22, డిసెంబర్ 2018, శనివారం

Do you know how many God Vigneswara?

గణపతులు ఎంతమందో మీకు తెలుసా?

ముద్గల పురాణాన్ని అనుసరించి 32 మంది గణపతులు ఉన్నారు ప్రధానంగా గణపతుల సంఖ్య 21 (కనుకనే ఏకవింశతి పత్రపూజ చేస్తారు). 

అవాంతర భేద గణపతులు 11 - మొత్తం - 32. నెల్లూరు లోని జ్యోతి వినాయక ఆలయం లో 32 గణపతి విగ్రహాలు కలవు.

1.  శ్రీ మహా గణపతి

       శ్రీ మహా గణపతి 

  • ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతులతో మొక్కజొన్న కండె, బాణం తొడిగిన విల్లు, పద్మం, కలువ, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో గద, చక్రం, పాశం, వరికంకి, రత్నాలు పొదిగిన కలశం ధరించి కనిపిస్తారు. 
  • ఈ గణపతిని సేవిస్తే సమస్త శుభాలూ కలుగుతుంది.
  • హస్తీంద్రావన చంద్రచూడ మరుణచ్చాయం త్రినేత్రం రసాదాశ్యిష్టంశిరయమాస పద్మకరయా స్వాంకస్థయా సంతతమ్బీజాపూరగదా ధనుర్విద్య శిఖయుక్ చక్త్రాబ్ద పాశోత్పల వ్రీహ్యగ్ర స్వవిశాణ రత్న కలశాన్ హస్త్రై ర్వహంతం భజే    అనే మంత్రంతో ప్రార్థించాలి.

2. శ్రీ వర గణపతి - 


                                                                         శ్రీ వర గణపతి
  • పాశం ,అంకుశం, తేనెకుండ, రత్నాల కుండా ఉంటుంది. వరాలు తీర్చే గణపతి 

3. శ్రీ శక్తి గణపతి -  

           శ్రీ శక్తి గణపతి
  • నాలుగు చేతులున్న ఈ గణపతి అంకుశం, పాశం,  విరిగిన దంతం పట్టుకుని దర్శనమిస్తారు.   ఈయన కరుణిస్తే ఏదయినా సాధించగలమనే ఆత్మస్థైర్యం పెరుగుతుంది.
  • ఆలింగ్య దేవీం హరితాంగయష్టింపరస్పరా శ్లిష్ట కటిప్రదేశమ్సంధ్యారుణం  పాశ స్ఫటీర్దధానంభయాపహం  శక్తి గణేశ మీదేఅనే మంత్రంతో   ఈ గణేశుని ప్రార్థించాలి. 

4. శ్రీ భక్తి  గణపతి 

         శ్రీ భక్తి  గణపతి

  • ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులలో కొబ్బరికాయ, అరటిపండు ఎడమ వైపు ఉన్న చేతులలో మామిడి పండు, బెల్లపు పరమాన్నం ఉన్న పాత్ర పట్టుకుని కనిపిస్తారు. 
  • ఈయనను... నాలికేరామ్ర కదలీ గుడపాయాస    ధారిణమ్శరచ్చంద్రాభ్వవుషం   భజే భక్త గణాధిపమ్అనే మంత్రంతో స్తుతించాలి...

  • ఈయనను సేవిస్తే భక్తిభావం పెరుగుతుంది.

5. శ్రీ బాల గణపతి

        శ్రీ బాల గణపతి
  • ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడి వైపు చేతులలో అరటిపండు, పనసతొన, ఎడమవైపు వైపు ఉన్న చేతులతో మామిడిపండు, చెరకుగడని పట్టుకుని దర్శనమిస్తారు.

  • బుద్ధి చురుకుగా పనిచేయాలంటే ఈ బాల గణపతిని పూజించాలి.  కరస్థ కదలీ చూత పన పేక్షుక మోదకమ్ బాలసూర్య నిభం వందే దేవం బాలగణాధిపమ్
  • అనే మంత్రంతో ప్రతిరోజూ సూర్యోదయ సమయాన చదవాలి.

6. శ్రీ తరుణ గణపతి -  

           శ్రీ తరుణ గణపతి
  • వినాయకుడి రూపానికి ఎనిమిది చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, వెలగగుజ్జు, దంతం, చెరకు ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, నేరేడు పండు, వరివెన్ను పట్టుకుని అభయముద్రతో దర్శనమిస్తారు. 

