కార్తీక పురాణం విశిష్టత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కార్తీక పురాణం విశిష్టత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, నవంబర్ 2020, మంగళవారం

17 కార్తీక పురాణం విశిష్టత పదునేడవ రోజు పారాయణం

wowitstelugu.blogspot.com

17 కార్తీక పురాణం విశిష్టత  పదునేడవ రోజు పారాయణం


పదునేడవరోజు పారాయణము

తృతీయాధ్యాయము

మళ్లా చెబుతున్నాడు సూతుడు: 

పూర్వాధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ, శ్రీకృష్ణునికి నమస్కరించి,  'ప్రాణేశ్వరా కాల స్వరూపుడవైన నీకు సర్వకాలాలూ అవయవాలై అల రారు తూండగా - తిథులలో యేకా దశీ,     నెలలలో కార్తీకమూ మాత్రమే అంతటి యిష్టమయి నందుకు కారణమేమిటో సెలవీయవలసిందని కోరగా - నువ్వు రాజిల్లేడు మోము వాడయిన నవనీత చోరుడిలా చెప్పసాగాడు. 'సత్యా! చక్కటి ప్రశ్ననే వేశావు. ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసు కోవలసిన విషయం. గతంలో పృథుచక్రవర్తి నారదుని  ఇదే ప్రశ్న వేశాడు. అప్పుడు నారదుడు చెప్పిన దానినే ఇప్పుడు నీకు చెబుతాను విను.'

సముద్రనందనుడయిన శంఖుడనే రాక్షసుడు త్రిలోక కంటకుడయి సర్వదేవతాది కారాలనూ హస్తగతం చేసుకుని, వారిని స్వర్గం నుంచి తరిమివేశాడు. పారిపోయిన దేవతలు తమతమ భార్యాబంధువులతో సహా మేరుపర్వత గుహలలో తలదాచుకున్నారు. అయినా శంఖుడికి తృప్తి కలగలేదు. "పదవులు పోయినంతమాత్రాన పటుత్వాలు పోతాయా? పదవి లేనప్పుడే పునః దానిని సాధించుకోవడం కోసం తమబలాన్ని పెంచుకుంటారు. ఆ రీత్యా వేదమంత్రాల వల్ల దేవతలు శక్తివంతులయ్యే అవకాశం వుంది గనుక, వేదాలను గూడ తన కైవసం చేసుకోవాలనుకున్నాడు. విష్ణువు యోగ నిద్రాగతుడయిన ఒకానొక వేళలో బ్రహ్మనుండి వేదాలను ఆకర్షించాడు. కాని యజ్ఞమంత్ర బీజాలతో గూడిన వేదాలు శంఖుని చేతి నుంచి తప్పించుకొని ఉదకాలలో తలదాచుకున్నాయి. అది గుర్తించిన శంఖుడు సాగరంలో ప్రవేశించి వెదికాడు గాని, వాటిని పసిగట్టలేకపోయాడు. అంతలోనే బ్రహ్మ, పూజాద్రవ్యాల్ని సమకూర్చుకొని, మేరు గుహాలయ వాసులయిన దేవతలందరినీ వెంటబెట్టుకుని, వైకుంఠం చేరాడు. సమస్త దేవతానీకమూ కలిసి వివిధ వృత్య వాద్యగీత నామస్మరణాదులతోనూ ధూపదీప సుగంధ ద్రవ్యాదులతోనూ - కోలాహలం చేస్తూ యోగనిద్రాగతుడయిన శ్రీహరిని మేల్కొలిపే ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు నిదురలేచిన ఆ శ్రీహరిని షోడశోపచారాలా పూజించి, శరణుకోరారు దేవతలు. శరణాగతులైన సురతతులను చూసి రమాపతి ఇలా అన్నాడు.

 'మీరు చేసిన సర్వోపచారాలకూ సంతోషించినవాడినై - మీ పట్ల వరదుడి నవుతున్నాను. ఈ కార్తీక శుద్ధ ఏకాదశిరోజు తెల్లవారు ఝామున నేను మేలుకొనే వరకూ మీరు ఏ విధంగానయితే సేవించారో - అదే విధంగా - ధూపదీప సుగంధ ద్రవ్యాదులూ, నృత్య గీత వాద్య నామస్మరణాదులతోనూ, షోడశోపచారాలతోనూ, కార్తీక శుద్ధ ఏకాదశీ ప్రాతర్వేళ నన్ను సేవించే మానవులు నాకు ప్రియులై నా సాన్నిధ్యాన్ని పొందెదరు గాక! వాళ్ళచేత నాకీయబడిన ఆర్ఘ్యపాద్యాదులన్నీ కూడా ఆయా భక్తుల సుఖసౌఖ్యాలకే కారణమగుగాక. ఇప్పుడు మంత్రబీజ సమాయుక్తాలైన వేదాలు ఉదకగతాలైనట్లే, ప్రతీ కార్తీకమాసంలోనూ కూడా వేదాలు జలాశ్రయాలై వర్థిల్లును గాక! నేనిప్పుడే మీనావతారుడనై సముద్రప్రవేశం చేసి శంఖుని సంహరించి వేదాల్ని కాపాడెదను గాక! ఇక నుంచి కార్తీక మాస ప్రాతర్వేళ మానవులచే చేయబడే నదీస్నానం - అవబృథ స్నానతుల్యమగు గాక! మరియు, ఓ మహేంద్రా! కార్తీక వ్రతము నాచరించిన వారందరును, నేను వైకుంఠమును, నీవు స్వర్గమును పాలించుట మనకు సహజమైనట్లుగ, పుణ్యలోకములను పొందదగియున్నారు. ఓ వరుణదేవా! కార్తీక వ్రతనిష్ఠుల కార్యాలకు విఘ్నాలు కలగకుండా రక్షణ చేసి, పుత్రపౌత్ర ధన కనక వస్తు వాహనాది సమస్త సంపదలూ అందించు. ఓ కుబేరా! ఏ కార్తీక వ్రతాచరణం వల్ల మానవులు నా యొక్క సారూప్యాన్ని పొంది జీవన్ముక్తులవుతున్నారో అటు వంటి వాళ్లందరికీ నువ్వు నా ఆజ్ఞానుసారంగా ధనధాన్య సమృద్ధిని కలిగించాలి. ముక్కోటి దేవతలారా! ఎవరీ కార్తీక వ్రతాన్ని జన్మవ్రతంగా భావించి విద్యుక్త విధానంగా ఆదరిస్తారో వాళ్ళు మీ అందరి చేతా కూడా పూజించతగిన వారుగా తెలుసుకోండి. మేళతాళాలతో, మంగళవాద్యాలతో మీరు నన్ను మేలుకొలిపిన యీ యేకదశి నాకు అత్యంత ప్రీతికరమైనది. అందువలన కార్తీక వ్రత, ఏకాదశీ వ్రతాలనే ఈ రెండింటినీ ఆచరించడంకన్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దగ్గరదారి లేదని తెలుసుకోవాలి. తపోదాన యజ్ఞ తీర్థాదులన్నీ స్వర్గఫలాన్నీయ గలవేగాని - నా వైకుంఠపదాన్నీయ లేవు సుమా.'

తృతీయోధ్యాస్సమాప్తః(మూడవఅధ్యాయ

ము సమాప్తము)

చతుర్థాధ్యాయము (మత్స్యావతారము)

