General News,Humanity,Mythology,Psychology,Health, Employment,Biographies

ప్రియమైన మిత్రులకు, మన wowitstelugu.com కు స్వాగతం-సుస్వాగతం సాధారణ వార్తలు,మానవత్వం, విశ్వాసాలు, మానసిక శాస్త్రం,ఆరోగ్యం,ఉద్యోగం,జీవిత చరిత్రలు, మున్నగునవి తెలుగులో తెలుగు భాష తెలిసిన వారందరికీ అర్దమైయే లా ఈ బ్లాగ్ లో పొందుపరచడం జరిగింది. బ్లాగ్ చదివి మీ విలువైన సమాచారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను . ఇట్లు .బ్లాగ్ అడ్మిన్ .

▼

30, నవంబర్ 2020, సోమవారం

25 కార్తీక పురాణము విశిష్టత - ఇరవై ఐదవ రోజు పారాయణ

wowitstelugu.blogspot.com

25 కార్తీక పురాణము విశిష్టత - ఇరవై ఐదవ రోజు పారాయణ 


పృథువు అడుగుతున్నాడు: 

'నారదా! నీచే అత్యద్భుతంగా చెప్పబడిన తులసీ మహత్యాన్ని విని ధన్యుడినైనాను. అదే విధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు. అయితే, గతంలో ఈ వ్రతం ఎవరెవరిచేత ఎలా ఎలా ఆచరించబడిందో తెలియజేయి' అని కోరగానే, నారదుడు వినిపించసాగాడు.

 ధర్మదత్త ఉపాఖ్యానము

  • చాలా కాలం పూర్వం సహ్య పర్వత భూమిని, కరవీరమనే ఊరు ఉండేది. ఆ వూళ్ళో ధర్మవేత్త, నిరంతర హరి పూజా ఆశక్తికలవాడు, నిత్యం ద్వాదాక్షరీ జపవ్రతుడు, అతిథి సేవాపరాయణుడు, ధర్మదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. 

  • ఒకానొక కార్తీకమాసంలో ఆ విపృడు విష్ణు జాగరణ చేయతలచిన వాడై తెల్లవారుఝామునే లేచి పూజకు కావలసిన సామానులు సమకూర్చుకుని విష్ణువు ఆలయానికి బయలుదేరాడు. 

  • ఆ దారిలో వంకరలు తిరిగిన ఘోరదంష్ట్రలు, తాటిస్తున్న నాలుకా, ఎర్రటికళ్ళు, దళసరి పాటి పెదాలు, మాంసరహితమైన శరీరము గలదీ పందివలె ఘుర్ఘురిస్తూనది అయిన ఒక దిగంబర రాక్షసి తారసపడింది. 

  • దానిని చూసి భీతావహుడైన ఆ బ్రాహ్మణుడు హరిస్మరణ చేస్తూనే ఉదకాలంతోసహా తన వద్ద గల పూజాద్రవ్యాలతో దానిని కొట్టాడు. 

  • హరిస్మరణంతో తులసీభరితమైన జలతాడనం చేయడంవలన, ఆ నీళ్ళు సోకగానే దాని పాపాలు అన్నీ పటాపంచలైపోయాయి. 

  • దానిద్వారా ఏర్పడిన జ్ఞానంవలన 'కలహా' అనబడే ఆ రాక్షసి ఆ బ్రాహ్మణునకు సాష్టాంగంగా ప్రణమిల్లి, తన పూర్వజన్మ కర్మలను విన్నవించసాగింది 'కలహా' చెబుతుంది. 

  • పుణ్యమూర్తివైన ఓ బ్రాహ్మణుడా! పూర్వంలో నేను సౌరాష్ట్ర దేశంలో భిక్షుడు అనే బ్రాహ్మణుడి భార్యను. అప్పుడు మిక్కిలి కఠినురాలినై ఉంటూ 'కలహ' అనే పేరుతొ పిలువబడే దానిని. 

  • నేను ఏనాడూ నా భర్త ఆజ్ఞలను పాటించి ఎరుగను. ఆయన హితవును ఆలకించేదానిని కాదు, కనీసము ఆయనకు సరిగా అన్నము కూడా పెట్టేదానిని కాదు.

  • నేను అలా నిత్య కలహకారిణై అహంకరించి వుండడంవలన కొన్నాళ్ళకు, నాథుని మనసు విరిగి మారుమనువు ఆడాలనే కోరికతో ఉండేవాడు. 

  • ఆయనను సుఖపెట్టలేక పోయినా, మారు మనువు చేసుకోవాలనే ఆయన కోరికను గుర్తించి, భరించలేక విషం త్రాగి చనిపోయాను. 

  • యమదూతలు నన్ను తీసుకువెళ్ళి యముడిముందు నిలబెట్టారు. యముడు, చిత్రగుప్తుడిని చూసి, 'చిత్రగుప్తా! దీని కర్మకాండలను తెలియజేయి. 

  • శుభమైనా ఆశుభమైనా సరే కర్మఫలాన్ని అనుభవించవలసినదే' అన్నాడు. 

  • అప్పుడు చిత్రగుప్తుడు 'ఓ ధర్మరాజా! ఇది ఒక మంచిపని కూడా చేయలేదు. తాను షడ్రసోపేతంగా భోజనం చేసిన తరువాత కూడా భర్తకు అన్నము పెట్టేదికాదు.