  • ఈయనను... పాశాంకశాపూస కపిత్థ జంబూ   స్వదంత శాలీనమపి స్వహస్త్రైః   ధత్తే సదా య సతరుణాభః  పాయాత్స యుష్మాం ష్తరుణో గణేశః    అనే మంత్రంతో పూజించాలి.

7. శ్రీ ఉచ్చిష్ట గణపతి -  

     శ్రీ ఉచ్చిష్ట గణపతి 
  • నాలుగు చేతులు  వీణ, నీలం కలువ, జపమాల కలిగి, వరి  మొక్క కలిగి ఉంటాడు, ఈ దేవుని పూజిస్తే భవిషత్తు గురించి తెలుస్తుంది.

  • ఈయనను.... నీలబ్జ దాడిమీ వీణా శాలినీ గుంజాక్ష సూత్రకమ్   దధదుచ్ఛిష్ట నామాయం గణేశః పాతు మేచకః   అనే మంత్రంతో ప్రార్థించాలి.

8. శ్రీ ఉన్మత్త గణపతి

         శ్రీ ఉన్మత్త గణపతి 

9. శ్రీ విద్యా గణపతి -

            శ్రీ విద్యా గణపతి

10. శ్రీ దుర్గా గణపతి

   శ్రీ దుర్గా గణపతి 
  • పాశం, జపమాల, విరిగిన దంతం, రోజా పుష్పం కలిగి ఉంటారు.

11. శ్రీ విజయ గణపతి

           శ్రీ విజయ గణపతి

  • సమస్త విజయాలను చేకూర్చే ఈ గణపతి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, పండిన మామిడి పండు ధరించి కనిపిస్తారు.ఈ గణపతిని....
  • పాశాంకుశ స్వదంత్రామ ఫలావా నాఖు వాహనఃవిఘ్నం నిఘ్నంతు నమః స్సర్వం రక్తవర్ణో వినాయకః అనే మంత్రంతో పూజించాలి.

12. శ్రీ వృత్త గణపతి -

13. శ్రీ విఘ్న గణపతి

  • గణపతి అసలు లక్షణమైన విఘ్ననాశనం ఈ రూపంలో కనిపిస్తుంది. ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి. కుడివైపు చేతులతో శంఖం, విల్లు, గొడ్డలి, చక్రం, పూలగుత్తి, ఎడమ వైపు ఉన్న చేతులతో చెరకు, పూలబాణం, పాశం, విరిగిన దంతం, బాణాలు పట్టుకుని కనిపిస్తారు. 
  • ఈయనను...శంఖేక్షు చాప కుసుమేషు కుఠార   పాశచక్ర స్వదంత సృణి మంజరికా  శరౌఘైపాణిశ్రి అఅఅ పరిసమీహిత భూషణా శ్రీవిఘ్నేశ్వరో   విజయతే తపనీయ గౌరః   అనే మంత్రంతో ప్రార్థించాలి.

14. శ్రీ లక్ష్మీ గణపతి- 

           శ్రీ లక్ష్మీ గణపతి

  • ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతితో వరదముద్రనిస్తూ, కత్తి, చిలుక, మాణిక్యం పొదిగిన కుంభం, పాశం, ఖడ్గం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అభయ హస్త ముద్రతో దానిమ్మ, అంకుశం, కల్పలత, అమృతం ధరించి కనిపిస్తారు. 
  • ఈ వినాయకుడిని సేవిస్తే ఐశ్వర్యం కలుగుతుంది.
  • బిభ్రాణ శ్శుకబీజపూరక మిలన్మాణిక్య కుంభాంకుశన్పాశం కల్పలతాం చ ఖడ్గ విలసజ్జ్యోతి స్సుధా నిర్ఘరఃశ్యామేనాత్తసరోరు హేణ సహితం దేవీద్వయం చాంతికేగౌరాంగో వరదాన హస్త సహితో లక్ష్మీ గణేశోశావ తాత్ అనే స్తోత్రంతో పూజించవలసి ఉంటుంది  

