24, మార్చి 2021, బుధవారం

ఫాల్గుణ శుద్ధ ఏకాదశిని అమలక ఏకాదశి అని ఎందుకంటారు ? అమలక ఏకాదశి వైశిష్ట్యం గురించి తెలుసుకోండి

wowitstelugu.blogspot.com

ఫాల్గుణ శుద్ధ ఏకాదశి ని అమలక ఏకాదశి అని ఎందుకంటారు ? అమలక ఏకాదశి వైశిష్ట్యం గురించి తెలుసుకోండి?



ఫాల్గుణ శుద్ధ ఏకాదశి వివరణలో ‘ఆమలకే వృక్షే జనార్థనః’ అని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో అభివర్ణించారు.

అధిక మాస ప్రశంస లేని సాధారణ సంవత్సరాల్లో మనకు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి. ఆ ఇరవై నాలుగు ఏకాదశులకు ఇరవై నాలుగు వివిధ నామాలు ఉన్నాయి. విష్ణువు చర్యలను బట్టి శయనైకాదశి, పరివర్తనైకాదశి, ప్రబోధిన్యేకాదశి, వ్రత నియమాన్ని బట్టి నిర్జలైకాదశి, ఫలైకాదశి, వీర పూజనాన్ని బట్టి భీష్మైకాదశి, ఇంద్రైకాదశి వంటివి ఏర్పడ్డాయి. కానీ, అన్నింటిలోకి ఒక కాయ పండుతో సంబంధించిన ఏకాదశి ఆమలైకాదశి ఒక్కటే. ఏకాదశి వంటి గొప్ప తిథిలో ఉసిరిని జత చేయడం వల్లనే ఆమలకిలో ఏదో విశిష్టత ఉందని భావించవచ్చు. మన తెలుగు సంప్రదాయంలో కొన్ని పండుగలు వచ్చే నెలలో కొన్ని ఫలాలు పూజనీయం, వరణీయమై భాసిల్లుతున్నాయి. వాటిని ఆయా తిథుల్లో భుజించాలని మన పెద్దలు ఆరోగ్యరీత్యా నియమం విధించారు. ఆయా తిథి నియమాలను అనుసరించి ఆహారాన్ని, ఫలాలను తీసుకోవడం వల్ల ఎనలేని ఆరోగ్యం చేకూరుతుంది. ఈ క్రమంలోనే చైత్ర మాసంలో అశోక కలికా ప్రాశనం, ఫాల్గుణ మాసంలో ఆమ్రపుష్ప భక్షణం, కార్తీకంలో బిల్వపత్ర పూజ, ఆశ్వయుజంలో శమీ వృక్ష పూజ వంటి వాటి వల్ల మనుషులకు ఆరోగ్యం చేకూరుతుంది.


👉అమలక ఏకాదశికే ధాత్రీ ఏకాదశి , అమృత ఏకాదశి అనే నామాంతరాలున్నాయి, ‘ ఆమలక వృక్షే జనార్దనః ’అంటారు కనుక ఈ రోజు ఉసిరి చెట్టు కింద లక్ష్మీనారాయణులను పూజిస్తే అధిక ఫలితం ఉంటుంది. ఈ రోజు ఏ దానం చేసినా అది అక్షయమవుతుంది.

👉 కొన్ని సంప్రదాయాలవారు ఈ రోజున సంపదలనిచ్చే లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవి ఉసిరి చెట్టులో ఉంటుందని భావిస్తారు. అలాగే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు , రాధ ఈ చెట్టు సమీపంలోనే నివసించారనేది ఒక కథ.

👉కార్తీక మాసంలో ఉసిరికాయల ప్రస్తావన వస్తుంది. ఉసిరి కొమ్మతెచ్చి పూజ చేయడం , ఉసిరికాయ దీపాలు వత్తులు వెలిగించడం , ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వంటి పలు రకాల క్రియలు చేస్తారు , మళ్ళీ ఉసిరి ప్రస్తావన కనబడేది ఫాల్గున మాసంలో ఉసిరి ఎంతో ప్రశస్తమైనది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇక చైత్ర మాసంలో కాసే ఉసిరి పండ్లకు ఒక ప్రత్యేకమైన ఔషధ గుణముంటుందని, వాటి కోసం ప్రత్యేకంగా వెతుకుతుంటామని ఒక వైద్య గ్రంథాన్ని ఉటంకిస్తూ ఒక ఆయుర్వేద వైద్యుడు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజునే హోళీ ఉత్సవాలకు ప్రారంభ దినంగా భావిస్తారు. ఆంధ్ర ప్రాంతం లోని గోదావరీ తీర వాసులు దీనిని కోరుకొండ ఏకాదశిగా వ్యవహరిస్తారు.

👉ఈ రోజు కోరుకొండలోని నరసింహ స్వామి ఆలయంలో విశేష పూజలు , తిరునాళ్ళు జరుగుతుంది. దీనికి అధిక సంఖ్యలో జనం వస్తారు. అన్ని పండుగ దినాలకూ సంబంధించి ఉన్నట్టే ఈ పర్వానికి సంబంధించి కథలు ఉన్నాయి.

01 దీనికి సంబంధించిన కథ:

దీని గురించి బ్రహ్మాండ పురాణంలో వశిష్ఠుడు చెప్పినట్లుగా ఉందని విజ్ఞులు చెబుతారు. దాని ప్రకారం విదిష రాజ్య ప్రభువైన చిత్రరథుడు విష్ణు భక్తుడు. అతని రాజ్య ప్రజలు కూడా విష్ణు భక్తులే. ఒక ఏడాది అతను , కొంత మంది భక్తులతో ఒక నదీ తీరంలో ఉన్న ఒక అమలక (ఉసిరిక) వృక్షం వద్ద విష్ణు పూజ చేశాడు. దీనిలో భాగంగా రాజు పరశురామావతార విష్ణువును కూడా పూజించాడు. వారందరూ ఉపవాసం ఉండి రాత్రంతా విష్ణు భజనలు పాడుకుంటూ జాగరణం చేశారు. ఆ సమయంలో ఎటువంటి వేట దొరక్క ఉపవాసం ఉన్న ఒక వేటగాడు కూడా వారితోబాటు రాత్రంతా జాగారం చేశాడు. ఆ కారణంగా అతను మరు జన్మలో రాజుగా జన్మించాడు. అతనికి వసురథుడని పేరు పెట్టారు. అతను కూడా వేట మైకంలో రాక్షసుల బారిన పడడం ఒక దివ్య శక్తి చేత* రక్షించబడటం వంటివన్నీ జరిగాయని చెబుతారు. గత జన్మలో చేసిన అమలక ఏకాదశి ఫలితంగా అతనికి ఈ జన్మలోనూ రక్షణ లభించిందని చెబుతారు.