  • అందువల్ల మేక జన్మమెత్తి బాధపడుతూ ఉండుగాక! నిత్యమూ భర్తతో కలహించి అతని మనసుకు బాధ కలిగించినందుకుగాను పందియోనిని పురుగై పుట్టుగాక!

  • వండిన వంటను తాను ఒక్కతే తిన్న పాపానికిగాను పిల్లి యోనిని పుట్టి తన పిల్లలను తనే తినుగాక! భర్త ద్వేషియై ఆత్మహత్య చేసుకున్నందువలన అత్యంత నిందితమైన ప్రేతశరీరాన్ని పొందునుగాక!

  • ఇది ప్రేతరూపమును పొంది కొన్నాళ్ళు నిర్జల స్థానంలో వుండి, అనంతరం, యోనిత్రయాన జన్మించి అప్పటికైనా సత్కార్యములు ఆచరించుగాక!' అని తీర్మానించాడు.

  • అది మొదలు ఓ ధర్మదత్తా! నేను అయిదు వందల సంవత్సరాలపాటు ఈ ప్రేతశరీరం ధరించి ఆకలిదప్పులతో అల్లాడుతూ అలనాటి నా పాపాలకై దుఃఖిస్తున్నాను. 

  • అనంతరం కృష్ణా సరస్వతీ సంగమస్థానమైన దక్షిణదేశానికి రాగ, అక్కడి శివగణాలు నన్ను తరిమికొట్టగా ఇలా వచ్చాను. 

  • పరమపావనమైన తులసిజలాలతో నీవు తాడించడంవలన ఈపాటి పూర్వస్మృతి కలిగింది. 

  • పుణ్య తేజస్వివైన నీ దర్శనం లభించింది. కాబట్టి కళంకరహితుడవై భూసురుడా! ఈ ప్రేత శరీరంనుంచీ, దీని తదుపరి ఎత్తవలసిన వివిధ యోనులలోని జన్మత్రయాన్నుంచీ నాకెలా ముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు' అని ప్రాధేయపడింది.

  • కలహ చెప్పినది అంతా విని, కలతపడిన మనస్సు కలవాడిన ఆ విపృడు సుదీర్ఘ సమయం ఆలోచించి, ఆలోచించి దుఃఖభార హృదయుడై ఇలా చెప్పసాగాడు.

పందొమ్మిదవ అధ్యాయం సమాప్తం


ఇరవైవ అధ్యాయం


ధర్మదత్తుడు చెబుతున్నాడు: 

ఓ కలహా!తీర్థాలూ, దానాలూ, వ్రతాలు చేయడంవలన పాపాలు నశించిపోతాయి. కానీ, నీ ప్రేత శరీరంవలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు. 

అదీగాక, మూడు యోనులలో మూడు జన్మలలో అనుభవించవలసిన కర్మపరిపాకం స్వల్ప పుణ్యాలతో తీరదు. అందువలన నేను పుట్టి బుద్దెరిగిన నాటినుండీ ఆచరిస్తూ వున్న కార్తీకవ్రత పుణ్యంలో సగభాగాన్ని నీకు ధారపోస్తాను. 

దానిద్వారా నీవు తరించి ముక్తిని పొందు' ఈ విధంగా చెప్పి ద్వాదశాక్షరీ మంత్రయుక్తంగా తులసీ తోయాలతో ఆమెను అభిషేకించి కార్తీకవ్రత పుణ్యాన్ని ధారపోశాడు.

ఉత్తరక్షణంలోనే కలహా ప్రేతశరీరాన్ని విడిచి, దివ్యరూపంతో, అగ్నిశిఖవలె లక్ష్మీకళతో ప్రకాశించింది. 

అమితానందంతో ఆమె ధర్మదత్తునికి కృతఙ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే, విష్ణుస్వరూపులైన పార్షాదులు ఆకాశంనుండి విమానంతో సహా వచ్చారు. 

వారిలోని పుణ్యశీల సుశీల అనే ద్వారపాలకుల చేత కలహ విమానం అధిరోహింప చేయబడి, అప్సరగణాలచేత సేవించబడసాగింది. 

ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగణాలకు సాష్టాంగపడ్డాడు ధర్మదత్తుడు. సుశీలా పుణ్యశీలు ఇద్దరూ అతనిని లేవదీసి, సంతోషం కలిగించే విధంగా యిలా చెప్పసాగారు ...

'ఓ విష్ణుభక్తా! దీనులయందు దయాబుద్ధి కలవాడవూ అయిన నీవు అత్యంత యోగ్యుడవు. లోకోత్తరమైన కార్తీక వ్రతపుణ్యాన్ని ఒక దీనురాలికోసం త్యాగం చేయడం వలన నీ యక్క నూరుజన్మలలోని పాపాలు యావత్తూ సర్వనాశనమైపోయాయి. 

ఈమె పూర్వ సంచితమంతా నీచే చేయించబడిన స్నాన ఫలం వలన తొలగిపోయింది. విష్ణుజాగరణ ఫలంగా విమానం తేబడింది. 

నీవు ఆమెకు అర్పించిన దీపదాన పుణ్యం వలన తేజోరూపాన్నీ, తులసి పూజాదులవలన విష్ణుసాన్నిధ్యాన్నీ ఆమె పొందబోతోంది. 

ఓ పవిత్ర చరిత్రుడా మానవులకు మాధవసేవవలన కలగని మనోవాంచితమంటూ ఏదీ లేదు. విష్ణువ్రతం మహాఫలదాయకము. హరినామస్మరణం మోక్షమార్గం. 