15. శ్రీ నృత్య గణపతి

         శ్రీ నృత్య గణపతి

  • సంతృప్తిని, మనశ్శాంతినీ ఇచ్చే ఈ గణపతి కుడి చేతులలో పాశం, అప్పాలు, ఎడమ వైపు చేతులతో అంకుశం, పదునుగా ఉన్న విరిగిన దంతం ధరించి దర్శనమిస్తారు.
  • పాశాంకుశాపూస కుఠారదంతః చంచత్కరః   క్లుప్త పరాంగులీకుమ్ పీతప్రభం కల్పతరో రథః   స్థం భజామి తం నృత్త పదం గణేశమ్అనే మంత్రంతో   ఈ వినాయకుడిని స్తుతించాలి.

16. శ్రీ శక్తి గణపతి -

        శ్రీ శక్తి గణపతి

17. శ్రీ మహా గణపతి

    శ్రీ మహా గణపతి

  • దంతం,దానిమ్మపండు, రత్నాలకుండ, నీలి కలవ కలిగి వుంటారు 

18. శ్రీ బీజ గణపతి -

19. శ్రీ దుంఢి గణపతి

  • విలువైన రత్నాల మాల, జపమాల.

20. శ్రీ పింగళ గణపతి - 

  • కోరికలు తీర్చే గణపతి దేవుడు 

21. శ్రీ హరిద్రా గణపతి -  

       శ్రీ హరిద్రా గణపతి

  • మోదకం అనే తీపి పదార్థం

22. శ్రీ ప్రసన్న గణపతి -

       శ్రీ ప్రసన్న గణపతి

23. శ్రీ వాతాపి గణపతి -

 శ్రీ వాతాపి గణపతి

24. శ్రీ హేరంబ గణపతి

        శ్రీ హేరంబ గణపతి

  • ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతితో అభయముద్రనిస్తూ, కత్తి, అక్షమాల, గొడ్డలి, మోదకం ధరించి, ఎడమవైపు ఉన్న చేతులతో వరద హస్త ముద్రతో విరిగిన దంతం, అంకుశం, ముద్గరం, పాశం ధరించి కనిపిస్తారు.

  • అభయ వరదహస్త పాశదంతాక్షమాలసృణి పరశు రధానో ముద్గరం మోదకాపీఫలమధిగత సింహ పంచమాతంగా వక్త్రంగణపతి రతిగౌరః పాతు హేరంబ నామా    అనే మంత్రంతో స్తుతించవలసి ఉంటుంది. 
  • ఈయనను సేవిస్తే ప్రయాణాలలో ఆపదలను నివారిస్తారు.

25. శ్రీ త్ర్యక్షర గణపతి 

                                              శ్రీ త్ర్యక్షర గణపతి 

  • కల్పవృక్షం కొమ్మ, కలువ, దానిమ్మ పండు కలిగి వుంటారు.  

26. శ్రీ త్రిముఖ గణపతి - 


  శ్రీ త్రిముఖ గణపతి 

  • తేనెపాత్ర, పాశం, అంకుశం.

27. శ్రీ ఏకాక్షర గణపతి -

     శ్రీ ఏకాక్షర గణపతి 

28. శ్రీ వక్రతుండ గణపతి -

  శ్రీ వక్రతుండ గణపతి 

29. శ్రీ వరసిద్ధి గణపతి  

  శ్రీ వరసిద్ధి గణపతి 

  • పాశం, అంకుశం, తేనెకుండ, రత్నాల కుండ

30. శ్రీ చింతామణి గణపతి-

శ్రీ  చింతామణి గణపతి 

31. శ్రీ సంకష్టహర గణపతి

 శ్రీ సంకష్టహర గణపతి 
  • అన్నపాత్ర, పాశం, అంకుశం, కలిగి వుంటారు 

32 .శ్రీ త్రైలోక్య మోహన గణపతి -

శ్రీ విఘ్నేశ్వర షోడశ నామావళిః

  1. ఓం సుముఖాయ నమః
  2. ఓం ఏకదంతాయ నమః
  3. ఓం కపిలాయ నమః
  4. ఓం గజకర్ణకాయ నమః
  5. ఓం లంబోదరాయ నమః
  6. ఓం వికటాయ నమః
  7. ఓం విఘ్నరాజాయ నమః
  8. ఓం గణాధిపాయ నమః
  9. ఓం ధూమ్రకేతవే నమః
  10. ఓం గణాధ్యక్షాయ నమః
  11. ఓం ఫాలచంద్రాయ నమః
  12. ఓం గజాననాయ నమః
  13. ఓం వక్రతుండాయ నమః
  14. ఓం శూర్పకర్ణాయ నమః
  15. ఓం హేరంబాయ నమః
  16. ఓం స్కందపూర్వజాయ నమః

16 మంది  గణపతులను షోడశ గణపతులంటారు. షోడశ గణపతి స్తోత్రం...

