12 కార్తీక పురాణము విశిష్టత - పన్నెండ వ రోజు పారాయణం
అత్రిమహముని చెబుతున్నాడు:-
అగస్త్యా! కార్తీకమాస శుక్ల ద్వాదశిని 'హరిబోధిని' అని అంటారు. ఆ ఒక్క పర్వతిథీ వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసిన, అన్ని విధాలైన యజ్ఞాలు ఆచరించిన కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది. విష్ణువుపట్లా, ఏకాదశిపట్లా భక్తిని కలిగిస్తుంది. సూర్యచంద్ర గ్రహణ పర్వాలకంటే గొప్పదీ ఏకాదశి కంటే వందరెట్లు మహిమాన్వితమైనదీ అయిన ఈ ద్వాదశినాడు ఏ పుణ్యం చేసినా, పాపం చేసినా అది కోటిరెట్లుగా పరిణమిస్తుంది. అంటే - ఈ ద్వాదశినాడు ఒకరికి అన్నదానం చేసినా కోటిమందికి అన్నదానం చేసిన పుణ్యమూ, ఒక్క మెతుకు దొంగిలించినా కోటి మెతుకులు దొంగలించిన పాపమూ కలుగుతాయి. ఒకవేళ ఏ రోజుకైనాద్వాదశీ ఘడియలు తక్కువగా ఉన్న పక్షంలో - ఆ స్వల్ప సమయమైనా సరే పారణకు ఉపయోగించాలే కానీ, ద్వాదశి దాటిన తరువాత పారణం పనికిరాదు. పుణ్యాన్ని కోరేవారు ఎవరైనా సరే ఏ నిమయాన్నయినా అతిక్రమించవచ్చును కానీ ద్వాదశీ పారణను మాత్రం విసర్జించకూడదు. ఏకాదశీ తిథినాడు ఉపవాసం ఉండి, మరుసటినాడు ద్వాదశీ తిథి దాటిపోకుండా పారణ చేయాలి. దానిద్వారా కలిగే శ్రేయస్సును శేషశాయి చెప్పలేగాని- శుధుడు చెప్పలేడు. ఇందుకు అంబరీషుడు కథే ఉదాహరణ.
యతోమ భయా త్క్రు త్వాసమ్య గుపొణం !
పూర్వం ద్వాదశ సంఖ్యాకే పురుషో హరినాసరే
పాపముల్లంఘనేపాత్ నైవయజ్యం మనిషిణా !!
అంబరీషుడి సమస్య విన్న వేదస్వరూపులైన ఆ బ్రాహ్మణులు, క్షణాల మీద శృతి స్మ్రుతి శాస్తపురాణాలు అన్నింటినీ మననం చేసుకుని "మహారాజా! సర్వేశ్వరుడు అయిన ఆ భగవంతుడు సమస్త జీవులలో జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై వుంటున్నాడు. ఆ జఠరాగ్ని, ప్రాణ వాయువుచేత ప్రజ్వలింప చేయబడటం వలననే జీవులకు ఆకలి కలుగుతుంది. దాని తాపమే క్షుత్పిపాసా భాధగా చెప్పబడుతూ వుంది. కాబట్టి, యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింప చేయడమే జీవలక్షణం. జీవులచే స్వీకరింపబడే భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య రూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు. జీవులందరిలోనూ వున్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కనుకనే ..
శ్లో || అత శ్వపాకం శూద్రం వా స్వన్య స ద్మాగతం శుకం !
అతి క్రమ్య న భుంజీత గృహమే థ్యతిధిం నిజం !!
శ్లో || వయం న నిశ్చయం క్వాపిగచ్చామో నరపుంగవ !
తథాపి ప్రథమం విప్రా ద్భోజనం న ప్ర కిర్తితం !!