భగవానుడైన శ్రీ మహావిష్ణువు దేవతలకలా ఉపదేశించినవాడై తత్ క్షణమే మహా మత్సశాబకమై - వింధ్యపర్వతమందలి కశ్యపుని దోసిలి జలాలలో తోచాడు. కశ్యపుడా చేపపిల్లను తన కమండలములో వుంచాడు. మరుక్షణమే ఆ మీనపుకూన పెరిగిపోవడం వలన దానినొకనూతిలో వుంచాడు. రెప్పపాటు కాలంలోనే ఆశఫరీశిశువు నూతిని మించి ఎదిగిపోవడం వలన, కశ్యపుడు దానిని తెచ్చి ఒక సరస్సులో వుంచాడు. కాని విష్ణుమీనం సరస్సును కూడా అధిగమించడంతో దానిని సముద్రంలో వదలవలసి వచ్చింది. ఆ మహా సముద్రంలో మత్స్యమూర్తి విపరీతంగా పెరిగి - శంఖుని వధించి, వాడిని తన చేతి శంఖంగా ధరించి, బదరీవనానికిచేరి, అక్కడ ఎప్పటివలెనే విష్ణురూపాన్ని వహించి ఋషులను చూసి, 'ఓ మునులారా! వేదాలు ఉదకాలలో ప్రవేశించి రహస్యంగా దాక్కుని వున్నాయి. మీరు వెళ్లి జలాంతర్గతములైన ఆ వేదాలను వెదకి తీసుకుని రండి. నేను దేవగణ సమాయుక్తుడనై ప్రయోగలో వుంటాను' అని చెప్పాడు. విష్ణ్వాజ్ఞను శిరసా ధరించిన ఋషులు సముద్రంలోకి వెళ్లి యజ్ఞబీజాలతో కూడి వున్న వేదాన్వేషణ ఆరంభించారు. ఓ పృథు మహారాజా! ఆ వేదాలలో నుంచి ఆ ఋషులకు ఎవరికెంత లభ్యమయ్యిందో అది వారి శాఖయైనది. తదాదిగా ఆయా శాఖలకు వారు ఋషులుగా ప్రభాసించారు. అనంతరం వేదయుతులై, ప్రయాగయందున్న విష్ణువును చేరి వేదాలను తెచ్చామని చెప్పారు. విష్ణ్వాజ్ఞపై ఆ సమస్తవేదాలనూ స్వీకరించిన బ్రహ్మ - ఆ శుభవేళను పురస్కరించుకుని, దేవతలతోనూ ఋషులతోనూ కూడినవాడై అశ్వమేథయాగాన్ని ఆచరించాడు. యజ్ఞానంతరం గరుడ సమస్త దేవగంధర్వ యక్షపన్నగ గుహ్యకాదులందరూ కూడి శ్రీహరినిలా ప్రార్ధించారు. 'ఓ దేవాధిదేవా! జగన్నాయకా! మా విన్నపాలను విను. అత్యంత సంతోషదాయకమైన ఈ సమయంలో మాకు వరప్రదాతనై మమ్మల్ని కాపాడు. హే లక్ష్మీనాధా! నీ అనుగ్రహం వల్లనే బ్రహ్మ తాను నష్టపోయిన వేదాలను ఈ స్థలంలో పొందగలిగాడు. నీ సమక్షంలో మేమందరమూ యజ్ఞంలోని హవిర్భాగాలనూ పొందాము. కాబట్టి, నీ దయవలన ఈ చోటు భూలోకంలో సర్వశ్రేష్ఠమైనదీ, నిత్యమూ పుణ్యవర్ధకమైనదీ, ఇహపరసాథకమైనదిగానూ యగుగాక! అదే విధంగా - ఈ కాలం మహా పుణ్యవంతమైనదీ - బ్రహ్మ హత్యాది పాతకాలను సైతం తొలగించేది, అక్షయ ఫలకరమైనదీ అయ్యేట్లుగా కూడా వరాన్ని అనుగ్రహించు.'

దేవతల ప్రార్ధనను వింటూనే వరదుడైన శ్రీహరి దివ్యమందహాసాన్ని చేశాడు. దైత్యారి 'దేవతలారా! మీ అభిప్రాయం నాకు సమ్మతమైంది. మీ వాంఛితం ప్రకారమే ఇది పుణ్యక్షేత్రమగుగాక! ఇక నుంచి బ్రహ్మ క్షేత్రమనే పేర ప్రఖ్యాతి వహించుగాక. అనతికాలంలోనే సూర్యవంశీయుడైన భగీరథుడీ క్షేత్రానికి గంగను తీసుకొని వస్తాడు. ఆ గంగా - సూర్యసుతయైన కాళిందీ ఈ పుణ్యస్థలిలోనే సంగమిస్తాయి. బ్రహ్మాదులైన మీరందరూ నాతో కూడుకున్నవారై ఈ తావుననే సుస్థితులయ్యెదరు గాక! ఇది తీర్ధరాజముగా ఖ్యాతి వహించుగాక! ఈ నెలవునందు ఆచరించే జప తపో వ్రతయజ్ఞ హోమనార్చనాదులు అనంత పుణ్యఫలదాలైనా సాన్నిధ్యమును అందిచ్చును గాక. అనేకానేక జన్మకృతాలైన బ్రహ్మహత్యాది ఘోరపాతకాలు సహితం ఈ క్షేత్రదర్శనమాత్రం చేతనే నశించిపోతాయి. ఇక్కడ నా సామీప్యంలో మరణించిన వాళ్ళు నా యందే లీనమై మరుజన్మ లేనివాళ్ళవుతారు. ఎవరైతే ఈ తీర్థంలో స్థిరచిత్తులై పితృకర్మలను ఆచరిస్తారో, వాళ్ల పితృలు నా సారూప్యాన్ని పొందుతారు. ఈ కాలం సర్వదా పుణ్యఫలాన్నిస్తుంది. సూర్యుడు మకరమందుండగా ప్రాతఃస్నానం చేసిన వాళ్లని చూసినంత మాత్రం చేతనే సామాన్య దోషాలన్నీ సమసిపోతాయి. వాళ్ళకి నేను క్రమంగా - సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యాలను ప్రసాదిస్తాను. ఓ ఋషులారా! శ్రద్ధాళువులై వినండి. నేను సర్వకాల సర్వావస్థలలోనూ కూడా ఈ బదరీవన మధ్యంలోనే విడిదిచేసి వుంటాను. ఇతరేతర క్షేత్రాలలో సంవత్సరాలుగా తపస్సు చేయడంవల్ల ఏ ఫలం కలుగుతుందో - ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో ఒక్క రోజు తపస్సుతోనే పొందవచ్చు. ఈ తీర్ధ దర్శనమాత్రం చేతనే సర్వులూ తమ పాపాలను పోగొట్టుకున్నవారై - జీవన్ముక్తులవుతారు.'

శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దేవతలకు వరప్రదానం చేసి - బ్రహ్మతో కలిసి అంతర్హితుడయ్యాడు. ఇంద్రాదులందరూ కూడా తమ తమ అంశల నా క్షేత్రంలో విడిచి __ తాము కూడా అదృశ్యులయ్యారు. ఓ పృథు నృపాలా! ఆ బదరీవన యాత్రా దర్శనాదుల చేత మానవులెంతటి పుణ్యాన్ని పొందగలరో - అంతటి పుణ్యాన్నీ కూడా  ఈ కథాశ్రవణ మాత్రంచేతనే పొందగలరయ్యా!' అని చెప్పి ఆగాడు నారదుడు.

ఏవం శ్రీ పద్మ పురాణంతర్గత కార్తీక మహత్మ్యమందు

మూడవ, నాలుగవ అధ్యాయములు 

17 వ రోజు

నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల మరియు తరిగిన వస్తువులు

దానములు :- ఔషధాలు, ధనం

పూజించాల్సిన దైవము :- అశ్వినీ దేవతలు

జపించాల్సిన మంత్రము :- ఓం అశ్విన్యౌవైద్యౌ తేనమః స్వాహా

ఫలితము :- సర్వవ్యాధీనివారణం ఆరోగ్యం




Note: 

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe,Also see my  Youtube channel bdl Telugu tech-tutorials like share and Subscribe,   కామెంట్   చేయడం  మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుందథాంక్యూ.

23, నవంబర్ 2020, సోమవారం

16 కార్తీక పురాణం విశిష్టత -పదహారవ రోజు పారాయణం

wowitstelugu.blogspot.com

16 కార్తీక పురాణం విశిష్టత -పదహారవ రోజు పారాయణం


ఈ విధంగా సూతుడు ప్రవచించిన స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యాన్ని విని సంతుష్టమానసులయిన శౌనకాది కులపతులు. "హేపురాణకథా కథనచో సురథునీ! 'సూతమునీ! లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణము స్కాందమందేగాక, పద్మ పురాణాంతరవర్తితయై కలదు కదా. దానిని కూడా విశదపరచవే" అని ప్రార్ధించగా సురచిర దరస్మేర వదనుడయిన సూతుడు - "మునులారా! వైకుంఠుని లీలా వినోదాలూ, మహిమలూ వినేవారికీ, వినిపించేవారికీ విశేష పుణ్యాన్నిస్తాయేగాని - విసుగుని కలిగించవు. భక్తి ప్రవత్తులతో మీరు కోరాలేగాని గురు ప్రసాదిత శక్త్యనుసారం వక్కాణిస్తాను - వినండి. స్కాంద పురాణంలో జనక మహారాజుకు విశిష్ఠుల వారెలా ఈ మహాత్మ్యాన్ని బోధించారో, అదే విధంగా పద్మపురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖతః ఈ కార్తీకమాస విశేషాలన్నీ వివరించబడ్డాయి.
పారిజాతాపహరణం

ఒకానొకప్పుడు నారదమహర్షి స్వర్గంనుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి, కృష్ణునికిచ్చి 'ఓ హరీ! నీకున్న పదహారువేల యేనమండుగురు భార్యలలోనూ, నీకత్యంత ప్రియమైన యామెకి ఈ పువ్వునీయవయ్యా' అని కోరాడు. ఆ సమయానికి రుక్మిణి అక్కడే వుంది. నందనందనుడా నందనవన కుసుమాన్ని రుక్మిణికి కానుక చేశాడు. ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది. 'ప్రియమైన భార్యకీయమంటే, తనకీయాలిగాని, ఆ రుక్మిణికీయడమేమి'టని కోపించింది. కృష్ణుడామె కెంత నచ్చచెప్పినా వినిపించుకోలేదు. పారిజాత వృక్షాన్ని తెచ్చి, తన పెరటిలో పాదుకొలిపేదాకా ఊరుకునేది లేదని బెదిరించి. అత్యంత ప్రియురాలయిన ఆమె అలుక తీర్చడమే ప్రధానంగా తలంచిన అనంతపద్మనాభుడు - తక్షణమే సత్యభామా సమేతంగా గరుత్ముంతుని నధిరోహించి - ఇంద్రుని అమరావతీ నగరానికి వెళ్ళాడు. స్వర్గసంపదను, భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడంగీకరీంచలేదు. తత్ఫలితంగా యుద్ధం జరిగింది .