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః |

లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః || 1 ||

ధూమ్ర కేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః |

వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః || 2 ||

షోడశైతాని నామాని యః పఠేత్ శృణు యాదపి |

విద్యారంభే వివాహే ప్రవేశే నిర్గమే తథా |

సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య జాయతే || 3 ||


Ganapathi Stotram with Lyrics...



వినాయకుడి ఇంకా చాలా  తెలుసుకోండి...

నోట్  
ఈ బ్లాగ్ wowitstelugu.blogsopt.com
నచ్చినట్లైతే like,share and subscribe చేయడం మర్చిపోకండి
మరియు ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com 
కూడా  like,share and subscribe  చేయడం మర్చిపోకండి . 
wowitsviral.blogspot.com కూడా చూడండి .... థాంక్యూ. 

21, డిసెంబర్ 2018, శుక్రవారం

Who is the Ardhanareshwar? Do you know how someone came to be?

అర్ధనారీశ్వరుడంటే ఎవరు?ఆ పేరు ఎవరికీ ఎలా వచ్చిందో తెలుసా ?
అర్ధనారీశ్వరము
పార్వతీ పరమేశ్వరులు ఒకటిగా ఉండడాన్ని అర్ధనారీశ్వరము అని హిందూ పురాణాలలో చెప్పబడి ఉంది. తలనుండి కాలి బొటన వేలి వరకూ సమానముగా అంటే నిలువుగా చెరి సగముగా ఉన్న మగ, ఆడరూపాలు ఒకటిగా ఉండడము. అర్ధ (సగమైన) నారి (స్త్రీ), ఈశ్వర (సగమైన పురుషుడు) రూపము (కలిగిఉన్న రూపము) అవుతుంది

  • తల ఆలోచనకి, పాదము ఆచరణికి సంకేతాలైతే, పార్వతీపరమేశ్వరులు తలనుండి కాలివరకు సమముగా నిలువుగా ఉంటారంటే ఇద్దరి ఆలోచనలూ, ఆచరణలూ ఒక్కటే అన్నమాట
  • లోకములో భార్యా భర్తలు అన్యోన్యముగా ఉంటూ తప్పు అయినా ఒప్పు అయినా ఆచరణలోనూ, ఆలోచనలోనూ కర్మలలోను, కార్యాలలోను, నిర్ణయాలలోనూ, నిర్మాణాలలోనూ ఒకటిగా చెరిసగముగా ఉండాలని హిందూపురాణాలు అర్ధనారీశ్వరాన్ని చూపడము జరిగింది
  • పరమేశ్వరుని, అంబికను ఏకభావముతో, భక్తితో సేవించాలి. అప్పుడే అధిక శుభము కలుగుతుంది. ఇరువురియందును సమాన ప్రీతి ఉండవలెనన్న భావం.  ఇరువురియందు భక్తులు  అందరు మాతాపిత భావము కలిగి ఉండాలి.

అర్ధనారీశ్వరుడు

  • లయకారుడిగా శివుడికి అధికారం అధికంగా ఉండాలి. అధికారాన్నే పార్వతి, దుర్గ, శక్తి రూపాలుగా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంటే శక్తిని ఆయన తనలో భాగంగా ధరించాలి. శివుడు, శక్తి మాత కలిసి పనిచేయడమంటే, స్త్రీ పురుషులు సమానమేనని అంతరార్థం
  • సంప్రదాయాన్ని చూపడానికే శివుడు + శక్తి కలిసి అర్ధనారీశ్వరుడిగా దర్శనమిస్తారు. శివుడు లేకుండా శక్తి, శక్తి లేకుండా శివుడు ఉండరు. శక్తితో కలిసిన శివుడిని సంపూర్ణుని (సగుణబ్రహ్మ)గా, శక్తితో లేనప్పుడు అసంపూర్ణుని (నిర్గుణబ్రహ్మ)గా పండితులు చెబుతారు
  • ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు కదా. అందుకే కాలం కూడా స్త్రీ పురుష రూపాత్మకమైంది. చైత్రం మొదలు భాద్రపదం వరకు అర్ధభాగం పురుష రూపాత్మకం. ఆశ్వయుజంనుంచి ఫాల్గుణం చివరి వరకు గల కాలం స్త్రీ రూపాత్మకం.