👉 ఎటువంటి కోరిక లేకుండా పూర్తి భక్తితో ఈ రోజు విష్ణు పూజ చేస్తే పైన చెప్పిన విధంగా ఈ జన్మలోనూ, వచ్చే జన్మలోనూ విశేష ఫలితం ఉంటుందని చెప్పడం ఈ కథ యొక్క ఉద్దేశం.

02 దీనికి సంబంధించిన కథ:

ప్రళయ కాలంలో సృష్టి అంతా జలయమయం అయినటువంటి తరుణంలో బ్రహ్మదేవుడు శ్రీమహావిష్ణువును గురించి కఠోరమైన తపస్సును ఆచరిస్తున్నాడు. ఆ తరుణంలో శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడికి కనిపించగానే బ్రహ్మదేవుడి యొక్క కన్నుల నుండి ఆనంద భాష్పాలు జారి భూమి మీద పడ్డాయి. ఆ ఆనంద భాష్పాల నుంచే ఉసిరిక చెట్టు ఆవిర్భవించిందని పురాణాలలో వర్ణించడం జరిగింది. ఉసిరిక చెట్టు మొత్తం శ్రీ మహావిష్ణువు వ్యాపించి ఉంటాడని స్కాంద పురాణంలో వర్ణించడం జరిగింది. అందువల్ల ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు (అమలక ఏకాదశి) ఎవరైతే ఉసిరి చెట్టు ఆరాధన చేస్తారో, ఎవరైతే ఉసిరిక చెట్టు క్రింద శ్రీమహా విష్ణువు యొక్క చిత్రపటం కానీ, కృష్ణ పరమాత్మ పటం కానీ ఉంచి అర్చన చేస్తారో వారికి శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క/శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందని పురాణాలలో, శాస్త్రాలలో వర్ణించడం జరిగింది.

అమలక (ఉసిరిక) ఏకాదశి వైశిష్ట్యం:

ఉప్పు తప్ప మిగతా అన్ని రసాలు ఉసిరికలో ఉన్నాయి అని మన వైద్య గ్రంథాలన్నీ ఎలుగెత్తి చెబుతున్నాయి. ఇది మహత్తరమైన ఔషధీ గుణాలు గల ఫలం. అమృతాఫలం అనే గ్రంథంలో నలభై పేజీల్లో కేవలం ఉసిరిక ఔషధీ గుణాల గురించే ఉందంటే దీని ప్రశస్తిని అర్థం చేసుకోవచ్చు. అలాగే, ఫలజాతులు అనే గ్రంథంలోని యాభై పేజీల్లో దీని సర్వాంగాల గురించి వర్ణనలు ఉన్నాయి. వైద్యం, పారిశ్రామికంగా దీని ఉపయోగాల గురించి, వాగ్భటంలో పుంజీల కొద్దీ శ్లోకాలలో దీని రసాయనిక, కాయకల్పాది చికిత్సోపయోగాలను విపులీకరించారు.

  • అమలక ఏకాదశి నాడు ఉసిరిక పూజ చేస్తే విష్ణు మూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందని పురాణాలలో, శాస్త్రాలలో వర్ణించడం జరిగింది.

  • అమలక ఏకాదశి నాడు చేసిన దానం వాజపేయం , సోమయజ్ఞంలో చేసిన దానంతో సమానమని చెబుతారు.

  • అమలక ఏకాదశి నాడు పూజించే అమలక వృక్షం ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నదనేది అందరికీ తెలిసిందే. దానికి ఎన్నో విశేష లక్షణాలు ఉన్నాయి.

  • (అమలక) ఉసిరి వృద్ధాప్యం త్వరగా రాకుండా కాపాడుతుంది

  • ఉసిరి గొంతు నొప్పి , హృద్రోగాలు పిత్తాశయంలో రాళ్లు , అల్సర్లు , కామెర్లు , నొప్పులు , దురదలను , పేలను నివారిస్తుంది , జీవ క్రియలు వేగంగా జరిగేలా చేస్తుంది

  • ఉసిరి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని జీర్ణ క్రియకు ఉపయోగించే పీచు పదార్థం దీనిలో ఎక్కువని సైన్స్ లో తెలుసుకున్నాం కదా.

  • ఉసిరి ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది , రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

  • ఉసిరి కంటి చూపును మెరుగు పరుస్తుంది, రక్తాన్ని వృద్ధి చేస్తుంది , ఎముకలకు బలం చేకూరుస్తుంది, శరీరాన్ని చల్లబరుస్తుంది, కేన్సర్‌ వచ్చే అవకాశాలను తగ్గిస్తుందని ఆధునిక శాస్త్రాలు కూడా చెబుతున్నాయి

  • ఉసిరి లివర్‌ను కాపాడుతుందని, శరీరానికి కాంతిని ఇస్తుందని, జుట్టు నెరవడాన్ని అరికడుతుందని చెబుతారు.

  • అంతేకాక ఉసిరి కాయ 'తెల్ల ప్లేగు' అనే క్షయ వ్యాధి రాకుండా ఇది కాపాడుతుందని కూడా ఆయుర్వేదం చెబుతోంది.

  • ఉసిరికాయలో విటమిన్‍ 'సి' పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని  ఆధునిక జీవ శాస్త్రం చెబుతుంది.
  • ఆయుర్వేదంలో పేర్కొనే  'చ్యవన్‍ప్రాశ'   ఔషధాన్ని ఉసిరి కాయల నుంచే తయారు చేస్తారు.
  • 2  చెంచాల ఉసిరి పొడిని 2 చెంచాల తేనెలో కలుపుకుని రోజూ 3 లేదా  4 సార్లు తాగితే జలుబు రాదు.
  • ఉసిరి కాయలు తరచూ తీసుకోవడం వల్ల శరీరంలోని 'అదనపు కొవ్వు' ను కరిగించుకోవచ్చు. బరువు కూడా తగ్గించుకోవచ్చు.
  • ఉసిరికాయను నిత్యం ఏదో రూపంలో తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

అమలక ఏకాదశి రోజు నాడు చేయవలసిన ప్రత్యేక పూజ విధానం

ఈ రోజు ఉసిరిక చెట్టు దగ్గర పూజ చేయడం ప్రత్యేకత. భక్తి శ్రద్ధలతో ఓం నమో నారాయణాయ అని స్మరిస్తూ ఉసిరిక చెట్టు మొదట్లో నీళ్ళను పోయాలి. ఆ తర్వాత చెట్టునకు పసుపు , కుంకుమ , గంధం, పూలతో అలంకరించి , దీపం , ధూపం , అరటి ఆకులో అరటిపండు నైవేద్యం పెట్టిన తర్వాత చెంబులో కొన్ని నీళ్ళను పోసుకుని అందులో తెల్లని దారం ఉండను వేసి దారాన్ని పచ్చగా తడవనిచ్చిన తర్వాత పచ్చగా పసుపునీటిలో తడిసిన ఆ పసుపు దారాన్ని ఉసిరిక చెట్టునకు సవ్య దిశగా ప్రదక్షిణలు చేస్తూ చుట్టునకు ఓ ఆకు వరస చొప్పున పదమూడు చుట్లు శ్రీ మహావిష్ణువును స్మరించుకుంటూ చుట్టిన దారాన్ని నిష్కల్మషమైన మనస్సుతో ముడి వేయాలి.

ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో స్మరించ వలసిన మంత్రం

ధాత్రిదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి !

వర్చస్వం కురుమాం దేవి ధనవంతం తథాకురు !!

👉 ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే ఉసిరిక చెట్టును సాక్షాతూ తల్లి రూపంగా ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. తల్లిలాంటి ఉసిరిక చెట్టుకు ఈ శ్లోకాన్ని చదువుతూ పూజ చేస్తే ఉసిరిక చెట్టు యొక్క అనుగ్రహం ద్వారా అద్భుతమైన తేజస్సును, యశస్సును పెంపొందింప జేసుకోవటంతో పాటుగా ధనప్రాప్తిని పొందవచ్చు.

👉 ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళి, చెట్టు మొదట్లో నీళ్ళు పోసి, ఉసిరిక చెట్టుకు పసుపు, కుంకుమ, గంధము అలంకరించి పసుపు రంగు దారాన్ని తీసుకొని ఉసిరిక చెట్టుకు 13 సార్లు చుడుతూ ముళ్ళు వేయాలి. ఆ తర్వాత ఉసిరిక చెట్టు చుట్టూ పదమూడు ప్రదక్షిణలు చేయాలి.

👉 ఈ శ్లోకం చదువుకుంటూ ప్రదక్షిణ చేస్తూ చివరిగా “ఓం విష్ణు రూపిణ్యై దాత్ర్యై నమః” అని ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి. ఆవిధంగా ఉసిరిక చెట్టును పూజించిన తరువాత ఏకాదశీ వ్రతాన్ని ఆచరిస్తే జన్మ జన్మాంతర పాపాలన్నీ పటాపంచలౌతాయి. పసుపు రంగు పుష్పాలతో ఉసిరిక చెట్టుకు పూజ చేయాలి. 

👉 భగవంతుడు భక్తుడి యొక్క ప్రేమతో కూడుకున్న పిలుపునకు స్వామి వారు అత్యంత ఇష్టపడతాడు. ప్రతీ ఏకాదశి రోజున ఉపవాసం చేసిన వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శారీరక పుష్టి , శక్తి ఉన్నవారు నెలలో వచ్చు రెండు ఏకాదశులలో ఉపవాసం ఉంటూ ప్రతి నెల చేస్తే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు నారాయణుడి అనుగ్రహానికి పాత్రులు అవుతారు.

👉 ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని కొంత మందికి కోరిక ఉంటుంది. కానీ శారీరక పుష్టి లేని వారు కొబ్బరి నీళ్ళు త్రాగుతూ కూడా ఉపవాసం చేయవచ్చును. భగవంతుడు తనపై భక్తి కావాలనే కోరుకుంటాడు , సాటి జీవులలో ప్రతి పనిలో తనను చూడగలిగితే చాలు అని స్వామి వారి ఉద్దేశం అది గ్రహించి వ్యవహారించగలిగితే చాలు.

ఈ క్రింది వీడియో యు. ఆర్.యల్.ల లో అమలక ఏకాదశి గురించి తెలుసుకోండి.

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి, 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My FaceBook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com













11, మార్చి 2021, గురువారం

శివరాత్రి నాడు పటించాల్సిన మంత్రాలు నాలుగు యామాల ప్రత్యేక పూజ శివుడిని ఏమి కోరుకోవాలి

wowitstelugu.blogspot.com

శివరాత్రి నాడు పటించాల్సిన మంత్రాలు  నాలుగు యామాల ప్రత్యేక పూజ  శివుడిని ఏమి కోరుకోవాలి


శివుడు అనగా మంగళకరుడు, శుభాలు చేకూర్చేవాడు. నేడు మహాదేవుడు పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహా శివరాత్రి. శివ రాత్రి అంటే మంగళకరమైన, శుభప్రదమైన రాత్రి అని అర్థం. శివరాత్రి నాడు ఉపవాసం జాగరణ, శివ దర్శనం, అభిషేకం, బిల్వ పత్రాలతో అర్చన, శివనామ సంకీర్తనల ద్వారా అజ్ణానం తొలగిపోయి శుభాలు కలుగుతాయి

మంగళకరుడు శివుడు, పార్వతికి వివాహం జరిగిన పవిత్రమైన రోజును మహా శివరాత్రి (Maha Shivaratri) అంటారు. ఈ రోజు సాయంకాల సమయాన్ని ప్రదోషకాలం  అంటారు. ఈ ప్రదోష సమయంలో శివస్మరణ, శివదర్శనం చేసుకుంటే భక్తులకు సకల శుభాలు కలుగుతాయి. మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు, శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రతో కలిసి ఉన్నప్పుడు శివుడు లింగాకారంగా ఆవిర్బవించాడని శివపురాణం చెబుతోంది.

ఈరోజు భక్తులు శివమూల మంత్రం పంచాక్షరీ మంత్రాన్ని, మహా మృత్యుంజయ మంత్రం, రుద్ర గాయంత్రి మంత్రాలను జపిస్తే శివుడు మీకు అన్ని శుభాలు చేకూరుస్తాడని, మీ పాపాలు తొలగిస్తాడని భక్తుల ప్రగాడ విశ్వాసం.  

శివమూల మంత్రం - శివ పంచాక్షరీ మంత్రం 

ఓం నమ:శివాయ

నాగేంద్రహారాయ త్రిలోచనాయ

భస్మాంగరాగాయ మహాశ్వరాయ

నిత్యాయ శుధ్ధాయ దిగంబరాయ

తస్మైనకారాయ నమ:శివాయ

మహా మృత్యుంజయ మంత్రం 

ఇది ఋగ్వేదంలోని ఒక మంత్రము

ఓం త్రయంబకం యజ్మహే సుగంధిమ్ పుష్టి వర్ధనం

ఊర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ 

రుద్ర గాయత్రి మంత్రం

ఓం తత్పురుషాయ విద్మహే 

మహాదేవాయ ధీమహి 

తన్నో రుద్రాయ ప్రచోదయాత్  

శివ పంచాక్షరీ మంత్రం ఓం నమ:శివాయ లోని ఐదు బీజాక్షరాలకు అర్థం ఇలా వివరించవచ్చును.

కారం బ్రహ్మను

కారం విష్ణువును

శి కారం రుద్రుడిని

కారం మహేశ్వరుడిని 

కారం సదాశివుడిని

సూచిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. 

శివరాత్రి రోజు నాలుగు యామాల ప్రత్యేక పూజ

మహాశివరాత్రి రోజున పద్నాలుగు లోకాల్లోని పుణ్యతీర్థాలు బిల్వమూలంలో ఉంటాయి. కాబట్టి ఆ రోజు ఉపవాసం చేసి ఒక్క బిల్వ పత్రాన్నైనా శివుడికి అర్పించి తరించమని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే శివరాత్రి రోజున శివాలయాల్లో జరిగే పూజలో పాల్గొంటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని వేద పండితులు చెబుతున్నారు.

ఈ రోజున ఆలయాల్లో నాలుగు యామాల ప్రత్యేక పూజ జరుగుతుంది. ప్రతి యామం పూజకు నిర్దిష్టమైన అభిషేకం చేస్తారు. ఇదే సమయంలో నిర్ణీత నైవేద్యంతోపాటు పారాయణం కొనసాగిస్తారు.

తొలి యామం: 

పూజలో అభిషేకం, అలంకరణ ఉంటాయి. గంధం, బిల్వపత్రాలు, తామరపువ్వులతో స్వామికి అర్చన చేస్తారు. నైవేద్యంగా పెసర పొంగలి సమర్పిస్తారు. రుగ్వేదాన్ని పారాయణం చేస్తే సౌభాగ్యం కలుగుతుంది. అంటే ఈ యామ పూజలో పాల్గొనే వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం.

రెండో యామం: 

ఈ పూజలో మధుపర్కం అంటే చక్కెర, పాలు, పెరుగు, నెయ్యితో అభిషేకం చేస్తారు. ఆ తర్వాత రోజ్ వాటర్, కర్పూరం గంధ లేపనంతో అలంకరించి బిల్వపత్రాలు, తులసితో అర్చన గావిస్తారు. నైవేద్యంగా పాయసం సమర్పించి యజుర్వేదాన్ని పారాయణం చేస్తారు. దీని వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది.

మూడో యామం: 

ఇందులో తేనెతో అభిషేకం చేసి, కర్పూరం గంధ లేపనంతో అలంకరణ చేస్తారు. బిల్వపత్రాలు, మల్లెపూలతో అర్చన, అన్నం, నువ్వులు నైవేద్యంగా నివేదించి, సామవేదాన్ని పారాయణం చేస్తే అపార సంపద లభిస్తుందట.

నాలుగో యామం: 

చెరకు రసంతో అభిషేకం చేసి మల్లె, తామర పూలు, కర్పూరం గంధ లేపనంతో అలకరించాలి. తామర, కలువ, మల్లె పూలతో అర్చనగావించి, వండిన అన్నం నైవేద్యంగా పెట్టాలి. అథర్వణ వేదాన్ని పారాయణం చేస్తే కుటుంబంలో సఖ్యత కలుగుతుందని వేద పండితులు పేర్కొంటున్నారు.

శివరాత్రి రోజున శివుణ్ణి ఏమని కోరుకోవాలి

👉నేను లేదా మేము  బతికి ఉన్నంత కాలం ధార్మిక కార్యాలు తమ  సంపాదనతో చేయాలి అని కోరుకోవాలి. ఈ కోరికకు అర్థం ఏంటంటే.. ఎప్పుడూ మనం సొంతంగా ఒకరికి ఇచ్చే స్థితిలోనే ఉండాలి అని అర్ధం. ఇంకా చెప్పాలంటే.. ఎప్పటికీ మన దగ్గర సంపద ఉన్నప్పుడే అది సాధ్యపడుతుంది కనుక అలాంటి కోరికలు కోరుకోవచ్చన్న మాట.

👉'మన ఇంట్లో దైవానికి నిత్య నైవేద్యం ఉండాలి' అని కోరుకోవాలి. అంటే మన ఇంట్లో ధాన్యం ఎప్పడూ నిలువ ఉంటుందన్న మాట.

👉 మన ఇంట్లో నేను నిత్యం పూజ చేయాలి అని కోరుకోవాలి. మనం ఆరోగ్యం బాగుండి, ఎప్పుడూ ఆనందంగా ఉంటేనే నిత్యపూజ సాధ్యపడుతుంది కనుక ఆ దేవుడిని నిత్యం కొలిచే భాగ్యం ప్రసాదిస్తే చాలు తండ్రీ అని వేడుకోవచ్చన్నమాట.

👉మన ఇంటికి ఎవ్వరు వచ్చినా కడుపునిండా భోజనం చేసి వెళ్ళాలి అని కోరుకోవాలి. అంటే మీకు అనుకూలవతి అయిన ధర్మపత్ని, పతి భాగస్వామి అవుతారు. ఈ కోరికలో ఉన్న మర్మం ఏంటంటే భార్యాభర్తల్లో ఏ ఒక్కరు మరొకరికి అనుకూలంగా లేకపోయినా ఇంటికి వచ్చే అతిథులందరికీ అతిథి మర్యాదలు చేయలేం. అలా కాకుండా అందరికీ అతిథిమర్యాదలు చేసే భాగ్యాన్ని ప్రసాదించమని ఆ దేవుడిని కోరుకోవడమంటే మీ జీవిత భాగస్వామి మీకు సైతం అనుకూలంగా ఉండేలా చూడమని ఆ దేవుడిని కోరుకోవడమే అవుతుంది. 