బ్రాహ్మణా తిథి కంటే ముందుగా భుజించటం కీర్తికరమైనది మాత్రం కాదు. ధరణీపాలా! ద్వాదశీ పారణా పరిత్యాగం వలన, అంతకు పూర్వ దినం అయిన ఏకాదశి ఉపవాసానికి భంగం కలుగుతుంది, ఆ ఏకాదశీ త్యాగానికి ప్రాయశ్చిత్తం అనేది లేదు. ఇటు - బ్రాహ్మణాతిథి అతిక్రమించడం వలన కలిగే విప్ర పరాభవానికి కూడా విరుగుడు లేదు. రెండూ సమతూకంలోనే వున్నాయి.
ఇరవై నాలుగవ అధ్యాయం సమాప్తం
ఇరవై అయిదవ అధ్యాయం ప్రారంభం
శ్లో || స్వాబుద్ధ్యాతు సమాలోక్య కురుత్వం తవ నిశ్చయం
మేము ఆశక్తులమై పోతున్నాం. కాబట్టి "ఆత్మబుద్ధి స్సుఖంచైవ'' అనే సూత్రం వలన భారం భగవంతుడి మీద పెట్టి నీ బుద్ధికి తోచినదానిని నువ్వు ఆచరించు'' అన్నారు బ్రాహ్మణులు. ఆ మాటలు వినగానే అంబరీషుడు 'ఓ బ్రాహ్మణులారా! బ్రాహ్మణ శాపంకన్నా విష్ణుభక్తిని విడిచి పెట్టడమే ఎక్కువ కష్టంగా భావిస్తున్నాను.
కృతావకాశ వత్సశ్చాత్ భూమ జీత్యేత్యవరేజగః !!
శ్లో || అస్నాత్వాతుమలం భుంక్తే -అదత్వాఘంతు కేవలం
యోనిమంత్రితాతిధి: పూర్వం మోహాద్భుంక్తే తతోధమః
మాలాశేసతు విజ్ఞేయః క్రిమిదిష్టాగాతో యధా
భుంజతేతేత్వఘం పాపాయే ఏవచ త్యాత్మకారణాత్
ఆతిథర్థ్యంచ పక్వం యే భుంజతే తేత్వ ఘాదఘం !!
స్నానం చెయ్యకుండా భోంచేసేవాడు - మలభోజి అవుతాడు. పరుడికి పెట్టకుండా తానొక్కడే తినేవాడు పాపభోక్త అవుతాడు. తానాహ్వానించిన అతిథికి పెట్టకుండా ముందుగా తనే భోంచేసేవాడు - ఆశుద్ధంతో పురుగువలే మలాశియే అవుతాడు. పక్వమైనది గాని, ఫలం గాని, పత్రంగాని, నీళ్ళుగాని - భోజనార్థంగా భావించి సేవించినది ఏదైనా సరే అన్నంతో సమానమే అవుతుంది. అందువలన - నీచేత అంగీకృతుడనైన అతిథిని - నేను రాకుండానే, నాకంటే ముందుగా అన్న ప్రతివిధిగా జలపారణం చేశావు. బ్రాహ్మణ తిరస్కారివైన నువ్వు బ్రాహ్మణ ప్రియుడైన విష్ణువుకు భక్తుడి ఎలా అవుతావు? "యథా పురోధనస్స్వస్య మదమోహాన్మహీపతే'' పురోహితుడు చెప్పినట్లు కాకుండా, మరోవిధంగా ఆచరించే మదమోహితుడిలా ప్రవర్తించావు నువ్వు'' అన్నాడు దూర్వాసుడు. ఆ ఆగ్రహానికి భయకంపితుడు అయిన అంబరీషుడు దోసిలి పట్టినవాడై "మునీంద్రా! నేను పాపినే! పరమ నీచుడనే! అయినా నిన్ను శరణు కోరుతున్నాను. నేను క్షత్రియున్ని గనుక - ఏ అభిజాత్యహంకారం వల్లనో తప్పు నేను చేశాను, కాని, నువ్వు బ్రాహ్మణుడివైన కారణంగా శాంతాన్ని వహించు. నన్ను రక్షించు. నీవంటి గొప్ప ఋషులు తప్ప విడిచి - మమ్మల్ని ఉద్ధరించేవాళ్ళు ఎవరు ఉంటారు?'' అంటూ అతని పాదాలమీద పడి