విష్ణు ధ్యాస తత్పరుడవైన నీవు నీ యిద్దరు భార్యలతోనూ కలిసి అనేక వేలసంవత్సరాల పాటు విష్ణుసాన్నిధ్యంలో వినోదించగలవు.'

ధర్మదత్తుడికి విష్ణు దూతల వరం

విష్ణుదూతలు చెబుతున్నారు: 

'ఓ ధర్మదత్తుడా! వైకుంఠంలో నీ పుణ్యఫలానుభవానంతరం తిరిగి భూలోకంలోని సూర్యవంశంలో దశరథుడు అనే మహారాజుగా పుడతావు, నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలు అవుతారు. 

ఇప్పుడు నీచే పుణ్యాభిషిక్తమైన ఈ 'కలహ'యే నీకా జన్మలో మూడవ భార్యగా పరిణమిస్తుంది. 

దివ్యకార్యార్థమై భూమిని అవతరించనున్న విష్ణువు ఆ పుట్టువులో నీ కుమారుడుగా జన్మిస్తాడు. ఓ ధాత్రీ సురవరేణ్యా! విష్ణువుకి అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీకవ్రతంతో సమానమైన యజ్ఞయాగాదులుగాని, దానతీర్థాలుగాని లేవని తెలుసుకో. 

అంతటి మహోత్కృష్టమైనదీ, నీచే ఆచరించబడినదీ అయిన కార్తీకవ్రతంలోని కేవల సగభాగపు పుణ్యానికే ఈ స్త్రీ విష్ణుసాలోక్యాన్ని పొందుతూ వుంది. ఆమెను ఉద్ధరించాలానే నీ సంకస్పం నెరవేరింది గనుక, నేవు దిగులుపడకు' అన్నారు విష్ణుదూతలు.


పందొమ్మిదీ, ఇరవై అధ్యాయాలు సమాప్తం


ఇరువై ఐదవరోజు పారాయణము సమాప్తం. 

ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్ . ల లో ఇరువై ఐదవరోజు పారాయణము చూడండి


కార్తీక పురాణం 25వ రోజు ... - YouTube

Karthika Puranam Day-25 | కార్తీక పురాణం 25 ...


KARTHIKA PURANAM DAY 25 | కార్తీక పురాణం ...

Note:
నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share, and subscribe చేయండి. అలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండి. 
అలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండి. Also see my  Youtube channel bdl 1tv  like, share and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe,   కామెంట్   చేయడం మర్చిపోకండి   

Today Quote:
"I find it sad that too many do not understand themselves, or their potential. They don’t even take the time to get to know their unconsciousness. You can truly learn so much, by simply getting to know the “you” that is behind the reality of yourself."
-Lionel Suggs



వద్ద నవంబర్ 30, 2020 కామెంట్‌లు లేవు:
షేర్ చేయండి

24 కార్తీక పురాణము విశిష్టత - ఇరవై నాలుగవ రోజు పారాయణ

wowitstelugu.blogspot.com

24 కార్తీక పురాణము విశిష్టత - ఇరవై నాలుగవ రోజు పారాయణ

పదహేడవ అధ్యాయం

ఇక ఇక్కడ యుద్ధరంగంలో అధికమైన శివ శౌర్యానికి చిన్నబుచ్చుకొన్న జలంధరుడు, తిరిగి ఈశ్వరుణ్ణి సమ్మోహింప చేయాలని అనుకుని మాయాగౌరిని సృష్టించాడు. 

ఒక రథంపై కట్టివేయబడి నిశుంభ నిశాచరులచేత వధింపబడుతూ వున్న ఆ మాయాగౌరిని చూశాడు ఈశ్వరుడు. 

చూసీచూడగానే ఉద్విగ్నమానసుడైన ఉగ్రుడు, యుద్ధాన్నీ, తన పరాక్రమాన్నీ, కర్తవ్యాన్నీ విస్మరించి ఉదాసీనుడై ఉండిపోయాడు. 

అదే అదునుగా జలంధరుడు అపుంఖశాన్యైకాలైన మూడు బాణాలను శివుని శిరసుపైనా, వక్షస్థలంపైనా, ఉదరమందునా ప్రయోగించాడు. 

అయినా ఈ జంగమయ్యలో చలనం కలగలేదు. అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయగా బ్రహ్మచే భోధించినవాడై, కోలుకున్న ఆ పరమేశ్వరుడు జ్వాలామాలాతి భీషణ రౌద్రరూపాన్ని ధరించాడు. 

అలా పారిపోతూన్న వారిలో వున్న అగ్రనాయకులైన శుంభ, నిశింభులను చూసిన రుద్రుడు 'పారిపోతూన్న వాళ్ళంతా పార్వతి చేతిలో మరణించేదరుగాక' అని శపించాడు. 

దానిని మళ్ళించడం సాంబశివుడికి కూడా సాధ్యం కాలేదు. ఎక్కడలేని కోపం వచ్చింది రుద్రుడికి, వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు, 

ఆ స్వరూపాన్ని చూసేందుకు సహితం శక్తిచాలక, అనేకమంది రాక్షసులు పారిపోసాగారు.

అది గమనించిన జలంధరుడు - బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు. శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు. 

ఉడికిపోయిన జలంధరుడు పరిఘాయుధంతో పరుగుపరుగున వచ్చి, ఈశ్వరుడి వాహనమైన ఎద్దును భయంకరంగా కొట్టాడు. ఆ దెబ్బకు నంది యుద్ధరంగంనుండి పరుగుతీయసాగింది. 