ఇంద్రోపేంద్రల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది. అక్కడి గోలోకంలోని గోవులకూ, గరుత్మంతునికీ భీషణమైన సంగ్రామం జరిగింది. ఆ సమఠోత్సాహంలో వైనతేయుడు తన తుండంముక్కతో గోవులను కొట్టడం వలన __గోవుల యొక్క చెవులు, తోకలు తెగి, రక్తధారాలతో సహా భూమిన పడ్డాయి. వాటిలో తోకలవలన గొబ్భిచెట్లు, చెవుల వలన చీకటిచెట్లు, తాకటం నుంచి మేహధీవృక్షాలూ ఆవిర్భవించాయి.మోక్షాన్ని కోరుకునేవాళ్ళు ఈ మూడుచెట్లకూ దూరంగా వుండాలి. ముట్టుకోకూడదు. అదేవిధంగా, గోవులు తమ కొమ్ములతో కొట్టడంచేత ఆ పక్షిరాజు యొక్క రెక్కల వెండ్రుక లోకమూడు రకాల పక్షలు జన్మించాయి. ఇవి మూడు కూడా శుభ్రప్రదమైనవే. గరుడ దర్శనం వలన మానవులు ఏయే శుభాలనయితే పొందుతున్నారో, అటువంటి సర్వశ్రేయస్సులనూ __ ఉపరి పక్షిత్రయాన్ని చూసిన మాత్రాననే పొంద గలుగుతారు.

పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు కోరగా, స్వర్గసంపదను, భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు. తత్ఫలితంగా ఇంద్రోపేంద్రుల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది. ఎట్టకేలకు ఆ తగవులో దేవేంద్రుడు తగ్గి, సవినయ పురస్సరంగా పారిజాతద్రుమాన్ని యాదవేంద్రునికి అర్పించుకున్నాడు. దానవాంతకుడు దానిని తెచ్చి ముద్దుల భార్యామణియైన సత్రాజితి నివాసంలో ప్రతిష్టించాడు. అందువలన అమితానందాన్ని పొందిన ఆ అన్నులమిన్న తన పెనిమిటియైన పీతాంబరునితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ 'ప్రాణప్రియా! నేనెంతయినా ధన్యురాలిని. నీ పదహారు వేల యనమండుగురు స్త్రీలలోనూ నేనే నీకు మీదుమిక్కిలి ప్రియతమను కావడం వలన, నా అందచందాలు ధన్యత్వం పొందాయి. అసలీ జన్మలో నీ అంతటివాడికి భార్యను కావడానికి, నీతో బాటు గరుడా రూఢనై బొందెతో స్వర్గసందర్శనం చేయడానికి, కథలుగా చెప్పుకోవడమే తప్ప - ఎవ్వరూ ఎప్పుడూ కళ్ళారా చూసి ఎరుగని కల్ప - (పారిజాత) వృక్షం నా పెరటి మొక్కగా వుండటానికి యేమిటి కారణం? నేను నిన్ను తులాభార రూపంగా నారదుడికి ధారపోసినా, అలిగిన ఆవేశంలో నిన్ను వామ పాదాన తాడించినా, నువ్వు మాత్రం నా మీద నువ్వు గింజంత కూడా కోపం చూపకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే - ఈ నీ ఆదరాభిమానానురాగాలు పొందడానికి నేను గత జన్మలలో చేసిన పుణ్యం యేమిటి? అదీగాక జన్మజన్మకీ నీ జంటను ఎడబాయకుండా వుండాలంటే నేనిప్పుడింకా ఏమేం చెయ్యాలి? అని అడిగింది. అందుకు ముకుందుడు మందహాసం చేస్తూ - ఓ నారీ లలామా, సత్యభామా! నీవు నన్ను కోరరానిది కోరినా, చెప్పరానిది అడిగినా, ఈయరానిదానిని ఆశించినా కూడా - నీ సమస్త వాంఛలనూ నెరవేర్చి సంతృప్తురాలను చేయడమే నా విధి. అందుకు కారణం నీ పూర్వజన్మమే' అంటూ ఇలా చెప్పసాగాడు.