👉నేను నా చివరి దశ వరకు నీ క్షేత్ర దర్శనానికి రావాలి అని కోరుకోవాలి. అంటే నీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వమని అడగడటమే అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

👉భాగవతులతో మన గడప నిండుగా ఉండాలి అని కోరుకోవాలి. అంటే మనకు సమాజంలో తగిన గౌరవం, స్థానం, కీర్తిప్రతిష్టలు రావాలి అని కోరుకోవడమే.  

👉కుటుంబసమేతంగా సంతోషంగా మీ క్షేత్ర దర్శనానికి రావాలి అని దైవాన్ని కోరుకోవాలి. మనం ఆరోగ్యంగా, ఆర్ధికంగా, కుటుంబంతో అన్యోణ్యంగా కలిసి ఉంటేనే కదా అది సాధ్యపడుతుంది. ఇంక ఈ జీవితానికి ఎవరికైనా ఇంతకన్నా ఎక్కువ ఎమి కావాలి చెప్పండి.

ఈ క్రింది వీడియో యు ఆర్. యల్. ల లో శివరాత్రి పటించే మంత్రాలు గురించి తెలుసుకోండి:


ఈ రోజు సూక్తి :

"Failure will never overtake me if my determination to succeed is strong enough."

-Og Mandino

Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి, 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My FaceBook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com



10, మార్చి 2021, బుధవారం

శివ, శక్తి యొక్క కలయికను సూచించే మహా శివరాత్రి వృతాంతం, మహాత్మ్యము దాని ప్రాశస్త్యం తెలుసుకోండి

wowitstelugu.blogspot.com

శివ, శక్తి యొక్క కలయిక ను సూచించే మహా శివరాత్రి వృత్తాంతంమహాత్మ్యము దాని  ప్రాశస్త్యం తెలుసు కోండి



మహాశివ రాత్రి మహాత్మ్య వృత్తాంతం శివ పురాణములోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది మహాశివరాత్రి ఒక హిందువుల పండుగ. ఈ రోజు శివుడుని భక్తితో కొలుస్తూ పండుగ జరుపుకుంటారు. ఇది శివ, దేవేరి పార్వతి వివాహం జరిగిన రోజు. శివరాత్రిని, సివరాత్రి,  శైవరాతిరి,  శైవవరాత్రి, శివరాతిరి అని కూడా అంటారు. మహా శివరాత్రి రోజున,  శివ పూజ అనుసరించుటకు అనువైన సమయం.   శివుడు  లింగ రూపంలో భూమి మీద కనిపించిన రోజు యే  శివరాత్రి . ఈ రోజున, అన్ని శివాలయాలు లో, అత్యంత పవిత్రమైన లింగోద్భవ పూజ నిర్వహిస్తారు. 

మరొక పురాణం ప్రకారం, సముద్ర మథనంలో  హాలాహలం ఉద్భవించింది. శివుడు ఆ హాలాహలం మొత్తం తీసుకోవడంవలన, హాలాహలం యొక్క ఘోరమైన ప్రభావాల నుండి ప్రపంచం మొత్తం రక్షించడం జరిగింది. శివుడు తన యోగ శక్తి  ద్వారా తన గొంతులో హాలాహలం బంధించుట  వలన అది తన గొంతు కిందకు వెళ్ళలేదు. ఈ  కారణంగా ఆయన  గొంతు హాలాహలం ప్రభావంతో నీలంగా మారినది, అప్పటి  నుండి ఆయనను  నీల కాంతుడు  , నీలకంఠం లేదా నీలకంఠుడు అని అంటారు. శివుడు శివ 'తాండవం', విశ్వ నృత్యం చేసినప్పుడు, మహా శివరాత్రి జరుపుకుంటారు.

భూమి యొక్క సృష్టి పూర్తి అయిన తరువాత, భక్తులు, సృష్టి పూర్తి  అయిన రోజు  పాటించేవారు, పార్వతి దేవి కృతజ్ఞతలుతో ఆయన సంతోష పెట్టేందుకు శివుడును ఏ దినం సృష్టి  పూర్తి దినమని  కోరారు. అందుకు శివుడు జవాబుగా, అమావాస్య 14 వ రోజు రాత్రి, ఫాల్గున నెలలో కృష్ణ పక్షం తన అభిమాన రోజు అని బదులిచ్చాడు. అప్పుడు  పార్వతి, ఆమె స్నేహితులకు ఈ విషయాలు చెప్పింది  వీరి నుండి ఆ పదం విశ్వం  అంతా వ్యాపించింది.

ప్రపంచ నాశనం అవుతున్న సమయం లో   పార్వతి దాన్ని కాపాడే నిమిత్తం తన భర్త శివుడు ని  ప్రార్థించారు అని మరో కథనం. శివుని ద్వారా తీసుకు రాబడిన ప్రళయం నుండి జీవాలను (నివసిస్తున్న ఆత్మలు) రక్షించేందుకు బంగారం దుమ్ము విత్తనం వంటి కణాలులో జీవం మైనపు ముద్దలతో ఉండిపోయే విధంగా పార్వతి దేవి  తన భర్థ  శివుడిని   ప్రార్థించారు.

మహా శివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం యొక్క కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది. హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. చాంద్రమాన నెల లెక్క ప్రకారం, ఈ రోజు గ్రెగేరియన్ క్యాలెండర్లో ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది. హిందువుల క్యాలెండర్ నెలలో ఫాల్గుణ మాసము యొక్క కృష్ణ పక్ష చతుర్దశి. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావింపబడుతుంది.

అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవము గొప్పగా జరుగుతుంది . పూర్వం శ్రీశైలం క్షేత్రంలో జరిగే ఉత్సవమును పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రములో విపులంగా వర్ణించాడు. శైవులు ధరించే భస్మము/విభూతి తయారుచేయటానికి ఈనాడు పవిత్రమైన రోజు గా  భావిస్తారు. రోజు అంతా భక్తులు "ఓం నమః శివాయ", అనే శివుని  యొక్క పవిత్ర మంత్రం పఠిస్తారు.

శివరాత్రి వృత్తాంతం

గంగా యమునా సంగమ స్థానమైన ప్రయాగలో (నేటి అలహాబాదు) ఋషులు సర్పయాగం చేస్తున్నసమయంలో రోమర్షణమహర్షి అని పేరు గాంచిన సూతమహర్షి అక్కడకు వస్తాడు. ఆలా వచ్చిన సూతమహర్షికి అ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పమనగా అతను తన గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాథను వివరించడం ప్రారంభిస్తాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతి నదీ తీరమున ధ్యానం చేస్తుంటాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్ళుతుంటాడు. దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మ కుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాథను తెలుపుమంటాడు.

అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మ కుమారుడైన సనత్ కుమారుడు తనకు, నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సర్పయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా, నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు.

బ్రహ్మ విష్ణువుల యుద్ధం :

ఒకప్పుడు ప్రళయ కాలం సంప్రాప్తము కాగా మహాత్ములగు బ్రహ్మ, విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగారు. ఆ సమయంలోనే మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించాడు. దాని వివరాలు ఇలాఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి, శేష శయ్యపై నిద్రిస్తున్న విష్ణువును చూసి, "నీవెవరవు, నన్ను చూసి గర్వముతో శయ్యపై పడుకున్నావులే, నీ ప్రభువును వచ్చి ఉన్నాను నన్ను చూడు. ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడుతుంది " అని అంటాడు. ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి, ఆసనం ఇచ్చి, "నీచూపులు ప్రసన్నంగా లేవేమి?" అంటాడు. 

దానికి సమాధానంగా బ్రహ్మ "నేను కాలముతో సమానమైన వేగం తో వచ్చాను. పితామహుడను. జగత్తును, నిన్ను కూడా రక్షించేవాడను" అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో "జగత్తు నాలో ఉంది. నీవు చోరుని వలె ఉన్నావు. నీవే నా నాభిలోని పద్మమునుండి జన్మించినావు. కావున నీవు నా పుత్రుడవు. నీవు వ్యర్థముగా మాట్లాడుతున్నావు" అంటాడు.

ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు సంవాదము లోనికి దిగి, చివరికి యుద్ధసన్నద్దులౌతారు. బ్రహ్మ హంస వాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు. ఈ విధంగా వారివురు యుద్ధం చేస్తూ ఉండగా దేవతలు వారివారి విమానాలు అధిరోహించి వీక్షిస్తుంటారు. బ్రహ్మ, విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలం పై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకొన సాగారు. 

ఇలా సమరం జరుగుతుండగా, విష్ణువు మాహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరిమీదకు ఒకరు సంధించుకొంటారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కల్గుతుంది. ఏమీ చేయలేక, దేవతలందరు శివునికి నివాసమైన కైలాసానికి బయలు దేరుతారు. ప్రమథగణాలకు నాయకుడైన శివుని నివాసస్థలమైన కైలాసంలో మణులు పొదగబడిన సభా మద్యలో ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి పరిచారికలు శ్రద్ధతో వింజామరలు వీచుతుంటారు. 

ఈ విధంగా నున్న ఈశ్వరునికి దేవతలు ఆనందబాష్పాలతో శ్హస్త్రంగమ్ ప్రణమిల్లుతారు. అప్పుడు ప్రమథ గణాలచేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని అహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో "బ్రహ్మ, విష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలియును. మీ కలవరము గాంచిన నాకు మరల చెప్పినట్లైనది " అంటాడు. బ్రహ్మ, విష్ణువులకు ప్రభువైన శివుడు సభలో ఉన్న వంద ప్రమథ గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి, తాను అనేక వాద్యములతో అలంకారములతో కూడిన వాహనం పై రంగు రంగుల ధ్వజముతో, వింజామరతో, పుష్పవర్షముతో, సంగీతము నాట్యమాడే గుంపులతో, వాద్య సముహంతో, పార్వతీదేవితో బయలుదేరుతాడు. 

యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషను ఆపి, రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు.మాహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్ని స్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకొంటాడు. బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్య చకితులై ఆ స్తంభం యొక ఆది, అంతం కనుగొనడం కోసం వారివారి వాహనాలతో బయలు దేరుతారు. విష్ణువు అంతము కనుగొనుటకు వరాహరూపుడై, బ్రహ్మ ఆది తెలుసుకొనుటకు హంసరూపుడై బయలుదేరుతారు. ఎంతపోయినను అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వస్తాడు.

 బ్రహ్మకు పైకి వెళ్ళే సమయంలో మార్గమధ్యంలో కామధేనువు క్రిందకు దిగుతూను, ఒక మొగలి పువ్వు (బ్రహ్మ, విష్ణువు ల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారినదే ఆ మొగలి పువ్వు) క్రింద పడుతూనూ కనిపించాయి. ఆ రెంటిని చూసి బ్రహ్మ 'నేను ఆది చూశాను అని అసత్యము చెప్పండి. ఆపత్కాలమందు అసత్యము చెప్పడము ధర్మ సమ్మతమే" అని చెప్పి కామధేనువు తోను, మొగలి పువ్వుతోను ఒడంబడిక చేసుకొంటాడు. వాటితో ఒడంబడిక చేసుకొన్న తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి, అక్కడ డస్సి ఉన్న విష్ణువుని చూసి, తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు, మొగలి పువ్వు అని చెబుతాడు. అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మకి షోడశోపచారా లతో పూజ చేస్తాడు.

 కాని,శివుడు ఆ రెండింటిని వివరము అడుగగా, బ్రహ్మ స్తంభం ఆదిని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెపుతుంది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి, నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు.మోసము చేసిన బ్రహ్మను శిక్షించడంకోసం శివుడు అగ్ని లింగ స్వరూపం నుండి సాకారమైన శివుడిగా ప్రత్యక్షం అవుతాడు. అది చూసిన విష్ణువు, బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరిస్తారు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇకనుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకొంటాడని, విష్ణువుకి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు.

బ్రహ్మకు శిక్ష మరియు వరము 

అరాజ భయమేతద్వైజగత్సర్వం నశిష్యతి! 

తతస్త్వం జహి దండార్హం వహ లోకథురం శిశో!!
వరందదామి తే తత్ర గృహాణ దుర్లభం పరమ్! 

వైతానికేషు గృహ్యేషు యజ్ఙేషు చ భవాన్గురుః!!
నిష్ఫలస్త్వదృతే యజ్ఙః సాంగశ్చ సహ దక్షిణః!


శివుడు బ్రహ్మ గర్వము అణచడానికి తన కనుబొమ్మల నుండి భైరవుడిని సృష్టించి పదునైన కత్తితో ఈ బ్రహ్మను శిక్షించుము అని చెబుతాడు. ఆ భైరవుడు వెళ్లి బ్రహ్మ పంచముఖాలలో ఏ ముఖము అయితే అసత్యము చెప్పిందో ఆ ముఖాన్ని పదునైన కత్తితో నరికి వేస్తాడు. అప్పుడు మహావిష్ణువు శివుడి వద్దకు వెళ్లి, పూర్వము ఈశ్వర చిహ్నంగా బ్రహ్మకు ఐదు ముఖాలు ఇచ్చి ఉంటివి. ఈ మొదటి దైవము అగు బ్రహ్మను ఇప్పుడు క్షమించుము అన్నాడు. 