భూమ్యాకాశాలను దహింపచేసి వేయగలిగినంతటి వేగవంతమైన ఆ చక్రం చూపరులను భయభ్రాంతులను చేస్తూ వెళ్ళి జలంధరుడి తలనరికి నేలపై పడవేసింది. 

అతని మొండెం కూడా రథనుంచి భూపతితమైపోయింది. ఆ మొండెంలోంచి వెలువడ్డ తేజస్సు, ఈశ్వరుడిలో లీనమైపోయింది. 

బ్రహ్మాదిదేవతలందరూ సంతోషాతిరేకులు, అవనతశిరస్కులూ అయి ఆ చంద్రశేఖరునకు ప్రణమిల్లారు. స్తుతించారు, కృతఙ్ఞతలు చెప్పుకున్నారు. 

అనంతరం 'బృందామోహితుడై అడవులలో అల్లాడిపోతూన్న విష్ణువును స్వస్థుడిని చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించవలసింది' అని ప్రార్థించగా, శివుడు 'మొహినీదేవత నాశ్రయించ'మని చెప్పి జయజయ ధ్వానాల నడుమ సకలగణ మహామాయని ప్రార్థించసాగారు.

దేవతాకృత మహామాయా ప్రార్థనం


శ్లో       య దుద్భువా స్సత్వ రజస్తమో గుణాః 

    సృష్టి స్థితి ధ్వంస నిదాన కారిణః 

    య దిచ్చయా విశ్వమిదం భవాభవౌ 

    తతోతి మూల ప్రకృతిం నతాస్కృతామ్         1

శ్లో        యాహి త్రయోవింశతి భేద శాబ్దితా 

    వై ద్రూప కర్మాణి జాగు స్త్రయోపివై 

    జగత్యాశేషే సమాధిష్టితా  పరా 

    వేదాస్తూ మూల ప్రకృతిం నతా స్మృతాం     2


శ్లో       య ద్భక్తియుక్తాః పురుషాస్తు నిత్యం 

    దారిద్ర్య భీ మోహ పరాభ వాదీన్ 
    న ప్రాప్నుంప త్యేవహి భక్తవత్సలాం 

    సదివ మూల ప్రకృతిం నతాస్మృతాం          3


సృష్టి స్థితిలయలకు కారణమైన సత్త్వరజస్తమోగుణాలు మూడు దేనినుంచి పుట్టినవో, దేనియొక్క యిచ్చవలన లోకంలో జనన - మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతి (మహామాయ)కి నమస్కరిస్తున్నాము

(1).

ఏదైతే ఇరవైమూడు భేదములతో చెప్పబడి సమస్త లోకములను అధిష్ఠించబడినదో, వేదములతో సైతము దేనియొక్క రూపకర్మములు కీర్తించబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము.

(2). 

దేనియందు భక్తుడైనవాడు దరిద్ర, భయ, మోహ, పరాభవాలను పొందడో, దేనికైతే తన భక్తులయందలి  ఎడతెగని ప్రేమకలదో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము .

(3). నారద ఉవాచ:     

స్తవమేత త్త్రిసంథ్యాం యః పఠే దేకాగ్ర మానసః 

దారిద్ర్యమోహ దుఃఖాని న కదాచిత్ స్మృశంతి తం

నారదుడు చెబుతున్నాడు: 

  • దేవతలచే గావించబడిన ఈ మూల ప్రకృతీ (మహామాయా) స్తవాన్ని ఎవరైతే ఏకాగ్రచిత్తంతో త్రిసంధ్యలా పఠిస్తారో వాళ్ళు ఏనాడూ కూడా దారిద్ర్యాన్నిగాని, భయాన్నిగాని, మొహాన్ని గాని, దుఃఖాన్నిగాని అవమానాన్నికాని పొందారు.

  • ఇక ప్రస్తుతంలోకి వద్దాము. ఆ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సు ఒకటి పొడచూపి 'ఓ దేవతలారా! త్రిగుణాలరీత్యా నేను త్రిమూర్తులనూ ధరించివున్నాను. 

  • రజోగుణం వలన - లక్ష్మిగాను, తమోగుణం వలన - సరస్వతిగానూ, సత్వగుణం వలన - పార్వతిగానూ విలసిల్లుతున్నది నేనే కావున మీ వాంఛా పరిపూర్తికై ఆ లక్ష్మీ-పార్వతీ-సరస్వతులను ఆశ్రయించం'డని ఆదేశించి అంతర్థానమైపోయింది.

  • దేవతలు రమా-ఉమా-సరస్వతుల చెంతకువెళ్ళి తమ మనోగతాన్ని వెల్లడించారు. భక్తవత్సలలైన ఆ తల్లులు ముగ్గురూ వారికి కొన్ని బీజాలను ఇచ్చి - 'విష్ణువు ఎక్కడయితే మొహావృతుడైనాడో అక్కడ ఈ బీజాలను చల్లించండి' అని చెప్పారు.

  • దేవతలు ఆ బీజాలను తెచ్చి - శ్రీహరి మోహితుడై పడివున్న బృందా చితి ప్రాంతమంతటా ఆ బీజాలను చిలకరించారు.