సత్యభామ పూర్వజన్మము

కృతయుగాంతకాలంలో, 'మాయా' అనే నగరంలో దేవశర్మ - అనే వేద పండితుడు వుండేవాడు. అతనికి లేక - లేక కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి. అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ పిల్లని, తన శిష్య పరంపరలోనివాడే అయిన 'చంద్రు'డనే వానికిచ్చి పెండ్లి జరిపించాడు - దేవశర్మ. ఒకనాడీ మామా, జామాతలిద్దరూ కలిసి సమిధలనూ, దుర్భలనూ తెచ్చుకునే నిమిత్తంగా అడవికి వెళ్ళి, అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు. బ్రాహ్మణులూ, ధర్మాత్ములూ నిత్య సూర్యోపాస్తిపరులూ అయిన వారి జీవిత విన్నాణానికి మెచ్చిన విష్ణుమూర్తి - శైవులుగాని, గాణాపత్యులుగాని, సౌర (సూర్య) వ్రతులు గాని, శాక్తేయులుగాని వీరందరూ కూడా వానచినుకులు వాగులై, వంకలై నదులై తుదకు సముద్రాన్నే చెందినట్టుగా - నన్నే పొందుతున్నారు. పుత్రభాత్రాది నామాలతో - దేవదత్తుని లాగా నేనే వివిధ నామారూపక్రియాదులతో అయిదుగా విభజింపబడి వున్నాను. అందువలన, మరణించిన మామా-అల్లుళ్ళను మన వైకుంఠానికే తీసుకుని రమ్మని తన పార్షదులకు ఆజ్ఞాపించాడు. పార్షదులు ప్రభువాజ్ఞను పాటించారు. సూర్యతేజస్సును కాంతులతో ఆ ఇరువురి జీవాలూ వైకుంఠంచేరి, విష్ణు సారూప్యాన్ని పొంది - విష్ణు సాన్నిధ్యంలోనే మసలసాగాయి.

ప్రథమోధ్యాయస్సమాప్తః 
(మొదటి అధ్యాయము సమాప్తము)
ద్వితీయాధ్యాయము
గుణవతి కథ   
  • పితృభర్తృ మరణవార్తను విన్న గుణవతి యెంతగానో క్రుంగిపోయినది. కాని, పోయిన వారితో తనుకూడా పోలేదు గనుకా, మరణం మాసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు గనుకా - వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో వున్న వస్తు సంచయాన్నంతటినీ విక్రయించి తండ్రికీ - భర్తకూ ఉత్తమగతులకై ఆచరించవలసిన కర్మలను ఆచరించింది. శేషజీవితాన్ని శేషశాయి స్మరణలోనే గడుపుతూ, దేహ పోషణార్ధం కూలిపని చేసుకుంటూ, ఆధ్యాత్మిక చింతనతో, హరిభక్తినీ - సత్యాన్నీ శాంతాన్నీ, జితేంద్రియత్వాన్నీ పాటిస్తూ వుండేది. పరమ సదాచారుపరులైన వారింట పుట్టి పెరిగింది కావడంవలన బాల్యంనుంచీ అలవడిన కార్తీక వ్రతాన్నీ - ఏకాదశీవ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడువకుండా ఆచరించేది.

  • కృష్ణుడు చెబుతున్నాడు: సత్యా! పుణ్యగణ్యాలూ, భుక్తి ముక్తిదాయకాలూ, పుత్రపౌత్ర సంపత్ సౌభాగ్య సంధాయకాలూ అయిన ఆ రెండు వ్రతాలూ నాకు అత్యంత ప్రీతీపాత్రమైన వన్న సంగతి నీకు తెలుసుకదా! కార్తీకమాసంలో సూర్యుడు తులారాశిలో వుండగా నిత్యమూ ప్రాతఃస్నానం ఆచరించే వారి సమస్త పాపాలనూ నేనూ నశింపచేస్తాను. ఈ కార్తీకంలో స్నానాలూ దీపారాధనలూ జాగరణ తుపసిపూజ చేసే వాళ్లు అంత్యంలో వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణు స్వరూపులై భావిస్తారు. విష్ణ్వాలయంలో మార్జనం చేసి, సర్వతోభద్రం - శంఖం - పద్మం మొదలయిన ముగ్గులను పెట్టి, పూజా పునస్కారాలను చేసే వారు జీవన్ముక్తులౌతారు. ఉపర్యుక్త ప్రకారంగా కార్తీక మాసంలో నెలరోజులలోనూ, కనీసం మూడురోజులయినా ఆచరించినవారు - దేవతలను కూడా నమస్కరించదగిన వాళ్లవుతున్నారు. ఇక పుట్టింది లగాయితు జీవితాంతమూ చేసే వారి పుణ్యవైభవాన్ని చెప్పడం ఎవరి వల్లా కాదు.