శివుని శరణు జొచ్చిన బ్రహ్మను (పిల్లవానిని తప్పుచేసినప్పుడు  దండించి తప్పు తెలుసుకొన్న తరువాత కారుణ్యమును ప్రకటించిన తండ్రిలా) బ్రహ్మను ఉద్దేశించి గొప్ప వరమును ప్రసాదించెను. బ్రహ్మను క్షమించి, "ఓ బ్రహ్మా నీకు గొప్పనైన దుర్లభమైన వరమును ఇస్తున్నాను, అగ్నిష్టోమము, దర్శ మొదలగు యజ్ఙములలో నీది గురుస్థానము. ఎవరేని చేసిన యజ్ఙములలో అన్ని అంగములు ఉన్నా అన్నింటినీ సరిగా నిర్వర్తించినా, యజ్ఙనిర్వహణముచేసిన బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చినా, నీవు లేని యజ్ఙము వ్యర్థము అగును" అని వరమిచ్చెను.


మొగలి పువ్వు కామధేనువు కి  శాపం 


👉 ఆతరువాత కేతకీపుష్పము వైపు చూసి, అసత్యము పల్కిన నీతో పూజలు ఉండకుండా ఉండు గాక అని అనగానే దేవతలు కేతకీపుష్పాన్ని దూరంగా ఉంచారు. దీనితో కలతచెందిన కేతకీపుష్పము పరమేశ్వరుడవైన నిన్ను చూసిన తరువాత కూడా అసత్య దోషము ఉండునా అని మహాదేవుడిని స్తుతించింది. దానితో ప్రీతి చెందిన శివుడు అసత్యము చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కాని కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీ పుష్పము ఛత్ర రూపములో నాపై ఉంటుంది అని చెబుతాడు.


👉అసత్యాన్ని చెప్పిన కామధేనువును కూడా శివుడు శిక్షించ దలచాడు.  అసత్యమాడినందుకు పూజలు ఉండవని శివుడు కామధేనువుకు శాపమిచ్చాడు. తోకతో నిజం చెప్పాను కనుక క్షమించుమని కామధేనువు శివుని ప్రాధేయపడింది. భోలాశంకరుడు కనుక, కోపమును దిగమ్రింగి, " మొగము తో అసత్యమాడితివి కనుక నీ మొగము పూజనీయము కాదు; కాని సత్యమాడిన నీ పృష్ఠ భాగము పునీతమై, పూజలనందుకొనును" అని శివుడు వాక్రుచ్చెను. అప్పటి నుండి గోముఖము పూజార్హము కాని దైనది; గోమూత్రము, గోమయము, గోక్షీరములు పునీతములైనవై, పూజా, పురస్కారములలో వాడబడుచున్నవి.


మహా శివరాత్రి వ్రత కథ 

ఒకనాడు కైలాసపర్వత శిఖరముపై పార్వతీపరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోను ఉత్తమమగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరెను. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమనుదాని విశేషాలను తెలియజేస్తాడు. దీనిని మాఘబహుళచతుర్దశి నాడు ఆచరించవలెనని, తెలిసికాని, తెలియకగాని ఒక్కమారు చేసినను యముని నుండి తప్పుంచుకొని ముక్తి పొందుదురని దాని దృష్టాంతముగా ఈ క్రింది కథను వినిపించెను.


ఒకప్పుడు ఒక పర్వతప్రాంతమున హింసావృత్తిగల వ్యాధుడొకడు వుండెను. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదేని మృగమును చంపి తెచ్చుచు కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయమున బయలుదేవి అడవియంతా తిరిగినా ఒక్క మృగము కూడా దొరకలేదు. చీకటిపడుతున్నా ఉత్తచేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక వెనుతిరిగెను. దారిలో అతనికొక తటాకము కనిపించెను. ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచియుండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగా నున్న ఆకులను, కాయలను విరిచి క్రింద పడవేయసాగెను. చలికి "శివ శివ" యని వణుకుచూ విల్లు ఎక్కిపెట్టి మృగాల కోసం వేచియుండెను.


మొదటిజామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను. వ్యాధుడు దానిపై బాణము విడువబోగా లేడి భయపడక "వ్యాధుడా! నన్ను చంపకుము" అని మనుష్యవాక్కులతో ప్రార్థించెను. వ్యాధుడు ఆశ్చర్యపడి మనుష్యులవలె మాట్లాడు నీ సంగతి తెలుపుమని కోరెను. దానికి జింక "నేను పూర్వజన్మమున రంభయను అప్సరసను. హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించుట మరచితిని. దానికి రుద్రుడు కోపించి కామాతురయైన నీవు, నీ ప్రియుడును జింకలుగా పన్నెండేళ్లు గడిపి ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాపవిముక్తులౌదురని సెలవిచ్చెను. నేను గర్భిణిని, అవధ్యను కనుక నన్ను వదలుము. మరొక పెంటిజింక ఇచటికి వచ్చును. అది బాగుగా బలిసినది, కావున దానిని చంపుము. లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువుల కప్పగించి తిరిగివస్తాను" అని అతన్ని వొప్పించి వెళ్ళెను.


రెండవజాము గడిచెను. మరొక పెంటిజింక కనిపించెను. వ్యాధుడు సంతోషించి విల్లెక్కుపెట్టి బాణము విడువబోగా అదిచూచిన జింక భయపడి మానవవాక్కులతో "ఓ వ్యాధుడా, నేను విరహముతో కృశించియున్నాను. నాలో మేదోమాంసములు లేవు. నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక యొకటి రాగలదు. దానిని చంపుము, కానిచో నేనే తిరిగివత్తును" అనెను. వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టెను.


మూడవజాము వచ్చెను. వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచియుండెను. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. వింటితో బాణము విడువబోగా ఆ మృగము వ్యాధుని చూచి మొదటి రెండు పెంటి జింకలు తన ప్రియురాలుల్ని తానే చంపెనా అని ప్రశ్నించెను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి రెండు పెంటిజింకలు మరలివచ్చుటకు ప్రతిజ్ఞచేసి వెళ్ళినవి, నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని "నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చెదను నా భార్య ఋతుమతి. ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞపొంది మరలివత్తును అని ప్రమాణములు చేసి వెళ్ళెను.