ఓ పృథు భూపతీ! పాతివ్రత్య మహిమాసుశోభితమైన ఈ గాథను - ఏకాగ్రచిత్తంతో చదివినా, విన్నా స్త్రీలుగానీ - పురుషులుగానీ ఇహంలో సంతాన సంపదనూ, పరంలో స్వర్గసంపదనూ పొందుతున్నారు అన్నాడు నారదుడు.

పదిహేడవ అధ్యాయం సమాప్తం


పద్దెనిమిదవ అధ్యాయం


తిరిగి నారదుడు చెబుతున్నాడు: 
  • ఓ పృథుమహారాజా! పూర్వోక్తవిధంగా బృందా చితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల - త్రిగుణశోభితాలైన ఉసిరి, మాలతి, తులసి అనే మూడు రకాల వృక్షాలు ఆవిర్భవించాయి. 

  • వీటిలో సరస్వతి వలన - ఉసిరిగ, లక్ష్మీవలన - మాలతి, గౌరివలన తులసి ఏర్పడ్డాయి. 

  • అంతవరకూ బృందామోహాలతో మాంధ్యుడై ఉన్న విష్ణువు తన చుట్టూ చెట్లు అయి మొలచిన లక్ష్మీ, సరస్వతీ, పార్వతీ మహిమలవలన, కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు. 

  • కానీ, వాటిలో లక్ష్మీదత్త బీజాలు ఈర్ష్యాగుణాన్వితాలయి ఉండటం వలన, ఆ బీజోత్పన్నమైన 'మాలతి' బర్చారీ నామధేయయై విష్ణువుకి దూరం అయింది. 

  • కేవలం అనురాగపూరితాలయిన ఉసిరి, తులసి మాత్రమే పీతాంబరునికి ప్రియాంకరాలయ్యాయి. 

  • తద్వారా విష్ణువు మోహవిముక్తుడై, దాత్రీ తులసీసమేతుడయి, సర్వదేవతా నమస్కారాలనూ అందుకుంటూ వైకుంఠానికి తరలివెళ్ళాడు. 

  • అందువల్లనే కార్తీకవ్రతంలోని విష్ణుపూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు. అంతేకాదు ...

తులసీ మహిమ

  • ఎవరింటిలో తులసీవనం ఉంటుందో ఆ ఇల్లు తీర్థస్వరూపమై వర్థిల్లుతుంది. యమదూతలు అక్కడకు రాలేరు. 
  • సర్వపాపా సంహారకమైన ఈ తులసీవనాన్ని ఎవరు ప్రతిష్టిస్తారో, వారికి యమధర్మరాజును దర్శించే పనివుండదు. 
  • అనగా, నరకానికి వెళ్ళరని, పుణ్యాత్ములై స్వర్గాన్నే పొందుతారని భావము.
  • గంగాస్నానం, నర్మదా దర్శనం, తులసీ సేవనం ఈ మూడు సమాన ఫలదాయకాలేనని చెప్పబడుతూ వుంది. తులసిని ప్రతిష్టించినా, తడిపినా, తాకినా, పెంచినా మానసిక, శారీరక పాపాలేగాక, మాటలవలని పాపాలు కూడా మటుమాయమైపోతాయి. 
  • తులసి గుత్తులతో శివకేశవులను అర్చించినవాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. 
  • పుష్కరాది తీర్థాలు, గంగాదినదులు, విష్ణ్వాదిదేవతలు తులసి దళాలతో నివశిస్తూ ఉంటారు. ఎన్ని పాపాలు చేసినవారైనా సరే ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పూసుకుని మరణిస్తున్నాడో అటువంటివాడిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు. 
  • అటువంటివాడు విష్ణుసాయుజ్యాన్నే పొందుతున్నాడనడం సత్యం, సత్యం, ముమ్మాటికీ సత్యం. తులసీచెట్లు యొక్క గంధాన్ని ధరించేవాడికి పాపాలు కొంచెం కూడా అంటవు. 
  • తులసీ వనపు నీడలో పితృశ్రాద్ధం చేసినట్లయితే, అది పితరులకు అక్షయ పదాన్నిస్తుంది, అదే విధంగా ...

ధాత్రీ (ఉసిరి) మహిమ

  • ఉసిరిగచెట్టు నీడను పిండప్రదానం చేసినవారి పితరులు నరకం నుంచి విముక్తులు అవుతారు. ఎవడైతే తన శిరస్సుపైనా, ముఖంలోనూ, దేహంలోనూ ఉసిరిపండును ధరిస్తున్నాడో వాడు సాక్షాత్ విష్ణుస్వరూపుడని తెలుసుకోవాలి. 

  • ఎవరి శరీరంపై ఉసిరికఫలమూ, తులసి, ద్వారకోద్భవమైన మృత్తికా ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడే అని తెలుసుకో. ఉసిరిగపండ్లనీ, తులసీదళాలనీ కలిపిన జలాలతో స్నానమాడిన వాడికి తక్షణమే గంగాస్నానఫలం లభిస్తుంది. 

  • ఉసిరి ప్రత్తితోగాని, ఫలాలతోగాని దేవతాపూజ చేసినవాడికి ముత్యాలతోనూ, మాణిక్యాలతోనూ, బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది. 

  • సూర్యుడు తులాగతుడైన కార్తీకమాసంలో చేయబడే యజ్ఞయాగాదులు, తీర్థసేవనలు విశేష ఫలితాలను ఇస్తాయి. 

  • సమస్త దేవతలూ, మునులూ కూడా ఈ కార్తీకమాసంలో ఉసిరిగచెట్టును ఆశ్రయించుకుని వుంటారు.