ప్రార్థించాడు. అయినా సరే, ఆ దూర్వాసుడి కోపం తగ్గలేదు. మణిమకుటాన్ని ధరించే ఆ అయోధ్యాపతి శిరస్సును తన ఎడమకాలితో తన్నివేశాడు. రవంత ఎడంగా వెళ్ళి "ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ప్రార్థిస్తే వాళ్ళు శాంతులు అవుతారు. కాని, నేను అలాంటివాడిని కాను. నాకు కోపంవస్తే, శాపం పెట్టకుండా ఉండను. చేపగానూ, తాబేలుగానూ, పందిగానూ, మరుగుజ్జు వాడిగానూ, వికృతమైన ముఖం కలవాడిగానూ, క్రూరుడైన బ్రాహ్మణుడిగానూ, జ్ఞానశూన్యుడైన క్షత్రియుడిగానూ, అధికారంలేని క్షత్రియుడిగానూ, దురాచార భూయిష్టమైన పాషండ మార్గవాదిగానూ, నిర్దయాపూర్వక బ్రాహ్మణ హింసకుడివనై బ్రాహ్మణుడిగానూ - పదిజన్మల (గర్భ నరకాల) అనుభవించు'' అని శపించాడు. అప్పటికే బ్రాహ్మణ శాపభయంతో అవాక్కయి వున్నాడు అంబరీషుడు. అయినా అతని అంతర్యంలో సుస్థితుడై ఉన్న శ్రీమహావిష్ణువు కల్పాంతరకాల లోకకళ్యానార్థమొ, బ్రాహ్మణ వాక్యాన్ని తిరస్కరించకూడదనే తన వ్రతంవల్లా, ఆ పదిజన్మల శాపాన్ని తానే భరించదలచి - 'గృహ్ణామి' అని ఊరుకున్నాడు. "ఇన్ని శాపాలు ఇస్తే - గృహ్ణామి - అంటాడేమిటి రాజు? వీడికింకా పెద్ద శాపం ఇవ్వాలి' అని మరోసారి నోరు తెరవబోయాడు దూర్వాసుడు. కానీ సర్వజ్ఞుడైన శ్రీహరి దూర్వాసుడి నోట ఇంకో శాపం వెలువడకుండానే - భక్తుడైన అంబరీషుడి రక్షణార్థంగా తన ఆయుధమైన సుదర్శన చక్రాన్ని వినియోగించడంతో, అక్కడి పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి - జగదేక శరణ్యమూ, జగదేక భీకరమూ అయిన సుదర్శనచక్రం రివ్వున దూర్వాసుడ్ని వంక కదిలింది. అచేతనాలైన పూజిత సంజ్ఞలలోంచి - జడమైన విష్ణుచక్రం, దివ్యకాంతి ప్రభాశోభితమై తనవంక కదలిరావాడాన్ని చూడగానే - దూర్వాసుడు త్రుళ్ళిపడ్డాడు. ఆ చక్రానికి చిక్కకూడదని భూచక్రం అంతా కూడా క్షణాలమీద పరిభ్రమించాడు. అయినా 'సుదర్శనం' అతగాడిని తరుముతూనే వుంది. భీతావహుడైన ఆ దూర్వాసుడు - వశిష్టాది బ్రహ్మర్షులనీ. ఇంద్రాది అష్టదిక్పాలకులనీ, చిట్టచివర శివ-బ్రహ్మలనీ కూడా శరణు కోరాడు. కాని, అతడి వెనకనే విహ్వల మహాగ్ని జ్వాలాయుతంగా వస్తూన్న విష్నుచక్రాన్ని చూసి ఎవరికీ వారే తప్పుకున్నారు తప్ప విడిచి, తెగించి ఎవరూ అభయాన్ని ఇవ్వలేదు.
ఇరవై ఆరవ అధ్యాయం ప్రారంభం
దేశకాల వయోవస్థా వర్ణాశ్రమ విభాగశః !!
పన్నెండవ రోజు పారాయణ సమాప్తం.
కార్తీక పురాణం 12 వ రోజు పారాయణం వీడియో యు. ఆర్. యల్ . లు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి