ గంగా ఘాట్:

ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి.

9) గాయ్ ఘాట్:

గోపూజ జరుగుతున్నది.

10) తులసి ఘాట్:

తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం పొందినది.

11) హనుమాన్ ఘాట్:

ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం వున్నదిఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు.

12) అస్సి ఘాట్:

పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్బవించింది.

13) హరిశ్చంద్ర ఘాట్:

సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహన కూలీగా పని చేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు. నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది...

14) మానస సరోవర్ ఘాట్:

ఇక్కడ కైలాసపర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తున్నది.ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తున్నది.

15) నారద ఘాట్:

నారదుడు లింగం స్థాపించాడు.

16) చౌతస్సి ఘాట్:

ఇక్కడే స్కంధపురాణం ప్రకారం ఇక్కడ 64 యోగినిలు తపస్సు చేసినారు.ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం... ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలిగి 64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి.

17) రానా మహల్ ఘాట్:

ఇక్కడే పూర్వం బ్రహ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు.

18) అహిల్యా బాయి ఘాట్

ఈమె కారణంగానే మనం ఈరోజు కాశీవిశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము.

ఈ క్రింది వీడియో లు చూసి కాశీ గొప్పదనం గురించి మరింత తెలుసుకోండి.



Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe 

చేయండి .   అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share
and subscribe చేయండి.   నా యూట్యూబ్ ఛానల్   bdl 1tv
నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  
కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.