ఇట్లు నాలుగు జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురుచూచుచుండెను. కొంతసేపటికి ఆ నాలుగు జింకలును వచ్చి నన్ను మొదట చంపుము, నన్నే మొదట చంపుమని అనుచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను. వానిని చంపుటకు అతని మనసు ఒప్పలేదు. తన హింసావృత్తిపై జుగుప్స కలిగెను. "ఓ మృగములారా ! మీ నివాసములకు వెళ్ళుము. నాకు మాంసము అక్కరలేదు. మృగములను బెదరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబము కొరకు ఇక నేనా పాపము చేయను. ధర్మములకు దయ మూలము. దమయు సత్యఫలము. నీవు నాకు గురువు, ఉపదేష్టవు. కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము. నేనిక సత్యధర్మము నాశ్రయించి అస్త్రములను వదలిపెట్టుదును." అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణ మాచరించి నమస్కరించెను.


అంతలో ఆకాశమున దేవదుందుభులు మ్రోగెను. పుష్పవృష్టి కురిసెను. దేవదూతలు మనోహరమగు విమానమును తెచ్చి యిట్లనిరి : ఓ మహానుభావా. శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించింది. ఉపవాసము, జాగరమును జరిపితివి, తెలియకయే యామ, యామమునను పూజించితివి, నీవెక్కినది బిల్వవృక్షము. దానిక్రింద స్వయంభూలింగమొకటి గుబురులో మరుగుపడి యున్నది. నీవు తెలియకయే బిల్వపత్రముల త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము. మృగరాజా! నీవు సకుటుంబముగా నక్షత్రపదము పొందుము."


ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో నిట్లనెను: దేవీ! ఆ మృగకుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. మూడు నక్షత్రములలో ముందున్న రెండూ జింకపిల్లలు, వెనుకనున్న మూడవది మృగి. ఈ మూడింటిని మృగశీర్ష మందురు. వాని వెనుక నుండు నక్షత్రములలో ఉజ్జ్వలమైనది లుబ్ధక నక్షత్రము.


మహా శివరాత్రి పూజ విధానం :


ఆ తరువాత బ్రహ్మ, విష్ణువు ఆదిగా గల దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో "మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి మహా శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది.


ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది" అని చెబుతారు. తాను ఈ విధంగా అగ్నిలింగరూపముగా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధిచెంద గలదని చెబుతారు .


శివరాత్రినాడు శివుని పూజించే విధానం 

1. జాగరణ 

2. రుద్రాభిషేఖం 

3. పంచాక్షరీ పఠనం 

4. మహామృత్యుంజయ మంత్రం 

5. శివ సహస్ర నామ స్తోత్రం 

6. బిల్వార్చన 
  • జాగరణము   అనగా ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తిని, శివపూజా భజన లీలా శ్రవణాదులతో మేల్కొలిపి, తాను శివుడై, సర్వమును శివస్వరూపముగా భావించి, దర్శించుటయే నిజమైన జాగరణము. అప్పుడు శివపూజలో సాయుజ్యము, శివభజనలో సామీప్యము, శివభక్తులతో కూడి, శివ విషయములు ప్రసంగించుటలో సలోక్యము, శివధ్యానములో సారూప్యము సిద్ధించునని ఆదిశంకరాచార్యులు మాట ప్రత్యక్ష సత్యమగును. ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుటయే శివరాత్రి జాగరణము. జాగరణ దినమున ఉ పవాసము ఉంటారు.ఈ జాగరణ సమయంలో తామున్న గృహ ఆవరణలోనో, తమ స్వంత పంటపొలాల్లోనో అక్కడి మట్టితో అక్కడే శివలింగాన్ని తయారుచేస్తూ జాముకొక శివలింగం తయారుచేసి పూజిస్తారు.ఒక రోజంతా ఉపవాసం, రాత్రి అంతా జాగరణ చేస్తారు . ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. ఈనాడు శివభక్తులు తెల్లవారుజామున లేచి,  స్నానం చేసి,  పూజలు చేసి, ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణము చేసి మరునాడు భోజనం చేస్తారు. 

  • రుద్రాభిషేకం  దీనిని వేదాలలోనుండి ప్రత్యేకమైన మంత్రాలను రుద్ర సూక్తంగా పండితులచే పఠించబడుతుంది. దీనిని శివలింగానికి ప్రాతఃకాలంలో పవిత్రస్నానం చేయిస్తారు. దీనినే రుద్రాభిషేకం అంటారు. శివలింగంతో బాటు గండకీ నదిలో మాత్రమే లభించే సాలిగ్రామం కూడా పూజలందుకుంటుంది. దీనిద్వారా మనసులోని మలినాల్ని తొలగించుకోవడమే ఇందులోని పరమార్ధం.

  • పంచాక్షరి మంత్రం  ఇది శివస్తోత్రాలలో అత్యుత్తమమైనది. ఈ మంత్రంలోని పంచ అనగా అయిదు అక్షరాలు "న" "మ" "శి" "వా" "య" (ఓం నమశ్శివాయ) నిరంతరం భక్తితో ఈనామం  పఠిస్తే శివసాయుజ్యం ప్రాప్తిస్తుంది.
  • మహామృత్యుంజయ మంత్రం  ఇది ఋగ్వేదం లోని ఒక మంత్రము. దీనినే "త్రయంబక మంత్రము", "రుద్ర మంత్రము", "మృత సంజీవని మంత్రము" అని కూడా అంటారు. ఇదే మంత్రం యజుర్వేదం లో కూడా ఉంది. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి, మోక్షం కొరకు జపిస్తారు.   ఆ మంత్రం ఇదే ...    "ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్" అని జపిస్తారు.
  • శివసహస్రనామ స్తోత్రము  ఈ స్తోత్రం  లోని వేయి నామాలు శివుని గొప్పదనాన్ని తెలియ చేస్తాయి.

  • బిల్వార్చన  ఈ పండుగ నాడు   ప్రధానంగా బిల్వ పత్రాలు శివుడికి, సమర్పించడం ద్వారా జరుపుకుంటారు. రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుతారు. 


ఈ  క్రింది వీడియో  యు. ఆర్. యల్. ల పై   క్లిక్ చేసి  శివరాత్రి  గురించి వీడియో ల లో  తెలుసుకొండి.




ఈ రోజు సూక్తి 

"It is less about becoming a better person, and more of being better, as a   person."
- J.R. Rim

Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి, 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My Facebook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com