  • ఏ నెలలోనైనా సరే - ఎవడైతే ద్వాదశినాడు తులసి దళాలను, కార్తీకం ముప్పదిరోజులలోనూ ఉసిరిగప్రత్తిని కోస్తున్నాడో వాడు నింద్యాలైన నరకాలనే పొందుతున్నాడు.

  • కార్తీకమాసంలో ఎవడైతే ఉసిరిచెట్టు నీడన భోజనం చేస్తాడో, వాడి యొక్క ఒక సంవత్సరపు దోషం తొలగిపోతుంది.

  • ఉసిరినీడన విష్ణుపూజ చేసినట్లయితే, అన్ని విష్ణుక్షేత్రాలలోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది. శ్రీహరి లీలలనీ మహిమలనీ చెప్పడానికి ఏ ఒక్కరికీ కూడా ఎలాగైతే సాధ్యం కాదో, అదే ప్రకారం ఈ తులసీ ధాత్రీ వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకుగాని, సహస్రముఖుడైన శేషుడికిగాని సాధ్యం కాదు.

  • ఈ ధాత్రీ తులసే జననగాథ ఎవరు వింటున్నారో, వినిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకున్నవాళ్ళై తమ  పూర్వులను కలిసి శ్రేష్ఠమైన విమానంలో స్వర్గాన్ని పొందుతున్నారు.


పదిహేడవ, పద్దెనిమిదవ  అధ్యాయాలు సమాప్తం


ఇరవైనాలుగవ రోజు పారాయణ సమాప్తం

ఇరవైనాలుగవ రోజు పారాయణ వీడియో యు. ఆర్. యల్. లు చూడండి 


Karthika Puranam - 24th day Story | Karthika ... - YouTube


Karthika Puranam Day-24 | కార్తీక పురాణం 24 ...

Karthika Puranam Day 24 Story ... - YouTube


కార్తీక పురాణం 24వ అధ్యాయం | మీ ...

Karthika Puranam - 24వ రోజు పారాయణం - YouTube

Note:
నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share, and subscribe చేయండి. అలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండి. 
అలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండి. Also see my  Youtube channel bdl 1tv  like, share and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe,   కామెంట్   చేయడం మర్చిపోకండి   




వద్ద నవంబర్ 30, 2020 కామెంట్‌లు లేవు:
షేర్ చేయండి

27, నవంబర్ 2020, శుక్రవారం

23 కార్తీక పురాణము విశిష్టత - ఇరవై మూడవ రోజు పారాయణము

wowitstelugu.blogspot.com

23 కార్తీక పురాణము విశిష్టత - ఇరవై మూడవ రోజు పారాయణము


పదిహేనవ అధ్యాయము 


వీరభద్రుడి మూర్ఛతో  వెర్రెత్తిపోయిన శివసేన పొలోమంటూ పరుగెత్తి పురహరున్ని శరణు వేడింది. అభవుడయిన శివుడు అసలేమీ జరగనట్లుగానే చిరునవ్వు నవ్వుతూ తన నంది వాహనాన్ని అధిష్టించి రణభూమికి బయలుదేరాడు. 

అంతవరకూ భయకంపితులైన సమస్త గణాలవాళ్ళూ కూడా శివసందర్శనంతో ధైర్యవంతులై పునః యుద్ధప్రవేశం చేశారు. 

నంది వాహనారూఢుడై వస్తూన్న ఆ శివుణ్ణి చూడగానే కార్తీక వ్రతస్థుణ్ణి చూసి పారిపోయే పాపాలవలె రాక్షసులంతా పారిపోసాగారు. 

జలంధరుడు చండీశ్వరుడితో తలపడ్డాడు. శుంభనిశుంభ కాలనేమ్యాశ్వముఖ, బలాహక, ఖడ్గరోమ, ప్రచండ, ఘస్మరాది రాక్షస నాయకులందరూ ఒక్కుమ్మడిగా ఈశ్వరుడితో తలపడ్డారు. సర్వేశ్వరుడైన శివుడికి వీళ్ళేపాటి? ఆయనొక గండ్రగొడ్డలితో ఖడ్గరోముడి శిరస్సును నరికేశాడు. 

బలాహకుడి తలను రెండు చెక్కలుగా చేసేశాడు. పాశప్రయోగంతో ఘస్మరుడిని నేలకు పడగొట్టాడు. ఈ లోపల శివ వాహనమైన వృషభం యొక్క శృంగ (కొమ్ముల) ఘాతాలకి అనేకమంది రాక్షసులు యమలోకానికి వెళ్ళిపోయారు. 

శివప్రతాపంతో చిల్లులు పడిపోయిన తన సేనాఛత్రాన్ని చూసుకుంటూనే సుడులు తిరిగిపోయిన జలంధరుడు సరాసరి రుద్రుడినే తనతో యుద్ధానికి పిలిచాడు. 

ఆహ్వాన సూచకంగా పదిబలమైన బాణాలతో పశుపతిని గాయపర్చాడు. అయినా శివుడి మోహంలో చిరునవ్వు మాయలేదు. 

ఆ మందహాసంతోనే జలంధరుడినీ, గుర్రాలనీ, రథాన్నీ, జెండానీ, ధనుస్సునీ నరికేశాడు. రథహీనుడైన రాక్షసుడు - ఒక గదను తీసుకుని గంగాధరుని మీదకు రాబోయాడు. 

శివుడా గదని తన బాణాలతో విరగగొట్టేశాడు. నిరాయుధుడైన జలంధరుడు పిడికిలి బిగించి పినాకపాణిపై దూకబోయాడు. 

ఒకే ఒక్క బాణంతో వాడిని రెండుమైళ్ళ వెనుకపడేలా కొట్టాడు విరాట్ శిఖామణి అయిన శివుడు. 

అంతటితో జలంధరుడు, ఈశ్వరుడు తనకంటే బలవంతుడని గుర్తించి సర్వ సమ్మోహనకరమయిన గాంధర్వ మాయను ప్రయోగించాడు. 

నాదమూర్తియైన నటరాజు మొహితుడు అయ్యాడు. గాంధర్వ గానాలు, అప్సరా నాట్యాలు, దేవగణ వాద్య ఘోషలతో ఆయన సమ్మోహితుడయి పోయాడు. 

ఆ మోహంతో ఆయన ధరించిన సమస్త ఆయుధాలూ చేజారిపోయాయి. ఎప్పుడైతే మృడుడు అలా మోహితుడై పోయాడో తక్షణమే జలంధరుడు శుంభ-నిశుంభలిద్దరినీ యుద్ధంలో నిలబెట్టి, తాను పార్వతీ ప్రలోభంతో శివమందిరానికి బయలుదేరాడు.

వెళ్ళేముందు శివస్వరూపాన్ని ఏకాగ్రంగా అవలోకించాడు. 'మాయ'తప్ప, బలం పనికిరాదని గ్రహించిన జలంధరుడు పంచముఖాలతోనూ, పదిచేతులతోనూ జటలతోనూ అచ్చం శివుడు ధరించిన ఆయుధాల వంటి ఆయుదాలతోనూ ఒకానొక మాయావృషభం మీద శివ మందిరమైన పార్వతీ అంతఃపురానికి బయలుదేరాడు. 

అలా వస్తూవున్న మాయా జలంధరుడిని చూసి, అంతవరకూ పరదృష్టి గోచరంగాని పార్వతి, వాడి దృష్టిపథంలో పడింది. 

అందానికి మారుపేరైన ఆ పార్వతిని చూస్తూనే జలంధరుడు వీర్యస్ఖలనం చేసుకున్నాడు. ఎప్పుడయితే వాడు వీర్యస్ఖలనం చేసుకున్నాడో, వాడి మాయా విద్య నశించిపోయింది. వాడు రాక్షసుడు అనే విషయం పార్వతికి అర్థమైపోయింది. 

అంతటితో ఆమె అంతర్హితయై మానస సరోవర తీరాన్ని చేరి విష్ణువును ధ్యానించింది. తక్షణమే ప్రత్యక్షమయ్యాడు విష్ణువు. ప్రత్యక్షమయిన విష్ణువు ఇలా చెప్పాడు 'తల్లీ! పార్వతీ! వాడు చూపించిన దారిలోనే నేనుకూడా ప్రయాణించాల్సి వుంది. 

దిగులుపడకు' అని ఆమెను ఓదార్చాడు. 'నీ ప్రాతివ్రత్య మహిమ వలన పశుపతి ఎలా జయింపరాని వాడు అయ్యాడో అలాగే ఆ జలంధరుని భార్య యొక్క పాతివ్రత్య మహిమ వలన వాడు కూడా జయింపరానివాడుగా తయారయ్యాడు. 

వాడు నీ పట్ల రాక్షస మాయను ప్రదర్శించినట్లే, నేను వాడి ఇల్లాలి యందు నా విష్ణుమాయను ప్రయోగిస్తాను.' అని ధైర్యం చెప్పి, రాక్షసలోకానికి బయల్దేరాడు విష్ణువు. 


పదిహేనవ అధ్యాయం సమాప్తం


పదహారవ అధ్యాయం


ఆ విధంగా విష్ణువు బయలుదేరినది మొదలు, అక్కడ ఆ రాక్షస రాజ్యంలో, జలంధరుడి భార్య అయిన బృందకు దుస్స్వప్నాలు కలుగసాగాయి. 

ఆమె కలలో జలంధరుడు దున్నపోతు మీద ఎక్కి తిరుగుతున్నట్లూ, దిగంబరుడు అయినట్లూ, ఒళ్ళంతా నూనె పూసుకుని తిరుగుతున్నట్లూ, నల్లటి రంగు పువ్వులతో అలంకరించబడినట్లూ, పూర్తిగా ముండనం (గుండు) చేయించుకున్నట్లూ, దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తున్నట్లూ, తనతో సహా తమ పట్టణమంతా సముద్రంలో మునిగిపోతున్నట్లూ కలలు వచ్చాయి. 

అంతలోనే మేల్కొనిన బృంద ఉదయ సూర్యుణ్ణి దర్శించి, తను చూసినది కలే అని తెలుసుకుని, అది ఆశుభమని తలపోసి చింతించసాగింది. 

ఐనా అది మొదలు ఆమెకు మనశ్శాంతి లేకుండా పోయింది. అరిష్టాన్ని తలబోస్తూ అస్థిరమతి అయి నలుదిక్కులా మసలసాగింది. 

ఆ విధంగా ఒకానొక వేళ వనవిహారం చేస్తుండగా సింహం వంటి ముఖాలు కలిగిన ఇద్దరు రాక్షసులు కనుపించారు. 