  • అదే విధంగా - ఆనాటి గుణవతి, విష్ణుప్రియంకరాలయి ఏకాదశీ కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా కడునిష్ఠతో ఆచరిస్తూ కాలం వెళ్ళదీసి - కొన్నాళ్ళ తరువాత యోభారం వల్ల శుష్కించి, జ్వరపడింది. అయినప్పటికీకూడా - కార్తీకస్నానం మానకూడదనే పట్టుదలతో నదికివెళ్ళి - ఆ చలిలోకూడా నడుములోతు నీళ్లకు చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూవుంది. అంతలోనే ఆకాశం నుంచి శంఖ చక్ర గదా పద్మాద్యాయుధాలు ధరించి విష్ణ్వాభులైన విష్ణుదూతలు గరుడతాకాయుతమైన విమానంలో వచ్చి గుణవతి నందులోచేర్చి దివ్యస్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో బాటుగా వైకుంఠానికి చేర్చారు. కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఆమె హరిసాన్నిధ్యాన్ని పొందింది.

  • అనంతరం శ్రీ మహావిష్ణువునైన నేను దేవతల ప్రార్ధన మీద దేవకి గర్భాన ఇలా కృష్ణుడిలా అవతరించాను. నాతో బాటే అనేకమంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు. పూర్వజన్మలలోని 'చంద్రుడు' ఈ జన్మలో అక్రూరుడయ్యాడు. అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు. బాల్యం నుంచే కార్తీకవ్రతం మీదా నా మీదా మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే - నువ్వుగా - అంటే సత్రాజిత్ కుమార్తవైన సత్యభామగా ఇలా జన్మించావు. ఈ జన్మ వైభోగానికంతకూ కారణం పూర్వజన్మలోని కార్తీక వ్రతాచరణా పుణ్యలేశమే తప్ప ఇతరంకాదు. ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలసింది. ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా, ఈనాడు నీ ఇంటా - వంటా కూడా లక్ష్మీకళ స్థిరపడింది. అలనాడు నీ సమస్త వ్రతాచరణా పుణ్యాలనూ కూడా 'నారాయణాయేతి సమర్పయామి' అంటూ జగత్పతినైన నాకేధారబోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్యవయ్యావు. పూర్వజన్మలో జీవితాంతంవరకూ కార్తీక వ్రతాన్ని విడువలని భక్తికి ప్రతిగా సృష్టి వున్నంత వరకూ నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు. సాత్రాజితీ! నువ్వే కాదు. నీ మాదిరిగా ఎవరయితే కార్తీక వ్రతానుష్ఠాననిష్ఠులూ నా భక్తగరిష్ఠులూ అయి వుంటారో వారందరూ కూడా నాకు ఇష్టులైసర్వకాల సర్వావస్థలలోనూ కూడా తత్కారణాలరీత్యా, నావారుగా, నా సాన్నిధ్యంలోనే వుంటూనే వుంటారు. రాగవతీ! ఒక్క రహస్యం చెబుతాను విను - తపోదాన యజ్ఞాదికాల నెన్నిటిని నిర్వర్తించినవారైనా సరే కార్తీక వ్రతాచరణాపరులకు లభించే పుణ్యంలో పదహారోవంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తుంచుకో.

ఉపరివిధంగా - శ్రీకృష్ణప్రోక్తమైన తన పూర్వజన్మ గాధనూ కార్తీక వ్రత పుణ్యఫలాలనూ విని పులకితాంగియైన ఆ పూబోడి తన ప్రియపతియైన విశ్వంభరుడికి వినయ విధేయతలతో ప్రణమిల్లింది.
ఏవం శ్రీపద్మ పురాణంతరగత కార్తీకమాహాత్మ్వమందు
ఒకటి రెండు అధ్యాయములు 
ఈ క్రింది వీడియో యు.ఆర్.యల్.లలో పదహారవ  రోజు పారాయణం వీడియో లు చూడండి

16 వ రోజు నిషిద్ధఆహారపదార్దాలు  :- ఉల్లి, ఉసిరి, చద్ది ,ఎంగిలి, చల్ల

చేయవలసిన దానములు :- నెయ్యి, సమిధలు, దక్షిణ, బంగారం

పూజించాల్సిన దైవము :- స్వాహా అగ్ని

జపించాల్సిన మంత్రము :- ఓం స్వాహాపతయే జాతవేదసే నమః

వచ్చే ఫలితము :- వర్చస్సు, తేజస్సు ,పవిత్రత


Note: 

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe,Also see my  Youtube channel bdl Telugu tech-tutorials like share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుందథాంక్యూ.

15 కార్తీక పురాణం విశిష్టత - పదిహేనవ రోజు పారాయణం

wowitstelugu.blogspot.com

15 కార్తీక పురాణం విశిష్టత - పదిహేనవ రోజు పారాయణం



 (దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మస్మృతితో నరరూపమందుట)

అంతట జనకమహారాజుతో వశిష్థమహాముని - జనకా! కార్తీకమాహాత్మ్యము గురించి యెంత వివరించిననూ పూర్తికానేరదు. కాని, మరియొక యితిహసము తెలియచెప్పెదను సావధానుడవై ఆలకింపు - మని ఇట్లు చెప్పెను.

  • ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవులవద్ద దీపారాధనను చేయుట, పురాణమును చదువుట, లేక వినుట, సాయంత్రము దేవతాదర్శనము - చేయలేనివారు కాలసూత్రమనెడి నరకమున బడి, కొట్టుమిట్టాడుదురు. 

  • కార్తీకశుద్ద ద్వాదశీ దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంథ పుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు యిచ్చినయెడల, విశేష ఫలము పొందగలరు. ఈవిధముగా నెలరోజులు విడువక చేసిన యెడల అట్టివారు దేవదుందుభులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. 

  • నెలరోజులు చేయలేనివారు కార్తీక శుద్ధ త్రయోదశి, చత్రుర్ధశి, పూర్ణిమ రోజులందైనా నిష్టతో పుజలు చేసి ఆవునేతితో దీపము నుంచవలెను.

  • ఈ మహాకార్తీకములో ఆవుపాలు పితికినంత సేపు మాత్రము దీపముంచిన యెడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును. 

  • ఇతరులు వుంచిన దీపము యెగద్రోసి వృద్ధి చేసిన యెడల, లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథకలదు. విను - మని వశిష్ఠులవారు యిట్లు చెప్పుచున్నారు.
👉
సరస్వతి నదీతీరమున శిధిలమైన దేవాలయమొకటి కలదు. కర్మ నిష్ఠుడనే దయార్ద్ర హృదయుడగు ఒక యోగిపుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీకమాసమంతయు అచటనే గడిపి పురాణపఠనము జేయు తలంపురాగా ఆ పాడుబడియున్న దేవాలయమును శుభ్రముగా వూడ్చి, నీళ్లతో కడిగి, బొట్లు పెట్టి, ప్రక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి, దూదితో వత్తులు జేసి, పండ్రెండు దీపములుంచి, స్వామిని పూజించుచు, నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీకమాసము ప్రారంభము నుండి చేయుచుండెను. ఒకరోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి, నలుమూలలు వెదకి, తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయియున్న వత్తిని తినవలసినదేనని అనుకొని నోట కరచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను. నోటకరచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తికూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీకమాస మగుటవలనను, శివాలయములో ఆరిపోయిన వత్తి యీ యెలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దానిరూపము మారి మానవరూపములో నిలబడెను

👉 

ధ్యాననిష్ఠలో వున్న యోగిపుంగవుడు తన కన్నులను తెరిచిచూడగా, ప్రక్కనొక మానవుడు నిలబడి యుండుటను గమనించి " ఓయీ! నీ వెవ్వడవు? ఎందుకిట్లు నిలబడి యుంటివి? అని ప్రశ్నించగా "ఆర్యా! నేను మూషికమును, రాత్రి నేను ఆహారమును వెదుకుకొంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి యిక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యివాసనలతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలెనని దానిని నోటకరిచి ప్రక్కనున్న దీపంచెంత నిలబడి వుండగ, నా అదృష్టముకొలదీ ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తితిని. కాని, ఓ మహానుభావా! నేను యెందుకీ మూషికజన్మ యెత్తవలసి వచ్చెనో- దానికిగల కారణమేమిటో విశదీకరింపు"మని కోరెను. అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టిచే సర్వము తెలుసుకొని "ఓయీ! క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు. నిన్ను బాహ్లికుడని పిలిచెడివారు. నీవు జైన మత వంశానికి చెందినవాడవు. నీకుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ, ధనాశా పరుడవై దేవ పూజలు, నిత్మకర్మలు మరచి,నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు, మంచివారలను, యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్ధచింత గలవాడై ఆడపిల్లను అమ్మువృత్తి చేస్తూ, దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు, సమస్త తినుబండారములను కడుచౌకగా కొని, తిరిగి వాటిని యెక్కువ ధరకు అమ్మి, అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక యితరులకు యివ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవుంచుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించి నందున పుణ్యాతుడవైతివి. దానివలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన, నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి, ఆ ధనముతో దానధర్మాలుచేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందు" మని అతనికి నీతులు చెప్పి పంపించెను.

స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి 

పంచదశాధ్యాయము

పదిహేనో రోజు పారాయణము సమాప్తము

ఈ క్రింది లింక్ లు క్లిక్ చేసి 15 వ రోజు పారాయణం వీడియో లు చూడండి

👉Note:

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe,Also see my  Youtube channel bdl Telugu tech-tutorials like share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుంది,  థాంక్యూ.