అర్ధనారీశ్వరుడు అవతరించినది మాఘ బహుళచతుర్ధశి రోజైన మహా శివ రాత్రి  నాడు, ఆది దంపతులు - జగత్పితరులు

'జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ' అని స్తుతిస్తుంటారు. జగత్తుకంతటికీ తల్లిదండ్రులలాంటి వారు పార్వతీపరమేశ్వరులు. ఆది దంపతులు ఇద్దరూ దేహాన్ని పంచుకొని అర్ధనారీశ్వర అవతారంతో కన్పించటం కూడా అందరికీ తెలిసిందే

ఇంతకీ శివుడు అర్ధనారీశ్వరుడు ఎప్పుడయ్యాడు? అమ్మకు తన దేహంలో సగభాగాన్ని ఎలా కల్పించాడు? అసలు దాని వెనుక ఉన్న ప్రధాన కారణమేమిటీ? అనే విషయాలను వివరించి చెబుతుంది కథాసందర్భం. ఇది శివపురాణంలోని శతరుద్ర సంహితలో కన్పిస్తుంది. నందీశ్వరుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుడికి కథను వివరించాడు

పూర్వం బ్రహ్మదేవుడు ప్రజలను వృద్ధి చేయటం కోసం తనదైన పద్ధతిలో సృష్టిని చేయసాగాడు. అలా తానొక్కడే ప్రాణులను రూపొందిస్తూ జీవం పోస్తూ ఎంతకాలంగా తన పనిని తాను చేసుకుపోతున్నా అనుకున్నంత సంఖ్యలో ప్రజావృద్ధి జరగలేదు. ఇందుకు ఎంతగానో చింతించిన బ్రహ్మదేవుడు పరమేశ్వరుడిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు.

బ్రహ్మ చేసిన కఠిన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. సగం పురుషుడు, సగం స్త్రీ రూపం గల దేహంతో శివస్వరూపం వెలుగొందసాగింది. పరమశక్తితో కూడి ఉన్న శంకరుడిని చూసి బ్రహ్మదేవుడు సాష్టాంగ ప్రణామం చేసి అనేక విధాల స్తుతించాడు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుడితో బ్రహ్మ సృష్టికి సహకరించటానికే అర్ధనారీశ్వర రూపాన్ని తాను ధరించి వచ్చినట్లు చెప్పాడు
అలా పలుకుతున్న శివుడి పార్శ్వ భాగం నుంచి ఉమాదేవి బయటకు వచ్చింది. బ్రహ్మదేవుడు జగనాత్మను స్తుతించి సృష్టి వృద్ధి చెందటం కోసం సర్వసమర్థమైన ఒక రూపాన్ని ధరించమని, తన కుమారుడైన దక్షుడికి కుమార్తెగా జన్మించమని బ్రహ్మదేవుడు ఉమాదేవిని ప్రార్థించాడు. ఆమె బ్రహ్మను అనుగ్రహించింది
వెంటనే భవానీదేవి కనుబొమల మధ్య నుంచి ఆమెతో సమానమైన కాంతులు గల ఒక దివ్యశక్తి అక్కడ అవతరించింది. అప్పుడా శక్తిని చూసి పరమేశ్వరుడు బ్రహ్మ తపస్సు చేసి మెప్పించాడు కనుక ఆయన కోర్కెలను నెరవేర్చమని కోరాడు. పరమేశ్వరుని ఆజ్ఞను ఆమె శిరసావహించింది. బ్రహ్మదేవుడు కోరినట్లుగానే అనంతరం ఆమె దక్షుడికి కుమార్తెగా జన్మించింది. ఆనాటి నుంచి లోకంలో నారీ విభాగం సంకల్పితమైంది.