వారిని చూసి భీతావహయైన బృంద, వెనుదిరిగి పారిపోతూ ఆ వనంలోనే శిష్య సమేతుడై ఉన్న ఒకానొక ముని యొక్క కంఠాన్ని చుట్టుకుని 'ఓ మునివర్యా! నన్ను రక్షించు. నాకు నీవే శరణు' అని కేకలు వేయసాగింది. 

అప్పుడా ముని భయగ్రస్తురాలైన ఆమెనూ, ఆమెని వెన్నంటి వస్తున్న రాక్షసులని చూసి ఒక్క హుంకార మాత్రం చేత, ఆ రాక్షసులు పారిపోయేలా చేశాడు. 

అంతటితో ధైర్యం చేజిక్కిన బృంద ఆ మునికి దండవత్ గా ప్రణమిల్లి 'ఓ ఋషీంద్రా! ఈ గండం నుంచి నన్ను కాపాడిన దయాళుడవు గనుక, నేను నా సంశయాలను కొన్నిటిని నీ ముందుంచుతున్నాను. 

నా భర్తయైన జలధరుడు ఈశ్వరునితో యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ ఆయన పరిస్థితి ఎలా వుందో దయచేసి నాకు తెలియజేయి' అని ప్రార్థించింది. 

కరుణాకరమైన దృష్టులను ప్రసరిస్తూ ఆ ఋషి ఆకాశంవంక చూశాడు. వెంటనే ఇద్దరు వానరులు వచ్చారు. 

మునివారికి కనుబొమ్మలతోనే కర్యవ్యాన్ని ఆజ్ఞాపించాడు. ఆ రెండు కోతులూ మళ్ళా ఆకాశానికి ఎగిరి, అతి స్వల్ప కాలంలోనే తెగవేయబడిన జలంధరుడి చేతులనూ, మొండెమునూ, తలను తెచ్చి వారి ముందుంచాయి. 

తన భర్త యొక్క ఖండిత అవయవాలను చూసి బృంద ఘోల్లుమని ఏడ్చింది. అక్కడే వున్న ఋషి పాదాలపై బడి తన భర్తను బ్రతికించవలసినదిగా ప్రార్థించింది. 

అందుకా ముని నవ్వుతూ 'శివోపహతులైన వాళ్ళని బ్రతికించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణవలన తప్పక బ్రతికిస్తాను' అంటూనే అంతర్హితుడయ్యాడు. 

అతనలా మాయమైనదే తడవుగా జలంధరుడి అవయవాలన్నీ అతక్కుని, అతడు సజీవుడు అయ్యాడు. 

ఖిన్నురాలై వున్న బృందను కౌగలించుకుని, ఆమె ముఖాన్ని పదేపదే ముద్దాడాడు. పునర్జీవితుడైన భర్తపట్ల అనురాగంతో బృంద పులకరించిపోయింది. వారిద్దరూ ఆ వనంలోనే వివిధ విధాలుగా సురత క్రీడలలో మునిగిపోయారు. 

మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయినా, ఒకానొక ఉరట సుఖానంతరం ఆమె అతనిని విష్ణువుగా గుర్తించివేసింది. 

మగడి వేషంలో వచ్చి తన ప్రతివ్రత్యాన్ని మంటగలిపిన ఆ మాధవుడిపై విపరీతంగా ఆగ్రహించింది. 

'ఓ విష్ణుమూర్తీ! పర స్త్రీ గామివై చరించిన నీ ప్రవర్తన నిందింపబడునుగాక! నీ మాయతో ఇతఃపూర్వం కల్పించిన వానరులిద్దరూ రాక్షసులై జన్మించి నీ భార్యనే హరించెదరుగాక! నువ్వు భార్యా వియోగ దుఃఖితుడవై, నీ శిష్యుడైన ఆదిశేష సహితుడవై అడవుల బడి తిరుగుతూ, వానర సహాయమే గతియైనవాడవవు గాక!' అని శపించి అని అభిలషిస్తూ చేరువ అవుతున్న శ్రీహరి నుంచి తప్పుకుని, అగ్నిని కల్పించుకుని అందులోపడి బూడిదైపోయింది. 

అందుకు చింతించిన విష్ణువు మాటిమాటికీ ఆ బృందనే స్మరించసాగాడు. నిలువునా కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తన తనువంతా పూసుకుని విలపించసాగాడు. సిద్ధులు, ఋషులు, ఎందరు ఎన్ని విధాల చెప్పినా విష్ణువు శాంతి పొందలేకపోయాడు. అశాంతితో అల్లాడిపోసాగాడు. 

పదిహేనవ పదహారవ అధ్యాయాలు సమాప్తం


ఇరవైమూడవ (బహుళ అష్టమి)రోజు పారాయణ సమాప్తం

ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. ల లో 23 వ రోజు పారాయణం చూడండి.

కార్తీక పురాణం - ఇరవై మూడవ ... - YouTube


Note:
నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండి. అలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండి. అలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండి. Also see my  Youtube channel bdl 1tv  like, share and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe,   కామెంట్   చేయడం మర్చిపోకండి   




వద్ద నవంబర్ 27, 2020 కామెంట్‌లు లేవు:
షేర్ చేయండి
‹
›
హోమ్
వెబ్ వెర్షన్‌ చూడండి

నా గురించి

నా ఫోటో
B.DHARMALINGAM
రెసిడెన్సీ లంకెలపాలెం, R. K. Township, Door No.5-14/20. Anakapalli District. A. P., Pin 531019.India.
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి
Blogger ఆధారితం.