సృష్టి ఆవిర్భావం

  • స్త్రీ, పురుష సమాగమ రూపమైన సృష్టి ఆనాటి నుంచి ప్రవర్తిల్లింది. స్త్రీ శక్తి సామాన్యమైనది కాదని, ప్రతివారు స్త్రీ మూర్తులను గౌరవించి తీరాలని ఆదిదేవుడు, ఆదిపరాశక్తి ఇద్దరూ సమానంగా ఎంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారో లోకంలో ఉండే పురుషులతో స్త్రీలు కూడా అంతే శక్తిసామర్థ్యాలు కలిగి ఉన్నారనే విషయాన్ని కథాసందర్భం వివరిస్తుంది. అంతేకాక స్థితి, లయ కారకులలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తొలుత తాను ఒంటరిగా సృష్టిని ప్రారంభించిన దానివల్ల ఎక్కువ ఫలితం కలగలేక పోయిందని, పరమేశ్వర అనుగ్రహంతో స్త్రీత్వం అవతరించిన తర్వాతే సృష్టి విశేషంగా పరివ్యాప్తమైందని కథ వివరిస్తోంది. స్త్రీ శక్తి విశిష్టతను తెలియచెప్పేందుకు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి అర్ధనారీశ్వర రూపంలో అవతరించాడు. కనుక పురుషాధిక్యాన్ని ప్రదర్శించటం కానీ, స్త్రీలను, స్త్రీ శక్తిని కించపరచటం కానీ ఎంతమాత్రం దైవహితం కాదనే విషయాన్ని కథలో మనం గమనించవచ్చు.
  • లోకం లో సహజం గా వినిపించే మాట పురుషుడే అధికుడని . శంకరుని విషయములో అది సరికాదు . శంకరుడు తన భార్య పార్వతిని నిరంతరము గౌరవిస్తూనే ఉంటాడు . పార్వతితో తనకు వివాహము కాకముందు తానే స్వయముగా మారు రూపములో బ్రహ్మచారి వేషములో ఆమె వద్దకు వెళ్ళి -- శంకరునికి తల్లిదండ్రులెవరో ఎవరికీ తెలియదని బూడిదమాత్రమే ఒంటికి పూసుముటాడని , ఇల్లు లేని కారణముగా శ్మశానములోనే ఉంటాడని , నిత్యము బిక్షకోసము తిరుగుతూ ఉంటాడని , బిక్షపాత్రకూడా లేని కారణముగా పర్రెని బిక్షపాత్రగా ధరిస్తాడని ... ఇలా ఉన్నది ఉన్నట్లుగా తన కాబోయే భార్యకి నిజాన్ని చెప్పిన ఒకేఒక్క ప్రియుడు శంకరుడు . లోకములో ప్రేముకులందరికీ ఒక తీరుగా మార్గదర్శకుడు కూడా.

  • తనకంటే తన భార్య పార్వతి బాగా ఆలోచించగలదని తెలిసి తనకంటే జ్ఞానవతిగా ఆమెను గుర్తించి నిరంతరము ఆమె వద్దకు వెళ్ళి భిక్ష యాచిస్తాడు శంకరుడు . ఆయన చేతిలో పుర్రె మన తలమీది పైభాగానికి సాంకేతం , ఆమె పెట్టే అన్నము జ్ఞానాని సంకేతము కాబట్టి ఆయన అన్నపూర్ణ నుండి గ్రహించేది " జ్ఞాన (అన్న) భిక్ష " తప్ప మనలా అన్నము మాత్రము కానేకాదు . 

అందుకే "అన్నపూర్ణే ! సదాపూర్ణే ! శంకరప్రాణవల్లభే ! జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం భిక్షాం దేహి పార్వతి !. అంటుంది పురాణ శ్లోకము.

ఈ క్రింది వీడియో యూ.ర్.యల్. చూసి ఇంకా తెలుసుకోండి ...

శివుని అర్థనారీశ్వర రహస్యం తెలుసా?|| Facts about ...

Sri Ardhanaareeswara Stotram || శ్రీ అర్ధనారీశ్వర ... - YouTube




Note:  నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండి మరియు  wowitsviral.blogspot.com  like,share and subscribe  చేయండి.  కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ ...